హైదరాబాద్: హైదరాబాద్లోని గండిపేట.. ‘తెలుగు విజయం’లో మహానాడు ఏర్పాట్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు ఉమ్మడిగా తెలుగు విజయాన్ని పరిశీలించడంతో పాటు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, మహానాడు ఏర్పాట్ల కమటీ కన్వీనర్ టీడీ జనార్దనరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మాగంటి గోపీనాథ్, మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.