Poster
-
Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్
పట్నా: రాబోయే అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులు నిర్వహించాయి. ఈ విందులలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా బీహార్లో పోస్టర్ వార్ జరుగుతోంది. పోస్టర్ల రూపంలో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మహిళా నేత రబ్రీ దేవి(Rabri Devi) నివాసం వెలుపల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుంటూ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లో ‘నువ్వు మోసగాడివి, హామీ ఇచ్చిన తరువాత ఎన్ఆర్సీ అన్నావు. మేము నీకు మద్దతు ఇవ్వబోము’ అని రాసి ఉంది. తాము నితీష్కు మద్దతు ఇవ్వబోమని వక్ఫ్ ఈ పోస్టర్లో స్పష్టం చేసింది. దీనికి ముందు కూడా పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇటీవల లాలూ యాదవ్ నివాసం వెలుపల ఒక పోస్టర్ కనిపించింది. ఆ పోస్టర్లో ‘నేను తగ్గేదే లే.. టైగర్ ఇంకా బతికే ఉంది’ అని రాసి ఉంది. ఈ పోస్టర్ను ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో లాలూ యాదవ్,మీసా భారతికి ఈడీ నోటీసులు పంపినప్పుడు ఏర్పాటు చేశారు. నాడు ఈడీ విచారణకు లాలూ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనిపై లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి యంత్రాంగాన్ని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించారు. #WATCH | Patna, Bihar: Posters targeting Chief Minister Nitish Kumar on Waqf and NRC installed outside the residence of former CM and RJD leader Rabri Devi pic.twitter.com/rOZT9HQFLe— ANI (@ANI) March 25, 2025లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 2004 నుండి 2009 వరకు యూపీఏ- 1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ కాలంలో రైల్వేలలో గ్రూప్ డీ నియామకాలు జరిగాయి. ఈ నియామకంలో లాలూ రిగ్గింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. లాలూ యాదవ్ ఉద్యోగాలు కల్పించినందుకు ప్రతిగా భూమిని లంచంగా తీసుకున్నారనే వాదన వినిపించింది. ఈడీ ఛార్జిషీట్ ప్రకారం లాలూ కుటుంబానికి ఏడు చోట్ల భూమి ఉంది. ఇండియా టీవీ కథనం ప్రకారం వీరి కుటుంబంపై రూ.600 కోట్ల మేరకు మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ సందర్భంగా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని తేలింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుటుంబంలోని ఇతర సభ్యులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రకటన జారీ చేయకుండానే, రైల్వేలలో గ్రూప్ డి ఉద్యోగాలలో పలువురిని నియమించారనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్ -
‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’.. రబ్రీ ఇంటి ముందు సీఎం నితీష్ పోస్టర్
పట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. కొన్ని రోజుల క్రితం సీఎం నితీష్ కుమార్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మౌనంగా ఉండకుండా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆర్జేడీ నేతలు సీఎం నితీష్పై విమర్శనాస్త్రాలు సంధించారు. #WATCH | Bihar: Amid CM Nitish Kumar's National Anthem controversy, a poster targeting the Chief Minister comes up outside the residence of former Chief Minister and RJD leader Rabri Devi in Patna. The poster addresses him as "The Non Serious Chief Minister." pic.twitter.com/t6I5Sr1PPh— ANI (@ANI) March 23, 2025ఇప్పుడు పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇంటి వెలుపల సీఎం నితీష్కు సంబంధించి ఒక పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో నితీష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రాశారు. ఈ పోస్టర్లో ‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’(నేను హీరోని కాదు విలన్ను’ అని రాసి ఉంది. అలాగే ఈ పోస్టర్లో నితీష్ కుమార్ మహిళలను, మహాత్మా గాంధీని, జాతీయ గీతాన్ని అవమానించారని కూడా ఆరోపించారు.ఇటీవల వెలుగు చూసిన సీఎం నితీష్ కుమార్ వీడియోను దృష్టిలో పెట్టుకుని శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి జాతీయ గీతాన్ని అవమానించారంటూ గందరగోళం సృష్టించాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరు దేశంలోని ప్రజల మనోభావాలను అపహాస్యం చేసినట్లుందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అసెంబ్లీలో విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్!
నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాకు మహారాజ్ పోస్టర్ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్టర్ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్ పోస్టర్లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
అద్దెకు బాయ్ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్జీవీ శిష్యుడి సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన 'మంగళవారం' డైరెక్టర్
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నా లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను 'మంగళవారం' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్గా వర్క్ చేశాం.ఈ వాలంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పోస్టర్ చాలా కొత్తగా ఉంది. వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.."మా పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలు" అని చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అలాంటి నాకు డైరెక్టర్ వినయ్ గారు ఈ సినిమా ద్వారా అవకాశమిచ్చారు. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తాను. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉంది అన్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. -
'పెళ్లి’ ఆశతో ప్రేమలో పడ్డాం.' వనితా విజయ్కుమార్ లవర్స్ డే స్పెషల్!
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్లో వార్తలొచ్చాయి. బీచ్లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.నాలుగో పెళ్లిపై రూమర్స్..గతేడాది అక్టోబర్లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
'థౌజండ్ వాలా'గా ఎంట్రీ ఇస్తోన్న అమిత్.. ఆసక్తిగా పోస్టర్
అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న టీమ్.. 1000వాలా నుంచి పోస్టర్ను రిలీజ్ చేసింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఆడియన్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉంది. ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సుమన్, నమిత, కీర్తి, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్
-
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్
అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.ఫిబ్రవరి 15న షూటింగ్ని పునఃప్రారంభించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్, అచ్యుత్ కుమార్, గోపాల్ కృష్ణ దేశ్పాండే, సంపత్ మైత్రేయ, యశ్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు. డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్ నిర్వర్తిస్తున్నారు. -
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
హారర్ థ్రిల్లర్
‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ
సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వశిష్ఠ". ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. "వశిష్ఠ" మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ , నాగబాల సురేష్ అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోస్టర్ కలకలం
-
ఉత్సవంలో ...
‘జరగండి... జరగండి...’ అంటూ రామ్చరణ్ ఏ రేంజ్లో మాస్ స్టెప్పులేశారో ఆ పాట వీడియో చూసినవాళ్లకి తెలిసిందే. రామ్చరణ్తో కలిసి కియారా అద్వానీ కూడా జోష్గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ నెలలోనే మరో పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసి, ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఓ ఉత్సవం నేపథ్యంలో రామ్చరణ్, ఉత్సాహంగా డ్యాన్స్ చేసే పాట ఇది అని పోస్టర్ స్పష్టం చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎస్. తిరుణావుక్కరసు. -
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
నటనకు 50 ఏళ్లు.. బాలకృష్ణ పోస్టర్ ఆవిష్కరణ!
తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరో నందమూరి బాలకృష్ణ . ఈ ఏడాదితో ఆయన నటుడిగా యాభైఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని సెప్టెంబరు 1న నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు.దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి, నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్ను అధిక బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
సీతారామం హీరో బర్త్ డే.. తెలుగులో మరో మూవీ!
సీతారామం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మరో కొత్త మూవీని ప్రకటించారు. తెలుగులో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దుల్కర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టైటిల్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ స్వప్న సినిమాస్ దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్ సాంప్రదాయ కుర్తా, ఎరుపు కండువా ధరించి కనిపించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా..దుల్కర్ నటించిన లక్కీ భాస్యర్ సెప్టెంబర్ 7వ తేదీ 2024న విడుదల కానుంది. ఆకాశంలో ఒక తార 💙Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥#AakasamLoOkaTara@pavansadineni @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/MIJpZjDsrI— Swapna Cinema (@SwapnaCinema) July 28, 2024 -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్లుక్, టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్గంజ్లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
మస్క్కు ధన్యవాదాలు తెలిపిన నిర్మాత.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.అయితే ఆ ట్వీట్లో ఓ సినిమా పోస్టర్ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa— Adham Bava (@adham_bava) June 11, 2024 -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్గ్రౌండ్లో కిచెన్లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఎం రేవంత్రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
AP: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్లోని నర్మదా డ్యామ్కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
Pushpa 2: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. పార్ట్-1 బ్లాక్బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్(పార్ట్-2) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. #2024RulePushpaKa ❤️🔥 Pushpa Raj is coming back this year to rule the worldwide box office 🔥🔥 May you all rule your year with ambition & determination and may you get everything you desire for 💫 Happy New Year 2024 ❤️#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG… pic.twitter.com/u6VED8LZbr — Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2024 -
సరదా.. సరదాగా...
హీరో వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సరదా.. సరదాగా...’ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేసింది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా కలిసి సరదాగా సముద్రపు ఒడ్డున చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందుతోన్న చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ‘రాంగ్ యూసేజ్..’ అనే తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. ‘సరదా.. సరదాగా...’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: యస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్కు సంబంధించిన పోస్టర్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
సీఎం షిండేపై బీజేపీ పోస్టర్..సంజయ్ రౌత్ ఆగ్రహం
ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండేపై రాజస్థాన్ బీజేపీ లీడర్ వేసిన పోస్టర్ శివసేన ఉద్ధవ్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్రౌత్కు కోపం తెప్పించింది. రాజస్థాన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రాజస్థాన్లోని హవామహల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలముకుందాచార్య కార్యకర్తలు షిండేకు ఆహ్వానం పలుకుతూ ఒక పోస్టర్ వేశారు. హిందూ హృదయ సామ్రాట్ షిండే అని పోస్టర్పై ఉండడం పట్ల సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం సొంత పార్టీకి మోసం చేసిన వ్యక్తిని బాల్ థాక్రేతో సమానంగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. అధికారం కోసం సొంత పార్టీని మోసం చేసే వారిని కీర్తించే కొత్త ట్రెండ్ స్టార్టయిందని రౌత్ అన్నారు. ఈ వివాదంపై మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునగంటివార్ స్పందించారు. ‘కార్యకర్తలు సాధారణంగా తమ అభిమాన నేతలను వారికిష్టం వచ్చినట్లుగా పిలుచుకుంటారు. ఇందులో భాగంగానే షిండేను అభిమానించే వ్యక్తి ఆ పోస్టర్పెట్టుంటారు. షిండే బాల్థాక్రే బాటలో వెళ్తున్నారని పోస్టర్ వేసిన వాళ్లు భావించి ఉంటారు. షిండే తనకు తానుగా ఆ పోస్టర్ అయితే పెట్టలేదుగా’ అని సుధీర్ అన్నారు. ఇదీచదవండి..డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు -
రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్కు లీడ్గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.' అని అన్నారు. హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి.’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
రావణుడిగా రాహుల్ గాంధీ..!
-
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
కోట బొమ్మాళి పాట
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!
పుష్పరాజ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్సింగ్ షెకావత్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్ భన్వర్సింగ్ షెకావత్పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లోపాల్గొన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఫాహద్ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ప్రతీకారంతో భన్వర్సింగ్ షెకావత్ సార్ బిగ్ స్క్రీన్స్పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్తో చిత్ర యూనిట్ ఫాహద్ కొత్తపోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా షూటింగ్లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. -
అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!
'మల్లేశం', 'వకీల్సాబ్' చిత్రాల ఫేం అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ను మేకర్ రిలీజ్ చేశారు. అతి భయంకరమైన క్షుద్రశక్తులు.. అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!) మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న హారర్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!) View this post on Instagram A post shared by FIRSTCOPY MOVIES (@firstcopymovies) -
కోట బొమ్మాళి పీఎస్లో..
శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ ప్రత్యేక పాత్రలో, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘రాజకీయాలు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో ‘కోట బొమ్మాళి పీఎస్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
‘స్కంద’ క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని ‘నీ చుట్టు చుట్టు...’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో రామ్ ఇంతకుముందు కనిపించనంత మాస్గా కనిపించనున్నారు. ‘నీ చుట్టు..’ సాంగ్ చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్ కుమార్, జీ స్టూడియోస్. డబుల్.. తొలి షెడ్యూల్ పూర్తి: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మా యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం విదేశాలు వెళ్లనున్నాం. 2024 మార్చి 8న థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’’ అని ఛార్మి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సీఈవో: విషు రెడ్డి. -
ఓ ప్రేమకథ
వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్, పోస్టర్ను చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ‘‘చదువుకునే టైమ్లోనే సినిమా తీయాలనే కల ఉండేది. మంచి టీమ్తో ‘నీతోనే నేను’ తీశాను’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పని చేశారు’’ అన్నారు అంజిరామ్. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు వికాస్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్, కెమెరామేన్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి. కడగండ్ల పాల్గొన్నారు. -
ఆర్జీవీ 'వ్యూహం' ఇంటెన్స్ పోస్టర్ చూశారా?
కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసామాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ ఇంటెన్స్ పోస్టర్ రిలీజైంది. టెక్నికల్గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్ చేయగల పోస్టర్ డిజైనర్స్.. అనిల్ అండ్ భాను అని సెన్సేషనల్ దర్శకుడు రామ్గోపాల్వర్మ తన ట్విటర్ ద్వారా తెలియచేశారు. వైఎస్. జగన్ పాత్రను పోషించిన అజ్మల్ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి ప్రతిభను చూసి ఆశ్యర్యపోతున్నానన్నారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్కుమార్. ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తామన్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్కు మంచి స్పందన లభించింది. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అన్న ఒకే ఒక్క డైలాగ్తో వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసేదిగా ఉంది. ఈ చిత్రంలో వైఎస్.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్– మనీష్ ఠాకూర్. VYOOHAM poster designs have been done by the incredibly talented duo of @anilandbhanu ..Film is produced by @dkkzoomin and the target audience is TDP, JS and the general public 💐💪 pic.twitter.com/7gNLafXZLl — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2023 చదవండి: ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే -
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
ఖమ్మంలో పోస్టర్ల కలకలం
-
బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్..
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రామ్ లీలా మైదానం వరకు భారీ ర్యాలీగా కదిలి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రిలాక్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు ఆదివారం ఉదయాన్నే సూపర్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. వారు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే దారి పొడవునా బ్యానర్లు, ప్లకార్డులు తగిలించేశారు. బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార బ్యానర్ల కంటే కూడా బీజేపీ తగిలించిన ఈ పోస్టర్లే జనాలను బాగా ఆకర్షిస్తుండటం విశేషం. ఆమ్ ఆద్మీ పార్ట్ బ్యానర్లలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ అని ఉంటే .. బీజేపీ రాసిన బ్యానర్లలో ఢిల్లీ సీఎం నిర్మించుకున్న సొంత ఇంటి భవనం గురించి మాత్రమే ప్రస్తావించారు.. "ఇంటి పునర్నిర్మాణానికి రూ. 45 కోట్లా.. ప్రజల వద్ద టాక్స్ రూపంలో వసూలు చేసిందేగా..?" "మాక్కూడా రూ. 45 కోట్ల భవనాన్ని చూడాలని ఉంది.." అని రాసిన బ్యానర్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ దర్శనమిచ్చాయి. ग़रीबों की कमाई के 45 करोड़ खर्च कर राजमहल सजाया केजरीवाल जवाब दो?? pic.twitter.com/BOuT2RCQhW — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి ఢిల్లీ సీఎం దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. కానీ ర్యాలీ రోజు ఉదయాన్నే బీజేపీ కౌంటర్ పోస్టర్లతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అంతేకాదు బీజేపీ ఢిల్లీ తన ట్విట్టర్ అకౌంట్లో "ఢిల్లీని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్" అని రాసి సీఎం ఫోటో ఉన్న ఒక సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. सिर्फ एक बंदा काफ़ी है, दिल्ली को तबाह करने के लिए - नाम है केजरीवाल pic.twitter.com/EwwFDBnmV5 — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 ఇది కూడా చదవండి: జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్ -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎంఎల్సీ కవిత పోస్టర్ను ఆవిష్కరించారు. 29 రాష్ట్రాల NRIలు పాల్గొంటున్న టోర్నమెంట్.. టీఆర్ఎస్నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం , కేసిఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది , కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకునామని , ఈ టోర్నమెంట్ లో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల కు చెందిన వారు పాల్గొంటారని, తద్వారా కేసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండాను NRI లందరికీ చేరుతుందని అందుకే బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం క్రికెట్ కప్ టోర్నమెంట్ను ఎంచుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా , అలాగే ఉద్యమం నుండి పార్టీకి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని కవిత అభినందించారు . కేసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూర్తి తోనే మేము క్రికెట్ను పార్టీ భావజాల వ్యాప్తికై ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ట్రాప్ చేసి నగ్నవీడియోలు తీసి.. వాస్తవ ఘటనలతో 'అంతం కాదిది ఆరంభం’ మూవీ
ఇషాన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. శక్తి మహీంద్రా, నిష్మా, ప్రణాళి హీరోయిన్స్. ప్రభు పౌల్రాజ్, సిరాజ్ నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ని డైరెక్టర్ దశరథ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. తమని ట్రాప్ చేసి, నగ్న వీడియోలు తీసి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. సిరాజ్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలతో ఇషాన్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు’’ అన్నారు. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, రచయిత రాంబాబు గోసాల, షేర్ స్టూడియోస్ అధినేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కర్రి మోహన్. -
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
వివాదాల పురుష్... ఇప్పుడు మరో మరక
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రజల నినాదమే
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ అంచనాలకు మించి రెండింతలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రజలు చెబుతున్నారన్నారు. సీఎం జగన్ను తామంతా విశ్వసిస్తున్నామని, తమ భవిష్యత్తు ఆయనలో కనిపిస్తోందని ప్రజలు బలంగా చెబుతున్నారన్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లభిస్తుందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం,ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలసి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్ను సజ్జల ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. సజ్జల ఏమన్నారంటే.. ప్రజల ఆకాంక్షల మేరకు.. ప్రజలతో మమేకమయ్యేందుకు భారీ స్థాయిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీ పరంగా పనిచేసే వారు కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చేలా ముందుకెళ్తాం. ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి అంచనాలకు అనుగుణంగా నడుచుకునేలా భారీ కసరత్తు ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చాం. 14 రోజులపాటు కార్యక్రమం.. ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుంది. 7 లక్షల మంది సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ఈ కార్యక్రమంలో పదాతిదళంగా వ్యవహరిస్తుంది. వలంటీర్లు స్థానికంగా ఎంత ప్రాంతాన్ని కవర్ చేస్తారో అంతే పరిధిలో గృహ సారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. సచివాలయాల కన్వీనర్లతోపాటు మండల ఇన్చార్జ్లు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో–ఆర్డినేటర్ వ్యవస్థలు ‘జగనన్నే మా భవిష్యత్తు’లో పూర్తిస్థాయిలో భాగస్వాములు అవుతారు. ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తుంది. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను కలుసుకుంటారు. గత సర్కార్కు, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరుగుతోంది. అర్హులైన కుటుంబాలను నూరుశాతం సంక్షేమ పథకాల పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో సర్వే ద్వారా వారి అభిప్రాయాల్ని సేకరిస్తాం. వికృత చేష్టలతో సంక్షేమ రథానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులకు గుణపాఠం చెబుతాం. -
ఆసక్తికరంగా 'ఏందిరా ఈ పంచాయితీ' టైటిల్ పోస్టర్
భరత్, విషికా లక్ష్మణ్లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇవ్వబోతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను సరిగ్గా గమనిస్తే.. 'పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే గొడవలు, రకరకాల మనుషుల గురించే ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఒక ఊరిలో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్గా సతీశ్, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. -
మహిళా రిజర్వేషన్ ఉద్యమం ఉధృతం: కవిత
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘మహిళలకు, దేశానికి సాధికారిత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఈ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు’అంటూ రూపొందించిన పోస్టర్ను శుక్రవారం ఆమె విడుదల చేశారు. మిస్డ్కాల్ కార్యక్రమంతో పా టు వచ్చే నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టిలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలని కవిత నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్తో ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష చేశారు. 18 రాజకీయ పారీ్టలతో పాటు మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. -
వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'చిత్రం చూడర'. ఈ చిత్రానికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీఎం సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితీ గౌతమ్ స్పెషల్ సాంగ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘 Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀 Directed by @NHarsha828 🎬 Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/rs1Mi9icP5 — BM Cinemas (@BMCinemas_) March 9, 2023 -
భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం
అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్పై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రక్ హీరోయిన్గా నటిస్తుంది. మరో కీలకపాత్రను బొమ్మాళి రవిశంకర్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఒక టేబుల్ వెనుక చొక్కా వేసుకుని, దానిపై కాకీ చొక్కా వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ని క్రియేట్ చేశారు. టేబుల్పై ఆ వ్యక్తి చేతులు పెట్టి ఉండటం. ఒక చేతి కింద భగవద్గీత వుండటం, మరో చేతిపై కత్తితో పొడిచి ఉండటం కనిపిస్తుంది. ఆ టేబుల్ ముందు భాగంలో ధర్మానికి ప్రతీకైన జాతీయ చిహ్నం ఉంటుంది. మరో పక్క శాంతికి చిహ్నమైన పావురం ఉండటం గమనించవచ్చు. నిల్చున్న వ్యక్తి వెనుక లా బుక్స్ వుండటంతో పాటు ఒక పవర్ఫుల్ కొటేషన్తో ముందుకొచ్చారు. “భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం..” అనే కొటేషన్లోనే అర్థం అవుతుంది భగవద్గీత గురించి ఎంత లోతుగా చెప్పబోతున్నారనేది. ఇప్పటివరకు భగవద్గీతను ఒక మతానికి చెందినది అనేది మాత్రమే అందరూ అనుకుంటున్నారు. కానీ భగవద్గీత కేవలం ఒక మతానికి కాదు మనిషులందరికీ సంబంధించినది అనేది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్కుమార్. -
నిఖిల్ సిద్ధార్థ్ న్యూ లుక్.. ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్ లుక్తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోస్టర్ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్లో లుక్లో కనిపించారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
వెంకీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన పోస్టర్ లుక్
టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ మరే కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇటీవల హీరో రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో కనిపించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ అడ్వెంచర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశారు. అది కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రానికి 'వెంకీ75' పేరుతో విడుదలైన పోస్టర్ వెంకీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జనవరి 25న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో వెంకటేశ్ నటించిన నారప్ప, ఎఫ్-3 చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. భారీ పేలుడు ముందు నిలబడిన వెంకటేశ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తే ఈ సినిమా యాక్షన్ జోనర్ను తలపించేలా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా.. ఇటీవల వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) -
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఈ నెల 7న విజయవాడలో ‘జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక’ పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎమ్మెల్సీలు కృష్ణమూర్తి, సునీత, రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం జోనల్ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన తెలిపారు. ‘‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. తన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేడు. ఆయన కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. మూడు సార్లు సీఎం చేసిన ప్రజలను మోసం చేశాడు. 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు. పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. లోకేష్ అవలక్షణాలున్న వ్యక్తి. అలాంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు. 2024 తర్వాత టీడీపీ కూడా ఉండదు’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారన్నారు. బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేశారన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారు. జయహో బీసీ సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తాం’’ అని మంత్రి అన్నారు. చదవండి: సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్ -
పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కింది
-
కర్ణాటకలో పోస్టర్ వార్
-
Kaali Row: దుమారం రేపుతున్న లీనా ట్వీట్లు
కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి మరో చిత్రాన్ని పోస్ట్ చేసి.. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్ ఉంచిందామె. ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతోంది. జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ మరింత ఘాటైన ట్వీట్ చేసింది లీనా మణిమేకలై. BJP payrolled troll army have no idea about how folk theatre artists chill post their performances.This is not from my film.This is from everyday rural India that these sangh parivars want to destroy with their relentless hate & religious bigotry. Hindutva can never become India. https://t.co/ZsYkDbfJhK — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 తమిళనాడులో పుట్టి, పెరిగిన కెనడా బేస్డ్ ఫిల్మ్ మేకర్ మణి మేకలై.. పలు షార్ట్ఫిల్మ్లు, డాక్యుమెంటరీల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాళి పేరుతో ఆమె రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ అగ్గిని రాజేసింది. దేశం మొత్తం - ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం నుండి అతిపెద్ద విద్వేష యంత్రానికి దిగజారినట్లు అనిపిస్తుంది. నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎక్కడా సురక్షితంగా లేను అంటూ మరో ట్వీట్ చేశారామె. కేరళ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. “These trolls are after my artistic freedom. If I give away my freedom fearing this mindless rightwing mob mafia, I will give away everyone’s freedom. So I will keep it, come what may.” https://t.co/nD2TNxypOk — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 ఇదిలా ఉంటే.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ జులై 2వ తేదీన లీనా మణిమేకలై చేసిన ట్వీట్ను తొలగించేసింది. ఇంకోవైపు కెనడా మ్యూజియం ఆగాఖాన్.. కాళి పోస్టర్ వివాదంపై క్షమాపణలు తెలియజేసింది. “It feels like the whole nation – that has now deteriorated from the largest democracy to the largest hate machine – wants to censor me,” said Manimekalai. “I do not feel safe anywhere at this moment.” @guardiannews https://t.co/WsK2hWdW96 — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 లీనా మణిమేకలై వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్ ఐయ్యమ్ ప్రెసిడెంట్ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ట్విటర్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ట్వీట్ల విషయంలో దృష్టిసారించాలని, విషయాన్ని సీరియస్గా పరిగణించి తొలగించాలని ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు. Delhi BJP leaders Harish Khurana, Rajan Tiwari & others lodged a complaint against filmmaker Leena Manimekalai, TMC MP Mahua Moitra and others under Section 295, 505 (2), 153B, 509, 120B IPC and Section 66 & 67 of IT Act for allegedly hurting religious sentiments pic.twitter.com/vGLPOGmdEk — ANI (@ANI) July 7, 2022 -
‘కుర్డుంగ్లా’పై నవరత్నాల రెపరెప
అనంతపురం: ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఖ్యాతి గాంచిన కుర్డుంగ్లా కనుమపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పోస్టర్ రెపరెపలాడింది. అనంతపురంలోని గుల్జార్పేటకు చెందిన షేక్ దావూద్ రహమాన్, అతని మిత్రులు నాలుగు ద్విచక్ర వాహనాల్లో 3,600 కి.మీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం లడఖ్లోని లేహ్ జిల్లాలో 5,359 మీటర్ల ఎత్తైన కుర్డుంగ్లా మార్గంలో నవరత్నాల పోస్టర్ను ప్రదర్శించారు. జిల్లా వాసులు సాధించిన ఈ ఘనతపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: (వైఎస్సార్ వరమిస్తే.. సీఎం జగన్ సాకారం చేశారు) -
కామ్రేడ్ భారతక్క ఎంతో కీలకం: రానా దగ్గుబాటి
Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అలాగే కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. నేడు (జూన్ 3) పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పాడు రానా దగ్గుబాటి. ఇంతకుముందు విడుదల చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్ను పంచుకుంటూ ట్వీట్ చేశాడు రానా. ఈ ట్వీట్లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రెడ్ భారతక్క కూడా అంతే కీలకం.' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్ చేశారు. సురేశ్ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్ సింగర్ వరం ఆలపించిన ఈ సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. చదవండి: కేసీఆర్ బయోపిక్పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani pic.twitter.com/aUOOR3kJYD — Rana Daggubati (@RanaDaggubati) June 4, 2020 -
బ్రహ్మాజీ తనయుడు హీరోగా 'గుట్టుచప్పుడు' పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుట్టుచప్పుడు. డాన్ ఎంటర్టైన్మెంట్పై లివింగ్ స్టన్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్లను హీరో అడవి శేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని తాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీనా అని చాలా డౌట్గా ఉందన్నాడు. ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుందని మెచ్చుకున్నాడు. మ్యూజిక్, ఎఫెక్ట్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయని, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ముందుగా మా మూవీ సెకండ్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసినందుకు హీరో అడవి శేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను' అని అన్నారు. హీరో సంజయ్ రావ్ ముందుగా అడవి శేష్కు థ్యాంక్ యు చెబుతూ 'అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో మీరు స్క్రీన్ పై చూస్తారు' అని ముగించారు. కెమెరామెన్ రాము హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్తూ సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారని మెచ్చుకున్నాడు. చదవండి: ఆర్ఆర్ఆర్ టీంకు తులం బంగారం, కేజీ స్వీట్ బహుమతి విక్ట్రీనా బాటలోనే అలియా-రణ్బీర్?, అక్కడే పెళ్లి వేడుకలు! -
సర్కారు వారి పాట: కళావతి సాంగ్ పోస్టర్ రిలీజ్
మహేశ్బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘కళావతి..’ (హీరోయిన్ పాత్ర పేరు) అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. The Classical Melody #Kalaavathi will strum your heart strings ♥️ #SVPFirstSingle will join your playlists on FEB 14 🎶#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/CtyfZaQXdg — SarkaruVaariPaata (@SVPTheFilm) February 9, 2022 -
నా పోస్టర్ దగ్గర నేనే సెల్ఫీ తీసుకున్నా: ఆకాష్ పూరి
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `పోస్టర్`. టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమవుతోంది. బుధవారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పోస్టర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 19న పోస్టర్ విడుదలవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ...``ప్రతి సినిమాకు, ప్రతి నటుడికి పోస్టర్ ఎంతో ఇంపార్టెంట్. `మెహబూబా` సినిమా టైమ్లో నాకిష్టమైన ఐమాక్స్ థియేటర్ వద్ద నా సినిమా పోస్టర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. నా పోస్టర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకున్నాను. అటువంటి ఒక మంచి టైటిల్తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి`` అని కాంక్షించారు. యంగ్ హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ ...`హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్లో నాకు ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. నటుడు, దర్శకుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ...`` ప్రతి సినీ కళాకారుడికి పోస్టర్తో ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే టైటిల్. నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను``అన్నారు. దర్శకుడు టి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ....``సినిమా పోస్టర్ నన్ను సినిమా రంగం వైపు రప్పించింది. సంధ్య థియేటర్లో కొంత కాలం ఆపరేటర్గా పని చేశాను. ఆ తర్వాత డైరక్షన్ డిపార్ట్మెంట్లో కొంత కాలం పని చేశాక.. ఫస్ట్ టైమ్ `పోస్టర్` సినిమా డైరెక్షన్ చేశాను. ఇది అందమైన ప్రేమకథ, ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ`` అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అరుణ్, డాన్స్ మాస్టర్ అరుణ్, నటి మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుకి పోస్టర్ అంటించిన మావోయిస్టులు.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనం
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి, కుముడాబల్లి వంతెన దగ్గరి ఓ చెట్టుకి మావోయిస్టులు ఓ పోస్టరు అతికించారు. నాగావళి–గుముసుర డివిజన్ మావోయిస్ట్ పార్టీ పేరిట మంగళవారం కనిపించిన ఈ పోస్టరుని చూసి, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టరు నకళ్లు సైతం గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని మావోయిస్టులు ఆరోపించారు. కలహండి జిల్లా, గోలముండ పరిధి, మహాలింగ సన్షైన్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్యకు గురికావడం దారుణమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మమిత హత్య కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని, శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని మావోయిస్టులు పోస్టర్లలో కోరారు. ఇదే విషయంపై స్పందించిన పోలీస్ అధికారులు ఇటువంటి గాలి వార్తలకు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి.. -
మన ఫ్రెండ్స్లో, మనకి జరిగిన కథే ‘పోస్టర్’
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా తాజా చిత్రం ‘పోస్టర్’. టి. మహిపాల్ రెడ్డి (టీఎంఆర్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.శేఖర్ రెడ్డి, ఏ. గంగారెడ్డి, ఐజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ ఎంతో గ్రాండ్ గా సెప్టెంబర్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది. మా సినిమా రిలీజ్ లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూ ఎఫ్ ఓ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు’ తెలిపారు. ఈ సినిమా మన ఊరిలో, మన ఇంటి పక్కన , మనకి జరిగిన కథలాగే ఉంటుందన్నారు హీరో విజయ్ ధరన్. శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్నాడు. -
ఉగాది స్పెషల్ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్
ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం.. ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021 ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Ugadi wishes to you and your family ! Stay safe ... take care #Lovestory@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula pic.twitter.com/lkpmupZ1TM — chaitanya akkineni (@chay_akkineni) April 13, 2021 నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్స్టోరీ. ఉగాది రోజు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 పండగ రోజు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్ 3 యూనిట్ సభ్యులు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. #HappyUgadi from Team #Thimmarusu.. Get ready for an entertaining thriller in theatres from May 21!@ActorSatyadev#PriyankaJawalkar @actorbrahmaji @ActorAnkith@smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1 @vamsikaka @SricharanPakala @MangoMusicLabel pic.twitter.com/yNTva0xdSW — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్ను రిలీజ్ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది. Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్గా ఆకట్టుకున్నాడు. Ugadi wishes from the team of #VirataParvam pic.twitter.com/LVfzsevt8W — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2021 సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్ పోస్టర్తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది. Baadshah @KicchaSudeep’s #K3Kotikokkadu Team Wishing everyone a #HappyUgadi Dubbing works are on full Swing, Release in Kannada&Telugu simultaneously!@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @anandaudioTolly @Mymoviebazaar pic.twitter.com/o73wH0tMz4 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో స్మార్ట్గా కనిపిస్తున్నాడు సుదీప్. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!!#TuckJagadish #HappyUgadi@NameisNani @riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/HfT4JUHdRK — BARaju (@baraju_SuperHit) April 13, 2021 ఫ్యామిలీ పిక్ను షేర్ చేసింది టక్ జగదీష్ టీమ్. ఇందులో నేచురల్ స్టార్ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్ నాని ఫ్యాన్స్కు తెగ నచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్ను కరోనా వల్ల వాయిదా వేశారు. ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము! Team #Seetimaarr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 @actorrahman @TarunRajArora pic.twitter.com/iVQZxg1qlb — Sampath Nandi (@IamSampathNandi) April 13, 2021 గోపీచంద్ సిటీమార్ నుంచి మాస్ లుక్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఐదుగురు ఆడవాళ్లు బైక్ నడుపుతున్న పోస్టర్ను రిలీజ్ చేయగా ఇది ఊరమాస్గా ఉందంటున్నారు నెటిజన్లు. అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT — Mohan Babu M (@themohanbabu) April 13, 2021 సన్ ఆఫ్ ఇండియా నుంచి మోహన్బాబు లుక్ను రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్ నిర్మిస్తున్నాడు. Thrilling Trilingual flick #Seethayanam movie Team wishes everyone a Happy Ugadi Here's the brand New Poster @akshith_sk @AnahitaBhooshan @DirPrabhakar #RohanBharadwaj #LalithaRajyalakshmi @padmanabhmusic @ColorCloudsEnt @LahariMusic @PulagamOfficial pic.twitter.com/ejlUqOaiML — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సీతాయణం నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఉగాది శుభాకాంక్షలు 'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1 #MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి.. సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Team #AndarubagundaliAnduloNenundali Wishes a Very Happy Ugadi ,Filled With laughter, joy and fulfilment! #HappyUgadi#Ali & @ItsActorNaresh #Mouryaani 🎬 : #SripuramKiran 🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/DBvbsaIIIV — BARaju (@baraju_SuperHit) April 13, 2021 అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!! Team #GullyRowdy wishes you A very Happy & safe Ugadi.#HappyUgadi@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/hHWtPiOcvZ — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! - #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥 Team #Black wishes everyone a Happy UGADI 🎋 Written & Directed : #GBKrishna Producer : #MahankaliDiwakar Music : #SureshBobbili DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x — BARaju (@baraju_SuperHit) April 13, 2021 #HappyUgadi from Team #HouseArrest!! 🎧 #FreeBirds ▶️ https://t.co/y9EjBrWr3L#HouseArrestOnMay7th@Sekhar_Dreamz @anuprubens @boselyricist @Chaitanyaniran @Niran_Reddy @AsrinReddy @Actorysr @IamSaptagiri @ChotaKPrasad @Yuvadop @Primeshowtweets @ARMusic2021 pic.twitter.com/cuNUpXyP1n — BARaju (@baraju_SuperHit) April 13, 2021 -
నాగశౌర్య షాకింగ్ లుక్ : టైటిల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: యంగ్హీరో నాగశైర్య మరోసారి షాకింగ్ లుక్లో ఫ్యాన్స్ను విస్మయపర్చాడు. ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్గా నాగశౌర్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్పై అభిమానులు ఫిదా అవుతున్నారు. (నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ) ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అటు ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎయిట్ ప్యాక్ బాడీతో చేతిలో బాణంతో స్టన్నింగ్ ఫస్ట్లుక్ ఇప్పటికే అందరినీ థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. “ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN — Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020 -
ఏప్రిల్ 12న అందరూ ఇళ్లలో..
న్యూఢిల్లీ : దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు. ఈ మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు, అత్యవవసర సిబ్బందికి ప్రోత్సాహం అందించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ నాడు చప్పట్లు కొట్టమని పిలుపునిచ్చారు. దీంతో భారతావని ఒక్కతాటిపైకి వచ్చి దాన్ని తమ విధిగా నిర్వర్తించింది. అనంతరం దేశ సమైక్యతను చాటి చెప్పేందుకు ఏప్రిల్ 5న జ్యోతిని వెలిగించాలని కోరగా దాన్ని కూడా ప్రజలు దిగ్విజయం చేశారు. అంతేకాక లాక్డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలను తన హోదాను పక్కనపెట్టి మరీ క్షమాపణలు కోరారు. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు) ఈ నేపథ్యంలో మనకోసం ఎంతో కష్టపడుతున్న నరేంద్ర మోదీకి వందనం చేద్దాం.. అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన కోసం, మన దేశం కోసం ఎంతో కృషి చేస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు ఇంట్లోనే నిల్చుని సెల్యూట్ చేద్దాం అన్నదే ఈ పోస్ట్ సారాంశం. దీనిపై మోదీ స్పందిస్తూ.. "నా కోసం 5 నిమిషాలు నిలబడండి అని చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. అయితే తొలుత నన్ను వివాదంలోకి లాగడానికి అల్లరి మూకలు చేసిన పనిగా భావించాను. కానీ నిజంగా నాపై మీకు ప్రేమ, గౌరవం ఉన్నట్లైతే ఓ పని చేసి పెట్టాలి. కరోనా సంక్షోభం ముగిసేవరకు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి" అని కోరారు. దీంతో మరోసారి మోదీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. (కరోనా: ‘పేషెంట్ నాపై వాంతి చేసుకున్నారు’) -
ఢిల్లీ ఫలితాలు: విజయమైనా.. అపజయమైనా ఓకే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గత ఎన్నికల కంటే బీజేపీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈక్రమంలో బీజేపీ కార్యాలయంపై ప్రత్యక్షమైన ఓ బ్యానర్ ఆసక్తి రేపుతోంది. ‘విజయం మాకు అహంభావాన్ని కలిగించదు. అలాగే ఓటమి మమ్మల్ని నిరాశపరచదు’ అని బ్యానర్పై హిందిలో రాసి ఉంది. అదేవిధంగా బ్యానర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని మళ్లీ ఆప్నకే పట్టం కట్టగా.. ఫలితాలు వాటిని నిజం చేస్తున్నాయి. ప్రజల నాడిని విశ్లేషించటంలో సర్వే సంస్థలు సఫలీకృతం అయినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ఆప్ 56 సీట్లలో ముందజలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ప్రధాని మోదీతోపాటు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ లాభం లేపోయింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అమిత్ షా చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ చదవండి: హస్తిన తీర్పు : ఖాతా తెరవని కాంగ్రెస్ -
బీసీ గర్జన పోస్టర్ను విడుదల చేసిన వైఎస్సార్సీపీ
-
రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన పోస్టర్
పాట్నా : బిహార్ రాజధానిలో వెలసిన ఒక పోస్టర్ రాజకీయ దుమారం రేపుతుంది. ఈ పోస్టర్లో రాహుల్ గాంధీతో పాటు పలువురు బిహార్ కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు మాత్రం ఉంటే సమస్య లేదు. కానీ ఆ ఫోటోల మీద సదరు నేతల పేర్లు కాక వారి సామాజిక వర్గాల(కులం) పేర్లు దర్శనమివ్వడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ పోస్టర్ చూసిన బీజేపీ నాయకులు ‘రాహుల్ గాంధీ కుల రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారం’టూ దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాలు బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్కు నూతన కార్యవర్గాన్ని నియమించినందుకు కృతజ్ఞతలు తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పోస్టర్ను తయారు చేయించారు. ఈ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ జాతో పాటు మరి కొందరు సీనియర్ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే పోస్టర్లో నాయకుల పేర్లకు బదులు వారి సామాజిక వర్గాల పేర్లు ప్రింట్ చేయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, మదన్ మోహన్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారి ఫోటోల మీద ‘బ్రాహ్మణ్ సముదాయ్’ అని ప్రింట్ చేశారు. ఇలానే మిగతా నేతల ఫోటోల మీద వారి సామాజిక వర్గాల పేర్లను ప్రింట్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు కుల రాజకీయాలను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాక ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ఈ పోస్టర్ల గురించి కానీ.. బీజేపీ నాయకుల ఆరోపణల గురించి కానీ కాంగ్రెస్ నాయకులు స్పందిచకపోవడం గమనార్హం. -
స్త్రీయేటివిటీ!
స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. ఈ టైమ్లో మళ్లీ ఇప్పుడొక అలజడి.. ‘విల్నస్’ టూరిజం యాడ్!! ఈశాన్య ఐరోపాలోని లిథువేనియా రాజధాని ‘విల్నస్’ ప్రత్యేకతలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలుసేమో కానీ, లిథువేనియా పర్యాటక శాఖ తెలియదనే అనుకుంది. మరి తెలియని ప్రదేశం గురించి పరదేశీ టూరిస్టులకు తెలియజేసి, వారిని రప్పించడం ఎలా? పబ్లిసిటీ ఇవ్వాలి. అయితే ఊరికే.. ‘ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది.. వచ్చి చూడండి’ అని పబ్లిసిటీ ఇస్తే, ఆ ప్లేస్ను చూడటం అటుంచి ముందసలు పబ్లిసిటీ పోస్టర్ పైపే చూడరు. ఎలా మరి! క్రియేటివ్గా ఆలోచించి యాడ్ క్రియేట్ చెయ్యాలి. సోషల్ మీడియా వచ్చాక ఎవరికీ తక్కువ క్రియేటివిటీ లేదని తేలిపోయింది. అందుకని యాడ్ పోస్టర్ ‘హైలీ క్రియేటివ్’ గా ఉండాలి. అప్పుడే చూపు పడుతుంది. ఆసక్తి కలుగుతుంది. లిథువేనియా టూరిజం వాళ్లు గత గురువారం ఇటువంటిదే ఒక హైలీ క్రియేటివ్ యాడ్ని విడుదల చేశారు. ఐరోపా మ్యాప్ మీద ఒక స్త్రీ వెల్లకిలా పడుకుని ఉంటుంది. అనుభూతి చెందుతున్న స్థితిలో ఆమె తన గుప్పెటతో మ్యాపులో విల్నస్ పట్టణం ఉన్నచోట దుప్పటి లాంటి ఆ మ్యాపును బిగించి పట్టుకుని ఉంటుంది. బిగిసిన నుదురు, విరిసిన జుట్టు, దగ్గరకు చేరిన కనుబొమలు.. అంతవరకే ఆ స్త్రీ ముఖం కనిపిస్తుంది. పైన ‘విల్నస్, ది జి–స్పాట్ ఆఫ్ యూరప్’ అని రాసి ఉంటుంది. ఆ పైన ‘నోబడీ నోస్ వేర్ ఇట్ ఈజ్, బట్ వెన్ యు ఫైండ్ ఇట్.. ఇటీజ్ అమేజింగ్’ అని ఉంటుంది. ‘అదెక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే దానిని కనిపెడితే మాత్రం మహాద్భుతంగా ఉంటుంది’ అని భావం. ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు బాల్టిక్ దేశాల పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ విల్నస్కి కూడా వస్తున్నారు. చర్చి అధికారుల అసహనానికి అది కూడా ఒక కారణం. సరిగ్గా పోప్ వచ్చే ముందు ఈ దరిద్రం ఏమిటని వారు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు. ‘పోస్టర్లో హద్దులు మీరినతనమేమీ లేదు కానీ, పోస్టర్ని విడుదల చేసిన సమయమే.. అనుకోకుండా అనుచితం అయిందని నవ్వేశారు ఆయన. అంతే తప్ప పోస్టర్ని కాన్సిల్ చెయ్యమని అనలేదు. ముందుముందు అంటారేమో తెలీదు. స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. క్రమంగా.. స్త్రీలకు సంబంధించినవని మనం అనుకుంటున్న గృహోపకరణాలు వగైరాలకు కూడా ఇప్పుడు మగవాళ్లను మోడల్గా పెట్టి యాడ్ పోస్టర్లు, కమర్షియల్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దాదాపుగా ‘జెండర్ న్యూట్రల్’ దశ చేరువలోకి వచ్చేసింది లోకం. ఈ టైమ్లో ఇప్పుడీ మాలోకం.. జి–స్పాట్ పోస్టర్!! మరో ఐరోపా దేశం ఫ్రాన్స్లో ఇప్పుడు లైంగిక హింసను ప్రేరేపించే క్రియేటివిటీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. స్త్రీలను అశ్లీలంగా చూపే సృజనాత్మకత ఎక్కడున్నా.. అక్కడికి పిడికిళ్లు బిగించి వెళ్లిపోతున్నారు మహిళలు. ఫ్రాన్స్ సముద్ర తీర ప్రాంతంలోని రిసార్ట్లు ఎంత రమణీయంగా ఉంటాయో చెప్పడానికి.. బికినీలు ధరించి తీరం వెంబడి నడుస్తున్న యువతుల ఫొటోలను టూరిజం కార్డుల మీద ‘రిస్కే’గా (లైంగిక భావనలు కలిగించేలా) ముద్రించడంపై కొద్ది రోజులుగా అక్కడి స్త్రీవాద సంస్థ ‘ఫెమ్ సోల్జర్స్’ అభ్యంతరం చెబుతోంది. న్యూస్ స్టాండ్లు, టూరిజం స్టాల్స్, సావనీర్ షాపులలోని రిస్కే కార్డులను ఖాళీ చేయిస్తోంది. అలా ఖాళీ చేయించడం పురుషులకు నచ్చడం లేదు. ‘‘ఏళ్లుగా ఉన్నదే కదా. స్త్రీలు లేకుండా అందం, వినోదం ఉంటుందా’’ అని మగాళ్లు అంటుంటే.. ‘‘ఇలాంటి పురుషానందాల వల్లనే కదా స్త్రీలపై ఇంత లైంగిక హింస జరుగుతోంది’’ అని ఫెమ్ సోల్జర్స్ అరోపిస్తున్నారు. తక్షణం ఆకట్టుకోవడానికి సృజనాత్మకంగా చెప్పడం అవసరమే. అయితే మైండ్కి టచ్ అవడం, హార్ట్కి టచ్ అవడం అని రెండు ఉంటాయి. సృజనాత్మకత మనసును తాకితే ఆహ్లాదంగా ఉంటుంది. మైండ్ను తాకితే అలజడిగా ఉంటుంది. స్త్రీ అంశతో యాడ్స్ చేసేటప్పుడు మనసూ, మైండ్ రెండూ కూడా ఆహ్లాదకరంగా లేకుంటే అది క్రియేటివిటీ అవదు. స్త్రీయేటివిటీ అవుతుంది. అది ఎక్కువ కాలం ఉండదు. మైండ్కి తప్ప హార్ట్కు టచ్ అవదు కాబట్టి. విల్నస్ టూరిజం శాఖ వివాదాస్పద పబ్లిసిటీ పోస్టర్ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. - మాధవ్ శింగరాజు -
సర్కార్ చిత్ర పోస్టర్పై రగడ
హీరో విజయ్ చిత్రంపై మొదట్లోనే రాజకీయ రగడ మొదలైంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ పోస్టర్లో విజయ్ సిగరెట్ కాలుస్తున్న దృశ్యం రచ్చకు దారి తీసింది. హీరో విజయ్పై కోర్టులో పిటిషన్ దాఖలుకు సిద్ధం అవుతున్నారు పొగాకు నిరోధక సంఘం. సినిమాల్లో మద్యం, పొగ తాగే సన్నివేశాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇతర చిత్రాల గురించి పట్టించుకోకపోయినా రజనీకాంత్, విజయ్ వంటి నటుల చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటే వాటిపై కేసులు, కోర్టులు అంటూ రచ్చ జరుగుతుంది. అయితే వారి ఇమేజ్ కారణంగా ఇలాంటి దురలవాట్ల ప్రభావం యువతలోకి వేగంగా చేరుతుందని సమాచారం. తాజాగా విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లో ఆయన సిగరెట్టు కాల్చుతున్న ఫొటో చోటుచేసుకోవడం దుమారానికి కారణమైంది.ఈ వ్యవహారంపై పొగాకు నియంత్రణ సంఘం నిర్వాహకుడు గ్రిల్ అలెగ్జాండర్ విజయ్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దీని గురించి ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘హీరో విజయ్ తన ముందు చిత్రంలోనూ పొగతాగే సన్నివేశాల్లో కనిపించారు. తాజాగా నటిస్తున్న సర్కార్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లో ఆయన సిగరెట్ తాగుతున్నట్టు కనిపించారు. ఇది పొగాకు నియంత్రణ చట్ట ధిక్కార చర్యగా పేర్కొన్నారు. పొగ త్రాగడం అనారోగ్యకరం వంటి యువతలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే విజయ్ లాంటి నటులు పొగతాగడాన్ని పోత్సహించే విధంగా ఆరోగ్యానికి హాని కలిగించేలా చిత్రాల్లో నటిస్తున్నారు. కాబట్టి విజయ్పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా పొగాకు నిరోధక రాష్ట్ర పర్యవేక్షణ కమిటీకి, సెన్సార్బోర్డుకు లేఖ రాశారు. అదే విధంగా విజయ్పై న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నట్లు’ గ్రిల్ అలెగ్జాండర్ తెలిపారు. సర్కార్ పోస్టర్లో సిగరెట్ కాలుస్తున్నట్లు విజయ్ స్టిల్పై పీఎంకే నేత అన్భుమని రామదాస్ ఇప్పటికే సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్పై ఇంకా ముందు ముందు ఎలాంటి రచ్చ జరగనుందో వేచిచూడాల్సిందే! రజనీ అభిమానుల ఆగ్రహం.. రజనీకాంత్ అభిమానులు, విజయ్ అభిమానులపై మండిపడుతున్నారు. సర్కార్ చిత్రం వారి మధ్య చిచ్చు పెట్టింది. వివరాలోకి వెళ్లితే.. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద హంగామా సృష్టించారు. చెన్నైలోని రోహిణి థియేటర్ వద్ధ సర్కార్ చిత్రానికి సంబంధించిన భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విజయ్ అభిమానుల భేటీ అయ్యారు. దీనిపై ఇతర హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. వారు నటుడు అజిత్ అభిమానులను, ఆయన కుటుంబాన్ని కించపరచే విధంగా మాట్లాడారు. అంతే కాకుండా రోహిణి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన రజనీకాంత్ చిత్ర పోస్టర్ను చించేశారు. దీంతో విజయ్ అభిమానులపై ఇతర నటుల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. -
అభిమాని కోసం ఆ హీరో ఏం చేశాడంటే..!
తమిళసినిమా: అభిమానులు లేనిదే హీరోలు లేరంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. హీరోలు కొన్ని సందర్భాల్లో వారి కోసం ఎందాకైనా అంటుంటారు. సంచలన నటుడు శింబు చేసిన ఈ పని చూస్తే మీరే అవునంటారు. అసలేంటీ ఇదంతా అంటారా.. చదవండీ. నటుడు శింబు లక్షలాది అభిమానుల్లో మదన్ ఒకరు. స్థానిక తేనాంపేటలోని ఒక ఏరియాలో నివశిస్తున్నాడు. ఇతను నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో పాటలు పాడుతుంటాడు. మదన్కు నటుడు శింబు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన అభిమాన సంఘంలో నిర్వాహకుడిగా ఉన్నాడు. గతవారం ఒక వివాహ వేడుక కోసం పోస్టర్ అంటిస్తుండగా ఆ ప్రాంతంలోని యువకులకు, మదన్కు మధ్య గొడవ జరిగింది. అది చినికిచినికి పెద్దదై మదన్ హత్యకు దారితీసింది. ఈ విషయం దుబాయిలో ‘సెక్క సివంద వానం’ చిత్ర షూటింగ్లో ఉన్న శింబు దృష్టికి వచ్చింది. శింబు తన తండ్రి టి.రాజేందర్కు విషయం చెప్పి మదన్ కుటుంబాన్ని ఓదార్చడానికి పంపారు. గురువారం షూటింగ్ పూర్తి చేసుకుని శింబు చెన్నైకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి తేనాంపేట ప్రాంతంలో శింబు తన అభిమానికి కన్నీటి అంజలి పోస్టర్ను స్వయంగా అంటించారు. అభిమానులపై హీరోలకు ప్రేమాభిమానాలు ఉంటాయన్నది శింబు ఇలా నిరూపించారు. -
శివుడిగా తేజ్.. పార్వతిగా ఐశ్వర్య..!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్ను తేజ్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్పై బయటికు వచ్చారు. ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్ ప్రతాప్ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్ప్రతాప్ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. -
రేస్ 3...తాజా పోస్టర్ చూస్తే...
సాక్షి,ముంబై: బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీపై తాజాగా వెల్లడైన పోస్టర్ అభిమానుల్లో హల్చల్ చేస్తోంది. తన అప్కమింగ్ మూవీ ‘రేస్ 3’ ట్విటర్లో హింట్లు ఇస్తున్న బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ తాజాగా మరో ఫోటోను షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పోస్టర్ని ట్విటర్లో సల్మాన్ పోస్ట్ చేశారు. అయితే ఈ సారి మాత్రం హీరో బాబీ డియోల్తో జాక్విలైన్ ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. ఈ పోస్టర్ లుక్, బాబీ, జాక్విలైన్ మధ్య రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల సల్మాన్ ట్వీట్ ప్రకారం సల్మాన్తో వెరైటీగా పోజులిచ్చిన జాక్విలైన్, ఇప్పుడు బాబీడియోల్తో కనిపించడంతో ఈ సినిమాపై ఇంకా భారీ క్రేజ్ నెలకొనడంతోపాటు యూత్లో భారీ సస్పెన్స్ నెలకొంది. ఎవరు ఏంటో అనే సీక్రెట్ త్వరలోనే రివీల్ అవుతుందంటూ సల్మాన్ ప్రకటించడంతో.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరితో రొమాన్స్ చేయబోతోందన్న డౌట్ సినీలవర్స్ని వెంటాడుతోంది. రెమో డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్లో సల్మాన్, అనిల్కపూర్ బాబీడియోల్తోపాటు జాక్విలైన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రేస్’ సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టగా, గతంలో సైఫ్ చేసిన రోల్లో ఇప్పుడు సల్మాన్ అలరించనున్నారు. జాక్విలైన్ మొదటి రెండు భాగాల్లోనూ నటించారు. ఈద్ సందర్భంగా జూన్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
విజయ్ ఆంటోనీగా విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఇప్పుడు బయోపిక్ల హవా కొనసాగుతోంది. ఓ పక్క దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్లు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, అలనాటి నటి సావిత్రి జీవితగాథ ‘మహానటి’ మాత్రం షూటింగ్ను పూర్తి చేసేసుకుంది. కీర్తి సురేష్.. దుల్కర్ సల్మాన్, సమంత ‘మధురవాణి’ పాత్రకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన లుక్ను చిత్రబృందం విడుదలచేసింది. (తొలి ఎంపిక సమంతే) ఈ పోస్టర్లో స్కూటర్పై వెళ్తున్న విజయ్.. అచ్చం పాతకాలపు సినిమా హీరోలా ఉన్నాడు. ‘నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణీ గారు’ అంటూ పోస్టర్పై సందేశం ఉంది. అంటే ఈ సినిమాలో విజయ్, సమంతలు స్నేహితులై ఉండొచ్చు. ఈ సినిమాలో విజయ్ పాత్ర పేరు కూడా విజయ్ ఆంటోని అని స్పష్టత ఇచ్చేశారు. మే 9న ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. The charm of the 80's :) Tana Peru Vijay Anthony. Absolute honour to play a part in telling her story.#Mahanati #NadigaiyarThilagam #MahanatiOnMay9th pic.twitter.com/kY0KpWzgG1 — Vijay Deverakonda (@TheDeverakonda) 10 April 2018 -
`రేస్ 3’ మోషన్ పోస్టర్ విడుదల
-
రజనీ 'కాలా-కరికాలన్'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ 161వ చిత్రం 'కాలా-కరికాలన్' పోస్టర్ను చిత్ర నిర్మాత ధనుష్ విడుదల చేశారు. ట్వీటర్ ద్వారా పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు ధనుష్. ‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కాలా’ అనే టైటిల్ను ఖరారుచేశారు. ధనుష్ తన వండర్బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #Kaala - Hindi and Telugu #superstar pic.twitter.com/NGjhX2rYqZ — Dhanush (@dhanushkraja) 25 May 2017 -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ పోస్టర్
ఆవిష్కరించిన మంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రూపొందించిన పోస్టర్ను గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, అధ్యాపకులు, ప్రోత్సాహకాలను పేర్కొంటూ దీనిని రూపొం దించారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభమవడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేపట్టినట్లు టీజీసీజీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవయ్య, సురేందర్రెడ్డి తెలిపారు. -
అభిమాని అత్యుత్సాహం : స్టార్ హీరోపై కేసు
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు చాలా సార్లు ఆ హీరోలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇలయదళపతి అభిమాని తన ఫేవరెట్ హీరో ఫోటోతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ విజయ్పై కేసు నమోదయ్యేలా చేసింది. విజయ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు తన ఫేవరెట్ హీరో త్రిశూలం పట్టుకున్నట్టుగా ఓ పోస్టర్ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో వైరల్ కావటంతో అందరి దృష్టి పోస్టర్పై పడింది. అయితే ఈ ఫోటోలో విజయ్ షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవడం పై హిందూ మక్కల్ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది. షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవటం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అని.. అలా చేసి విజయ్ తమ మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా విజయ్పై కేసు నమోదయ్యింది. -
కొత్త లుక్ గురూ!
దర్శకుడు సుకుమార్ చిత్రమంటే టైటిల్స్, పోస్టర్స్ దగ్గర్నుంచీ వైవిధ్యం కనిపిస్తుంది. సినిమా థీమ్కి తగ్గట్టు ప్రతిదీ డిజైన్ చేస్తారీ లెక్కల మాస్టారు. ఇప్పుడు రామ్చరణ్ హీరోగా తీయబోయే పల్లెటూరి ప్రేమకథా చిత్రం పోస్టర్లోనూ వైవిధ్యం చూపించారు. చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీఏం) నిర్మించనున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా... కావిడి బిందెలతో నీళ్లు తీసుకువెళ్తున్న ఓ గ్రామీణ యువకుడి పెన్సిల్ స్కెచ్ ఫొటో విడుదల చేశారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా, రామ్చరణ్ కెమేరా స్విచ్చాన్ చేశారు. కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘రామ్చరణ్ని సరికొత్త లుక్లో ఆవిష్కరించే వినూత్న కథని సుకుమార్ సిద్ధం చేశారు. కథానాయికగా సమంత, కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్నూలి, కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్
అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(సీసీపీహెచ్) నడుం బిగించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే ఫోన్లలో అకౌంట్ల వివరాలు చెప్పొద్దని హెచ్చరించారు. -
23న రాజ్విహార్ సెంటర్లో క్రిస్మస్ సందడి
కర్నూలు (టౌన్) ; స్థానిక రాజ్విహార్ సెంటర్లో ఈనెల 23 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు క్రిస్మస్ సందడి నిర్వహిస్తున్నట్లు జాతీయ ఎస్సీ, ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు ఆర్.రాజ్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరులకు వివరించారు. ఇదే సందర్భంగా క్రిస్మస్ సందడి పోస్టర్ను విడుదల చేశారు. ఏటా దేశ వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న క్రిస్మస్ పండుగను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పండుగగా చూస్తున్నాయన్నారు. అందువల్లే ఈ వేడుకల్లో మంత్రులు, ప్రభుత్వ ఆధికారులు పాల్గొనడం లేదని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ కళాశాల రజతోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
నంద్యాలరూరల్: స్థానిక ఆర్ఏఆర్ఎస్లోని వ్యవసాయ కళాశాల రజతోత్సవానికి సంబంధించిన పోస్టర్ను మంగళవారం ఏడీఆర్ డాక్టర్ బి.గోపాల్రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురువయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1991లో ప్రారంభమైన వ్యవసాయ కళాశాల అంచలంచలుగా అభివృద్ధి చెందిందన్నారు. వేడుకల్లో భాగంగా డిసెంబర్ 2న అగ్రి ఫెస్ట్ నిర్వహించి విద్యార్థులకు ఆధునికతపై సెమినార్లు, 3న రజతోత్సవాన్ని పురస్కరించుకొని 600మంది రైతులతో సదస్సు, డిసెంబర్ 4న నూతన భవనాలు, ఆధునిక ల్యాబ్లు, గోదాములు ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. 1991 నుంచి 2016 వరకు మహానంది వ్యవసాయ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రజతోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. -
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
బోట్క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు -
వచ్చే నెల 6 నుంచి 'జై ఆంధ్రప్రదేశ్'
హైదరాబాద్ : రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది. నవంబర్ 6నుంచి ఐదు బహిరంగ సమావేశాలను నిర్వహించనుంది. వీటిలో మొదటిది ఆరోతేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఈ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వ విఫలమైన తీరును, అవినీతి రాజకీయాలను ఎండగట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ జై ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికే పరిమితమై పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, వాటి అమలులో మాత్రం శూన్యం కనిపిస్తుందన్నారు. అన్ని వైపుల నుంచి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఎండగడుతున్న ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి భారీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఐదు సమావేశాలను నిర్వహిస్తున్నామని, వాటిలో మొదటిది నవంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో జరగనుందని వెల్లడించారు. వరుసగా జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రబలిన అవినీతిని, ప్రత్యేకహోదా సాధనలో ప్రభుత్వం విఫలమైన తీరును చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీలోని సీనియర్ నేతలందరూ, అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారని తెలిపారు. -
జేవీవీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ సత్యనారాయణరెడ్డి నల్లగొండ టూటౌన్ : ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను శుక్రవారం కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలుతూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, ఎ.గోవర్దన్, ఎన్.భీమార్జున్రెడ్డి, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్ బాల్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సీనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో ఈ క్రీడలకు సంబంధించి పోస్టర్ను టాలీవుడ్ హీరోయిన్లు రాశీ ఖన్నా, చార్మి, సంగీత దర్శకుడు రవివర్మతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హ్యాండ్బాల్ సంఘం సెక్రటరీలు, కోచ్లు, సీనియర్ ఆటగాళ్లు, పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించి, హ్యాండ్బాల్ గేమ్ అభివృద్ధికి కృషిచేస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు. -
అమ్మ పోస్టర్తో ఇరకాటం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ (జయలలిత) పై అలవిమాలిన అభిమానం అంటించిన పోస్టర్ అన్నాడీఎంకే శ్రేణులను ఇరకాటంలో పెట్టింది. కావేరీ జల వివాదం రగులుతున్న తరుణంలో కర్ణాటకకు ఆ పోస్టర్ ఒక అస్త్రంగా మారింది. ఇంతకూ ఏమిటా పోస్టర్, ఏమా కథ అంటే... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి జయలలితకు 2014లో జైలుశిక్ష విధించింది. జయ బెంగళూరు జైల్లో ఉన్నపుడు అన్నాడీఎంకే శ్రేణులు, అభిమానాలు తమిళనాడులో అనేక ఆందోళనలకు దిగారు. రోడ్లపై పొర్లారు, కొరడాలతో తమను తామే కొట్టుకున్నారు. కర్ణాటక దిష్టిబొమ్మలు తగులబెట్టారు. రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారు. కొందరు అత్యుత్సాహవంతులు తీర్పు చెప్పిన న్యాయమూర్తిని తూలనాడుతూ పోస్టర్లతో ప్రచారం చేశారు. అంతటితో శాంతించని మరికొందరు అమ్మను ఆకట్టుకోవడం కోసం కర్ణాటక ప్రజలను ఉద్దేశించి పోస్టర్లు అంటించి అందులో కావేరీ వివాదాన్ని ముడిపెట్టారు. ‘కావేరీయై వెచ్చుకో..అమ్మవై కొడు-అమ్మా వా’ (కావేరీని ఉంచుకో...అమ్మను మాకిచ్చేయి-అమ్మా రా) అనే నినాదంతో పెద్ద సంఖ్యలో వెలువడిన పోస్టర్లు ఆనాడు ఎవ్వరినీ పెద్దగా ఆకర్షించలేదు. అయితే కావేరీ నది నుంచి వాటా జలాలు విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై మంగళవారం సానుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కర్ణాటక ప్రజలు పాత పోస్టర్ను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో రెండు రోజులుగా సాగుతున్న పోరాటంలో అన్నాడీఎంకే శ్రేణుల ఆనాటి పోస్టర్నే వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ హైలెట్గా వాడుకుంటున్నారు. మీరు ఆశించినట్లుగా అమ్మను ఇచ్చేశాం కదా, కావేరీని కూడా కావాలంటే ఎలా అంటూ అన్నాడీఎంకే నేతలపై చలోక్తులు విసురుతున్నారు. -
ఆసక్తిని రేకెత్తిస్తోన్న‘మఫ్టీ’ పోస్టర్
బెంగళూరు : ఉగ్రం, రథావర తదితర హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న శ్రీమురళి కొత్త చిత్రం మఫ్టీకి సంబంధించిన పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. నర్తన్ దర్శకత్వంలో జయణ్ణ భోగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీమురళికి జోడీగా మాస్టర్పీస్ ఫేమ్ శాన్వి శ్రీవాత్సవ్ హీరోమాన్గా నటించనుంది. అంతేకాకుండా కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్కుమార్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఆయన అభిమానులతో పాటు, శ్రీమురళి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితిని పుసరస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు శాండల్ఉడ్ జనాలను కూడా ఆకర్షిస్తూ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. -
‘శాంతి మానవత ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ(గాంధీనగర్) : జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘శాంతి మానవత ఉద్యమం’ వాల్పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాంతి, మానవతా ఉద్యమాన్ని ఆగస్టు 21న ప్రారంభించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉద్యమంలో భాగంగా వివిధ మత, సామాజిక వర్గాల సభ్యులతో గ్రామ స్థాయి వరకు ‘సద్బావనా’ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో శాంతి మానవతా ఉద్యమం కన్వీనర్ ముహమ్మద్ అక్బర్ బాషా, జమాఅతె ఇస్లామీ హింద్ బాధ్యులు అబ్దుల్ ఖదీర్, ముజాహిద్ ఉమ్రి, మహెబూబ్ జానీ, కె ఎం ఖాన్, పింకిసింగ్, పి రాజశేఖర్, జయరాజ్, ఫారూఖ్ షుబ్లీ, మునీర్ అహ్మద్, సయ్యద్ రషీద్, ముహ్మద్ అలి పాల్గొన్నారు. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మంజం శ్రీనివాస్ కోరారు. గురువారం మంచిర్యాలలోని యూనియన్ కార్యాలయంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు పోతున్నాయని ఆవేదన∙వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు అనుకూలంగా ఉంటూ దేశంలోని కార్మిక చట్టాలను సవరించే విధానాన్ని కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 45 రోజుల్లోగా సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల కనీస వేతనం రూ.18 వేలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిత్యావసర ధరలను నియంత్రించి, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని తగ్గించాలని కోరారు. సమావేశంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాశ్తోపాటు కె.విజయ, పి.సురేఖ, అరుణ, నసీమా ఉన్నారు. -
సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట మున్సిపాలిటీ : కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు. గురువారం చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు జీవించడానికి కనీస వేతనం రూ. 18 వేలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక చట్టాల సవరణ నిర్ణయాన్ని, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కారింగుల వెంకన్న,పరమేష్, షేక్ సయ్యద్, మధు, వీరయ్య, రహీం, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఔను! మన సిన్మాల్నే వాళ్లు కాపీ కొడుతున్నారు!
మన సినిమాలు చాలావరకు హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టినట్టు ఉంటాయి. హాలీవుడ్, కొరియా చిత్రాల్లోని పోరాట దృశ్యాలను, సెట్టింగ్స్, ఎమోషన్స్ ను యథాతథంగా దిగమతి చేసుకోవడంలో మనోళ్లు దిట్టలు.. ఇది మన సినిమాలపై చాలామందికి ఉన్న అభిప్రాయం. కానీ ఇంకా మీరు అదే అభిప్రాయంలో ఉంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా హాలీవుడ్ చిత్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్న మన సినిమాలను ఏకంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలు కాపీ కొడుతున్నారు. ఉదాహరణకు నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘ఏ వెడ్నెస్ డే’ సినిమా హాలీవుడ్లో ‘కామన్ మ్యాన్’గా రీమేక్ అయింది. ఇందులో ప్రధాన పాత్రను బేన్ కింగ్స్లే పోషించాడు. షారుక్ ఖాన్ ‘డర్’ సినిమా ప్రేరణగా హాలీవుడ్లో ‘ఫియర్’ చిత్రాన్ని రూపొందించారు. ‘జబ్ వుయ్ మెట్’ సినిమా ఆధారంగా హాలీవుడ్లో ‘ఏ లీప్ ఇయర్’ సినిమా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన సినిమాలు అంతర్జాతీయంగా మంచి ప్రభావాన్నే చూపుతున్నాయి. తాజాగా కెనడాకు చెందిన బ్రదర్-సిస్టర్ నిర్మాణ సంస్థ ఓ ఆడియో ట్రాక్ కవర్ కోసం మన సినిమా పోస్టర్ను అడ్డంగా కాపీ కొట్టింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా ట్రాక్ ‘ఎక్స్వైజెడ్’ కవర్ యథాతథంగా బాలీవుడ్ సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ పోస్టర్ను పోలి ఉండటం గమనార్హం. పోస్టర్నే కాదు ఆ సినిమా థీమ్ను కూడా ఈ నేచర్ ట్రాక్లో వాడుకున్నారు. ఇందులో కనిపించే లుక్, టెస్ టెన్సీసన్ కూడా అచ్చం ‘కుచ్ కుచ్ హోతా హై’ లో షారుక్, కాజోల్ పాత్రల్లాగే ఉండటం నెటిజన్లు గుర్తించి.. దీనిపై పోస్టులు చేస్తున్నారు. మా సినిమా థీమ్లనే కాదు.. పోస్టర్లను కూడా కాపీ కొడతారా? వారు ప్రశ్నిస్తున్నారు. -
ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరిస్తే..
పంజగుట్ట (హైదరాబాద్) : ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' రోజున అందరూ చేనేత దుస్తుల్ని ధరిస్తే లక్షమంది నేతన్నలకు బతుకుదెరువు ఇచ్చిన వారమవుతామని, మరో లక్ష మందికి ఉపాధి చూపినట్లవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం కూడా పూనుకుని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో చేనేత స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మస సంస్కృతిని గుర్తుంచుకుని గౌరవించుకోవాలంటే చేనేత దినోత్సవాన్ని గొప్పగా నిర్వహించుకోవాలని, కనీసం ఆ రోజైనా ప్రతివారూ చేనేత వస్త్రాల్ని ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడ్క కల్పన కుమారి మాట్లాడుతూ .. ఆగస్టు 7వ తేదీన నెక్లెస్ రోడ్లో చేపట్టే వాక్లో అందరూ చేనేత వస్త్రాలు ధరించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, పద్మశాలి పొలిటికల్ ఫోరం ప్రతినిధి చిక్క చందు, ఆలిండియా హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యుడు తడ్క యాదగిరి, చేనేత వర్గాల చైతన్య వేదిక ప్రతినిధి చిక్కా దేవదాసు, గోళ్ళ నరేందర్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'అన్నా' హజారే పోస్టర్ విడుదల!
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నా' ఫస్ట్ లుక్ విడుదలైంది. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో వెలువడుతున్న చిత్రం పోస్టర్ ను ముంబైలోని ఓ కార్యక్రమంలో అన్నా హజారే స్వయంగా విడుదల చేశారు. 25 ఏళ్ళ వయసులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న తనకు ప్రస్తుతం 79 సంవత్సరాలని, ఇప్పటికీ అదే మార్గంలో తాను నడుస్తున్నానని హజారే పోస్టర్ రిలీజ్ సందర్భంలో తెలిపారు. దేశంలో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. ద రైజ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వెలువడనున్న 'అన్నా' చిత్రానికి మహేంద్ర జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ నమ్ దేవ్, శతాత్ సక్సేనా, కిషోర్ కదమ్ చిత్రంలో నటిస్తుండగా... దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ అన్నా పాత్రను పోషిస్తున్నారు. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ ఈ సినిమాలో జర్నలిస్టు రోల్ లో కనిపించనుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే.. 2011 లో జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత..
అమె అందంలో ఛేంజ్ వచ్చేసిందంటూ నిరాశ పడ్డ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది సమంత. జూన్ నెలలో వెలువడ్డ ఓ సినీ మ్యాగజిన్ పై కనిపించిన పోస్టర్.. అభిమానులను కట్టిపడేసింది. అందానికి మరోపేరు సమంత అనేట్లుగా... నిండైన వస్త్రధారణ, బంగారు వన్నెలొలికించే సంప్రదాయ పట్టుచీరతో అందర్నీ ఆకట్టుకుంది. సమంతలో ఛార్మ్ తగ్గిందేమో అన్న అనుమానాలకు చెక్ పెట్టేసింది. ఆరేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూ... తన అద్భుతమైన నటనతో ఎందరో హీరోయిన్లను దాటేసి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది సమంత. అందంలో మిగిలిన వారితో పోలిస్తే కాస్త వెనుకబడ్డా.. నటనతో పోటీపడి వారందరికీ దీటుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే లుక్స్ తో అద్భుతమైన నటనతో ఈగ, బృందావనం వంటి సినిమాల్లో ఆమె రూపం సైతం అందర్నీ కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత ఆమెలో వచ్చిన ఛేంజ్ ను, తగ్గిన ఛార్మ్ ను చూసి అభిమానులు దిగాలు పడిపోయారు. అప్పట్లో ఆమెకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని, అదే ఆమె అందాన్ని దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే... సన్నబట్ట నలిగినా అందమే అన్న సామెతకు సంమత సరిగ్గా సరిపోతుందని ఇటీవల వెలువడిన 'గలాటా సినిమా' మ్యాగజిన్ నిరూపించింది. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కనిపించిన పోస్టర్ చూస్తే ఆమె అందం తరిగేదికాదని అర్థమౌతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 సినిమాలో సమంతలో ఏదో లోపం ఉందంటూ అభిమానులు నిరాశ పడ్డారు. కానీ ఫేస్ లో కాస్త గ్లో తగ్గినా తన నటనతో ఆఫీలింగ్ నుంచి వారిని బయట పడేయగలిగింది అయితే ఇప్పుడు తాజాగా వెలువడిన గలాటా సినిమా మ్యాగజిన్ లో అటువంటి అనుమానాలకు పూర్తిగా చెక్ పెట్టేసింది ఆ చెన్నై సుందరి. సౌత్ ఇండియన్ మూవీ మ్యాగజిన్ కవర్ పేజ్ పై బంగారు బొమ్మలాంటి రూపంలో ప్రత్యక్షమైన సమంత.. తనలో అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. మ్యాగజిన్ పోస్టర్ పై గోల్డెన్ డామినేటెడ్ జరీ బోర్డర్ సంప్రదాయ పట్టుచీరకు తోడు.. నిండైన డిజైనర్ బ్లౌజ్.. ఆమె అందాన్ని మరింత ఇనుమడింజేసింది. అంతేకాదు 'గలాటా సినిమా' జూన్ 2016 మ్యాగజిన్ కోసం తీసిన ప్రత్యేక ఫోటో షూట్ కు సంబంధించిన చిత్రాల్లోనూ ఆమె అందం కళ్ళు తిప్పుకోకుండా చేస్తోంది. సంమంత నిజంగా గ్లామరస్ బ్యూటీ క్వీన్ అని మరోమారు రుజువు చేస్తోంది. -
సమ్మె సైరన్ మోగిస్తాం
- నిరవధిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు : శివగోపాల్ మిశ్రా - సమ్మె తేదీలోపు ప్రభుత్వం స్పందించాలి - కార్మికులు సమ్మెకు దిగితే భారీ నష్టాలు వాటిల్లుతాయి - సమ్మె పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ : ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జులై 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నామని ఎన్జేసీఏ కన్వీనర్, ఏఐఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదివరకు కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక తీరుకు నిరసనగా 1968, 1974లో రైల్వేతో పాటు అన్ని శాఖల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము చేపట్టనున్న సమ్మెలో 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వ్యతిరేకతకు నిరసనగా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లు ఏడవ వేతన సిఫార్సులో సవరణలు, కనీస వేతనం 18వేల నుంచి 26 వేల రూపాయలు ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానం వద్దని, వీటన్నింటిని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. ఎస్సీఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్. శకర్రావు మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి పేద ప్రజలకు, కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంటే మన దగ్గర మాత్రం మోదీ సర్కార్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తుందని ఎద్దేవా చేశారు. రైల్వేలో, డిఫెన్స్లో ఎఫ్డీఐను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 7 రోజులు రైల్వే సమ్మె జరిగితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడతాయి, 10 రోజుల రైల్వే వ్యవస్థ సమ్మెతో పరిశ్రమలు మూత పడతాయి,15 రోజులు సమ్మె చేస్తే దేశం స్తంభించిపోతుందని తెలిపారు. అందువల్ల సమ్మె జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిస్తే బాగుంటుందని హెచ్చరించారు. తొలుత సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను శివగోపాల్ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పలు విభాగాల ఉద్యోగులు, మజ్దూర్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫ్యాన్స్ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. కాన్సెప్ట్ బావున్నా.. కథని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడన్నది విశ్లేషకుల మాట. రకరకాల కామెంట్లతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు. బ్రహ్మోత్సవం ఫలితం విషయంలో పూర్తిగా బాధ్యత తనదేనని, దర్శకుడిని ఎంచుకుంది తానేనంటూ మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా ఓ గోడపై అంటించిన బ్రహ్మోత్సవం పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఆ పోస్టర్ ఎవరి పనో అంతుబట్టలేదుగానీ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతుంది. 'బోర్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం' అని రాసున్న బ్రహ్మోత్సవం పోస్టర్ కడపలో దర్శనమిచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ఎడిట్ చేసిన మాట నిజమేగానీ.. అయితే ఈ రకమైన ప్రచారం మాత్రం మహేష్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. -
స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో స్వచ్ఛ యాదగిరి గుట్ట పోస్టర్ను ఎమ్మెల్యే సునీత ఆవిష్కరించారు. స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆమె విజప్తి చేశారు. -
సేనాపతి హల్ చల్!
అభిమాన హీరో సినిమా మొదలైందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆ ఆనందంలో ఆ సినిమాకి ఏవేవో టైటిల్స్ పెట్టేస్తారు. పాత ఫొటోలతో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసేస్తారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు అదే చేశారు. ఆయన హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఇది తమిళ ‘వీరమ్’కి రీమేక్ అనే వార్త ఆ తర్వాత ప్రచారంలోకొచ్చింది. కానీ, చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తాజాగా.. ఈ చిత్రానికి ‘సేనాపతి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ టైటిల్తో ఓ పోస్టర్ డిజైన్ చేసి, ఎవరో సామాజిక మాధ్యమంలోకి వదిలారు. అంతే.. కాసేపటికే ఆ పోస్టర్ ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కాదు కాబట్టి, ఈ టైటిల్ నిజం కాదని అర్థమవుతోంది. మరి.. అసలు టైటిల్ ఏంటి? ఒకవేళ ఆ నోటా ఈ నోటా ఈ టైటిల్ పెట్టాలని దర్శక-నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసే అభిమానులు పోస్టర్ డిజైన్ చేశారా? అన్నది తెలియడానికి ఎంతో కాలం పట్టదు. -
రెహమాన్ సినిమా తొలి పోస్టర్ వచ్చేసింది!
ముంబై: ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత మరో కీలక అడుగు ముందుకేశారు. తన సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆయన చిత్ర నిర్మాణ రంగంలో తన మొదటి చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రధాన కథాంశంతో కూడిన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 99 పాడల్గళ్ పేరుతో, హిందీలో 99 సాంగ్స్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తొలి పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కలర్ ఫుల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అందరి ఆశీస్సులను ఆకాంక్షించారు. '' మీ అందరి సహకారం, ఆశీస్సులతో .. నా సినిమా మొదటి పోస్టర్.. షేర్ చేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు అటు ఈ సినిమా దర్శకుడు ముఖేస్ చాబ్రా కూడా ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. రెహమాన్ చిత్రంలో భాగస్వామి కావడం తనకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్ వైఎంసీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తమిళ్, హిందీ భాషలలో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్ లో కొత్త సంగీత దర్శకు లను ప్రోత్సహిస్తానని ప్రకటించారు. అరుదైన ప్రతిభతో రెండు అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడు ఏఆర్ రెహమాన్ అటు హాలీవుడ్లో కూడా తన హవాను చాటుకుంటున్నారు. With your support & good wishes, I'm pleased to share my movie's first poster! https://t.co/F7KOZ0bRmv — A.R.Rahman (@arrahman) March 9, 2016 -
పవన్ పోస్టర్పై ఫ్యాన్స్ ఆగ్రహం
రేపల్లె (గుంటూరు): కాపు రిజర్వేషన్ విషయంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పవన్ వైఖరిని తప్పుబడుతూ ఆయన పోస్టర్లను చించివేస్తున్నారు. కాపు గర్జన సభ సందర్భంగా తునిలో జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ సోమవారం విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ వైఖరిపై కాపు యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ పై అభిమానం చాటుతూ గతంలో గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడిలో తాము ఏర్పాటుచేసిన ఆయన ఫ్లెక్సీని మంగళవారం కాపు యువత కార్యకర్తలు చించివేశారు. సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పవన్ వ్యవహరించడం సిగ్గుచేటని వారు వ్యాఖ్యానించారు. -
ఫిబ్రవరి మొదటి వారానికి అంతా సిద్ధం
♦ మేడారం జాతర ఏర్పాట్లపై కడియం ♦ చందూలాల్, ఇంద్రకర ణ్తో కలసి పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరగనున్న తొలి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా భావించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ల నుంచి కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నం దున ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి ఆయన మేడారం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆరు నెలల క్రితమే జాతర ఏర్పాట్లను ప్రారంభించామని, రూ.154 కోట్లతో పనులు చేస్తున్నామని కడియం వివరించారు. ప్రస్తుతం రోడ్లు, భక్తులు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు తదితర పనులు జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల మొదటివారానికల్లా పనులు పూర్తవుతాయని, త్వరలో క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తామన్నారు. రూ.1.20 కోట్లతో గద్దెల వద్ద, ఆ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ చేయిస్తున్నామని, స్టీల్ బారికేడ్లతోపాటు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే పరిసరాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇటు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా వెళ్లే దారి, అటు తాడ్వాయి మీదుగా వచ్చే రోడ్డును రెండు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం ఉత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకునే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు చెప్పారు. గురువారం నుంచి ఆహ్వానపత్రికలు పంపుతామన్నారు. మేడారం జాతరకు ఆసియాలోనే పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుందని మంత్రి చందూలాల్ అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఎస్సీ సెల్ చైర్మన్ రవి పాల్గొన్నారు. -
యూనివర్సిటీలో 'అంబేదర్కర్' ప్లెక్సీలు చించిన దుండగులు
-
గిన్నీస్బుక్లో బాహుబలి భారీ పోస్టర్
-
ఉద్యమంలా హరితహారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ను ఉద్యమంలా చేపట్టాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు జీవంపోసే వృక్షసంపదను కాపాడుకునేందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అభిలషించారు. జెడ్పీ సమావేశమందిరంలో శనివారం హరితహారంపై ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య ఆతిధిగా హాజరైన మహేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2.34 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 20 లక్షల గుంతలు తవ్వి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచామని అన్నారు. మొక్కలను నాటడం కాదు.. సంరక్షించడం ముఖ్యమని, ఈ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం.. నాటిన మొక్కలను పోషించే బాధ్యతను గ్రామీణ ఉపాధి హామీతో అనుసంధానం చేసిందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. వృక్ష సంపద లేకపోవడం వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటేలా ప్రజలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అడవులు అంతరించిపోవడం వల్ల కోతులు గ్రామాల్లో సంచరిస్తున్నాయని, అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను పెంచేందుకు అటవీశాఖ కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మట్లాడుతూ కళాశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థల్లో విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, మంచిరెడ్డి కిషన్రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, రామ్మోహన్రెడ్డి, వివేక్, కనకారెడ్డి, గాంధీ, సుధీర్రెడ్డి, కలెక్టర్ రఘునందన్రావు, ఎస్పీ శ్రీనివాస్, జేసీ ఆమ్రపాలి, సబ్కలెక్టర్ వర్షిణి, వివిధ శాఖల అధికారులు, పురపాలికల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హరితహారం అమలుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొం దించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. డీపీఓపై గుస్సా! జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి వ్యవహారశైలిపై మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో లేచి నిరసన తెలిపారు. చేవెళ్ల ఎంపీపీని చాంబర్లోకి అనుమతించకుండా డీపీఓ అవమానపరిచారని సభ్యులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల కు కనీస గౌరవం ఇవ్వని డీపీఓ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి మహేందర్రెడ్డి.. ఈ అంశంపై సమావేశంలో చర్చించడం సబబుకాదని సముదాయించడంతో ఎంపీపీలు శాంతించారు. -
ఐష్ ఐస్ చల్లేస్తుందా?!
గాసిప్ అసలైన అందానికి ఐశ్వర్యారాయ్ తప్ప మరో నిర్వచనం తెలియనివాళ్లు చాలామందే ఉన్నారు. ఆ అభిమానమే అందరినీ ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఐష్ మళ్లీ ఎప్పుడు తెరమీద కనిపిస్తుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆమె రీ ఎంట్రీ సినిమా ‘జాబాజ్’ పోస్టర్ చూసి ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో, బాధ- ఆవేశం కలగలసిన ఎక్స్ప్రెషన్తో ఉన్న ఐశ్వర్యతో ఉన్న ఆ పోస్టర్ పెద్దగా కిక్కివ్వలేదెవ్వరికీ. పైగా ఐష్ కూడా నాజూగ్గా కాకుండా కాస్త బొద్దుగా ఉండటం మరీ నిరుత్సాహపర్చింది. కొంప దీసి సినిమాలో కూడా ఐష్ ఇలాగే ఉంటుందా, తమ ఆసక్తి మీద ఐస్ చల్లేస్తుందా అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో సినిమా రిలీజైతే కానీ తెలీదు మరి! -
'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'
లాంస్ ఎంజిల్స్: వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే.. అది కూడా దాని శ్వాస నిట్టూర్పులు తగిలేంత దగ్గరిగా.. రెండు చేతులు పట్టినా సరిపోనంత పెద్ద కోరలతో ఆ జంతువుంటే.. అమ్మో ఒళ్లు జలదరించి పోతుందికదా.. ఇదే కాదు ఇలాంటి ఎన్నో అనుభవాలు అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. మీకే కాదు ఆ సమయంలో మీతో పాటు కూర్చున్న అందరికీ కూడా. ఇంతకీ ఏంటనీ అనుకుంటున్నారా.. జురాసిక్ చిత్రాలు మీరు చూసే ఉంటారుగా.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ చిత్రాలకు సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత గొప్పగా తీర్చి దిద్ది 'జురాసిక్ వరల్డ్' అనే పేరుతో దర్శకుడు కోలిన్ ట్రెవర్రో గాడ్జిల్లాలతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనున్న ఈ చిత్రానికి చెందిన కొన్ని పోస్టర్లు ఆయన ఆన్లైన్లో విడుదల చేశారు. ఆ పోస్టర్లలో ఈ చిత్రంలోని హీరోయిన్ బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓ అద్దాల భవంతిలో నిల్చుని ఉండగా.. అద్దం వెలుపల సరిగ్గా ముఖానికి దగ్గర ఓ పెద్ద గాడ్జిల్లా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కనిపిస్తుంది. ఇలాంటి పోస్టర్లు ఇంకెన్నో ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
13న గద్వాలలో కేటీఆర్ పర్యటన: మంద జగన్నాథం
మహబూబ్నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్లు ఈనెల 13వ తేదీన జిల్లాలోని అలంపూర్, గద్వాలలో పర్యటించనున్నట్లు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం తెలిపారు. సోమవారమిక్కడ కొండేరు గ్రామంలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ను పట్టభద్రులు, ఉద్యోగ సంఘాల వారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిప్రకాష్, నాయకులు గోవర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (ఇటిక్యాల) -
ధర్నా పోస్టర్ రిలీజ్ చేసిన వైఎస్ఆర్ సీపీ
-
రిలీజ్కు ముందే 85 కోట్లు వసూళ్లు....
-
అమీర్ ఈసారి నిండుగా బట్టలేసుకున్నాడు!
పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అమీర్ ఖాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్ధమవుతుందని సమాధానమిచ్చారు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్.. అందర్ని ఆశ్చర్య పరిచారు. బుధవారం విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ పూర్తిగా, నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం చేతిలో పట్టుకుని నిలుచున్నాడు. ఈ పోస్టర్ తో బట్టలేసుకోలేదని విమర్శల వర్షం కురిపించిన క్రిటిక్స్ నోళ్లకు తాళం వేశారు. ఈ పోస్టర్ పై క్రిటిక్స్ ఏమని విమర్శలు చేస్తారో వేచి చూడాల్సిందే. -
పీకే 2వ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా ఉండదట!
ఆమీర్ ఖాన్ నటించిన 'పీ.కే' పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనాలకు, వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ వివాదంపై మిస్టర్ కూల్ సానుకూలంగానే స్పందించారు. పబ్లిసిటీ కోసం తాము ఈ పోస్టర్ విడుదల చేయలేదని.. ఈ చిత్రం చూసిన తర్వాత విమర్శకులు తమ వాదనల్ని మార్చుకుంటారని అమీర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. పీ.కే చిత్రానికి సంబంధించిన రెండవ పోస్టర్ ఆగస్టు 20 తేదిన విడుదల కానుంది. పీకే రెండవ పోస్టర్ లో ట్రానిస్టర్ కూడా అడ్డుగా ఉండదు. ఇక మీరే చెప్పండి అంటూ మీడియాకు ఓ ప్రశ్నను అమీర్ సంధించారు. ట్రాన్సిస్టర్ అడ్డుగా ఉంటేనే ఇన్ని వివాదాలు చెలరేగాయి. ఇక ట్రాన్సిస్టర్ అడ్డు లేకుంటే ఏమైంతుందో ఓసారి ఊహించుకోవాల్సిందే. -
అమీర్ 'పీకే పోస్టర్' వివాదం
-
దేశ రాజధానిలో పోస్టర్ల రగడ!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ల రగడ కొత్త రూపం దాల్చింది. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని ఆగస్టు 3 తేదిన జంతర్ మంతర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాకు హాజరు కావాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన పోస్టర్లను అతికిస్తుండగా నలుగురు ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆప్ నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ పోలీసులను రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపింది. ఢిల్లీలో నగరమంతటా బీజేపీ హోర్డింగ్స్ ఉన్నాయని, ఆమ్ ఆద్మి పార్టీ పోస్టర్లనే ఎందుకు టార్గెట్ చేస్తోందని పలువురు నేతలు ఆరోపించారు. ఎన్నికలకు భయపడి బీజేపీ పారిపోతోందని ఆప్ ఎద్దేవా చేసింది. Bhaag BJP Bhaag.AAP aayi he....... 3Aug Jantar Mantar. .@AamAadmiParty .@ArvindKejriwal pic.twitter.com/tNyuQFhehu— Vandana Singh (@VandanaSsingh) July 28, 2014 -
'కాంగ్రెస్ మా పోస్టర్ కాపీ కొట్టింది'
న్యూఢిల్లీ : పోస్టర్ చూసి సినిమా ఎలాంటిదో చెప్పేయవచ్చు. పోస్టర్లో విషయం ఎంత బాగుంటే సినిమా కూడా అంత బాగుంటుందంటారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చినట్లుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు అంతగా కలిసొస్తున్నట్లు లేదని భావించిన హస్తం పార్టీ... వెంటనే పోస్టర్ మార్చేసింది. నేను కాదు మనం అంటూ రాహుల్గాంధీ ఫోజ్తో విడుదలైన పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో హల్చల్ చేస్తున్నాయి. విడగొట్టొద్దు... కలిసుందాం అనే నినాదంతో ఏర్పాటు చేసిన కొత్త పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేను కాదు మనం అనే టైటిల్తో రూపొందిన పోస్టర్ను తమను చూసే కాపీ కొట్టారని బీజేపీ మండిపడుతోంది. గతంలోనే తాము మోడీ ముఖ చిత్రంతో ఆ పోస్టర్ను విడుదల చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ ఆ పోస్టర్ను కాపీ చేసిందని ఎద్దేవా చేసింది. -
పోస్టర్ వివాదం!
అభిమానులు తమ అభిమాన కథానాయకుడిపై చూపించే మితిమీరిన మమకారం ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంది. ఇటీవల రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కనబర్చిన మమకారం ఆ పనే చేసింది. ఆ రోజు రజనీ పేరు మీద తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానాలు, పూజలు, సేవా కార్యక్రమాలు చేశారు. చెన్నయ్లో అయితే మరింత సందడిగా జరిగాయి. రజనీ నిలువెత్తు కటౌట్లు పెట్టి, క్షీరాభిషేకాలు కూడా చేశారు. అంతా బాగానే ఉంది. కానీ, ఒకే ఒక్క పోస్టర్ మాత్రం వివాదానికి దారి తీసింది. రజనీకాంత్ ఓటు వేయడానికి క్యూలో నిలబడిన పోస్టర్ అది. అందులో వివాదం ఏముంది? అనుకోవచ్చు. కానీ, రజనీ వెనకాల వినాయకుడు, విష్ణుమూర్తి నిలబడినట్లుగా ముద్రించారు. దాంతో పాటు ‘తలైవా (నాయకుడా)! నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు కూడా ఓటేస్తారు’ అని రాశారు. ఇది విశ్వ హిందూ పరిషత్వారికి ఆగ్రహాన్ని కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని వారు మండిపడుతున్నారు. ఇలా చేయడం తగదంటూ ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే... రజనీకి ఈ పోస్టర్తో ఎలాంటి సంబంధం లేకపోయినా, అభిమానుల అత్యుత్సాహం ఇంత పని చేసింది. -
సమైక్యశంఖారావం పొస్టర్ రిలీజ్ చేసిన ఉద్యోగులు
-
సమైక్య శంఖారావం సభ పోస్టరు విడుదల
-
‘మనగుడి’ పోస్టర్ ఆవిష్కరణ
‘ భద్రాచలం టౌన్, న్యూస్లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈనెల 21న నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమ వాల్పోస్టర్లను ఆలయ ఏఈఓ ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనగుడి పేరిట అనేక ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని, ఈనెల 11 నుంచి వరుసగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని తెలిపారు. ఈనెల 16న స్థానిక బస్టాండ్ ఇన్గేట్ వద్ద నున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న భక్తులకు టీటీడీ నుంచి కంకణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రావణ్కుమార్, భద్రాచలం ధార్మిక మండలి సభ్యులు శీలం పుల్లారెడ్డి, గంజి పురుషోత్తం పాల్గొన్నారు. -
ఫీజుపోరు ఫోస్టర్ విడుదల