జేసీబీ ఢీకొని ఒకరి మృతి, నలుగురికి గాయాలు | road accident in hyderabad, 1 died, 4 injured | Sakshi
Sakshi News home page

జేసీబీ ఢీకొని ఒకరి మృతి, నలుగురికి గాయాలు

Published Fri, Feb 13 2015 2:24 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

నగరంలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో ఓ జేసీబీ వాహనం శుక్రవారం ఉదయం విధ్వంసం సృష్టించింది.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్,  మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో ఓ జేసీబీ వాహనం శుక్రవారం ఉదయం విధ్వంసం సృష్టించింది. ఆరాంఘర్ వైపు వెళుతున్న జేసీబీ, బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు వెళుతున్న ఆటో, బైక్ తో పాటు పాదచారులపై దూసుకెళ్లింది.

ఈ ఘటనలో మహేందర్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్తానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఓ ప్లాస్టిక్ కంపెనీ ఉద్యోగి అని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement