Poster
-
డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్!
నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాకు మహారాజ్ పోస్టర్ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్టర్ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్ పోస్టర్లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
అద్దెకు బాయ్ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్జీవీ శిష్యుడి సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన 'మంగళవారం' డైరెక్టర్
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నా లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను 'మంగళవారం' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్గా వర్క్ చేశాం.ఈ వాలంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పోస్టర్ చాలా కొత్తగా ఉంది. వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.."మా పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలు" అని చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అలాంటి నాకు డైరెక్టర్ వినయ్ గారు ఈ సినిమా ద్వారా అవకాశమిచ్చారు. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తాను. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉంది అన్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. -
'పెళ్లి’ ఆశతో ప్రేమలో పడ్డాం.' వనితా విజయ్కుమార్ లవర్స్ డే స్పెషల్!
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్లో వార్తలొచ్చాయి. బీచ్లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.నాలుగో పెళ్లిపై రూమర్స్..గతేడాది అక్టోబర్లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
'థౌజండ్ వాలా'గా ఎంట్రీ ఇస్తోన్న అమిత్.. ఆసక్తిగా పోస్టర్
అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న టీమ్.. 1000వాలా నుంచి పోస్టర్ను రిలీజ్ చేసింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఆడియన్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉంది. ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సుమన్, నమిత, కీర్తి, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్
-
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్
అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.ఫిబ్రవరి 15న షూటింగ్ని పునఃప్రారంభించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్, అచ్యుత్ కుమార్, గోపాల్ కృష్ణ దేశ్పాండే, సంపత్ మైత్రేయ, యశ్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు. డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్ నిర్వర్తిస్తున్నారు. -
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
హారర్ థ్రిల్లర్
‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ
సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వశిష్ఠ". ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. "వశిష్ఠ" మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ , నాగబాల సురేష్ అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోస్టర్ కలకలం
-
ఉత్సవంలో ...
‘జరగండి... జరగండి...’ అంటూ రామ్చరణ్ ఏ రేంజ్లో మాస్ స్టెప్పులేశారో ఆ పాట వీడియో చూసినవాళ్లకి తెలిసిందే. రామ్చరణ్తో కలిసి కియారా అద్వానీ కూడా జోష్గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ నెలలోనే మరో పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసి, ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఓ ఉత్సవం నేపథ్యంలో రామ్చరణ్, ఉత్సాహంగా డ్యాన్స్ చేసే పాట ఇది అని పోస్టర్ స్పష్టం చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎస్. తిరుణావుక్కరసు. -
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
నటనకు 50 ఏళ్లు.. బాలకృష్ణ పోస్టర్ ఆవిష్కరణ!
తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరో నందమూరి బాలకృష్ణ . ఈ ఏడాదితో ఆయన నటుడిగా యాభైఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని సెప్టెంబరు 1న నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు.దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి, నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్ను అధిక బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
సీతారామం హీరో బర్త్ డే.. తెలుగులో మరో మూవీ!
సీతారామం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మరో కొత్త మూవీని ప్రకటించారు. తెలుగులో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దుల్కర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టైటిల్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ స్వప్న సినిమాస్ దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్ సాంప్రదాయ కుర్తా, ఎరుపు కండువా ధరించి కనిపించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా..దుల్కర్ నటించిన లక్కీ భాస్యర్ సెప్టెంబర్ 7వ తేదీ 2024న విడుదల కానుంది. ఆకాశంలో ఒక తార 💙Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥#AakasamLoOkaTara@pavansadineni @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/MIJpZjDsrI— Swapna Cinema (@SwapnaCinema) July 28, 2024 -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్లుక్, టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్గంజ్లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
మస్క్కు ధన్యవాదాలు తెలిపిన నిర్మాత.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.అయితే ఆ ట్వీట్లో ఓ సినిమా పోస్టర్ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa— Adham Bava (@adham_bava) June 11, 2024 -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్గ్రౌండ్లో కిచెన్లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఎం రేవంత్రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
AP: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్లోని నర్మదా డ్యామ్కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
Pushpa 2: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. పార్ట్-1 బ్లాక్బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్(పార్ట్-2) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. #2024RulePushpaKa ❤️🔥 Pushpa Raj is coming back this year to rule the worldwide box office 🔥🔥 May you all rule your year with ambition & determination and may you get everything you desire for 💫 Happy New Year 2024 ❤️#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG… pic.twitter.com/u6VED8LZbr — Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2024 -
సరదా.. సరదాగా...
హీరో వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సరదా.. సరదాగా...’ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేసింది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా కలిసి సరదాగా సముద్రపు ఒడ్డున చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందుతోన్న చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ‘రాంగ్ యూసేజ్..’ అనే తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. ‘సరదా.. సరదాగా...’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: యస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్కు సంబంధించిన పోస్టర్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
సీఎం షిండేపై బీజేపీ పోస్టర్..సంజయ్ రౌత్ ఆగ్రహం
ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండేపై రాజస్థాన్ బీజేపీ లీడర్ వేసిన పోస్టర్ శివసేన ఉద్ధవ్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్రౌత్కు కోపం తెప్పించింది. రాజస్థాన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రాజస్థాన్లోని హవామహల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలముకుందాచార్య కార్యకర్తలు షిండేకు ఆహ్వానం పలుకుతూ ఒక పోస్టర్ వేశారు. హిందూ హృదయ సామ్రాట్ షిండే అని పోస్టర్పై ఉండడం పట్ల సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం సొంత పార్టీకి మోసం చేసిన వ్యక్తిని బాల్ థాక్రేతో సమానంగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. అధికారం కోసం సొంత పార్టీని మోసం చేసే వారిని కీర్తించే కొత్త ట్రెండ్ స్టార్టయిందని రౌత్ అన్నారు. ఈ వివాదంపై మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునగంటివార్ స్పందించారు. ‘కార్యకర్తలు సాధారణంగా తమ అభిమాన నేతలను వారికిష్టం వచ్చినట్లుగా పిలుచుకుంటారు. ఇందులో భాగంగానే షిండేను అభిమానించే వ్యక్తి ఆ పోస్టర్పెట్టుంటారు. షిండే బాల్థాక్రే బాటలో వెళ్తున్నారని పోస్టర్ వేసిన వాళ్లు భావించి ఉంటారు. షిండే తనకు తానుగా ఆ పోస్టర్ అయితే పెట్టలేదుగా’ అని సుధీర్ అన్నారు. ఇదీచదవండి..డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు -
రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్కు లీడ్గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.' అని అన్నారు. హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి.’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
రావణుడిగా రాహుల్ గాంధీ..!
-
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
కోట బొమ్మాళి పాట
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!
పుష్పరాజ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్సింగ్ షెకావత్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్ భన్వర్సింగ్ షెకావత్పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లోపాల్గొన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఫాహద్ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ప్రతీకారంతో భన్వర్సింగ్ షెకావత్ సార్ బిగ్ స్క్రీన్స్పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్తో చిత్ర యూనిట్ ఫాహద్ కొత్తపోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా షూటింగ్లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. -
అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!
'మల్లేశం', 'వకీల్సాబ్' చిత్రాల ఫేం అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ను మేకర్ రిలీజ్ చేశారు. అతి భయంకరమైన క్షుద్రశక్తులు.. అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!) మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న హారర్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!) View this post on Instagram A post shared by FIRSTCOPY MOVIES (@firstcopymovies) -
కోట బొమ్మాళి పీఎస్లో..
శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ ప్రత్యేక పాత్రలో, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘రాజకీయాలు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో ‘కోట బొమ్మాళి పీఎస్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
‘స్కంద’ క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని ‘నీ చుట్టు చుట్టు...’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో రామ్ ఇంతకుముందు కనిపించనంత మాస్గా కనిపించనున్నారు. ‘నీ చుట్టు..’ సాంగ్ చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్ కుమార్, జీ స్టూడియోస్. డబుల్.. తొలి షెడ్యూల్ పూర్తి: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మా యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం విదేశాలు వెళ్లనున్నాం. 2024 మార్చి 8న థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’’ అని ఛార్మి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సీఈవో: విషు రెడ్డి. -
ఓ ప్రేమకథ
వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్, పోస్టర్ను చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ‘‘చదువుకునే టైమ్లోనే సినిమా తీయాలనే కల ఉండేది. మంచి టీమ్తో ‘నీతోనే నేను’ తీశాను’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పని చేశారు’’ అన్నారు అంజిరామ్. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు వికాస్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్, కెమెరామేన్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి. కడగండ్ల పాల్గొన్నారు. -
ఆర్జీవీ 'వ్యూహం' ఇంటెన్స్ పోస్టర్ చూశారా?
కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసామాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ ఇంటెన్స్ పోస్టర్ రిలీజైంది. టెక్నికల్గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్ చేయగల పోస్టర్ డిజైనర్స్.. అనిల్ అండ్ భాను అని సెన్సేషనల్ దర్శకుడు రామ్గోపాల్వర్మ తన ట్విటర్ ద్వారా తెలియచేశారు. వైఎస్. జగన్ పాత్రను పోషించిన అజ్మల్ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి ప్రతిభను చూసి ఆశ్యర్యపోతున్నానన్నారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్కుమార్. ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తామన్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్కు మంచి స్పందన లభించింది. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అన్న ఒకే ఒక్క డైలాగ్తో వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసేదిగా ఉంది. ఈ చిత్రంలో వైఎస్.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్– మనీష్ ఠాకూర్. VYOOHAM poster designs have been done by the incredibly talented duo of @anilandbhanu ..Film is produced by @dkkzoomin and the target audience is TDP, JS and the general public 💐💪 pic.twitter.com/7gNLafXZLl — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2023 చదవండి: ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే -
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
ఖమ్మంలో పోస్టర్ల కలకలం
-
బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్..
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రామ్ లీలా మైదానం వరకు భారీ ర్యాలీగా కదిలి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రిలాక్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు ఆదివారం ఉదయాన్నే సూపర్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. వారు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే దారి పొడవునా బ్యానర్లు, ప్లకార్డులు తగిలించేశారు. బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార బ్యానర్ల కంటే కూడా బీజేపీ తగిలించిన ఈ పోస్టర్లే జనాలను బాగా ఆకర్షిస్తుండటం విశేషం. ఆమ్ ఆద్మీ పార్ట్ బ్యానర్లలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ అని ఉంటే .. బీజేపీ రాసిన బ్యానర్లలో ఢిల్లీ సీఎం నిర్మించుకున్న సొంత ఇంటి భవనం గురించి మాత్రమే ప్రస్తావించారు.. "ఇంటి పునర్నిర్మాణానికి రూ. 45 కోట్లా.. ప్రజల వద్ద టాక్స్ రూపంలో వసూలు చేసిందేగా..?" "మాక్కూడా రూ. 45 కోట్ల భవనాన్ని చూడాలని ఉంది.." అని రాసిన బ్యానర్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ దర్శనమిచ్చాయి. ग़रीबों की कमाई के 45 करोड़ खर्च कर राजमहल सजाया केजरीवाल जवाब दो?? pic.twitter.com/BOuT2RCQhW — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి ఢిల్లీ సీఎం దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. కానీ ర్యాలీ రోజు ఉదయాన్నే బీజేపీ కౌంటర్ పోస్టర్లతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అంతేకాదు బీజేపీ ఢిల్లీ తన ట్విట్టర్ అకౌంట్లో "ఢిల్లీని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్" అని రాసి సీఎం ఫోటో ఉన్న ఒక సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. सिर्फ एक बंदा काफ़ी है, दिल्ली को तबाह करने के लिए - नाम है केजरीवाल pic.twitter.com/EwwFDBnmV5 — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 ఇది కూడా చదవండి: జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్ -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎంఎల్సీ కవిత పోస్టర్ను ఆవిష్కరించారు. 29 రాష్ట్రాల NRIలు పాల్గొంటున్న టోర్నమెంట్.. టీఆర్ఎస్నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం , కేసిఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది , కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకునామని , ఈ టోర్నమెంట్ లో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల కు చెందిన వారు పాల్గొంటారని, తద్వారా కేసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండాను NRI లందరికీ చేరుతుందని అందుకే బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం క్రికెట్ కప్ టోర్నమెంట్ను ఎంచుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా , అలాగే ఉద్యమం నుండి పార్టీకి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని కవిత అభినందించారు . కేసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూర్తి తోనే మేము క్రికెట్ను పార్టీ భావజాల వ్యాప్తికై ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ట్రాప్ చేసి నగ్నవీడియోలు తీసి.. వాస్తవ ఘటనలతో 'అంతం కాదిది ఆరంభం’ మూవీ
ఇషాన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. శక్తి మహీంద్రా, నిష్మా, ప్రణాళి హీరోయిన్స్. ప్రభు పౌల్రాజ్, సిరాజ్ నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ని డైరెక్టర్ దశరథ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. తమని ట్రాప్ చేసి, నగ్న వీడియోలు తీసి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. సిరాజ్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలతో ఇషాన్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు’’ అన్నారు. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, రచయిత రాంబాబు గోసాల, షేర్ స్టూడియోస్ అధినేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కర్రి మోహన్. -
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
వివాదాల పురుష్... ఇప్పుడు మరో మరక
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రజల నినాదమే
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ అంచనాలకు మించి రెండింతలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రజలు చెబుతున్నారన్నారు. సీఎం జగన్ను తామంతా విశ్వసిస్తున్నామని, తమ భవిష్యత్తు ఆయనలో కనిపిస్తోందని ప్రజలు బలంగా చెబుతున్నారన్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లభిస్తుందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం,ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలసి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్ను సజ్జల ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. సజ్జల ఏమన్నారంటే.. ప్రజల ఆకాంక్షల మేరకు.. ప్రజలతో మమేకమయ్యేందుకు భారీ స్థాయిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీ పరంగా పనిచేసే వారు కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చేలా ముందుకెళ్తాం. ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి అంచనాలకు అనుగుణంగా నడుచుకునేలా భారీ కసరత్తు ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చాం. 14 రోజులపాటు కార్యక్రమం.. ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుంది. 7 లక్షల మంది సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ఈ కార్యక్రమంలో పదాతిదళంగా వ్యవహరిస్తుంది. వలంటీర్లు స్థానికంగా ఎంత ప్రాంతాన్ని కవర్ చేస్తారో అంతే పరిధిలో గృహ సారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. సచివాలయాల కన్వీనర్లతోపాటు మండల ఇన్చార్జ్లు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో–ఆర్డినేటర్ వ్యవస్థలు ‘జగనన్నే మా భవిష్యత్తు’లో పూర్తిస్థాయిలో భాగస్వాములు అవుతారు. ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తుంది. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను కలుసుకుంటారు. గత సర్కార్కు, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరుగుతోంది. అర్హులైన కుటుంబాలను నూరుశాతం సంక్షేమ పథకాల పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో సర్వే ద్వారా వారి అభిప్రాయాల్ని సేకరిస్తాం. వికృత చేష్టలతో సంక్షేమ రథానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులకు గుణపాఠం చెబుతాం. -
ఆసక్తికరంగా 'ఏందిరా ఈ పంచాయితీ' టైటిల్ పోస్టర్
భరత్, విషికా లక్ష్మణ్లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇవ్వబోతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను సరిగ్గా గమనిస్తే.. 'పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే గొడవలు, రకరకాల మనుషుల గురించే ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఒక ఊరిలో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్గా సతీశ్, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. -
మహిళా రిజర్వేషన్ ఉద్యమం ఉధృతం: కవిత
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘మహిళలకు, దేశానికి సాధికారిత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఈ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు’అంటూ రూపొందించిన పోస్టర్ను శుక్రవారం ఆమె విడుదల చేశారు. మిస్డ్కాల్ కార్యక్రమంతో పా టు వచ్చే నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టిలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలని కవిత నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్తో ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష చేశారు. 18 రాజకీయ పారీ్టలతో పాటు మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. -
వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'చిత్రం చూడర'. ఈ చిత్రానికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీఎం సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితీ గౌతమ్ స్పెషల్ సాంగ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘 Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀 Directed by @NHarsha828 🎬 Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/rs1Mi9icP5 — BM Cinemas (@BMCinemas_) March 9, 2023 -
భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం
అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్పై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రక్ హీరోయిన్గా నటిస్తుంది. మరో కీలకపాత్రను బొమ్మాళి రవిశంకర్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఒక టేబుల్ వెనుక చొక్కా వేసుకుని, దానిపై కాకీ చొక్కా వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ని క్రియేట్ చేశారు. టేబుల్పై ఆ వ్యక్తి చేతులు పెట్టి ఉండటం. ఒక చేతి కింద భగవద్గీత వుండటం, మరో చేతిపై కత్తితో పొడిచి ఉండటం కనిపిస్తుంది. ఆ టేబుల్ ముందు భాగంలో ధర్మానికి ప్రతీకైన జాతీయ చిహ్నం ఉంటుంది. మరో పక్క శాంతికి చిహ్నమైన పావురం ఉండటం గమనించవచ్చు. నిల్చున్న వ్యక్తి వెనుక లా బుక్స్ వుండటంతో పాటు ఒక పవర్ఫుల్ కొటేషన్తో ముందుకొచ్చారు. “భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం..” అనే కొటేషన్లోనే అర్థం అవుతుంది భగవద్గీత గురించి ఎంత లోతుగా చెప్పబోతున్నారనేది. ఇప్పటివరకు భగవద్గీతను ఒక మతానికి చెందినది అనేది మాత్రమే అందరూ అనుకుంటున్నారు. కానీ భగవద్గీత కేవలం ఒక మతానికి కాదు మనిషులందరికీ సంబంధించినది అనేది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్కుమార్. -
నిఖిల్ సిద్ధార్థ్ న్యూ లుక్.. ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్ లుక్తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోస్టర్ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్లో లుక్లో కనిపించారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
వెంకీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన పోస్టర్ లుక్
టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ మరే కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇటీవల హీరో రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో కనిపించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ అడ్వెంచర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశారు. అది కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రానికి 'వెంకీ75' పేరుతో విడుదలైన పోస్టర్ వెంకీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జనవరి 25న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో వెంకటేశ్ నటించిన నారప్ప, ఎఫ్-3 చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. భారీ పేలుడు ముందు నిలబడిన వెంకటేశ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తే ఈ సినిమా యాక్షన్ జోనర్ను తలపించేలా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా.. ఇటీవల వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) -
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఈ నెల 7న విజయవాడలో ‘జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక’ పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎమ్మెల్సీలు కృష్ణమూర్తి, సునీత, రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం జోనల్ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన తెలిపారు. ‘‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. తన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేడు. ఆయన కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. మూడు సార్లు సీఎం చేసిన ప్రజలను మోసం చేశాడు. 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు. పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. లోకేష్ అవలక్షణాలున్న వ్యక్తి. అలాంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు. 2024 తర్వాత టీడీపీ కూడా ఉండదు’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారన్నారు. బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేశారన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారు. జయహో బీసీ సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తాం’’ అని మంత్రి అన్నారు. చదవండి: సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్ -
పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కింది
-
కర్ణాటకలో పోస్టర్ వార్
-
Kaali Row: దుమారం రేపుతున్న లీనా ట్వీట్లు
కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి మరో చిత్రాన్ని పోస్ట్ చేసి.. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్ ఉంచిందామె. ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతోంది. జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ మరింత ఘాటైన ట్వీట్ చేసింది లీనా మణిమేకలై. BJP payrolled troll army have no idea about how folk theatre artists chill post their performances.This is not from my film.This is from everyday rural India that these sangh parivars want to destroy with their relentless hate & religious bigotry. Hindutva can never become India. https://t.co/ZsYkDbfJhK — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 తమిళనాడులో పుట్టి, పెరిగిన కెనడా బేస్డ్ ఫిల్మ్ మేకర్ మణి మేకలై.. పలు షార్ట్ఫిల్మ్లు, డాక్యుమెంటరీల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాళి పేరుతో ఆమె రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ అగ్గిని రాజేసింది. దేశం మొత్తం - ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం నుండి అతిపెద్ద విద్వేష యంత్రానికి దిగజారినట్లు అనిపిస్తుంది. నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎక్కడా సురక్షితంగా లేను అంటూ మరో ట్వీట్ చేశారామె. కేరళ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. “These trolls are after my artistic freedom. If I give away my freedom fearing this mindless rightwing mob mafia, I will give away everyone’s freedom. So I will keep it, come what may.” https://t.co/nD2TNxypOk — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 ఇదిలా ఉంటే.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ జులై 2వ తేదీన లీనా మణిమేకలై చేసిన ట్వీట్ను తొలగించేసింది. ఇంకోవైపు కెనడా మ్యూజియం ఆగాఖాన్.. కాళి పోస్టర్ వివాదంపై క్షమాపణలు తెలియజేసింది. “It feels like the whole nation – that has now deteriorated from the largest democracy to the largest hate machine – wants to censor me,” said Manimekalai. “I do not feel safe anywhere at this moment.” @guardiannews https://t.co/WsK2hWdW96 — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 లీనా మణిమేకలై వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్ ఐయ్యమ్ ప్రెసిడెంట్ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ట్విటర్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ట్వీట్ల విషయంలో దృష్టిసారించాలని, విషయాన్ని సీరియస్గా పరిగణించి తొలగించాలని ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు. Delhi BJP leaders Harish Khurana, Rajan Tiwari & others lodged a complaint against filmmaker Leena Manimekalai, TMC MP Mahua Moitra and others under Section 295, 505 (2), 153B, 509, 120B IPC and Section 66 & 67 of IT Act for allegedly hurting religious sentiments pic.twitter.com/vGLPOGmdEk — ANI (@ANI) July 7, 2022 -
‘కుర్డుంగ్లా’పై నవరత్నాల రెపరెప
అనంతపురం: ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఖ్యాతి గాంచిన కుర్డుంగ్లా కనుమపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పోస్టర్ రెపరెపలాడింది. అనంతపురంలోని గుల్జార్పేటకు చెందిన షేక్ దావూద్ రహమాన్, అతని మిత్రులు నాలుగు ద్విచక్ర వాహనాల్లో 3,600 కి.మీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం లడఖ్లోని లేహ్ జిల్లాలో 5,359 మీటర్ల ఎత్తైన కుర్డుంగ్లా మార్గంలో నవరత్నాల పోస్టర్ను ప్రదర్శించారు. జిల్లా వాసులు సాధించిన ఈ ఘనతపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: (వైఎస్సార్ వరమిస్తే.. సీఎం జగన్ సాకారం చేశారు) -
కామ్రేడ్ భారతక్క ఎంతో కీలకం: రానా దగ్గుబాటి
Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అలాగే కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. నేడు (జూన్ 3) పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పాడు రానా దగ్గుబాటి. ఇంతకుముందు విడుదల చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్ను పంచుకుంటూ ట్వీట్ చేశాడు రానా. ఈ ట్వీట్లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రెడ్ భారతక్క కూడా అంతే కీలకం.' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్ చేశారు. సురేశ్ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్ సింగర్ వరం ఆలపించిన ఈ సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. చదవండి: కేసీఆర్ బయోపిక్పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani pic.twitter.com/aUOOR3kJYD — Rana Daggubati (@RanaDaggubati) June 4, 2020 -
బ్రహ్మాజీ తనయుడు హీరోగా 'గుట్టుచప్పుడు' పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుట్టుచప్పుడు. డాన్ ఎంటర్టైన్మెంట్పై లివింగ్ స్టన్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్లను హీరో అడవి శేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని తాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీనా అని చాలా డౌట్గా ఉందన్నాడు. ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుందని మెచ్చుకున్నాడు. మ్యూజిక్, ఎఫెక్ట్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయని, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ముందుగా మా మూవీ సెకండ్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసినందుకు హీరో అడవి శేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను' అని అన్నారు. హీరో సంజయ్ రావ్ ముందుగా అడవి శేష్కు థ్యాంక్ యు చెబుతూ 'అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో మీరు స్క్రీన్ పై చూస్తారు' అని ముగించారు. కెమెరామెన్ రాము హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్తూ సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారని మెచ్చుకున్నాడు. చదవండి: ఆర్ఆర్ఆర్ టీంకు తులం బంగారం, కేజీ స్వీట్ బహుమతి విక్ట్రీనా బాటలోనే అలియా-రణ్బీర్?, అక్కడే పెళ్లి వేడుకలు! -
సర్కారు వారి పాట: కళావతి సాంగ్ పోస్టర్ రిలీజ్
మహేశ్బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘కళావతి..’ (హీరోయిన్ పాత్ర పేరు) అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. The Classical Melody #Kalaavathi will strum your heart strings ♥️ #SVPFirstSingle will join your playlists on FEB 14 🎶#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/CtyfZaQXdg — SarkaruVaariPaata (@SVPTheFilm) February 9, 2022 -
నా పోస్టర్ దగ్గర నేనే సెల్ఫీ తీసుకున్నా: ఆకాష్ పూరి
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `పోస్టర్`. టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమవుతోంది. బుధవారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పోస్టర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 19న పోస్టర్ విడుదలవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ...``ప్రతి సినిమాకు, ప్రతి నటుడికి పోస్టర్ ఎంతో ఇంపార్టెంట్. `మెహబూబా` సినిమా టైమ్లో నాకిష్టమైన ఐమాక్స్ థియేటర్ వద్ద నా సినిమా పోస్టర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. నా పోస్టర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకున్నాను. అటువంటి ఒక మంచి టైటిల్తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి`` అని కాంక్షించారు. యంగ్ హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ ...`హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్లో నాకు ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. నటుడు, దర్శకుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ...`` ప్రతి సినీ కళాకారుడికి పోస్టర్తో ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే టైటిల్. నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను``అన్నారు. దర్శకుడు టి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ....``సినిమా పోస్టర్ నన్ను సినిమా రంగం వైపు రప్పించింది. సంధ్య థియేటర్లో కొంత కాలం ఆపరేటర్గా పని చేశాను. ఆ తర్వాత డైరక్షన్ డిపార్ట్మెంట్లో కొంత కాలం పని చేశాక.. ఫస్ట్ టైమ్ `పోస్టర్` సినిమా డైరెక్షన్ చేశాను. ఇది అందమైన ప్రేమకథ, ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ`` అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అరుణ్, డాన్స్ మాస్టర్ అరుణ్, నటి మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుకి పోస్టర్ అంటించిన మావోయిస్టులు.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనం
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి, కుముడాబల్లి వంతెన దగ్గరి ఓ చెట్టుకి మావోయిస్టులు ఓ పోస్టరు అతికించారు. నాగావళి–గుముసుర డివిజన్ మావోయిస్ట్ పార్టీ పేరిట మంగళవారం కనిపించిన ఈ పోస్టరుని చూసి, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టరు నకళ్లు సైతం గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని మావోయిస్టులు ఆరోపించారు. కలహండి జిల్లా, గోలముండ పరిధి, మహాలింగ సన్షైన్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్యకు గురికావడం దారుణమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మమిత హత్య కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని, శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని మావోయిస్టులు పోస్టర్లలో కోరారు. ఇదే విషయంపై స్పందించిన పోలీస్ అధికారులు ఇటువంటి గాలి వార్తలకు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి..