
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
అమిత్షాకు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ వినతి
నల్లగొండ టౌన్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలని కోరారు.