కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి చెందాడు.
నిజామాబాద్: కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భిక్నూర్ మండలం ఇసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె పెంటయ్య(60) మూడు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిగా స్వస్థత చేకూరటంతో బుధవారం పెంటయ్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాడు.