ఇద్దరు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం | mother and daughter suicide in warangal district | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం

Published Fri, Apr 29 2016 11:28 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

mother and daughter suicide in warangal district

వరంగల్ : కట్నం వేధింపులతో తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో తల్లి, కూతురు చనిపోగా మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం ఆత్మకూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు కిరణ్, సుప్రియ దంపతులకు ఇద్దరు కూతుళ్లు నిత్యశ్రీ, సింధుశ్రీ ఉన్నారు.

అయితే, కొన్ని రోజులుగా సుప్రియను కిరణ్ పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుప్రియ తీవ్ర ఆవేదన చెందింది.  ఈ క్రమంలో నేటి ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఇద్దరు పిల్లలు గట్టిగా పట్టుకుంది. మంటల్లో సుప్రియ, నిత్యశ్రీ(2) చనిపోగా సింధుశ్రీ(5) తప్పించుకుంది.

ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... తల్లికుమార్తె మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే సింధును చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement