TDP Mahanadu
-
టీడీపీపై బొత్స సెటైర్లు
-
చంద్రబాబు భయాన్నే ఈనాడు హైలైట్ చేసింది
టీడీపీ మహానాడుకు సంబంధించి మీడియాలో.. ప్రత్యేకించి ఈనాడులో వచ్చిన వార్తలను చదివితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.ఈనాడు పత్రిక తన శక్తి వంచన లేకుండా తెలుగుదేశంను జాకీలు వేసి లేపే ప్రయత్నం యధాప్రకారం చేసింది. పదిహేనువేల మంది ఈ మహానాడులో పాల్గొంటారనుకుంటే.. అనేక రెట్లు కార్యకర్తలు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయని రాశారు.సభ మొదలైనప్పటి నుంచి చివరవరకు జనం కదలలేదని ఈనాడు రాసింది. తీరా చూస్తే చంద్రబాబు మాట్లాడుతున్న తరుణంలోనే వందల కుర్చీలు ఖాళీగా కనబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సందర్భంలో చంద్రబాబు అంటున్న ఒక మాట మాత్రం వాస్తవం అనిపిస్తుంది.‘‘ఈసారి ఎన్నికలలో అవకాశం వదలుకుంటే అన్నిదారులు మూసుకుపోతాయ’’ని ఆయన పార్టీ కార్యకర్తలతో అంటున్నట్లు ఆ వీడియోలో ఉంది.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యలు పత్రికలో కూడా వచ్చాయి. ఆయన భయం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలు తెలియచెబుతాయి. 👉 జగన్ పై చంద్రబాబు అండ్ కో ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. ఆయన స్కీముల ప్రభావానికి.. తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటో తెలియక చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నది మాత్రం అక్షర సత్యం. ఆ మాట ప్రతిసారి చెప్పలేరు కనుక రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాలని పైకి అంటుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలను కౌరవసేన అని,దానిని ఓడించి సభలోకి గౌరవంగా వెళతామని చంద్రబాబు చెప్పారు. విశేషం ఏమిటంటే 2014 ఎన్నికలలో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి. అంటే కౌరవుల సంఖ్య వందకు దాదాపు దగ్గరగా ఉందన్నమాట. ఆ తర్వాత ఆ సంఖ్యకు తోడుగా మరో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అయినా చంద్రబాబు భాషలో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరిని.. జనం కౌరవులుగా పరిగణించి ఓడించారన్నమాట.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 👉 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ మిగిలిన మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీని బహిష్కరించారు. ఆ తర్వాత 2019 లో తెలుగుదేశం కౌరవులు వంద మందిని ఓడించి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ పక్షాన 151 మంది గెలిచారు. వీరిని కౌరవులుగా పోల్చడం వల్ల టీడీపీకి ఏమి ప్రయోజనం వస్తుందో తెలియదు. ఎవరో తెలివితక్కువగా ఇచ్చిన సలహాను చంద్రబాబు వాడుకున్నట్లు అనిపిస్తుంది. 👉 చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీని ఆయన ఒక్కరే బహిష్కరించారు. మరి మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు ఎందుకు వస్తున్నారో వారికి కూడా తెలియదు. సభ జరిగే రోజుల్లో వారు లోపలికి వచ్చి కౌరవుల మాదిరి ఏదో ఒక గొడవ చేసి బయటకు వెళుతున్నారు. కొత్తగా ఏదో ఫోర్ పి అంటూ పేదలందరిని ధనికులను చేసేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అదెలాగో ఆయన చెప్పలేరు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని మరో మాట అన్నారు. మంచిదే. మరి పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కదా? అయినా పేదరికం ఎందుకు పోలేదు?. అందరిని ధనికులుగా ఎందుకు మార్చలేకపోయారు? అంటే దాని అర్ధం ఆయన ఏదో పడికట్టు పదాలతో నినాదం ఇచ్చి జనాల్ని మాయ చేసే ఆలోచనే కదా!. ఇప్పుడు చంద్రబాబు అందరినీ ధనికులను చేసేస్తానంటే ప్రజలు నమ్ముతారా?. 👉 మరింత సంక్షేమం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఒక పక్క సంక్షేమ స్కీములతో రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేస్తారు. ఇంకో వైపు తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చంద్రబాబు అంటారు. ఆయన్ని ఎలా నమ్మలి?. ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దం చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, ఆ పది లక్షలలో చంద్రబాబు టైమ్ లో చేసిన మూడు లక్షల కోట్లో, నాలుగు లక్షల కోట్లు కూడా ఉండి ఉండాలి కదా! దాని గురించి జనానికి తెలియదని ఆయన భావన అన్నమాట. 👉 ఇక రాజకీయ తీర్మానంలో ఒక విశేషం కనిపించింది. రాష్ట్ర ,జాతీయ రాజకీయాలలో ఏమి జరుగుతోందో తెలుగుదేశం గమనిస్తోందని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.అంటే మళ్లీ అవకాశవాదంతో టీడీపీ వ్యవహరిస్తోందన్నమాట. జనసేనతో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్న విషయాన్ని కాని, ప్రధాని మోదీని మళ్లీ కాకా పడుతున్న సంగతిని కాని యనమల ఎందుకు వివరించలేదో తెలియదు. రెండు,మూడు పడవలపై కాళ్లు పెట్టి ఎటు వీలైతే అటు దూకుతారని అనుకోవచ్చన్నమాట. 👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పలు తీర్మానాలు ఆమోదించిన మహానాడులో.. అమరావతి గురించి ప్రత్యేక తీర్మానం ఎందుకు పెట్టలేదో తెలియదు. అమరావతిలో యాభై వేలకు పైగా పట్టాలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎందుకు తీర్మానం చేయలేదో ఊహించుకోవచ్చు. పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డు పడుతోందని, చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చుతున్నారని ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. డ్యామేజీ అయిందన్న భయంతో మహానాడు మొదటిరోజు వాటి జోలికి వెళ్లలేదనుకోవాలి. ఏది ఏమైనా మహానాడులో ఏమి చెప్పాలనుకున్నారో ఎవరికి తెలియకపోయినా, కదం తొక్కిన పసుపుదళం అంటూ ఈనాడు పత్రిక పెద్ద హెడింగ్ లు పెట్టి మురిసిపోతే తెలుగుదేశం గెలిచిపోతుందా! వారి భ్రమ కాకపోతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
మహానాడులో తమ్ముళ్ల బాహాబాహీ
-
‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత కనుమరుగే’
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. చంద్రబాబు పదవీ దాహం వల్ల ఎన్టీఆర్ మరణించారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని అంబటి ప్రశ్నించారు. ‘‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగే. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తుక్కు తుక్కయిన సైకిల్ను బాబు తొక్కలేరు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా?. వాగ్ధానాలను నట్టేట ముంచిన చంద్రబాబును ఎవరు నమ్ముతారు?. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే’’ అని మంత్రి అంబటి మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్ ‘‘వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా?. దోచుకు తినడమే చంద్రబాబు తెలుసు. ఎన్టీఆర్ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేది. మహానాడులో చంద్రబాబు అభూతకల్పనలు చెప్పారు. మేం చెప్పింది చేసి చూపించాం. టీడీపీ చెప్పింది ఏదీ చేయలేదు. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
టీడీపీ మహానాడు ప్రాంగణంలో ‘గాలి దుమారం’
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. నేతలు మాట్లాడుతుండగానే వర్షం కురుస్తుండటంతో ప్రాంగణం నుంచి కార్యకర్తలు వెళ్లిపోతున్నారు. కాగా, నిన్న(శనివారం) మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు : పోసాని -
టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ లోకేష్ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
సాక్షి కార్టూన్ 30-05-2022
సర్వేలు, కొలమానాలొద్దు సార్! మహానాడులో ఎక్కువ బూతులు మాట్లాడినోళ్లకే టికెట్స్ ఇస్తే సరి! -
మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్
‘టీడీపీలో దీర్ఘకాలిక పదవుల విధానం రద్దు. వరుసగా మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు. ఇది నా నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం.’ – మీడియా ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోకేష్ ఝలక్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఆ జాబితాలో ముందు వరుసలో జిల్లాకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిలవనున్నట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే సోమిరెడ్డి పరిస్థితి ఏమిటీ? రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదా? అని జిల్లా ప్రజానీకంతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుందీ సోమిరెడ్డి పరిస్థితి. ‘మహానాడు’ ఆయన రాజకీయ జీవితానికి సమాధి కానున్న పరిస్థితి ఏర్పడింది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు సోమిరెడ్డి. వరుస ఓటముల పాలైనా సోమిరెడ్డికి టీడీపీ అగ్రనేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పొలిట్బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటన జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో వరుస ఓటముల చరిత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీడీపీ సీనియర్ నేతగా జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా, పొరుగు జిల్లాల ఇన్చార్జి బాధ్యులుగా ఉన్న ఆయన 1994, 99 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. 2004, 2009, 2012 (కోవూరు ఉప ఎన్నిక), 2014, 2019ల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన చరిత్ర జిల్లాలో సోమిరెడ్డిదే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన నేతల జాబితాలో సోమిరెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. నారా లోకేష్ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడితే సోమిరెడ్డికి పార్టీ టికెట్ దక్కడం దుర్లభమే. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే సోమిరెడ్డికి నారా లోకేష్ ఝలక్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. యూటర్న్లు తీసుకోవడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటు, అదే వారసత్వం నారా లోకేష్కు కూడా వస్తే తప్పా, సోమిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం లేదు. లోకేష్ ప్రకటన తర్వాత నెటిజన్లు, తెలుగుతమ్ముళ్లు అయ్యో.. సోమిరెడ్డా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్చల్ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు. టిక్కెట్ కోసమేనా ఇదంతా..? గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్ ఉండటం, ఆయనకు టిక్కె ట్ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
ఒంగోలులో వెలవెల బోయిన తెలుగుదేశం మహానాడు
-
అచ్చెన్నాయుడి పదవికి ఎసరు!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పదవికి పార్టీ అధినేత చంద్రబాబు ఎసరు పెట్టారు. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తప్పించి మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చాప కింద నీరులా చాలాకాలం నుంచి వ్యాపంపజేశారు. తాజాగా క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం వస్తున్నట్లు చూపించి మహానాడులో అచ్చెన్నకు చెక్ పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలులో శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రతిపాదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, ఎక్కువ పదవులు ఇస్తోందని ఆయన చెప్పినట్లు తెలిసింది. జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకట్రావు చెప్పినట్లు తెలిసింది. వ్యూహాత్మకంగానే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ, తెలంగాణకు అధ్యక్షులను ఎన్నుకుంటారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం లాంఛనమైన ప్రక్రియే. మిగిలిన పదవులను ఎవరికివ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఇలాగే అచ్చెన్నాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్న పార్టీ పరిస్థితి, లోకేశ్ నాయకత్వం పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆయన్ని లోకేష్ టార్గెట్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ అచ్చెన్నాయుడిని లోకేష్ ఎక్కడికీ వెళ్లనివ్వలేదు. మీడియా సమావేశాల పైనా ఆంక్షలు విధించారు. దీంతో అచ్చెన్నాయుడు అప్పుడప్పుడు ప్రకటనలు మాత్రం విడుదల చేసేవారు. జిల్లాల పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుని లోకేశే వెళ్లేవారు. అన్ని రకాలుగా అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేశారు. అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాలని చూశారు. ఇలా చేస్తే బీసీల్లో ఇంకా బలహీనమవుతామని చంద్రబాబు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు మహానాడు సందర్భంగా వ్యూహం ప్రకారం కళా వెంకట్రావు ద్వారా అచ్చెన్నకు చెక్ పెడుతున్నారు. లోకేశ్ కూడా పార్టీ నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉండకూడదని మహానాడు ప్రాంగణంలోనే తేల్చి చెప్పారు. ఎక్కువ కాలం పదవులు పట్టుకుని వేళ్లాడితే కొత్త వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని ఉద్దేశించే లోకేశ్ మాట్లాడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు తర్వాత కొత్త వారికి అవకాశం పేరుతో అచ్చెన్నను పదవి నుంచి తప్పించి మరో డమ్మీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. (క్లిక్: వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు) -
వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయలు. చంద్రబాబు ఓ విష సర్పం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. అది మహానాడు కాదు.. మోసపునాడు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోంది’’ అని ఆరోపించారు. -
మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి: మంత్రి రోజా
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు -
‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’
సాక్షి, విశాఖపట్నం: మహానాడులో చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శించేందుకు ఏమీ లేక చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ’టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడిని మించిన దొంగలెవరున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నాడు’’ అని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు. చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’ -
మేకవన్నె పులి బాబూ!
దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజాన్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయ మేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరా టంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడు పుఠాణీ ఆరంభించారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగు దేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్నమిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చా త్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించీ, చేరదీస్తున్న గ్రూపుల గురించీ పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందనీ, అతడి వల్ల ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందనీ, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందనీ, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్ను పోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేక పోయాను. నామీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధా భక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్ద మనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తన కంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండే వాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరే వారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెçప్పడం కూడా నాకిష్టంలేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అంద రికీ 5లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్ని కల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! తెలుగు జాతి దురదృష్టం చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లు న్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దుర దృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభ వించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజా స్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లిన ప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగు జాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగు దేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయ కుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? ఆదర్శాలకు వెన్నుపోటు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్ లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమ స్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడు అనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడి చారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడి గట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవా ల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మ హక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికి తనంతో దాన్ని మరోరకంగా ఉపయోగించకండి... ఇది ‘అన్న’ మాట. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
కేంద్రానికి మద్దతు: టీడీపీ తీర్మానం
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూమ్ కాన్ఫరెన్స్లో గురువారం రెండో రోజు జరిగిన మహానాడులో ఈ మేరకు రాజకీయ తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రంలో కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవాలని తీర్మానించింది. జగన్ పాలనను ప్రశ్నించాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. చంద్రబాబు మరో యూటర్న్ మాట మీద నిలబడకుండా.. సమయానుకూలంగా మాటమారుస్తూ.. యూటర్న్లు తీసుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన చంద్రబాబు తాజాగా మరో యూటర్న్ తీసుకున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వాన్ని తిట్టి కాంగ్రెస్తో జతకట్టిన ఆయన ఇప్పుడు అవసరాల కోసం బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు సందర్భం కాకపోయినా, అవసరం లేకపోయినా బీజేపీకి మద్దతు ప్రకటించారు. తన అవినీతిపై విచారణ భయం పట్టుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పనిచేయాలని, ఇందుకోసం బీజేపీ, వామపక్ష పార్టీలను సైతం వాడుకోవాలని మహానాడులో నర్మగర్భంగా చెప్పడం గమనార్హం. మొక్కుబడి తీర్మానాలు: రెండు రోజులపాటు ఆన్లైన్లో టీడీపీ నిర్వహించిన మహానాడు మొక్కుబడిగా ముగిసింది. చంద్రబాబు రోజూ నిర్వహించే టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల మాదిరిగానే ఇది కూడా ముగిసినట్లు పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొక్కుబడి తీర్మానాలు, సుదీర్ఘ ఉపన్యాసాలతో శుక్రవారంతో ఈ తంతు ముగిసినట్లు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే మొక్కుబడి తంతును ఈసారి కూడా చంద్రబాబు రక్తి కట్టించారు. అదే కోవలో మిగిలినవి.. ఈసారి మొత్తం 15 తీర్మానాలు చేశారు. 8 ఏపీకి సంబంధించినవి కాగా తన గొప్పలు, ప్రభుత్వంపై బురద చల్లడం, అభూత కల్పనలకే చంద్రబాబు పరిమితమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్) మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా) మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. -
జూమ్ కాన్ఫరెన్స్తో మహానాడట!
సాక్షి, అమరావతి : టీడీపీ మహానాడుపై, చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. ‘జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?’అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలోనూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘ఏడాది కాలంలో లాక్ డౌన్ వల్ల మూడు నెలలు రాబడి లేకపోయినా 90 శాతం హామీలు నెరవేర్చారు జగన్ గారు. వివిధ కార్యక్రమాల కింద 3.60 కోట్ల మందికి 40 వేల కోట్ల సాయం అందింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులన్నీ కొనసాగుతున్నాయి. పోలవరం వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తవుతుంది’అంటూ ట్విటర్లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా? — Vijayasai Reddy V (@VSReddy_MP) May 28, 2020 చదవండి: 'ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు' ‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’ -
ఆ హక్కు చంద్రబాబుకు లేదు: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైందని గుర్తు చేశారు. చంద్రబాబు తనయుడే ఘోరంగా పరాజయం పాలయ్యారని, కేవలం 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే టీడీపీ గెల్చుకుందని తెలిపారు. ఓటమిపై మహానాడులో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని అంబటి సూచించారు. చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రతిపక్ష హోదాను కూడా చంద్రబాబు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధిపొందాలన్నదే చంద్రబాబు తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి బుధవారం మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వ సహాయక చర్యలపై.. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని అంబటి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో టీడీపీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందాయని, ఆయన ధోరణి నచ్చకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా.. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంబటి వెల్లడించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. మే 30న రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు. వలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని అంబటి పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ నిత్యం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. -
ఎన్నికల ఫలితాల షాక్ టీడీపీ మహానాడు రద్దు
-
‘మహానాడు’ రద్దు!
సాక్షి, అమరావతి: ఈనెల 27వతేదీ నుంచి నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేయాలని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం ఉండ వల్లిలోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో ఆయన మహానాడు నిర్వహణపై మంతనాలు జరిపారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న దృష్ట్యా మహానాడు నిర్వహించడం కష్టమని పలువు రు మంత్రులు పేర్కొనగా చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. మహానాడు బదులుగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫలితాలపై భయంతోనే? ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మహానాడు నిర్వహించారు. ఈసారి ఫలితాల సాకుతో దీన్ని రద్దు చేసుకోవడానికి కారణం గెలుపుపై భరోసా లేకపోవడమేనని చెబుతున్నారు. సర్వేలు, అంచనాలన్నింటిలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని ప్రస్ఫుటమవుతుండడంతో టీడీపీ అధినేత సహా ముఖ్య నేతల్లో కలవరం నెలకొంది. అధికారం కోల్పోతున్నామనే ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోసేందుకు 120 సీట్లు వస్తాయంటూ గంభీరంగా చెబుతున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును సైతం రద్దు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై ధీమా ఉంటే మహానాడు నిర్వహించడానికి ఇబ్బంది ఉండేది కాదని కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. దీన్ని బయటకు చెప్పుకోలేక ఫలితాల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాల్సి ఉంది కాబట్టి మహానాడులో పాల్గొనలేరని, అందుకే రద్దు చేసినట్లు పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. -
మహానాడులో భోజనాలు తప్ప ఇంకేమీ లేదు!
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు. -
మాపై రుబాబు ఏంటి?
