
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని దళిత సంఘాలు కేంద్రా న్ని హెచ్చరించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని పటిష్టపరిచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ, మాలమహానాడు జాతీయ సమన్వయకర్త అద్దంకి దయాకర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...దళితుల హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు, కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు.
ఈ ప్రయత్నాలను తాము తిప్పి కొడతామని, ఆగస్టు 8న ఢిల్లీ వేదికగా తమ గళాన్ని కేంద్రానికి వినిపిస్తామన్నారు. రాంలీలా మైదానం లో దేశవ్యాప్తంగా ఉన్న 71 దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల నుంచి దళితులు తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment