ఆవిష్కరించిన మంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రూపొందించిన పోస్టర్ను గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, అధ్యాపకులు, ప్రోత్సాహకాలను పేర్కొంటూ దీనిని రూపొం దించారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభమవడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేపట్టినట్లు టీజీసీజీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవయ్య, సురేందర్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ పోస్టర్
Published Fri, May 19 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
Advertisement
Advertisement