కుప్పం టీడీపీ నేతల్లో నిప్పు రాజేసుకుంది. మహానాడు వేదికగా జరిగిన సమీక్షలో స్టీరింగ్ కమిటీ సభ్యులకే తమ పార్టీ అధినేత ప్రాధాన్యమిచ్చారని ద్వితీయశ్రేణి నేతలు మండిపడుతున్నారు. వారి మాటలు విని సామాన్య కార్యకర్తలపై చిర్రుబుర్రులాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కడానికే బాబు కంకణం కట్టుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక ఆయనతో వేగలేమని పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కుప్పం: కుప్పం టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపైనే క్షేత్రస్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహానాడు పూర్తయిన తర్వాత కుప్పం నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు కేవలం కొందరికే ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. క్రియాశీలక కార్యకర్తలను తీవ్రంగా అవమానించారని కుంగిపోతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అసంతృప్తి విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానా డు కార్యక్రమం అనంతరం కుప్పం నేతలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అధినేతతో మాట్లాడేందుకు కుప్పం నుంచి సుమారు 300 మంది కార్యకర్తలు తరలివెళ్లారు. అందులో కేవలం స్టీరింగ్ కమిటీ సభ్యులైన 24 మందితోనే చంద్రబాబునాయుడు మూడు గంటలకుపైగా సమీక్షించారు. సమావేశం ముగిసేంత వరకు క్రియాశీలక సభ్యులు బయటే నిరీక్షించారు. వారితోనే పార్టీకి చేటు కుప్పం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు పొడజూపాయి. అధినేతతో సఖ్యతగా ఉన్న కొందరు నేతల వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తోందని క్రియాశీలక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహానాడు వేదికగా జరిగిన సమీక్షలో వారికే తమ అధినేత ప్రాధాన్యమివ్వడం వారికి మింగుడు పడడంలేదు. మూడు గంటలౖకుపెగా నిరీక్షించినా తమను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాపైనే చిందులా? 3 గంటలు, 24 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ముగిశాక బయట వేచి ఉన్న కార్యకర్తలపై బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. సమస్యలు తెలుసుకోకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులు చెప్పిన మాటలు విని పార్టీ భుజాన మోసేవారిపై మండిపడడం ఏంటని పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అధినేతే ఇలా వ్యవహరించడం పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. రాజీనామాల దిశగా అడుగులు టీడీపీలో బలమైన సామాజికవర్గ నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పదవులు అనుభవిస్తూ ప్రజల వద్ద విమర్శలు తీసుకొస్తున్న ప్రజాప్రతినిధులను వదిలి సామాన్య కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అధినేతకు తగదని, ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగా వాపోతున్నారు. రాజధానిలో జరిగిన కుప్పం నేతల సమావేశంలో తీవ్ర మనస్తాపానికి గురైన నేతలు పదవులు, పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కుప్పం ఉప సర్పంచ్ భర్త రాజీనామా మేజర్ గ్రామ పంచాయతీ కుప్పం ఉప సర్పంచ్ భర్త జి.ఎమ్.సుధీర్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన 20 ఏళ్ల నుంచి పార్టీలో క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో మంచి నాయకత్వం లేదని, అనుకున్న స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడంలేదని, అందుకే తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. -
చంద్రబాబును సీఎం చేసి తప్పు చేశాం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి తప్పు చేశామన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని చెప్పారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ మండిపడ్డారు. ‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు చేశారు. ట్యాక్సులన్నీ గుజరాత్కు తీసుకెళ్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. దొలేరా నగరంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అక్కడ పీపీపీ విధానం ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయి. దొలేరాలో ప్రపంచంలోని పెద్ద నగరం నిర్మిస్తున్నారు. రూ. 2500 కోట్లు అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చారు. రాజధానిలోని 4600 స్క్వేర్ మీటర్స్కు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పామన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది. డిజైన్లు మార్చి లేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి రాని విధంగా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్కి విడుదల చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం. ప్లేస్, ఏ స్థాయి వ్యక్తులు రావాలో కూడా మీరే చెప్పండి. మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాల్లో ఒక్కటి కూడా రాష్ట్రాభివృద్ధికి ఉపయోడపడేవి లేవు. కచ్చితంగా సవాలు స్వీకరించి మమ్మల్నీ ఢీ కొట్టే దమ్ముంటే చర్చకు రండి. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు. కేంద్రం పన్నులు కొట్టొద్దు అంటూ బాబు పిలుపునివ్వడం దారుణం. ప్రపంచ దేశాలకు బాబాను ఇంచార్జ్గా పంపాలి. దేశం ఒక్కటే కాదు.. ప్రపంచ దేశాల సమస్యలన్నీ తీర్చే ఏకైక వ్యక్తి చంద్రబాబే. కేంద్ర పథకాలన్నీ చంద్రబాబు రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో బీజేపీకి ధీటైన ప్రతిపక్షం లేదు. రాజకీయాల్లో శత్రువుల ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే వుంటారు. ఈ విషయం లోకేష్కు తెలియక శత్రువులు అంటూ అజ్ఞానిలా మాట్లాడారు.. లోకేష్కు రాజకీయ అనుభవం లేదని’ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. -
‘బాబు తుప్పు,.. కొడుకు పప్పు’
సాక్షి, నరసాపురం: మహానాడు పేరుతో విజయవాడలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ అబద్ధాలు, మోసాల పోటీలు జరిగాయని వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ పోటీల్లో చంద్రబాబు మొదటి స్థానంలో, ఆయన కొడుకు లోకేశ్ రెండో స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 176వ రోజులో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అబద్దాలు, మోసాల విషయంలో నెంబర్వన్గా నిలిచిన చంద్రబాబు ‘తుప్పు’ అని, ఆయన ముద్దుల తనయుడు లోకేశ్ ‘పప్పు’అని వ్యాఖ్యానించారు. అది మహానాడు కాదు. దగానాడు అని ఆయన పేర్కొన్నారు. కుట్ర, దగా, మోసం ఎలా చేయాలో మహానాడులో చర్చించారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని, పదవిని, జెండాను లాక్కొని ఆయన చావుకు కారణమయ్యారని జగన్ ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి రోజున మెడలో ఒక దండ మాత్రం వేస్తాడని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్టీ ప్లీనరీలో ఎవరైనా, ఆయా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తారు. కానీ టీడీపీ మహానాడు.. వైఎస్ జగన్ను తిట్టడానికే పరిమితమైందని అన్నారు. అక్కడ తిట్ల తీర్మానాలు, అబద్దాల ప్రొగ్రెస్ రిపోర్టులు చేశారని చురకలంటించారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసిన టీడీపీకి విడాకులు తీసుకుని కొత్త పెళ్లి కూతురును వెతుక్కునేటప్పుడు మళ్లీ హోదా విషయం గుర్తుకొచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. అబద్ధాల మహానాడులో.. తాము 600 హామీలు ఇచ్చామనీ.. వాటిలో 98 శాతం నెరవేర్చామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, పైపెచ్చు ఇవ్వని హామీలు కూడా అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. నాడు హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ది నామమాత్రమేనని చెప్పి.. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఆమోదం తెలిపారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ హోదా అంటూ మాట మార్చుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రి..
సాక్షి, ఢిల్లీ : టీడీపీ అట్టహాసంగా నిర్వహించింది మహానాడు కాదని.. అది దగానాడు అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై టీడీపీ బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల ముఖ్యమంత్రి.. బలహీన పడినప్పుడల్లా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తారని ఆయన విరుచుపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఢిల్లీ- ముంబై కారిడార్లో దొలారే సిటీ నిర్మాణం చేయాలనే నిర్ణయం యూపీఏ హయాంలో జరిగిందని జీవీఎల్ గుర్తు చేశారు. ‘రూ. 2,333 కోట్లతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుంది. రూ. 300 కోట్లను రూ.3 వేల కోట్లగా.. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు క్షమపణ చెప్పాలని’జీవీఎల్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రవర్తన ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా ఉందని ధ్వజమెత్తారు. బాబు పూర్తిగా యుటర్న్ తీసుకున్నారని, గుజరాత్కు కేంద్రం అదనంగా ఏమీ ఇవ్వలేదని జీవీఎల్ పేర్కొన్నారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్ సిటీలు ఇచ్చామన్నారు. ‘ఎంత సాయం చేస్తున్నా చేయట్లేదని దుష్పచారం చేస్తున్నారు. హోదా కంటే ఎక్కువ సాధించామని మీరే చెప్పారు.. ఎన్ని నిధులిచ్చినా దుర్వినియోగం అవుతున్నాయని’ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. పారిశ్రామిక నగరాన్ని క్యాపిటిల్ సిటీతో పోలిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ సిటీలో మౌలిక వసతుల కోసం రూ. 2500 కోట్లు కేంద్రం పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. కానీ, రూ. 98వేల కోట్లు కేంద్రం ఇస్తున్నారనడం బాబు దగాకోరు మాటలకు నిదర్శనం నరసింహారావు విమర్శించారు. -
సైకిల్ స్టాండ్ ?
-
మహానాడు సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు
-
‘మహా’ర్భాటం..!
సాక్షి, అమరావతి, విజయవాడ: టీడీపీ విజయవాడలో అట్టహాసంగా నిర్వహించిన మహానాడు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై కనీసం చర్చ కూడా లేకుండానే ముగిసింది. అనూహ్యంగా మారిన పార్టీ రాజకీయ వైఖరి గురించి వివరించకుండా ఎంపిక చేసుకున్న అంశాలపై సుదీర్ఘ ప్రసంగాలతో మూడు రోజుల తంతును మంగళవారంతో ముగించారు. ఓవైపు సూర్య ప్రతాపం మరోవైపు నేతల ఊకదంపుడు ఉపన్యాసాలతో విసిగిపోయిన కార్యకర్తలు మధ్యాహ్నం భోజనాలు ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం ఎలా అరికట్టాలనే అంశాన్ని కూడా మహానాడులో ప్రస్తావించలేదు. ప్రపంచంలో చంద్రబాబు అంతటి గొప్ప వ్యక్తి లేరని, లోకేష్ లాంటి వీరుడు మరొకరని చూడలేమనే రీతిలో నాయకులు పొగడ్తల వర్షం కురిపించారు. మద్దతు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే రీతిలో ప్రసంగాలు సాగాయి. మూడు రోజుల్లో 37 గంటలపాటు సాగిన మహానాడులో 8 నుంచి 10 గంటలు చంద్రబాబే మాట్లాడగా 106 మంది నాయకులు చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ ప్రస్తావించారు. వైఖరి మార్పుపై కప్పదాటు ఎన్నికలకు ముందు పార్టీ రాజకీయ వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందనే విషయంపై చంద్రబాబు సహా ముఖ్య నేతలెవరూ సరైన కారణాలను పార్టీ యంత్రాంగానికి వివరించలేదు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదా వద్దంటూ ప్యాకేజీకి ఒప్పుకుని ఉన్నట్టుండి బయటకు రావటంపై శ్రేణులకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఉద్యమాలను అణచి వేయటంపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఇప్పుడు పోరాడాలనటాన్ని ఎలా సమర్థించుకుంటారో అధినేతకే తెలియాలి. అంతా మోదీ, అమిత్షా చుట్టూనే మహానాడు అంతా కేంద్రం, ప్రధాని మోదీ, అమిత్షా చుట్టూ సాగింది. మోదీపై వ్యతిరేకత పెంచడం ద్వారానే టీడీపీ ముందుకు వెళ్లగలుగుతుందని చెబుతూ పార్టీ యంత్రాంగమంతా అదే పనిలో ఉండాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నమ్మకుండా ఎదురుదాడి చేయాలన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందనే ప్రచారం చేయాలని సూచనలు చేశారు. కేవలం భోజనాల కోసమా? మహానాడు ద్వారా విస్తృత ప్రచారం, ఆర్భాటానికే టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించామని, అదిరిపోయే భోజనాలు పెట్టామని ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ ప్రకటించారు. సమస్యలపై చర్చించకుండా భోజనాల మెనూ గురించి ప్రచారం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. భోజనాల కోసం మహానాడు పెట్టారా? అనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. -
పంథా మార్చుకోని నారా లోకేశ్..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన సహజ ధోరణిని బయటపెట్టారు. ఇప్పటికే పలుమార్లు తన ప్రసంగాలతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా మహానాడులో సైతం తన బాణీని వదులుకోలేదు. తన పంథాను కొనసాగిస్తూ ప్రజలు కార్పోరేటర్లుగా కూడా తిరస్కరించిన నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ గెలిపించిందని చెప్పారు. ‘అంతెందుకు కార్పొరేటర్లుగా కూడా గెలవని వాళ్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది’ అంటూ మహానాడులో లోకేశ్ వ్యాఖ్యానించారు. దీంతో కార్పొరేటర్ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తిని ప్రజా సేవకుడిగా ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో నిలబెట్టామని లోకేశే ఆయన నోటితో చెప్పినట్లు అయింది. లోకేశ్ వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు సైతం నిశ్చేష్టులు అయ్యారు. గతంలో దేశంలో తెలుగుదేశం పార్టీ అత్యంత అవినీతి పార్టీని అని లోకేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు మహానాడులో టీడీపీ నేతల వైఖరి మారలేదు. చివరిరోజు సమావేశాలు ఆత్మస్తుతి పరనింద సైతంగానే సాగాయి. ప్రతిపక్ష పార్టీ, బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబుకు భజన చేస్తూ తరించిన తమ్ముళ్లు నాయకత్వం దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. దీంతో కీలకమైన పార్టీ సమావేశం కాస్తా.. బుర్రకథలా మారిందని టీడీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది. లోకేశ్ గత వ్యాఖ్యల కోసం.. కింది లింక్స్పై క్లిక్ చేయండి.. టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారు: లోకేశ్ మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్.. లోకేశ్.. మళ్లీ వేసేశారు! అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్ నారా లోకేశ్ ప్రమాణం చూశారా? తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేష్ -
ఎన్టీఆర్పై చంద్రబాబు కపట ప్రేమ
-
మరోసారి తడబడ్డ లోకేశ్ బాబు
-
తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నా..
సాక్షి, విజయవాడ : తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ నేత తాను మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మహానాడులో ఆయన ప్రసంగించారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని విమర్శిస్తూ కొందరు ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారని, మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ నేతలు నమ్మకంతో ఉన్నారని చెప్పారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో పదవులను సైతం వద్దని తిరస్కరించినట్లు వెల్లడించారు. టీడీపీ విశ్వసనీయత కలిగిన పార్టీ అని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చేలా తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ప్రతి పక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో యువతకే పెద్ద పీట వేయబోతున్నట్లు వెల్లడించారు. -
‘మహానాడు కాదు..మహాదగానాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు చాలాసార్లు అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ఎందుకు తీర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. అది మహానాడు కాదు మహా దగానాడు అని ఎద్దేవా చేశారు. దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నర్సింహులుని టీడీపీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. దళితుల పట్ల మంత్రి ఆదినారాయణ రెడ్డి అవహేళనగా మాట్లాడినా, వర్ల రామయ్య పబ్లిగ్గా విద్యార్థిని తిట్టినా చంద్రబాబు వివరణ కూడా అడగలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు స్వాహా చేశారని సుధాకర్ బాబు ఆరోపించారు. -
మోదీ, అమిత్ షాపై యనమల తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీడీపీ మహానాడు వేదికగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన మహానాడులో ప్రసంగించిన ఆయన...అమిత్ షా, మోదీలు నియంతలు అంటూ ధ్వజమెత్తారు. వారిద్దరిని ముస్సోలిని, హిట్లర్లతో పోల్చారు. ‘గత ఎన్నికల్లో బీజేపీతో జతకడితేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. బీజేపీ ఉన్నా.. లేకపోయినా టీడీపీ అధికారంలోకి రావాలని 2014లో ప్రజలు కోరుకున్నార’ని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం వల్లే ఆ పార్టీకి అధికారం దూరమైందని యనమల పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణమని యనమల అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీడీపీ చురుకైన పాత్ర పోషించాలని మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. -
కేసీఆర్ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావు
-
‘మహానాడులో అవినీతిపై తీర్మానం చేయాల్సింది’
సాక్షి, కడప : అత్యాచారాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతుందని విమర్శించారు. అయినా మహిళా ఎమ్మార్వోపై టీడీపీ నేతలు దాడి చేసినపుడు వారిని వెనకేసుకొచ్చిన చంద్రబాబు నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు.. జాబు లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రామచంద్రయ్య మండిపడ్డారు. ఒకపక్క కరువు రహిత రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటూనే మరో పక్క కరువు మండలాలు ప్రకటించడం చంద్రబాబుకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. మహానాడుకు ప్రజల సొమ్మును వాడుతున్నారు.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య విమర్శించారు. మహానాడుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపై నిలదీస్తే ప్రతిపక్షాలు అభివృద్దికి అడ్డుపడుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తారని విమర్శించారు. రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కుని వారికి ఇంతవరకు న్యాయం చేయలేదని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహానాడులో అవినీతిపై కూడా ఒక తీర్మానం చేసి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. -
మహానాడు బుర్రకథను తలపిస్తోంది : పార్థసారధి
సాక్షి, చిత్తూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సమావేశాలు బుర్రకథను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకే మహానాడు సమావేశాలు ఏర్పాటుచేశారని అన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తెలుగు ప్రజలకు ఏమి చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లేదని దూషించారు. మహానాడు వేదికపై ప్రజలను కించపరిచే విధంగా మట్లాడుతుంటే బాబు ముసిముసి నవ్వులు నవ్వుతారా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ మహానాడులో వంటల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీతో కలిసి హోదాను భూస్థాపితం ప్రత్యేక హోదాపై చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్థసారధి దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి ప్రత్యేక హోదాను భూస్థాపితం చేశారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన తప్పిదాలను ప్రజల నుంచి దృష్టి మరల్చడంలో బాబు దిట్టని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. -
చంద్రబాబును పొగిడేందుకే మహానాడు సమావేశాలు
-
అమరావతి వేదికగా మహానాడు
-
మహానాడుకు వెల్లువెత్తిన ఎన్ఆర్ఐల వ్యతిరేకత
-
యూసీలు అడిగే అర్హత అమిత్షాకు లేదు: సీఎం
సాక్షి, అమరావతి: రాజధానిపై నిధుల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు వినియోగ పత్రాలు (యూసీ) అడిగే అర్హత ఎక్కడిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడ కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మహానాడు రెండో రోజైన సోమవారం పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్లోనే ఉన్నాయంటూ అమిత్షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రణాళికలు ఎప్పుడో వచ్చాయని, రూ. 24 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో కొన్ని పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. రాజధానిపై తామిచ్చిన యూసీలు సరిగానే ఉన్నాయని నీతిఆయోగ్ చెప్పిందని, అయినా కూడా అమిత్షా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా ఇలా ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలనా వ్యవహారాల్లో బీజేపీ అధ్యక్షుడు తలదూర్చడం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను వాడుకుంటూ తమపై దాడి చేస్తున్నారని అన్నారు. 22 కోట్ల మంది సెల్ నంబర్లు తన వద్ద ఉన్నాయంటున్న అమిత్షా వాటిని పాలనకు వినియోగించుకోవాలని, బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలకు కాదన్నారు. తెలుగువారు గర్వపడేలా ఎన్టీఆర్ బయోపిక్ తెలుగువారంతా గర్వపడలా, స్ఫూర్తి పొందేలా ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించి, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినప్పుడే ఆయనకు అసలైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై గతంలో తీర్మానం చేశామని, మళ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. రాజధానిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. సినిమాల ద్వారా విభిన్న పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని కొనియాడారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించారని, సంక్షేమ పథకాల ఘనత ఆయనదేనని, పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఇకపై పార్టీకి ఎక్కువ సమయం నాలుగేళ్లుగా పార్టీకి పెద్దగా సమయం ఇవ్వలేకపోయాయని, ఇకపై ఎక్కువ సమయం కార్యకర్తలకే కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తన జీవిత ఆశయమని, వచ్చే ఏడాది ఏప్రిల్లోగా ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో 54 ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భావితరాలకు గుర్తుండేలా బయోపిక్: బాలకృష్ణ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రానికి నమ్మకం ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం మహానాడులో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు గుర్తుండేలా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నామని తెలిపారు. బయోపిక్లలో తండ్రి పాత్రను ఏ కొడుకూ ఇంతవరకు చేయలేదని.. అలా చేసే అదృష్టం తనకే దక్కిందన్నారు. బీజేపీ ఏమీ చేయలేక కొత్త నటులను, కులసంఘాలను రంగంలోకి దించుతోందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. మహానాడులో ఆయన ప్రసంగిస్తూ.. పద్ధతి ప్రకారం పాలన చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 68 ఏళ్ల వయసులో రాష్ట్రం కోసం నిత్యం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వం వేసిన సీసీ రోడ్ల మీదే ప్రతిపక్షాలు నడుస్తున్నాయని చెప్పారు. -
మహానాడు నేతల ఊకదంపుడు ప్రసంగాలు
-
మహానాడు కాదు.. మాయనాడు..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని వాడుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరం తీరాక టీడీపీ, బీజేపీని దోషిగా నిలబెడుతోందంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడారని చెప్పారు. చంద్రబాబును పెద్ద మాయగాడు అని అభివర్ణించారు. నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా చంద్రబాబు మహానాడు పేరుతో మాయనాడును నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ను ఆత్మక్షోభకు గురి చేశారని చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జతకడుతోందని అన్నారు. కర్ణాటకలో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. -
విభజన సమయంలో బాబు డబుల్ గేమ్ ఆడాడు
-
చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు
-
భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదో..?
సాక్షి, విజయవాడ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రలో ఎంతో మంది పుడతారని, కానీ చరిత్ర సృష్టించే యుగ పురుషులు కొందరే ఉంటారని, వారిలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. తొలిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ని అనురాగ దేవత షూటింగ్ లో కలిశానని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంస్కరణలకు రామారావు నాంది పలికారని కొనియాడారు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, ఆయన బాటలో ముందుకు పోదామని చంద్రాబాబు పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కావని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఇప్పటి వరకూ చాలా మందికి భారత రత్న ఇచ్చారని, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భారతరత్నకు ఎన్టీఆర్ నిజమైన అర్హులు అని అన్నారు. ఎన్నో తీర్మానాలు పెట్టినా ఎందుకు భారతరత్న ఇవ్వటం లేదని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్కు శ్రీకారం చుడతామని ప్రకటించారు. కేంద్రంలోని అన్ని శాఖలకు యుటిలైజేషన్ సర్టిఫికేట్(యూసీ)లు పంపించామని, కానీ కేంద్ర నాయకులు ఇవ్వలేదంటూ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. నీతీ ఆయోగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఇవ్వకుంటే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ అన్యాయం పై ప్రతి ఒక్కరూ ప్రజల్ని చైతన్య పరచాలని పిలుపు నిచ్చారు. అనవసరంగా ఒక రాష్ట్రం, జాతితో పెట్టుకోవద్దంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుకి యూసీలు ఇవ్వలేదని చెప్పే అధికారం ఎక్కడిదంటూ మండిపడ్డారు. -
అమెరికాలో టీడీపీకి సెగ
-
డల్లాస్ మహానాడుకు నిరసన సెగ
డల్లాస్ : అమెరికాలో తొలిసారిగా డల్లాస్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. అమెరికా నలుమూలల నుండి వంద మందికి పైగా తెలుగు ఎన్ఆర్ఐలు డల్లాస్ లో జరుగుతున్న మహానాడు వద్దకి నిరసన తెలపడానికి వచ్చారు. మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన టీడీపీ నాయకులు వాపోయారు. ఇక్కడ టీడీపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా అని ఊహించలేకపోయామన్నారు. తెలుగు ఎన్ఆర్ఐ ప్రత్యేక హోదా పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు నల్లటి దుస్తులు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. కుల, మత, రాజకీయ, ప్రాంత భేధాలు లేకుండా అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇదంతా గమనించిన ఇండియా నుండి వచ్చిన నాయకులు డల్లాస్ మహానాడు నిర్వాహకులని మందలించినట్టు సమాచారం. -
మహానాడు కాదది.. మాయనాడు
విజయవాడ సీటీ: టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని... తెలుగు ప్రజలను మోసం చేసే మాయనాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్ అభివర్ణించారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్ల అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబుకు కేంద్రం అంటే భయం పట్టుకుందన్నారు. చివరకు తిరుమల దేవస్థానంలో స్వామి వారి నగలను కూడా వదలిపెట్టని చంద్రబాబుకు చిప్పకూడు తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు మహానాడులో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారని, కానీ మహానాడులో తయారు చేస్తున్న కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకులు తదితర వంటల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ విధానాల గురించి కాకుండా వైఎస్ జగన్పై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ధైర్యంగా అవిశ్వాసం పెట్టిన దేశంలోనే మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబుపై సీబీఐ, ఏసీబీ, ఈడీలు విచారణ చేపడతాయని, ఆయనకు చిప్పకూడు తధ్యమన్నారు. పంచాయతీ సర్పంచ్ అనుభవం కూడా వైఎస్ జగన్కు లేదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఎంపీగా అత్యధిక మెజారిటీ సాధించిన రెండో వ్యక్తి అని అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఆ నిందను కేంద్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయిందని చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్సార్ మాత్రమే అన్నారు. ఆరోగ్యశ్రీని అద్భుతంగా కొనసాగించారన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానైనా చంద్రబాబు అబద్ధాలు మానేయాల’ని వెల్లంపల్లి హితవు పలికారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, అయితే నీలా పొత్తులతో కాకుండా సింగిల్గానే సింహంలా ఎన్నికలకు వెళ్తామని వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
నా సైన్యం 70 లక్షలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి పెద్ద సైన్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మంది, తెలంగాణలో 10 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ప్రపంచంలోని వందల దేశాల్లో టీడీపీ మహానాడు జరుపుకునే రోజు వస్తుందన్నారు. విజయవాడ సమీపంలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంలో ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని, మాటలు ఎక్కువ చెబు తున్నారు తప్ప పనులు మాత్రం జరగడం లేదని విమర్శించారు. అంతా ప్రచార అర్భాటమేనని, నరేంద్ర మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమేనని అన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ హయాంలో బ్యాంకులన్నీ దివాలా తీస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో బ్యాంకుల్లో రూ.29,916 కోట్ల అవినీతి జరగ్గా, నాలుగేళ్ల బీజేపీ పాలనలో రూ.1.11 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిపోయాయని, పరిపాలన గాడి తప్పే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. కేంద్రం తీరు వల్ల అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహానాడులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో బీజేపీ ఆటలు సాగలేదు. అక్కడ ఆ పార్టీ నాయకుల టేపులు దొరికాయి. ఇక బీజేపీ ఏ విధంగా నీతివంతమైన పార్టీ? దక్షిణ భారతదేశంలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తోంది. బీజేపీకి అధికారంపైన ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అసలే రాదు. మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ఆ పార్టీల నాయకులను దెబ్బ తీయాలనుకుంటే బొబ్బిలి పులుల్లా తిరిగొస్తారు, కొండవీటి సింహాల్లా గర్జిస్తారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్ నగరాన్ని నిర్మించా. నా కష్టార్జితాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మళ్లీ టీడీపీ అధికారం రావాలి. టీడీపీ గెలవడం ఒక చారిత్రిక అవసరం. 25 ఎంపీ సీట్లు సాధించాలి. కేంద్ర ప్రభుత్వంలో 61 శాతం అవినీతి ఉందని ఒక సర్వేలో తేలింది. వాళ్లు(కేంద్రం) చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. నాలుగేళ్లలో బీజేపీ ఏమైనా చేసిందా? నేను సవాల్ చేసి అడుగుతున్నా. బీజేపీ వాళ్లు ఈ నాలుగేళ్లలో చేసింది ఏమైనా ఉందా? బీజేపీ మాకు నమ్మకద్రోహం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏదోవిధంగా తప్పించుకునేలా అడ్డదారులు వెతుకుతున్నారు. గట్టిగా అడిగితే మాపై కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. విభేదించిన వారిని ఇబ్బంది పెట్టే అలవాటు బీజేపీకి ఉంది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. టీటీడీని కబ్జా చేయాలనుకున్నారు రాష్ట్రంలోని వెంకటేశ్వరస్వామిని కేంద్రంలోని నరేంద్ర మోదీ కబ్జా చేయాలనుకున్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి ఎవరు వచ్చినా ఊరుకోం.. ఖబడ్దార్. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని, లేని వజ్రాలున్నాయని బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది బీజేపీ కుట్రలో భాగమే. నవ్యాంధ్రలో సమస్యలను పరిష్కరించడం కోసమే క్లెమోర్ మైన్ల దాడి నుంచి 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు’’ అని చంద్రబాబు తెలియజేశారు. మహానాడులో చంద్రబాబు తొలుత డ్వాక్రా బజార్, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతి చెందిన టీడీపీ కార్యకర్తలకు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, బుచ్చిలింగం పార్టీ పరిస్థితులపై తమ నివేదికలు సమర్పించారు. -
లోకేష్తో ఏమైనా ఉపయోగం వుందా?
సాక్షి, విజయవాడ: టీడీపీ నిర్వహిస్తోంది మహానాడు కాదు, తెలుగు ప్రజలను మోసం చేసే మాయనాడు అని విజయవాడ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ద్వారా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారు కానీ మహానాడులో తయారు చేస్తున్న వంటల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ విధానాల గురించి కాకుండా వైఎస్ జగన్పై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని తెలిపారు. ధైర్యంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ‘నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబుకు కేంద్రం అంటే భయం. ఓటుకు నోట్లు కేసులో ఏమవుతుందోనని భయం. మీలాగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వైఎస్ జగన్కు చేతకాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు అరెస్ట్ చేస్తాయోనని భయం. చంద్రబాబుకు అరెస్ట్ కావడం, చిప్పకూడు తినడం ఖాయం. చంద్రబాబు తనయుడు లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యారు. లోకేష్ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం వుందా? రాష్ట్ర ప్రజలను మోసగించడం మీకే చెల్లుతుంది. ప్యాకేజీ కావాలన్నావు, హోదా సంజీవని కాదన్నావు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నావు. కర్ణాటక గురించి మాట్లాడే చంద్రబాబు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేలను ఎలా కొన్నావు? అడ్డగోలుగా ప్రజలను దోచుకుని, సింగపూర్, మలేషియాలో దాచుకున్నావు. నమ్మి ఓటు వేసిన తెలుగు ప్రజలను నట్టేటముంచారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వైఎస్ఆర్ తెచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానైనా చంద్రబాబు అబద్దాలు మానేయాల’ని వెల్లంపల్లి హితవు పలికారు. -
అన్న సిద్ధాంతం ఇదేనా?
-
నేటి నుంచి ‘మహానాడు’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అట్టహాసంగా ‘మహానాడు’ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు మహానాడు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12కు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుందని తెలుగు దేశం పార్టీ నేతలు తెలిపారు. విజయవాడలో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి కానూరులోని సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేశారు. ప్రధాన వేదికను రెండు భాగాలుగా నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలకు పక్కనే మరో వేదిక ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలనే తేడా లేకుండా అందరూ ఒకేచోట కూర్చునేలా ఏర్పాట్లు చేశామని ప్రకటించినా విడిగా గ్యాలరీలు సిద్ధం చేశారు. వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులకు ఒక్కో బ్లాకు, ఆహ్వానితులకు ఆరు బ్లాకులు ఏర్పాటు చేయగా కార్యకర్తలకు విడిగా ఎనిమిది గ్యాలరీలు నిర్మించారు. ఏసీలు, ఐస్ కూలర్లు మహానాడు ప్రాంగణం అంతా అత్యాధునిక లైటింగ్, ఏసీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. ఎండ ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేందుకు ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలకు సెంట్రలైజ్డ్ ఏసీ, గ్యాలరీలకు ఐస్ కూలర్లను అమర్చారు. పటిష్టమైన టెంట్లు వేశారు. మూడు వేలకుపైగా ఎల్ఈడీ విద్యుత్ దీపాలు, పది భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వీఐపీలు, కార్యకర్తలకు విడిగా భోజన ఏర్పాట్లు చేశారు. సర్కారు ఖర్చుతో సోకులు మహానాడు కోసం విజయవాడ నగరాన్ని ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున అలంకరించారు. బందరు రోడ్డులోని డివైడర్లకు కొత్త రంగులు వేయడంతోపాటు కొన్నిచోట్ల మొక్కలు నాటారు. రోడ్ల పక్కన చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కానూరు వరకూ పంట కాలువ రోడ్డు డివైడర్కు ఆఘమేఘాల మీద రంగులు వేసి మొక్కలు నాటారు. పంటకాలువ రోడ్డులో కొంతభాగాన్ని విస్తరించడంతోపాటు రాత్రికి రాత్రే తారు రోడ్డు వేశారు. బందరు రోడ్డు, పంట కాలువ రోడ్డు, రింగు రోడ్లతోపాటు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ పరిసరాల్లోని రోడ్లను నీటి ట్యాంకర్లతో శుభ్రం చేశారు. ఈ పనులన్నింటినీ విజయవాడ కార్పొరేషన్ రూ.ఐదు కోట్లతో అప్పటికప్పుడు చేయించినట్లు నాయకులు చెబుతున్నారు. 11 పార్కింగ్ ప్రదేశాలు మహానాడుకు వచ్చే వాహనాల కోసం 11 చోట్ల 40 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు భారీగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. రెండు జాతీయ రహదారుల మీదుగా వెళ్లే లారీలు, భారీ వాహనాలను మూడురోజులు నగరంలోకి రాకుండా ఇతర మార్గంలో వెళ్లాలని నిర్దేశించారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈసారి మహానాడులో 34 తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. -
తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైంది..
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్నారు. మహానాడుకు తనను పిలవకుండా మాదిగలను, దళితులను అవమానపరిచారని విమర్శించారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న నన్ను మహానాడుకు పిలవలేదు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీనియర్ లీడర్కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎస్సీ వర్గీకరణ సభ కోసం నిజామాబాద్ వెళ్తుండగా ఇద్దరు బిడ్డలున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే చంద్రబాబు ఆదుకోలేదు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఉన్న ప్రేమ ఇదా? ఆంధ్రాలోనూ దళితులున్నారు జాగ్రత్త! పెద్ద మాదిగ అన్న మీరు వర్గీకరణపై ఎందుకు తీర్మానం చెయ్యలేదు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంట్కు పంపినా మీరెందుకు చెయ్యలేదో చెప్పాలి’’అని నిలదీశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కనీసం చాయ్కి కూడా సమయం ఇవ్వలేదని, ఆయనా దళితులకు న్యాయం చేసేది అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా బాబు చెప్పాలని, తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరిగి నా తప్పేంటని అడుగుతానని స్పష్టంచేశారు. ‘‘రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయావ్.. ఎంగేజ్మెంట్కు కేబినెట్ అంతా తీసుకొని వెళ్లావ్.. కానీ నా బిడ్డ పెళ్లికి పిలవంగా పిలవంగా సాయంత్రం వచ్చారు. అదే కేసీఆర్ ఇంటికి వెళ్లి.. నా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందనగానే ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెళ్లికి కూడా వచ్చారు’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ శ్మశానంలా తయారైంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైందని, ఆంధ్రప్రదేశ్లోనూ వస్తదో, రాదో అన్న పరిస్థితి ఉందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డిలాంటి మూర్ఖులను ప్రోత్సహించి, నిబద్ధత గల తన వంటి నాయకులను చిన్నచూపు చూడటంతోనే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. పార్టీలో నీతి లేని నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, దళితులను ముఖ్యంగా మాదిగలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పార్టీలో డబ్బు, కులానికే ప్రాధాన్యత పెరిగింది. అందుకే పార్టీ పతనావస్థకు చేరుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్తో కలిసిపోదాం.. కేసీఆర్తో కలిసి పోదాం అన్నందుకే తనను పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి వాపోయారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్ మన మిత్రుడే. ఆయన కేబినెట్లో ఉన్నవారు మనవారే. వారితో జతకట్టడం మనకు మంచిదే. టీఆర్ఎస్లో పార్టీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నా’’అని చెప్పారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని, బాబు తనను పిలిచి మాట్లాడాలని అన్నారు. తనను పిలవకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే చెప్పుతో కొట్టేవారు ఓటుకు కోట్లు కేసులో రేవంత్రెడ్డి అప్రూవర్గా మారతాడని చంద్రబాబు భయపడ్డారని, అందుకే బ్లాక్ మెయిల్ చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. ఒకవేళ కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టేవారని, నాదెండ్ల భాస్కర్రావు మాదిరే తిరుగుబాటు చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో పైసా, పరపతి లేనివారికి సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని, ఆ పని మీరెందుకు చేయలేకపోయారని బాబు ను నిలదీశారు. పార్టీ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. -
బాబే అవమాన పరిస్తే దిక్కెవరు : మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘నన్నింత చిన్నచూపు చూస్తరా? ఒక దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’ అని ప్రశ్నించారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు..’ అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. సిద్ధాంతపరంగా కాంగ్రెస్తో పొత్తు అసాధ్యమని, టీఆర్ఎస్తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు?’ అన్నారు. -
మహానాడుకు నన్ను పిలువలేదు: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం టీటీడీపీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అయితే ఈ మహానాడుకు పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులతో పాటు మరో నేత ,ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మోత్కుపల్లి, కృష్ణయ్య మహానాడుకు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాలు విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. కాగా తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్ఎస్లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్ నేత అయిన మోత్కుపల్లిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నారని సమాచారం. మరో వైపు మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్ఎస్లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్ఎస్లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నన్ను పిలువలేదు: మోత్కుపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడుకు హాజరుకాకపోవడంపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం జరుగుతున్న టీటీడీపీ మహానాడులో మోత్కుపల్లితో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పాల్గొనలేదు. ఈ అంశంపై మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీటీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం అందలేదు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారనుకున్నా.. అది జరుగులేదు.. అందుకే దూరంగా ఉన్నాను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నా వ్యాఖ్యలు టీటీడీపీ తప్పుగా అర్ధం చేసుకుంది. అధినేత చంద్రబాబుకే వివరణ ఇస్తానని చెప్పా. ఆరోజు నుంచి ఇప్పటివరకు అపాయింట్మెంట్ కోరినా కలిసేందుకు అవకాశం దొరకటం లేదు’ అని వెల్లడించారు. -
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీటీడీపీ మహానాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం మహానాడు జరుగనుంది. ఈమహానాడులో మొత్తం 8 తీర్మానాలపై నేతలు చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపే ఎండగట్టడం తదితర అంశాలపై చర్చలు సాగనున్నాయి. ఈ నేపధ్యంలో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, రావు చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇతర నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళలర్పించి అనంతరం మహానాడుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ..‘17 పార్లమెంట్ స్థాయి, రెండు జిల్లా స్థాయి మహానాడులు నిర్వహించాం. నేడు 8లక్షల మంది కార్యకర్తలు, నాయకులందరి సాక్షిగా తెలంగాణ మహానాడు జరుగుతోంది. దేశంలోనే సెక్రటేరియట్కు రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. సెక్రటేరియట్కు రాకుండా ఇంటి నుంచి పాలన వల్ల పరిపాలన గాడి తప్పింది. సీఎం రాకపోవటంతో అజమాయిషీ లేకుండా పాలన పడకేసింది. ప్రగతిభవన్ పైరవీభవన్గా మారిపోయింది. టీడీపీ వల్లనే పేదవాళ్లకు న్యాయం జరగుతుంది’ అని తెలిపారు. కాగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ నాయకులు భారీగా మహానాడుకు తరలివచ్చారు. పూర్వ వైభవానికి కృషి 35 ఏళ్లుగా మహానాడు ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా 27, 28, 29 లో విజయవాడలో మహానాడు నిర్వహిస్తున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రమణ నాయకత్వంలో తెలుగు దేశం మహానాడు జరుగుతోందని, అనేక తీర్మానాలతో పాటు, భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటామన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ సుస్థిరంగా తెలుగు వారి గుండెల్లో నిలిచి పోయిందని తెలిపారు. తెలంగాణ మహానాడుకు వెళ్లేముందు ఎన్టీఆర్కు నివాళులర్పించి ఆయన ఆశయాలు అభ్యర్థించేందుకు ఘాట్కు వచ్చామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు అండదండలతో తెలంగాణలో తెలుగుదేశం పూర్వ వైభవానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా చంద్రబాబు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే మహానాడు చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుని మహానాడులో పాల్గొంటారు. విజయవాడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గాన మహానాడుకు చేరుకుంటారు. దాదాపు 5 గంటల పాటు మహానాడులో ఉండనున్న చంద్రబాబు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రసంగించనున్నారు. -
బతుకు బస్టాండు
కదిరి అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనతో ఆర్టీసీ ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కదిరి ఆర్టీసీ డిపోలో దాదాపు 104 బస్సులు ఉంటే అందులో 60 బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో పలు సర్వీసుల రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు ఆశ్రయించారు. మరికొందరు మాత్రం బస్టాండుల్లోనే గంటల తరబడి వేచి చూశారు. ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా తమకీ పాట్లు తప్పడం లేదని ప్రయాణికులు వాపోయారు. -
శ్మశానానికి దారి చూపండి బాబూ
పెనుకొండ: సీఎం చంద్రబాబు ఎదుట తురకలాపట్నం వాసులు సమస్యలు ఏకరువు పెట్టారు. సోమవారం రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలోని రచ్చకట్టపై ముఖ్యమంత్రి గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా... వేదిక వద్దకు వెళ్లిన మంజుల తమ గ్రామంలోని శ్మశానానికి దారి చూపాలని వేడుకుంది. తమ గ్రామంలోని శ్మశానానికి దారిలేక చాలా ఇబ్బందులు పడుతున్నామనీ, పొలాల మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు భూ యజమానులు ఒప్పుకోవడం లేదని వెల్లడించింది. తమ ఇబ్బందులను అధికారులకు, ప్రజాప్రతినిథులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న గ్రామ కార్యదర్శి కూడా శ్మశానానికి దారి లేక జనం పడుతున్న ఇబ్బందులను వివరించారు. స్పందించిన సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ వీరపాండియన్ను ఆదేశించారు. అనంతరం మంజుల మాట్లాడుతూ, తమ గ్రామంలో బస్టాండ్ లేక జనం పడుతున్న బాధలను సీఎం దృష్టికి తీసుకువచ్చింది. వెంటనే బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చేనేత వర్గానికి చెందిన శంకరమ్మ అనే ఉపాధి హామీ కూలీ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పిస్తున్నారనీ, అయితే 150 రోజుల పని కల్పించడం లేదన్నారు. దీంతో ఈ సమస్య కేంద్రం పరిధిలో ఉందని వారిని అక్కడి నుంచి పంపారు. -
ఏయూ సొంత జాగీరా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)ను తెలుగుదేశం పార్టీ నేతలు సొంత జాగీరులా మార్చేస్తున్నా పాలకమండలి సభ్యులు గానీ, అధికారులు గానీ కిమ్మనకపోవడం వివాదాస్పదమవుతోంది. పైగా టీడీపీ నేతలకు వంతపాడుతూ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. సరిగ్గా గతేడాది మే నెలలోనే ఏయూ గ్రౌండ్స్లో ఎటువంటి అనుమతుల్లేకుండా టీడీపీ మహానాడు నిర్వహించిన పార్టీ పెద్దలు మంగళవారం ధర్మపోరాట సభ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించడం చర్చాంశనీయమవుతోంది. వర్సిటీలో రాజకీయ పార్టీల సభలు ఏర్పాటు చేయడమే నిబంధలకు విరుద్ధం కాగా.. ఆ సభకు కనీసంగా అనుమతులు తీసుకోకపోవడం టీడీపీ నేతల లెక్కలేని తనానికి అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏటా మే నెలాఖరులో నిర్వహించే మహానాడును గతేడాది ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏయూలో నిర్వహించడమే వివాదాస్పదమైతే... అసలు ఏయూ అధికారుల నుంచి నిర్వహణకు కనీస అనుమతులు కూడా పొందని టీడీపీ నేతల బరితెగింపు వ్యవహారంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉండాల్సిన ఏయూ అధికారులు ఈ సారి స్వయంగా వారే దాసోహం అన్నారు. దీంతో టీడీపీ ప్రత్యేక హోదాపై ‘అర్ధంతరపు’ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం తలపెట్టిన ధర్మపోరాట సభకు వర్సిటీ అధికారులే అనుమతిలిచ్చేశారు. టీడీపీ నాయకులు మాట వరుసకు వచ్చి కలిస్తే... అయ్యో ఫరవాలేదండీ... మీ ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్స్ను వాడుకోండి... అంటూ సొంతజాగీరులా అప్పజెప్పేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మాత్రం నో తెలుగుదేశం పార్టీకి వంతపాడుతూ ఏయూ గ్రౌండ్స్లో సభకు అనుమతిలిచ్చేసిన అధికారులు ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూ వస్తున్నారు. 2015 సెప్టెంబర్లో ప్రత్యేక హోదా డిమాండ్తోనే యువభేరి పేరిట విద్యార్థులు, యువకులతో వర్సిటీ గ్రౌండ్స్లో సదస్సు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు భావించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు, మత సంబంధమైన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని ఉన్నత విద్యామండలి జీవో జారీ చేసిందంటూ అప్పట్లో వర్సిటీ అధికారులు హడావుడి చేశారు. అనుమతిలివ్వలేమని చేతులెత్తేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు యువభేరిని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించుకున్నారు. ఆ తర్వాత 2016 నవంబర్లో జై ఆంధ్రప్రదేశ్ పేరిట బహిరంగసభను నిర్వహించేందుకు ఏయూ గ్రౌండ్స్ను అడిగితే అప్పు డూ అదే సాకు చెప్పారు. దీంతో వన్టౌన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థుల దీక్షలకూ నిరాకరణ ఇక ప్రత్యేక హోదా డిమాండ్తోనే వర్సిటీలో విద్యార్థులు దీక్షలు తలపెడితే కనీస మానవత్వం లేకుం డా వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపా రు. గత ఏప్రిల్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షలకు సంఘీభావంగా ఏయూలో విద్యార్థి సంఘాల నేతలు నిరవధిక నిరశన దీక్షలకు దిగారు. ఆ మేరకు కనీసం టెంట్ వేసుకునేందుకు కూడా వర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. వేసిన టెం ట్లు కూడా నిర్దాక్షిణ్యంగా తీసివేయడంతో విద్యార్థి నేతలు మండుటెండలోనే దీక్షలు కొనసాగించారు. టీడీపీ సభకు మాత్రం సై... వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులపై ఇలా లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టిన ఏయూ అధికారులు అధికార టీడీపీ నేతలు వచ్చి సభ పెట్టు కుంటామంటే ఏ మాత్రం ఆలోచించకుండా అనుమతులిచ్చేశారు. పోనీ గ్రౌండ్ వరకే పర్మిషన్ ఇచ్చారని భావించినా.. వర్సిటీలో రోడ్ల మధ్యలో ఇష్టారాజ్యంగా గోతులు తీసి స్వాగత ద్వారాలు, కటౌట్లు పెట్టేస్తున్నా వర్సిటీ అధికారులు మిన్నకుం డటం విమర్శలపాలవుతోంది. వాస్తవానికి అధికా రుల్లోని ఓ వర్గం మాత్రం టీడీపీ నేతల బరితెగింపుపై విస్మయం వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా మాట్లాడేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏయూపై అధికార టీడీపీ పెత్తనం చేస్తున్నా విద్యార్థి సంఘాలు సైతం మౌనంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. ఏయూ అధికారులు టీడీపీ తొత్తుల్లా మారారు... వంశీకృష్ణ విమర్శ ఏయూ ఉన్నతాధికారులు టీడీపీ నేతలకు తొత్తుల్లా మారారని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గతంలో తాము ఎన్నోమార్లు ప్రత్యేక హోదా ఉద్యమ సభలకు, సదస్సులకు ఏయూ గ్రౌండ్స్ను అడిగితే అనుమతులు నిరాకరించిన అధికారులు టీడీపీ నేతలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. అధికారమదంతో ఏయూను సొంత జాగీరులా వాడుకుంటున్న టీడీపీ నేతలకు విద్యార్థులు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. అనుమతిచ్చాం.. అద్దెకట్టారో లేదో తెలియదు: వీసీ నాగేశ్వరరావు టీడీపీ అర్బన్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ వచ్చి అనుమతి కావాలని అడిగారు.. సెలవులే కదా అని వర్సిటీ గ్రౌండ్స్ను అద్దెకిచ్చాం.. రోజుకు లక్ష వరకు అద్దె చెల్లించాలి.. మరి ఆ డబ్బులు కట్టారో లేదో నాకు తెలియదు... అని ఏయూ వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సహా ఇతర పార్టీల సభలు, సదస్సులకు అనుమతులు ఇవ్వని మీరు... టీడీపీ సభలకు మాత్రమే ఎలా ఇస్తున్నారని ప్రశ్నించగా... అప్పుడు సెలవుల్లేవు.. ఇప్పుడు సెలవులు కదా.. అందుకే ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు సెలవుల రోజుల్లో అడిగినా పర్మిషన్ ఇవ్వలేదని ప్రస్తావించగా.. ఏమో ఆ తేదీలు గుర్తు లేవు అని సమాధానమిచ్చారు. -
ఏం సాధించారని మహానాడులో సంబరాలు
►తండ్రిలాంటి మామనే మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ►అది అమరావతి కాదు భ్రమరావతి ►ప్రత్యేక హోదా, కడప స్టీల్ప్లాంటుపై మహానాడులో తీర్మానం చేయాలి ►మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల కాలంలో ఏం సాధించిందని మహానాడులో సంబరాలు చేసుకుంటున్నారని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రశ్నించారు. కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెద్ద పరిశ్రమ రాలేదని, ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయిందని, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకొనేవారే లేరన్నారు. జిల్లా టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా, కడప స్టీల్ప్లాంటు కావాలని మహానాడులో తీర్మానాలు చేయించాలని సవాల్ విసిరారు. ఇది ఒరిజినల్ టీడీపీ కాదని, 1982లో ఏ సిద్దాంతాలు, ఆశయాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో వాటికి ఎప్పుడో తిలోదకాలిచ్చేశారని ఎద్దేవా చేశారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు నందమూరి వారి పార్టీ నారా వారి వశమైందని అభివర్ణించారు. ఆనాడు ఎన్టీఆర్ మృతదేహం వద్దకు వచ్చే ధైర్యం కూడా లేని చంద్రబాబు, విధిలేని పరిస్థితుల్లోనే హరికృష్ణను మంత్రిని చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్పై పోటీ చేస్తానని చెప్పిన బాబుకు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తండ్రిలాంటి మామనే మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం లెక్కకాదన్నారు. లోకేష్కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాదన్నారు. అమరావతి రాజధాని పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని, అక్కడ నిలబడేందుకు చెట్టుగానీ, తాగేందుకు నీరుగానీ లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక, వర్షపాతం కరువై పంట నష్టాలతో రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. పసుపు రైతులకు క్వింటాకు రూ.10వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి, టమోటా రైతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. భేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని, బంగారు ఆభరణాలను అసలు, వడ్డీ కట్టి విడిపిస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఖరీఫ్, రబీలో రూ.4వేలు విలువగల ఎరువులను రైతులకు ఉచితంగా అందించాలని, ఈ మేరకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరించడానికే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జులై 8,9 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని, మే 25 నుంచి జూన్ 5వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు పూర్తవుతాయన్నారు. జూన్ 19,20,21 తేదీలలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని వివరించారు. -
ద్రోహం @ బాబు.కామ్
-
మహానాడా?మాయనాడా?
-
రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్టణం: తెలంగాణలో నిరంతర విద్యుత్ కు చంద్రబాబు ఉదారతే కారణమని టీటీడీపీ నేత రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం విశాఖ టీడీపీ మహానాడులో తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్ట్స్ -ప్రాజెక్ట్స్ రీడిజైన్స్- భూసేకరణ పై పార్టీ నేత భూపాల్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రేవంత్ బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలంటే రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే తాము ఏ వైపు అని కేసీఆర్ ప్రశ్నించారని, ఇందుకు తమ సమాధానం ప్రజల పక్షం అని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఒప్పించుకుంటామని తెలిపారు. ఎన్నికల హామీలను అమలుచేయని సీఎంగా కేసీఆర్ నిలిచిపోతారని అన్నారు. 1100 రోజుల టీఆర్ ఎస్ పాలనలో 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న 1250 మందిని గుర్తించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా సవరణ చేసిందని ఆరోపించారు. -
వైఎస్ఆర్ సీపీ డిమాండ్లను ఒప్పుకోండి..
హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే మరోవైపు టీడీపీ మాత్రం రైతుల దుఖం మీద పండుగ చేసుకుంటోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారధి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంతో మట్లాడారు. ‘అన్ని జిల్లాల్లో కరువు ఉంది, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పండిన పంటను అమ్ముకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. టీడీపీ మహానాడులో రైతుల సమస్యులు గానీ.. యువకుల ఉద్యోగాల సమస్యలు గానీ చర్చకే రాలేదు. మహానాడులో ఎటువంటి మేలు జరిగే విషయం చర్చకు రాలేదు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు లేకుండా మహానాడు జరుపుతున్నారు. మహానాడు పేరుతో తిరునాళ్లు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. మీ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వంలో అవినీతి లేదంటే.. వైఎస్ఆర్ సీపీ చేసిన డిమాండ్లను ఒప్పుకోండి. మీ మూడేళ్ల పాలనపై నమ్మకం ఉంటే అవినీతిపై సీబీఐతో విచారణ చేయించండి. మీ కులపిచ్చితో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమకు నీళ్లివ్వాలని ఆలోచించిన మొదటి వ్యక్తి వైఎస్ఆరే. కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు అన్యాయం జరగకుండా రాయలసీమకు నీళ్లివ్వాలని ఆయన తపించారు. ఇక నారా లోకేశ్ ప్రసంగం ఉత్తరమకుమారుడి ప్రగల్భాలను తలపించింది. రాజధాని భూముల్లో అవినీతి జరగలేదని చెప్పగలరా?. అమరావతిలో కానీ...పోలవరంలోకానీ జరగాల్సిన అభివృద్ధి జరిగిందా?. మీరు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఏవిధంగా అడ్డుపడుతున్నారో చెప్పాలి. రాష్ట్రంలో అవినీతి తప్ప... అభివృద్ధి జరగడం లేదు.’ అని ఆయన అన్నారు. -
వైఎస్ఆర్ సీపీ డిమాండ్లను ఒప్పుకోండి..
-
మహానాడులో ‘ఎన్టీఆర్’కు మొక్కుబడి తంతు
-
ఏపీలో ప్రజా సమస్యలు పట్టవా ?
-
చంద్రబాబు.. నీచపు వ్యక్తిత్వమున్న విలన్!
తిరుపతి: చంద్రబాబునాయుడు లాంటి విలన్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా కనిపించడని, చంద్రబాబులాంటి నీచపు వ్యక్తిత్వమున్న విలన్ ఉండబోరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎవరికీలేని విలన్ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని, దివంగత నేత ఎన్టీఆర్ను చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినవారే ఇప్పుడు ఆయన వారసులమని ప్రకటించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఎలుకల్లా చేరి..పందికొక్కుల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు వాగ్దానాలు ఎప్పటికీ ఆచరణకు నోచుకోవు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అబద్ధాలు చెప్తున్నారు పారిశ్రామిక ఒప్పందాలపై అబద్ధపు లెక్కలు చెప్పారు నీతులు చెప్పడంలో, వంచించడంలో బాబులాంటి దారుణమైన వ్యక్తి మరొకరు లేరు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది ఎన్నికల వాగ్దానాలపై చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదు ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారు మూడేళ్లైనా ప్రజలకు అనుకూలంగా ఒక్క ఆశయాన్ని నెరవేర్చలేదు చంద్రబాబు మాటలు నమ్మితే టీడీపీకి పుట్టగతులు ఉండవు -
‘గీతం’ మూర్తి బహిరంగ క్షమాపణ
మహానాడు వేదికపై ఎమ్మెల్సీతో క్షమాపణ చెప్పించిన చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: ‘ఏయూ ఒక దెయ్యాలకొంప..’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ, గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, లక్షలాది మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విశాఖ ప్రజల మనోభావాలను గాయపర్చినందుకు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నానని ప్రకటించారు. మూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏయూ విద్యార్థి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడురోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మహానాడు ప్రాంగణానికి వచ్చిన మూర్తి తాను అలా అనలేదని, మీడియా వక్రీకరించిందని బుకాయించడంతో మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మూర్తి వ్యాఖ్యల వీడియోలను ఆయనకు చూపించారు. ఆయనతో క్షమాపణలు చెప్పించాలని, లేకుంటే ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్సీ మూర్తిని పిలిపించి చీవాట్లు పెట్టి, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మహానాడులో ‘ఎన్టీఆర్’కు మొక్కుబడి తంతు...
మరోసారి భారతరత్న! దివంగత నేతకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని టీడీపీ మహానాడులో తీర్మానం - దాదాపు ప్రతి మహానాడులో తీర్మానం చేయిస్తూ తర్వాత అటకెక్కిస్తున్న బాబు - విశాఖ మహానాడులో రెండోరోజు 13 తీర్మానాలు ఆమోదం - కౌలు రైతుల సంక్షేమానికి చట్టం తెస్తామని చంద్రబాబు వెల్లడి విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని టీడీపీ మహానాడులో మరోసారి మొక్కుబడిగా తీర్మానం చేశారు. దాదాపు ప్రతి మహానాడులో ఈ మేరకు తీర్మానం చేయడం, తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూరంగా ఉండడంపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా మళ్లీ తీర్మానం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మహానాడు ముసాయిదా తీర్మానాల్లో ఎన్టీఆర్కు నివాళి అర్పించే తీర్మానం తప్ప భారతరత్న ఇవ్వాలనే తీర్మానం లేదు. అయినా తాజాగా ఈ మేరకు తీర్మానం చేయడం గమనార్హం. అసలు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం రావడం చంద్ర బాబుకు ఇష్టంలేదనే వాదన టీడీపీలో వినిపి స్తోంది. కేవలం విమర్శల నుంచి తప్పించుకో వడానికే ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారనే తప్ప ఆయనపై అభిమానంతో కాదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. గతంలో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వంలో తాను చక్రం తిప్పానని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అప్పట్లోనే ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదని టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మహానాడులో రెండోరోజు ఆదివారం మొత్తం 13 తీర్మానాలను ఆమోదించారు. తీర్మానాలపై జరిగిన ప్రతి చర్చలోనూ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ప్రతి అంశంలోనూ అండగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. మహానాడులో ఆది వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సందర్భాల్లో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఏం చెప్పారంటే... ‘‘రాష్ట్రంలో వాస్తవ సాగుదార్లుగా ఉన్న కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఒక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం. రైతులు(భూ యజమానులు), కౌలు రైతులకు మధ్య అవగాహన ఉండేలా ఈ చట్టం రూపొందిస్తాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రైతులకు తప్ప కౌలుదార్లకు అందడం లేదన్న విమర్శల నేపథ్యంలో కొత్త చట్టం గురించి ఆలోచిస్తున్నాం. ఒప్పందాలు 1,529... సిద్ధమైనవి 23 రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపనలో భాగంగా ఇప్పటిదాకా 1,529 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో 927 ఒప్పందాల పరిశీలన పూర్తయింది. 23 ఒప్పందాలు అమలుకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా 2.6 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పరకాలది రాజకీయ నియామకం టీడీపీ మహానాడులో మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రమేయం గురించి పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. పరకాల ప్రభాకర్ది నాన్ అఫీషియల్ పొలిటికల్ అపాయింట్మెంట్ అని, అతను ప్రభుత్వ ఉద్యోగి కాదని స్పష్టం చేశారు. ఆ హోదాలోనే ఆయన తనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, దీనిపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకే ఈ వివరణ అని చెప్పారు. కాగా ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని పరకాల ప్రభాకరే మహానాడులో ప్రవేశపెట్టడం విశేషం. ఇది చర్చనీయాంశంగా మారింది. రెండోరోజూ జాడలేని ఎన్టీఆర్ కుటుంబీకులు మహానాడులో రెండోరోజు కూడా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ రెండోరోజైనా మహానాడుకు వస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ, వారి జాడ కనిపించలేదు. ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండోరోజు కూడా గైర్హాజరయ్యారు. నందమూరి మోహనకృష్ణ తనయుడు, సినీ నటుడు తారకరత్న ఒక్కరే ఆదివారం మహానాడుకు వచ్చారు. ఆయనతోపాటు సినీ నటుడు వేణుమాధవ్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీలు మాగంటి మురళీమోహన్, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావు కూడా గైర్హాజరయ్యారు. అధ్యక్ష పదవికి బాబు తరçఫున నామినేషన్లు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు తరఫున పలువురు నాయకులు మహానాడులో 33 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి గా తెలంగాణకు చెందిన పెద్దిరెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తరఫున 33 సెట్ల నామినేషన్లను పలువురు నాయకులతో దాఖలు చేయించారు. సోమవారం లాంఛనంగా చంద్రబాబు మూడోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. -
బాబు మహా‘డప్పు’ సభ..
టీడీపి మహానాడుపై జక్కంపూడి రాజా విసుర్లు సీతానగరం (రాజానగరం) : విశాఖలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు.. బాబు మహాడప్పు సభగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అద్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించిన లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, మహానాడులో ఆయన ఫోటోకు భజన చేస్తున్నారన్నారు. టీడీపీ వారసత్వాన్ని నందమూరి వంశీయులకు కాకుండా లోకేష్కు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. లోకేష్కు దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చి, పార్టీకి వారసత్వం ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత 1999లో బీజేపీ పొత్తుతో గెలిచిన చంద్రబాబు.. తిరిగి 2014లో బీజేపీ పొత్తు, జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చారన్నారు. పొత్తు లేకుండా ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన సందర్బం లేదన్నారు. ఆడపడుచులకు పార్టీలో పెద్దపీట వేశామని డప్పు కొట్టుకునే టీడీపీలో మహిళలతో కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత మహానాడులో జరిగిన అవమానంకు కంటతడి పెట్టారని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరేందుకు ఇతర పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఎన్టీఆర్ తొలి మహానాడులో తీర్మానం చేశారని, చంద్రబాబు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి డిపాజిట్ గల్లంతు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహానాడుకు రాయపాటి, రామసుబ్బారెడ్డి డుమ్మా
అధినేత తీరుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్దీ అదే బాట హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేత ఎస్వీ రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఎస్వీ సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి తనకు ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ రాయపాటి అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మహానాడు వేదికగా టీడీపీలోని పలు లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు కుటుంబం ఈ మహానాడుకు దూరంగా ఉంది. నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ, బాలకృష్ణ, యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు రాయపాటి, ఎస్వీ రామసుబ్బారెడ్డి కూడా మహానాడుకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. -
చంద్రబాబు.. నీచపు వ్యక్తిత్వమున్న విలన్!
-
‘కేసీఆర్కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కు దమ్ముంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలి. వెంటనే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరాలి.. అప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్మెంతో. కేసీఆర్ వెల్లడించిన సర్వే వివరాలన్ని అబద్ధాలని అన్నారు. -
పార్టీ ఉనికి కోసమే పొత్తు