rajendranagar
-
అతివేగంతో ట్రిపుల్ రైడింగ్.. స్పాట్లోనే మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్ మండలం పరిధిలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రారంభమైన మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ వేపై ఓ బైక్ వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.బహదూర్పురా-ఆరాంఘడ్ కొత్త ఫ్లై ఓవర్పై సోమవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ డివైడర్ను ఢీ కొట్టింది. ఇద్దరు స్పాట్లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధృవీకరించారు.మృతుల్ని బహుదూర్పురాకు చెందిన మాబ్, అహ్మద్, సయ్యద్గా గుర్తించారు. ఈ ముగ్గూరూ మైనర్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
HYD: అనాథాశ్రమంలో బాలికలతో కేర్ టేకర్ అనుచిత ప్రవర్తన!
సాక్షి, రాజేంద్రనగర్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్ టేకర్గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.అయితే, కొత్తగా చేరిన కేర్ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్కు రంగం సిద్ధం! -
రాజేంద్రనగర్లో విషాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్లో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఇద్దరికి గాయాలు...సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నానిన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు
-
రాజేంద్రనగర్లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో..
హైదరాబాద్: వారిద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అవుతారు. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మోనిక తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహ గౌడ్, సోమేశ్ గౌడ్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడ కేశవ్నగర్లో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. పై అంతస్తులో నర్సింహ, స్వప్న దంపతులు తమ ఇద్దరు కుమారులతో పాటు నర్సింహ మేనమామ కుమారుడు, స్వప్న సోదరుడైన శేఖర్ (26) ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్, ఆయన భార్య స్రవంతి (28), ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. నర్సింహ, సోమేశ్ అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు జాబ్ చేస్తుండగా.. శేఖర్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. పిల్లలు ఇంటికి వచ్చి చూడగా.. మంగళవారం స్వగ్రామంలో బంధువు దశదిన కర్మ ఉండటంతో నర్సింహ, సోమేశ్తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి, చందు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలి వెళ్లగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో ఈ విషయం చెప్పారు. వారు సోమేశ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగతజీవులై కనిపించారు. పంచనామా చేసి ఇరువురి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సింహ, సోమేశ్, స్వప్న ఇంటికి చేరుకున్నారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని, తామంతా కలిసి మెలిసి ఉండేవాళ్లమన్నారు. శేఖర్ ఐదేళ్లుగా తమతోనే ఉంటున్నాడని.. వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నర్సింహ, సోమేశ్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
HYD: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్ను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్ను బాలానగర్, రాజేంద్ర నగర్లో ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు. ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవ్వరూ ఉన్నారు?. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. డ్రగ్స్ను బెంగళూరు నుంచి హైదరాబాద్కు అర్జున్ తీసుకువచ్చినట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్.. అంతకుముందు కూడా న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. -
హైదరాబాద్: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
రాజేంద్రనగర్లో అగ్నిప్రమాదం..భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్ : రాజేంద్రనగర్లోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని థర్మకోల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగలవల్ల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో గ్యాస్ సిలిండర్లు ఉండటం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ గగన్పహాడ్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో చుట్టుపక్కల వారు అప్పట్లో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదీచదవండి..కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి! -
రాజేంద్రనగర్లో రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. డైరీ ఫామ్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో రౌడీ షీటర్ సర్వర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పథకం ప్రకారం సర్వర్ను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు.కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. పాతకక్షల నేపథ్యంలో సర్వర్ను దుండగులు చంపినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
HYD: హైస్పీడ్లో కారు బీభత్సం.. సినిమా రేంజ్లో టైర్లు ఊడిపోయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఉన్న కారు సినిమా రేంజ్లో డివైడర్ను ఢీకొట్టి.. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు రెండు వీల్స్ ఊడిపోయి గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లోని పీవీ ఎక్స్ప్రెస్వేపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజూమన హైస్పీడ్లో ఉన్న కారు.. 198వ పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం, మరో కారును కూడా సదరు కారు ఢీకొట్టింది. ఈ సందర్బంగా కారు రెండు టైర్లు ఉడిపోయి.. ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, మైనర్లు ఈ కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
రంగారెడ్డి: నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్లు చోరీ
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలోని హైదరాబాద్ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు ఎన్పీఏ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
గ్యాంగ్ నుంచి వెళ్లిపోయాడని..కిడ్నాప్ చేసి బట్టలూడదీసి...
సాక్షి, రాజేంద్రనగర్: గ్యాంగ్ నుంచి వెళ్లిపోయి తమపైనే దుష్ప్రచారం చేస్తావా అంటూ ఓ రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బట్టలూడదీసి చితకబాదిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో రెండు సార్లు సదరు యువకుడిపై ఇదే గ్యాంగ్ దాడికి పాల్పడింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో వారు మరోసారి తెగబడ్డారు. రౌడీషీటర్తో పాటు అతడి అనుచరులు యువకుడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి తమ సెల్ఫోన్ స్టేటస్లలో పోస్టు చేసుకోవడం గమనార్హం. తమతో ఎవరైనా పెట్టుకుంటే తమను కాదంటే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సన్సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను గతంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ రౌడీïÙటర్ ఇర్ఫాన్తో సన్నిహితంగా ఉండే వాడు. అతడి గ్యాంగ్లో తిరుగుతూ గొడవలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు మహ్మద్ ఇర్ఫాన్ను మందలించి ట్యాక్సీ కోనుగోలు చేసి ఇచ్చారు. గత 8 నెలలుగా ట్యాక్సీ నడుపుకుంటున్న ఇర్ఫాన్ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రౌడీషీటర్ ఇర్ఫాన్ తన గ్యాంగ్ నుంచి వెళ్లిపోయినందుకు రూ.50 వేలు ఇవ్వాలని అతడికి ఫోన్చేసి బెదిరిస్తున్నాడు. రెండు సార్లు ఇంటి వద్దకు వచ్చి గొడవపడి దాడి చేశాడు. రెండు నెలల క్రితం అతడిపై దాడి చేయడంతో బాధితుడి సోదరుడు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి మహ్మద్ ఇమ్రాన్ తన కారును లంగర్హౌజ్లో సరీ్వసింగ్కు ఇచ్చి ఇంటికి వచ్చేందుకు వేచి ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్ ఇర్ఫాన్ అతడి స్నేహితులు జహీర్, షహీన్షా, ముదస్సర్, ఫవాద్లు మహ్మద్ ఇర్ఫాన్ను మాట్లాడేది ఉందంటూ ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్ దర్గా సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతడి దుస్తులు విప్పించి బెల్టులు, కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహ్మద్ ఇర్ఫాన్పై దాడి చేసి అనంతరం సన్సిటిలోని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. రౌడీషీటర్ గ్యాంగ్ రికార్డు చేసిన దృశ్యాలను తమ సెల్ఫోన్ స్టేటస్లతో పాటు గ్రూప్లలో పోస్టులు చేశారు. తమతో విభేదించినా, తమతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని కామెంట్ చేశారు. ఈ క్లిప్పింగ్ చూసిన మహ్మద్ ఇర్ఫాన్ సోదరుడి స్నేహితుడు సమాచారం అందించడంతో అతను మహ్మద్ ఇర్ఫాన్ను నిలదీశాడు. అప్పటికే గాయాలతో బాధపడుతున్న మహ్మద్ ఇర్ఫాన్ను రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఉషామోహన్ ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే... గతంలో మహ్మద్ ఇర్ఫాన్పై రౌడీషీటర్ ఇర్ఫాన్ గ్యాంగ్ దాడి చేసి బెదిరించింది. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడి సోదరుడు ఆరోపించారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నాడు. ఇప్పటికైనా రౌడీïÙటర్ ఇర్ఫాన్తో పాటు అతడి గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. (చదవండి: మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...) -
ఓలా డ్రైవర్పై రెచ్చిపోయిన గ్యాంగ్
-
‘ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ ప్రారంభం
వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల సాయంతో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్’, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ కాంప్లెక్స్ను బుధవారం ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్కు వ్యవసాయ శాస్త్రవేత్త ‘డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రప్రభుత్వ సాయంతో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. -
రాజేంద్రనగర్లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి..
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్లో దారుణం చోటుచేసుకంఉది. చింతల్ మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కొందరు గుర్తుతెలియని యువకులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. యువతిని ఢీ కొట్టిన దండగులు వెంటనే కారుతో పారిపోయారు. రోడ్డుపై కారును ముందుకు తీసుకొని వెళ్లి రివర్స్ చేసి మరి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. రక్తపు మడుగులో రోడ్డు పడి పోయిన యువతిని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో మాత్రం స్పష్టంగా రోడ్డు పక్కన నుంచి నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారుతో ఢీ కొట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా, హత్య? అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. చదవండి: వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి A 19 yr old woman sustained serious injuries after she was hit by a car, while she was walking on the road side footpath, when the driver of a car rammed into her, at Chintalmet at Rajendranagar in Hyderabad on Wednesday, she is undergoing treatment. pic.twitter.com/pFofLzI8zT — AMIT KUMAR GOUR (@gouramit) July 7, 2022 -
రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..
సాక్షి, హైదరాబాద్: ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో దొరికిన ప్రెస్ ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు కేసులను చేధించారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, బనారస్కు చెందిన ప్రమోద్కుమార్(40) నగరానికి వలస వచ్చాడు. మతం మార్చుకున్న అతను తన పేరును మహ్మద్ ఇక్బాల్గా మార్చుకున్నాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్బేగంను వివాహం చేసుకుని గోల్కొండ రిసాలా బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మహ్మద్ ఇక్బాల్ భూత వైద్యుడిగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పని చేసేవాడు. అతను ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ లతీఫ్ అలియాస్ మన్ను వద్ద గతంలో రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో లతీఫ్ తరచు ఇక్బాల్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. దీంతో మెహరాజ్బేగంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఇక్బాల్ భార్యను హెచ్చరించాడు. లతీఫ్ను సైతం తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో ఇక్బాల్, మెహరాజ్బేగం తమకు అడ్డుగా ఉన్న ఇక్బాల్ను హత్య చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం లతీఫ్ మలక్పేట్ ముసారాంబాగ్కు చెందిన మహ్మద్ ఉస్మాన్, గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్ సోఫియాన్ సహాయం కోరాడు. వీరికి రూ.10 వేలు ఇచ్చి తాను పిలిచిన వెంటనే రావాలని సూచించాడు. ఈ నెల 11న మహ్మద్ ఇక్బాల్ సిద్ధిపేట వెళ్తున్నట్లు సమాచారం అందడంతో లతీఫ్ 11న తెల్లవారుజామున మహ్మద్ ఉస్మాన్, షేక్ సోఫియన్తో కారులో వేచి ఉన్నాడు. ఇక్బాల్ యాక్టివాపై టోలిచౌకీ వైపు వెళుతుండగా లక్ష్మిగూడ రోడ్డు వద్దకు రాగానే లతీఫ్ కారును బైక్కు అడ్డుపెట్టి ఇక్బాల్ను కిడ్నాప్ చేశాడు. చదవండి: (ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..) బైక్ను షేక్ సోఫియాన్ తీసుకోగా కారులో లతీఫ్, మహ్మద్ ఉస్మాన్ ఇక్బాల్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఈసీ నదిలో పారవేశారు. నది వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఇక్బాల్కు చెందిన ప్రెస్ ఐడీ కార్డు పడిపోయింది. అయితే నదిలో నీరు కొద్దిగా ఉండడంతో మూడు రోజులకే మృతదేహం పైకి తేలింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో దొరికి ప్రెస్ ఐడీ కార్డు ఆధారంగా ముందుకు సాగారు. సీసీ కెమెరాల్లో 11న తెల్లవారుజామున టాటా ఇండికా కారు, యాక్టివా తెల్లవారుజామున రావడం, 25 నిమిషాల్లో తిరిగి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వాటి నంబర్లు లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు ప్రారంభించారు. ఇక్బాల్ మృతిపై అతడి భార్యకు సమాచారం అందించగా తన భర్త మూడు రోజుల క్రితం బయటికి వెళ్లి రాలేదని చెప్పింది. మూసీ నదిలో దొరికిన మృతదేహాన్ని చూసినా ఆనవాళ్లు సరిగ్గా చెప్పకపోడంతో ఆమెను మరింత లోతుగా ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు) -
తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడంటూ టెన్త్ విద్యార్ధిపై దాడి
-
సాగును లాభసాటిగా మార్చాలి
ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. వెంకయ్య శనివారం రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–ఎన్ఏఏఆర్యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. -
రాజేంద్రనగర్లో ఆటోడ్రైవర్ వీరంగం.. మహిళలపై దాడి
Rajendranagar: టో ట్రాలీని నెమ్మదిగా వెళ్లమని సూచించినందుకు డ్రైవర్ ఇద్దరు మహిళలతో పాటు మరో యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో శనివారం ఈ విషయం బయటకు వచ్చింది. హైదర్గూడకు చెందిన చందు తన ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో ఈశ్వర్ థియేటర్ లైన్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఓ ఆటో ట్రాలీలో వస్తూ వారి పక్క నుంచి కట్ కొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న మహిళలు నెమ్మదిగా వెళ్లమని తెలపడంతో ఆటో డ్రైవర్ వాగ్వాదానికి దిగి మొదట చందుపై దాడి చేశాడు. అనంతరం అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు శనివారం వైరల్ కావడంతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
Hyderabad: ఇస్తా సిటీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లాట్ నెంబర్ ఐదు వందల ఒకటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్ మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..) -
రాజేంద్రనగర్లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్పై హిమాయత్సాగర్ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అత్యాచారం అనంతరం తిరిగి బాధిత యువతిని నిందితుడు ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అయితే తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది. దీంతో వెంటనే తల్లి, బాధితురాలుతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై అత్యాచార కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాది పాటు కాపురం.. మోజు తీరాక..) -
యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం..
సాక్షి, మైలార్దేవ్పల్లి (హైదరాబాద్): నిరుపేద యువతులకు డబ్బును ఎరగా చూపుతూ.. గత కొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి మహ్మదీయ కాలనీకి చెందిన షాబానాబేగం(37)ను గత కొంత కాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి
-
లైంగిక దాడి కేసు: ముగ్గురు ఆటో డ్రైవర్ల రిమాండ్
రాజేంద్రనగర్: ఇంటి వద్ద దింపుతామని ఆటోలో తీసుకువెళ్ళి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు బాధితురాలి సెల్ఫోన్, రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. పురానాపూల్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో హైదర్గూడలోని కల్లు కంపౌండ్కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్ళేది. ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదర్గూడ కంపౌండ్కు వచ్చింది. ఇదే సమయంలో కూకట్పల్లి వివేక్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింగ్రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్(31), బాలానగర్కు చెందిన ప్రసాద్(35) లు వచ్చారు. ఈ ముగ్గురూ మహిళతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. తాము కూడా ఆటోలో పురానాపూల్ వైపు వెళ్తున్నామని ఇంటి వద్ద దించేస్తామని నమ్మించారు. అత్తాపూర్ మీదుగా తిరిగి రాజేంద్రనగర్ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు. హిమాయత్సాగర్ లార్డ్స్ కళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి సెల్ఫోన్, మెడలోని రోల్డ్ గోల్డ్ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్లు కంపౌండ్తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్సాగర్ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. -
Hyderabad: రాజేంద్రనగర్లో మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
రాజేంద్రనగర్ లో బాలిక పైకి దూసుకెళ్లిన కారు
-
పెళ్లై 15 నెలలు.. పిల్లలు పుట్టడం లేదని కానిస్టేబుల్..
సాక్షి,రాజేంద్రనగర్: వివాహం జరిగి 15నెలలు గడుస్తున్నా సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేషనల్ పోలీస్ అకాడామీలో వాసు(30) కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వాసుకు 15నెలల కిందట నీలిమతో వివాహం జరిగింది. సంతానం కలగడం లేదని తరుచూ భార్యాభర్తల మధ్య గొడవజరుగుతుంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవయింది. రాత్రి 9గంటల ప్రాంతంలో ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.11గంటల ప్రాంతంలో నీలిమకు మెలుకువ రావడంతో బెర్రంలో చూడగా వాసు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యు కు, చుట్టు పక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా.. టీవీ నటుడిపై కేసు -
ఈ బైక్ వాలా ఎంత పనిచేశాడు...
-
ఈ బైక్ వాలా ఎంత పనిచేశాడు...
సాక్షి, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్ద బైక్ నడిపిస్తున్న వ్యక్తిని తప్పించబోయి రెండు లారీలు ఢీకొన్నాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. వివరాలు.. ఈ సాయంత్రం పీడీఎస్ రైస్ని తరలిస్తున్న ఓ లారీ గాంధీ నగర్ వద్ద యూటర్న్ తీసుకోబోయింది. ఈ నేపథ్యంలో ఓ బైకు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ బైక్పై ఉన్న వ్యక్తిని తప్పించబోయాడు. వాహనాన్ని పక్కకు తిప్పాడు. లారీ కాస్తా ముందు వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. లారీ క్యాబిన్లు నుజ్జనుజ్జయయి డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టోల్ గేట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు యాక్సిడెంట్ దృశ్యాలు చిత్రీకరించాయి. -
గేదె గడ్డి మేసిన వివాదం, సోదరుడిపై హత్యాయత్నం
సాక్షి, రాజేంద్రనగర్: గేదెలు వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేసిన విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్తా హత్యాయత్నానికి దారితీసింది.. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏసీపీ సంజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎం.బాల్రాజ్ అలియాస్ బాలయ్య (38), ఎం.రమేష్(37) వరుసకు సోదరులు. రమేష్కు చెందిన 3 గేదెలు బుధవారం రాత్రి వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేశాయి. ఈ విషయాన్ని బాలయ్య వర్సిటీ అధికారులకు తెలపడంతో రమేష్కు అపరాధరుసుం విధించారు. ఇదేవిషమై గురువారం ఎన్ఐఆర్డీ కమాన్ వద్ద బాల్రాజ్, రమేష్ మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. బాల్రాజ్ తనవెంట తెచ్చుకున్న కొడవలితో రమేష్పై దాడి చేశాడు. స్థానికులు బాల్రాజ్ను నియంత్రించి కొడవలిని లాగివేయడంతో ప్రమాదం తప్పింది.తీవ్రంగా గాయపడ్డ రమేష్ను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాల్రాజ్.. రమేష్పై దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రాజేంద్రనగర్కు చెందిన నారాయణ, నరేష్ ధైర్యంగా ముందుకు వెళ్లి బాల్రాజ్ను అడ్డుకుని గాయపడ్డ రమేష్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్ వారిని అభినందించారు. గతంలో బాల్రాజ్పై హత్యారోపణలు.. కాగా బాల్రాజ్పై గతంలో రెండు హత్యారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో బాల్రాజ్ నిత్యం మద్యం తాగి దౌర్జన్యం చేయడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. సోదరుడిపై దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
రాజేంద్రనగర్లో కోవిడ్ కలకలం
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో గురువారం కరోనా కలకలం సృష్టించింది. ఎస్టీ హాస్టల్తో పాటు ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలుసుకున్న స్థానికులు కలవరానికి గురయ్యారు. ఒకే సారి 26 మందికి కరోనా రావడంతో ఇదే విషయమై చర్చించుకున్నారు. మధ్యాహ్నానికి ఎప్పుడు రద్దీగా ఉండే రాజేంద్రనగర్ చౌరస్తా బోసిపోయి కనిపించింది. విద్యార్థులకు కరోనా సోకిందన్న విషయంతో స్థానిక వ్యాపారస్తులు సైతం మధ్యాహ్నం దుకాణాలను మూసివేశారు. ఇతర హాస్టల్లలో... రాజేంద్రనగర్ ప్రాంతంలో గిరిజన హాస్టల్తో పాటు ఎస్సీ, బీసీ, బాలిక, బాలుర హాస్టల్స్ ఉన్నా యి. ఈ ఐదు హాస్టల్స్లోని విద్యార్థులంతా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యభ్యాసంసం కొనసాగిస్తున్నారు. వైద్య బృందం హాస్టల్స్లో ఉదయం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది అందరికి నెగటీవ్గా వచ్చింది. ఆందోళనలో తల్లిదండ్రులు... రాజేంద్రనగర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 24మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతున్నారు. -
రాజేరేంద్రనగర్ లో చిరుత సంచారం
-
ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే!
నిత్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం వీడటం లేదు. కళ్ల ముందు అనేక అనర్థాలు కంటపడుతున్నా.. చిన్న పిల్లల పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్యం పుణ్యం తెలియని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో బలైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్లో బుధవారం చోటుచేసుకుంది. అయితే అదృష్టం కొద్ది చిన్నారి ప్రాణాలతో బయటి పడింది. రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లిలో ఓ అపార్ట్మెంట్ కింద పిల్లలు సరాదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే రోడ్డు మీద చిన్న పాప ఆడుకోవాడాన్ని కారు డ్రైవర్ గమనించకుండా సడెన్గా అపార్ట్మెంట్ నుంచి కారు పాప మీద నుంచి బయటకు తీసుకెళ్లాడు. అయితే ఈ ఘటనలో అదృషవశాత్తు పాపకు ఎలాంటి హానీ జరగలేదు. కారు వెళ్లిన అనంతరం సరక్షితంగా లేచి నడుచుకుంటూ వెళ్లింది. చదవండి: విషాదం: ఏం కష్టం వచ్చిందో! దీనికి సంబంధించిన దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో గురువారం పోస్టు చేశారు. పిల్లలు ఇంటి సమీపంలో ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు కోరారు. ‘ఏమి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అదృష్టం, దురదృష్టం, ఖర్మ, విధి... అని అనుకుని ఊరుకుండటం, తప్ప ఏమి చేయలేము. వాళ్ళు, వీళ్లు కాదు అందరూ సుకోవాల్సిందే. (డ్రైవర్ & తల్లిదండ్రులు) పిల్లాడికేం తెలుసు. అంత వయసులో తెలుసుకోగలిగే అవకాశమూ లేదే..’ అని ట్విటర్లో షేర్ చేశారు. దీనిని చూసి నెటిజన్లు ఈ సంఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక అని కామెంట్ చేస్తున్నారు. -
బెలూన్ తెరుచుకున్నా దక్కని ప్రాణం
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకొచ్చిన ఓ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన శ్రీనివాస్రావు శనివారం రాత్రి 11.30 గంటలకు బెంజ్ (ఏపీ 39 సీఎస్ 9999) కారులో పుప్పాలగూడ టోల్గేట్ సర్వీస్ రోడ్డు మీదుగా వేగంగా వచ్చాడు. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన నాగేశ్వర్రావు(40) తన కారు(ఐ–20)లో నార్సింగి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో అదుపుతప్పిన శ్రీనివాస్రావు బెంజ్.. నాగేశ్వర్రావు కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బెంజ్ వేగానికి అతడి కారు పల్టీ కొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ ఘటనలో నాగేశ్వర్రావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారులోని బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఆయన బతకలేదు. బెంజ్ కారులోని బెలూన్లన్నీ తెరుచుకోవడంతో శ్రీనివాస్రావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్రావును ఆదివారం సాయంత్రం రిమాండ్కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్రావు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామన్నారు. (బంధువులకు కుళ్లిపోయిన అనాధ శవాలు!) -
హైదరాబాద్లో మళ్లీ చిరుత కలకలం
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగరలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి చిరుత గగన్పహాడ్ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ, పోలీసు అధికారులు.. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఫుట్ ప్రింట్స్ ఆధారంగా అది అడవిలోని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగినట్టుగా గుర్తించారు. దాని ఆచూకీ కనుగోనడానికి.. ఆ పరిసరాల్లో 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ నెల 14న ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే చిరుత సంచరించిన సంగతి తెలిసిందే. దాని ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా చిరుత కదిలికలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 15 రోజులుగా చిరుత అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇంకా దొరకని చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ శివారు మైలార్దేవ్పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి(ఎన్హెచ్ 7) హైవే రోడ్డు పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ లభించలేదు. సమీపంలోని రైల్వే స్టేషన్ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్ అటవీ ప్రాంతం మీదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికారులు స్థానికులను హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా చిరుతపులికి సంబంధించిన అడుగులను అధికారులు గుర్తించారు. కాగా అడుగుల ఆధారంగా చిరుత ఫాంహౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాల ఫీడ్ ఆధారంగా అధికారులు చిరుత ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వలల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికారులు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు) -
52 రకాల విదేశీ ద్రాక్షలు ఒకేచోట..
సాక్షి, రాజేంద్రనగర్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 52 రకాల దేశ, విదేశాలలో పండే ద్రాక్షలు. నేరుగా పంట చేనులోకే వెళ్లి మనకు కావాల్సిన ద్రాక్షలను తెంపుకోవచ్చు. ఈ పంటలన్నీ పూర్తిగా సేంద్రీయ పద్ధతులో పండించినవే. ఇది ఎక్కడో కాదు మన రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపుజీ హార్టికల్చర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలోనే. ఈ నెల 13వ తేదీ నుంచి ద్రాక్షప్రియులకు ఈ సౌకర్యాన్ని పరిశోధన కేంద్రం కల్పిస్తోంది. రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రాన్ని 5 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. వీటిలో ద్రాక్షలపై పరిశోధనలు చేయడంతో పాటు వివిధ రకాల ద్రాక్ష పంటలను పండిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే ద్రాక్షలతో పాటు కొత్త రకాల ద్రాక్షలను ఇక్కడ పండించి రైతులకు చేరవేస్తున్నారు.. అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లోనే లభించే రెడ్ గ్లోబ్, రిజమత్, కట్ట కుర్గన్, ఫ్లెమ్ సీడ్లెస్, ఫెంటాసి సీడ్లెస్, బెంగళూరు బ్లూ, సాద్ సీడ్లెస్ తదితర అనేక రకాల ద్రాక్షలను పండిస్తున్నారు. ప్రస్తుతం 52 రకాల ద్రాక్షలు ఈ కేంద్రంలో లభిస్తున్నాయి. నేరుగా పంట చేనులోనే కావాల్సిన ద్రాక్షలను తీసుకోవచ్చు. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల ఎదురుగా ఉన్న ఈ ద్రాక్ష తోటలో ప్రతి సంవత్సరం నెలపాటు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం 96185 37654, 79818 99114లలో ద్రాక్షప్రియులు సంప్రదించవచ్చు. -
కారుకు గెలుపు ప్రతిష్టాత్మకం
సాక్షి,మేడ్చల్ : పుర ఎన్నికల పోరు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పారీ్టకి ప్రతిష్టాత్మకంగా మారింది. రెబల్స్ గుబులు ఒక వైపు.. సొంత పారీ్టలో వేరు కుంపట్లు మరొక వైపు.. నేతల మద్య శిఖ పట్లు ఇంకొక వైపు ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేమి వెరసి.. కారు పార్టీ జోరుకు బ్రేకులు వేస్తున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్, బడంగ్పేట మీర్పేట్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, పెద్దఅంబర్పేట్, ఇబ్రహింపట్నం, నార్సింగ్, శంషాబాద్, తుర్కయాంజాల్, తుక్కుగూడ, జల్పల్లి, మణికొండ, ఆదిభట్ల అమనగల్లు, షాద్నగర్ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను పోల్చుకుంటే ఇతర పార్టీల ఓట్లు పెరిగాయి. ఇటీవల మన నగరం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపట్టడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న పుర ఎన్నికల పోరులో పట్టణ ప్రాంత ఓటర్లు అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నారా? లేదా వ్యతిరేకంగా నిలుస్తున్నారా ? అన్న విషయం సస్పెన్స్గా మారింది. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూముకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో 210 వార్డులున్నాయి. ఇందులో నాలుగు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో పురపోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సు«దీర్రెడ్డితో ఉన్న విభేదాలు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాలపై ప్రత్యక్షంగా మిగతా వాటిపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు రెబల్స్ గుబులు .. బోడుప్పల్లో 11 చోట్ల జవహర్నగర్లో 10, పీర్జాదిగూడలో ఏనమిది, నాగారంలో ఐదు, తూముకుంటలో ఏనమిది, ఘట్కేసర్లో ఏడు, మేడ్చల్లో 20, గండ్లపోచంపల్లిలో ఒక చోట రెబల్స్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మోజారిటీ పరిశీలిస్తే కొంత మేరలో పడిపోయింది. దీంతో పుర పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్ మున్సిపాలిటీలకు పార్టీ ఇన్చార్జులను నియమించినప్పటికీ అన్నీ తానై మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్ పార్టీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి తనయులు, కూతురు ఎన్నికల బాధ్యతలు మీద వేసుకుని పని చేస్తున్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ రాజశేఖర్రెడ్డి మేడ్చల్తో పాటు మరి కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారు. మహేశ్వరం బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలో 121 వార్డులుండగా, అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నీ తానై చూసుకుంటోంది. ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మద్య అధిపత్య పోరు కారణంగా మీర్õపెట్లో 8 డివిజన్లు, తుక్కగూడలో నాలుగు వార్డుల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. జల్పల్లిలో ఎంఐఎం 24 చోట్ల పోటీ చేస్తున్నది. గతంలో ఈ మున్సిపాలిటీ నాలుగు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పడు ఎంఐఎం 16 ఎంపీటీసీలను గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం, కాంగ్రెస్లను ఎదుర్కోవడం ద్వారా టీఆర్ఎస్కు పట్టం గట్టడంతో పాటు మిగతా పురపాలక సంఘాల్లో గులాబీ జెండాను ఎగుర వేయడం లక్ష్యంగా మంత్రి సబిత ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కంజాల్ మున్సిపాలిటీల్లో 87 వార్డులుండగా, రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 85 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం కోసం అన్నీ తానై స్థానిక ఎమ్మెల్యే మంచికంటి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ మోజారిటీ బాగా తగ్గింది. పెద్దఅంబర్పేట్లో ఒక వార్డుతో పాటు మిగతా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో రెబల్స్ ఉన్నారు. పైగా నాయకుల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తున్నది. దీన్ని అధిగమించడం ద్వారా అభ్యర్థుల గెలుపు తథ్యంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఎన్నికల బాధ్యతలను మీద వేసుకుని పని చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్, కొంపెల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో 79 వార్డులుండగా, ఇందులో రెండు వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ అన్నీ తానై ఎన్నికల బాధ్యతలను మీద వేసుకున్న స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న అధిపత్య పోరు దుండిగల్ మున్సిపాలిటీపై ప్రభావం చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. దుండిగల్లో నాలుగు చోట్ల టీఆర్ఎస్కు రెబల్స్ బెడద ఉంది. మూడు పురపాలక సంఘాలకు పార్టీ ఇన్చార్జులను అధిష్టానం నియమించినప్పటికీ, అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్తో పాటు శంషాబాద్, మణికొండ, నార్సింగ్, మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 85 వార్డులున్నాయి. టీఆర్ఎస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్కు సొంత పార్టీలోని నేతల మద్య ఉన్న అధిపత్య పోరు ఎటువైపు దారి తీస్తుందోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనికి తోడు బండ్లగూడలో రెండు చోట్ల రెబల్స్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కూడా తిరుగుబాటు దారులున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్ అన్నీ తానై పుర ఎన్నికల పోరులో నిమగ్నమై పని చేస్తున్నారు. -
అతివేగం; ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో మితిమీరిని వేగంతో వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బుధవారం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కారు బస్ డిపో ఎదురుగా ఉన్న డివైర్పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
షాపులకు క్యూఆర్...ఇది కొత్తది యార్!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలోని జనప్రియ ప్రాంతంలో క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా కమర్షియల్ ప్రాంతాల్లోనూ క్యూఆర్ కోడ్ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉప కమిషనర్ ప్రదీప్కుమార్, శానిటరీ సూపర్వైజర్లు ఆంజనేయులు, కృష్ణ కిశోర్ ఆధ్వర్యంలో హైదర్గూడ, అత్తాపూర్లోని దుకాణాలను సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రతి దుకాణానికి ఒక కోడ్ను కేటాయిస్తున్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది తమ స్మార్ట్ఫోన్ ద్వారా కోడ్ను స్కాన్ చేసి చెత్తను సేకరించనున్నారు. అదేవిధంగా కోడ్ ఆధారంగా సిబ్బంది పని తీరును సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నా రు. హైదర్గూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు చెత్తను రోడ్లపై వేయకుండా ఏర్పాట్లు చేశారు. తడి, పొడి చెత్త కోసం డబ్బాలను సైతం అందజేశారు. క్యూఆర్ కోడ్తో మరింత పకడడడడ్బందీగా ప్రతి దుకాణం నుంచి చెత్తను సేకరించడం సులభతరం కానుంది. – రాజేంద్రనగర్ హైదర్గూడ అపార్ట్మెంట్లో తొలిసారిగా గత మార్చి 28న జీహెచ్ఎంసీ యంత్రాంగం 1,200 కుటుంబాలు ఉంటున్న హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్లో దేశంలోనే తొలిసారి క్యూఆర్ కోడ్తో చెత్త సేకరణను ప్రారంభించింది. మొదట కొంతమేర ఇబ్బందులు ఎదురైనా అనంతరం పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వ్యాపార ప్రాంతాల్లో అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల నుంచీ క్యూఆర్ కోడ్తో చెత్త సేకరిస్తున్నారు. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు.. అత్తాపూర్, హైదర్గూడ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. ఇవి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అతిపెద్ద వ్యాపార కేంద్రాలు. దీంతో ఈ ప్రాంతంలో నూరు శాతం చెత్తను సేకరించేందుకు అధికారులు క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు త్వరలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ను ఆహ్వానించేందుకు అధికారులు నిర్ణయించారు. -
తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతోందని..
రాజేంద్రనగర్: సెల్ఫోన్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. తరచూ ఫోన్లో మాట్లాడుతోందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను అంతమొందించాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం విఠలాపురం ప్రాంతానికి చెందిన శాంతయ్య, సున్నాల శ్రీదేవి (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవలే సన్సిటీ ప్రాంతంలోని ఓ ఇంటిలో శాంతయ్య వాచ్మెన్గా పనిలోకి చేరగా.. శ్రీదేవి ఆ ఇంటి పనులు చూసుకుంటోంది. అయితే, శ్రీదేవి తరచుగా సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో శాంతయ్య ఆమెను మందలించాడు. ఇదే విషయమై సోమవారం ఉదయం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేని శాంతయ్య, శ్రీదేవి తలపై రోకలి బండతో బలంగా బాదాడు. దీంతో శ్రీదేవి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాచిపోయిన పులిహోర.. 51 వేలు ఫైన్
రాజేంద్రనగర్: పాచిపోయిన పులిహోరను వినియోగదారులకు అందించిన ఓ హోటల్కు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 51 వేల జరిమానాను విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వహకులు శుక్రవారం పాడైపోయిన పులిహోరాను వినియోగదారులకు అందించారు. ఈ విషయమై వినియోగదారులు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రమేశ్కు ఫిర్యాదు చేయడంతో హోటల్ తనిఖీలు నిర్వహించారు. పాచిపోయిన పులిహోరాతో పాటు ఇతర పదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వహకుడికి రూ. 51 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించామ న్నారు. మున్సిపల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం ఉడిపి హోటల్కు రావడంతో విషయం వెలుగుచూసిందని తెలిపారు. తనిఖీ చేస్తున్న కార్పొరేషన్ అధికారులు -
కానిస్టేబుల్నంటూ ప్రేమ జంటపై దాడి
సాక్షి, రాజేంద్రనగర్ : పోలీస్ కానిస్టేబుల్ని అంటూ గండిపేట పార్కులో ప్రేమజంటను భయబ్రాంతులకు గురి చేసి ఫొటోలు తీయడంతో పాటు నగదు లాక్కెళ్లిన దుండగుడిపై బాధితుడు నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్(21) విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గండిపేట ప్రాంతానికి తన ప్రేయసితో కలిసి వచ్చాడు. పార్కు వద్ద ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటుండగా సివిల్ డ్రెస్లో వచ్చిన ఓ వ్యక్తి తాను నార్సింగి పోలీస్స్టేషన్ సివిల్ కానిస్టేబుల్ హుస్సేన్గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సాయంత్రం సమయంలో మీకేమి పని అంటూ వారి ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అనంతరం వారి వివరాలను స్వీకరించి భయబ్రాంతులకు గురిచేశాడు. హుస్సేన్ దగ్గర ఉన్న రూ. 6500 నగదు లాక్కొని వెళ్లిపోయాడు. ఈ విషయమై సయ్యద్ హుస్సేన్ నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడిపై కొడవలితో దాడి
అత్తాపూర్: పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని తమ్ముడిపై అన్న కొడవలితో దాడిచేసిన సంఘటన రాజేంద్రనరగ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లిలో అన్నదమ్ములు సామ సుభాష్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు నివసిస్తున్నారు. సుభాష్రెడ్డి వ్యాపారం చేస్తుండగా, చంద్రశేఖర్రెడ్డి లాయర్గా పనిచేస్తున్నాడు. తగ కొంత కాలంగా ఇద్దరికి ఆస్తుల లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో గొడవలు పడి ఒకరిపై ఒకరు రాజేంద్రనగర్ పీఎస్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం వాంబేకాలనీ సమీపంలో నీటి సరఫరా జరిగే పైపులైన్ మరమ్మతుల విషయమై సామ సుభాష్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డిల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సుభాస్రెడ్డి తన వెంట తెచ్చుకున్న గడ్డి కోసే కొడవలితో తమ్ముడు చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తీవ్ర గాయాలకు గురైన చంద్రశేఖర్రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనపై సుభాష్రెడ్డి, ఆయన భార్య, కొడుకు దాడి చేశారని చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభాస్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రాజేంద్రనగర్లో గంజాయి మూఠా గుట్టురట్టు
-
డ్రగ్స్ ఓవర్ డోస్.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడంతో పండు అనే యువకుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్లోని శివరాంపల్లికి చెందిన శివ కుమార్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పండు(19) కొత్తపేట్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యలో మానేసి తన తండ్రికి చెందిన వాటర్ ప్లాంట్లో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా గంజాయి, డ్రగ్స్కు అలవాటైన పండు, శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకుని, ఓవర్ డోస్ అవ్వడంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫంక్షన్ హాల్లో దారుణం : లిఫ్ట్లో కాలు ఇరికి..
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్లో జరిగిన ఓ వివాహవేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలో జాగీర్ రాధా నగర్లోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో లిఫ్ట్లో కాలు ఇరికి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఆడుకుంటూ బాలుడి మృతి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆడుకుంటూ మృతి చెందాడు. జనప్రియ అపార్ట్మెంట్లోని పార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్ శర్మ సిమెంట్ బెంచ్పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు.. సిమెంట్ బెంచ్ ఆ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు అపార్ట్మెంట్వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఆడుకుంటూ చిన్నారి మృతి.. వీడియో వైరల్
-
చెరువులో నిర్మాణాలు!
రాజేంద్రనగర్ : దశాబ్దాల కాలంపాటు సాగు, తాగునీరందించిన చెరువు ఇప్పుడు కబ్జాలతో కుచించుకుపోతోంది. చెరువులోకి వరదనీరు రాకుండా కాలువలను దారి మళ్లించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పీరం చెరువు ప్రాంతంలోని సర్వేనెంబర్ 27లో 4.25 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుతో పాటు ఎఫ్టీఎల్ను నిర్థారించి హద్దులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో కళకళలాడేది. చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు ఈ నీరే ఉపయోగపడేది. ఈ చెరువులోనే వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరేది. సంవత్సరం పొడవునా నీటితో వెంకన్నకుంట కళకళలాడేది. చుట్టుపక్కల వారు తాగేందుకు దీని నీటిని ఉపయోగించేవారు. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి నిర్మాణాలు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో భూమికి విలువ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. ఈ చెరువులోకి కొందరు వర్షపు నీరు రాకుండా కాలువలను మూసివేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా చేసిన సమయంలో చెరువుకు వచ్చే కాలువలు, తూములను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరదనీరు చేరడం లేదు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో నిర్మాణాలను ప్రారంభించారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ.. ఎఫ్టీఎల్ భూముల్లో మొదటగా నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో ఏకంగా చెరువు స్థలంలోనే నిర్మాణాలు వెలిశాయి. కొన్ని రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో అదనుగా భావించి జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసినా పని ఒత్తిడిలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ప్రçహారీ నిర్మాణాలను చేపడుతున్నారు. స్థానికంగా ఈ చెరువును ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. రూ.3 లక్షలతో చెరువు కట్ట ఎత్తును పెంచారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను నిర్వహించాల్సి ఉండగా.. నిర్మాణాలు జరుగుతుండడంతో ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కబ్జాదారులకు పనులు మరింత సులభం అయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
హైదరాబాద్లో బట్టబయలైన పరిటాల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. నగరంలోని అరాంఘర్ చౌరస్తా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పరిటాల వర్గీయుడి నుంచి పోలీసులు 24లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సునీత ముఖ్య అనుచరుడు రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేయసికి పెళ్లయిందని యువకుడి బలవన్మరణం
రాజేంద్రనగర్: ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్పల్లి ప్రాంతానికి చెందిన సాయి(24) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సాయి ప్రేమించిన యువతికి ఆదివారం వివాహం జరిగిందని అప్పటి నుంచి తమ వద్ద విషయాన్ని తెలుపుతూ బాధపడుతున్నాడని స్నేహితులు తెలిపారు. ఇదే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని స్నేహితులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాష్.. హ్యాట్రిక్
రాజేంద్రనగర్: హ్యాట్రిక్ విజయం అందించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలేత్తిన తీర్చుకోలేనని టి.ప్రకాష్గౌడ్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజా సేవ చేసేందుకు ప్రజల్లోకి వచ్చానని అందుకు వారు తనను ఆహ్వానించారన్నారు.ప్రతిసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని వారి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. మహిళలు, యువతీయువకులు అందరు కలిసి తనను గెలిపించారన్నారు. గత రెండుసార్లు ప్రతిపక్షంలో ఉండి విజయం సాధించానని ఇప్పుడు అధికార పక్షంగా మరోసారి గెలిపించారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్చు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు. తనవెంట నిలిచిన నాయకులు, కార్యకర్తలందరికి న్యాయం చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. గత నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో నిర్వహించలేదన్నారు. మరోసారి అవకాశం ఇచ్చారని ఈ ఐదు సంవత్సరాలలో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పతంగికి నియోజకవర్గంలో స్థానం లేదు.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి స్థానం లేదు. మూడు సార్లు పోటీ చేసి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు పన్నిన ప్రజలు మాత్రం ఆదర్శించారన్నారు. మైనార్టీలు మరోసారి నావెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. వారికి అందుబాటులో ఉండి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు. -
చెత్తలో రూ. ఆరు లక్షలట!
రాజేంద్రనగర్: ఇంట్లో చెత్త నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ బదులు, నగదు బ్యాగ్ను ఇంటి యజమాని వాచ్మెన్కు అందించాడు. దాన్ని ఆ వాచ్మెన్ చెత్త సేకరణదారుడికి అందించాడు. అందులో రూ. 6 లక్షలు ఉన్నాయంటూ ఆ యజమాని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చెత్త లారీతో పాటు చెత్తనంతా వెతికినా డబ్బు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీసులు చెత్త సేకరిస్తున్న కార్మికుడితో పాటు వాచ్మెన్ను విచారిస్తున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని రాధాకృష్ణానగర్ ప్రాంతంలో డి.యాదగిరి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తుంటాడు. ఆటోలో సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలిస్తాడు. కాలనీకి చెందిన ఓ అపార్ట్మెంట్లో ఓ యజమాని ఆరు లక్షల నగదును ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. శుక్రవారం ఉదయం చెత్త కోసం వచ్చిన కార్మికుడికి ఇంట్లోని వారు ఆ బ్యాగును కాస్తా చెత్త బ్యాగ్ అనుకొని వాచ్మెన్కు అందజేశారు. వాచ్మెన్ బ్యాగ్ను చెత్త తరలించే వాహనంలో వేశాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నగదు ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించకపోవడంతో ఇంట్లో వెతకగా బ్యాగ్కు బదులు, చెత్త బ్యాగ్ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో వెంటనే ఆ ఇంటి యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. పోలీసులు చెత్త సేకరిస్తున్న యాదగిరి డంపింగ్ యార్డు వద్ద పట్టుకొని తనిఖీ చేశారు. ఆటోతో పాటు అప్పుడే చెత్తను తరలిస్తున్న లారీని పూర్తిగా వెతికారు. అయినా డబ్బు బ్యాగ్ కనిపించలేదు. దీంతో యాదగిరితో పాటు వాన్మెన్ను స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్మికుడిని వేధించడం సరైంది కాదు: రుద్రకుమార్ చెత్త సేకరించే కార్మికుడు యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్టేషన్లో వేధించడం సరైంది కాదని బీఎల్ఎఫ్ నాయకుడు రుద్రకుమార్యాదవ్ అన్నారు. రూ. 6 లక్షల డబ్బును ఎవరైనా చెత్త వేసే ప్రాంతంలో భద్రపరుస్తారా అని ప్రశ్నించారు. కార్మికుడిని వెంటనే వదిలివేయాలన్నారు. -
పబ్లిక్ మేనిఫెస్టో రాజేంద్ర నగర్ నియోజకవర్గం
-
రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు
హైదరాబాద్: హైదర్ గూడా పరిధి నలందానగర్లోని ఓ ఇంట్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాగేశ్వరరావు అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారంతో పాటు రెండు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి వెనుక డోర్ పగలగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి సభ్యులు ఓ శుభకార్యానికి బయలుదేరిన కొద్ది సేపటికే దొంగలు తమ చేతులకు పనిచెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. -
అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ క్రైమ్ : రాజేంద్రనగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ అగర్వాల్ ఇంట్లో చోరి చేసి, అతన్ని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పనిచేసే పట్నాకు చెందిన డ్రైవర్.. ఈ దోపిడీకి ప్లాన్ చేసి తన గ్యాంగ్తో ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు. దోపిడీ చేసే క్రమంలో అగర్వాల్ నోటికి ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
అగర్వాల్ హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి లభించింది. అగర్వాల్ దగ్గర పని చేసిన ఆరుగురు డ్రైవర్లలో ఓ డ్రైవరే ఈ హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పట్నాకు పంపించామని పోలీసులు తెలిపారు. గత గురువారం రాత్రి రాజేంద్రనగర్ పరిధి తిరుమలనగర్లోని ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. ఇంటి యాజమాని రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ దాడిలో అగర్వాల్ ప్రాణాలు కోల్పోగా..ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దోపిడీలో డ్రైవర్తో పాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్లో రెచ్చిపోతున్న దోపిడీ దొందలు
-
రాజేంద్రనగర్లో దొంగల బీభత్సం: దంపతులపై దాడి
-
రాజేంద్రనగర్లో దొంగల బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోని దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన రాజేంద్రనగర్లోని తిరుమలనగర్లో గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వివరాలు.. రాజేంద్రప్రసాద్ అగర్వాల్ ఇంట్లో దొంగలు పడ్డారు. అగర్వాల్, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో అగర్వాల్ ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలతో ఆయన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నామని ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదిస్తామని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మిగతా వివరాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను ఆస్తమా వ్యాదిగ్రస్తుడు. -
పనిచేసే ఇంటికే కన్నం వేసిన పనిమనిషి
-
కార్లలో మేకల దొంగతనం
రాజేంద్రనగర్ : ఒకటి కాదు... రెండు కాదు... 11 నెలలుగా 30 మేకలను ఎత్తుకెళ్లారు. కారుల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనాల విషయం తెలిసి దొంగలను పట్టుకునేందుకు స్థానిక యువకలు ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు సరికదా.. ఆ కారును వారి మీదకే దూకించి భయపెట్టేవారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్న చందంగా ఎట్టకేలకు మేకల దొంగలు పోలీసులకు చిక్కారు. కారు పంక్చర్ కావడంతో స్థానిక యువకులు గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమావతిపేట ప్రాంతంలో స్థానిక కురుమ, యాదవులు మేకలను పెంచుతున్నారు. వీటిని తమ ఇళ్ల ముందు ఉన్న పాకలతో పాటు బస్తీలోని ఖాళీ స్థలంలో రాత్రి సమయాలలో గడ్డి వేసి ఉంచేవారు. గత 11 నెలలుగా రాత్రి సమయంలో వాహనాలలో వచ్చిన దొంగలు వీటిని ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఇలా 30 మేకలను అపహరించారు. ఈ విషయమై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. స్థానిక యువకులు రాత్రి సమయంలో బస్తీలలో కాపు కాసినా వారిపైకే వాహనాలను తీసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేసి తప్పించుకునే వారు. వాహనాలకు నెంబర్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వారిని పట్టుకోవడంలో స్థానిక యువకులు విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక యువకులు ప్రేమావతిపేట శివాలయం వద్ద కాపు కాశారు. కారులో నలుగురు యువకులు ప్రేమావతిపేట ప్రాంతానికి వచ్చారు. ఓ వీధిలో నిద్రిస్తున్న మూడు మేకలను రెప్పపాటులో కారులోకి వేసుకున్నారు. మేకల శబ్ధానికి అప్రమత్తమైన యువకులు కారు వద్దకు రాగానే రివర్స్లో వారిపైకే వేగంగా పోనిచ్చారు. అప్రమత్తమైన యువకులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో వాహనం ముందు టైర్ పంక్చరైంది. అలాగే ముందుకు వేగంగా పోనిచ్చారు. రోడ్డుపై కొద్దిదూరం వెంబడించినా యువకులకు కారు చిక్కలేదు. విషయాన్ని పెద్దలకు చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాహనం పంక్చర్ కావడంతో దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో డాంబర్ రోడ్డు (బీటీ రోడ్డు)ను రాసుకుంటూ వెళ్లింది. యూనివర్సిటీ రోడ్డు నుంచి బుద్వేల్ మీదుగా స్థానిక చర్చి ప్రాంతంలో పార్కు చేసి ఉంది. దీంతో యువకులు వాహనాన్ని గుర్తించి దానిపై స్థానికులను ఆరా తీశారు. స్థానిక యువకులే దొంగతనాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనంతో పాటు నలుగురు యువకులు, ఒక మేకను స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత 11 నెలల కాలంగా 30 మేకలను దొంగలించింది వీరేనా, వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ యువకులంతా 24 సంవత్సరాలలోపే ఉండడం గమనార్హం. -
అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్కు మహిళల దేహశుద్ది
-
చెక్కుల ద్వారానే పంట సాయం
-
అగ్రి వర్సిటీ తెలంగాణకే గర్వకారణం
రాజేంద్రనగర్ : వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలు, విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదర్శంగా నిలుస్తుందని, వెనుకబడిన తరగతుల సంక్షేమంపై ఏర్పడిన లెజిస్లేచర్ కమిటీ అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ఉద్యోగుల నియామకం, అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించడంపై సభా సంఘం చైర్మన్ వి.గంగాధర్గౌడ్ నేతృత్వంలోని కమిటీ బుధవారం విశ్వవిద్యాలయంలో పర్యటించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిటీ చైర్మన్ వి.గంగాధర్గౌడ్, కమిటీ సభ్యులు ఆర్.కృష్ణయ్య, టి.ప్రకాష్గౌడ్, సి.విఠల్రెడ్డి, వీసీ వి.ప్రవీణ్రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్కుమార్ వివ రాలను మీడియాకు వెల్లడించారు. విశ్వ విద్యాలయంలో 738 ప్రభుత్వ అను మతి పొందిన టీచింగ్ పోస్టులు ఉంటే అందులో 361 మంది ఉద్యోగంలో ఉన్నారని, వారిలో 132 మంది వెనుకబడిన తరగతుల ఉద్యోగులు(36.5 శాతం) ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే 1437 నాన్ టీచింగ్ పోస్టులకుగాను 918 మంది సర్వీసులో ఉంటే వారిలో 399 మంది(43.4 శాతం) వెనుకబడిన తరగతుల వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 44.35 శాతం మంది, డిప్లొమో కోర్సులలో 63 శాతం మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెనుకబడిన తరగతులకు కేటాయించిన రిజిర్వేషన్ల కంటే అధికంగా ఇవ్వడంపై కమిటీ చైర్మన్ వీసీని అభినందించారు. విశ్వవిద్యాలయం ఏర్పడిన అనతికాలంలోనే దేశంలో 12వ ర్యాంకును సాధించడమే కాకుండా దక్షి ణాది రాష్ట్రాలలో 3వ ర్యాంకు పొందడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఏడు పంటలకు సంబంధించి 13 రకాల నూతన వంగడాలను విడుదల చేసి రైతులకు ఎంతో సేవ చేస్తుందన్నారు. విదేశాలలో వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెనుకబడిన తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలని కోరా రు. విశ్వవిద్యాలయంలోని బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం బీసీ సెల్ను కూ డా ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశ్వవిద్యాలయంలోని డిగ్రీ సీట్లు పెంచడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీత కార్మికులను దృష్టిలో ఉంచుకుని అధిక దిగుబడినిచ్చే ఈత చెట్ల రకాలను రూపొందించాలన్నారు. అంతకుముందు బోధన, బోధనేతర, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కమిటీ విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వీసీతోపాటు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు గంగాధర్గౌడ్ తెలిపారు. -
’పండుగ’ చేసుకున్న దొంగలు
-
దొంగలుంటారు జాగ్రత్త అని చెప్పి..
రంగారెడ్డి: బంగారు నగలు వేసుకొని బయటకు వెళ్తున్నారు.. జాగ్రత్తమ్మా అసలే రోజులు బాగాలేవు.. దొంగలుంటారు జాగ్రత్తా అని చెప్పి మహిళతో మాటలు కలిపి దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసులాక్కెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీలో ఆటో దిగి ఇంటికి వెళ్తున్న విజయ అనే మహిళను వెంబడించిన దుండగులు ఆమెతో దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్పి మరీ ఆమె మెడలోని బంగారు నగలు లాక్కెళ్లారు. పల్సర్ బైక్ పై వచ్చినట్లు గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. -
సీనియర్ అసిస్టెంట్ ఖాతాలో కోట్ల సొమ్ము
హైదరాబాద్: ఉద్యోగుల సొమ్మును తన ఖాతాలో వేసుకుని అక్రమాలకు పాల్పడిన రాజేంద్రనగర్ ఎస్టాబ్లిష్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఉద్యోగులకు చెందిన జీతాల డబ్బు రూ.1.3 కోట్లను సీనియర్ అసిస్టెంట్ అరవిందరాజు తన ఖాతాలో వేసుకుని భారీ అక్రమాలకు తెరలేపాడు. ఉద్యోగుల పీఎఫ్, ఎల్ఐసీ కట్టకుండా గత కొన్ని నెలలుగా మోసాలకు పాల్పుడుతున్నాడు. డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసులకు భయపడ్డ అరవిందరాజు రెండ్రోజుల క్రితం కోర్టులో లొంగిపోయాడు. మోసపోయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుడి వద్ద ఉన్న నగదు వివరాలపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తల మొండెం వేర్వేరుగా...
రాజేంద్రనగర్ : మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీ డ్రైనేజీ పైపులైన్ నుంచి కుల్లిపోయిన శవం ఒకటి కోట్టుకువచ్చింది. దీంతో స్థానికులు మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మూడు వారాల క్రితమే చనిపోయి ఉండవచ్చని బావిస్తున్నారు. మృతుని తల, మోండం రెండు భాగాలుగా విడిపోయింది. పైపులైన్ నుంచి 10 మీటర్ల దూరంలో తల పుర్రె ఉండగా మోండం కింది భాగం కుల్లిపోయిన స్థితిలో పైపు నుంచి బయటకు వెళ్ళింది. పై భాగం పూర్తిగా కుల్లిపోయి ఆనవాలు లేకుండా మారింది. పంచనామా నిర్వహించిన ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు వారాల కిత్రమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని ఏదైనా ప్రాంతంలో డ్రైనేజీలో వేయడంతో కోట్టుకు వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాలలో మిస్సింగ్ కేసుల విషయమై పరిశీలించనున్నట్లు తెలిపారు. మృతదేహం మగవారిదా, ఆడవారిదా అన్నది గుర్తించలేకపోతున్నామాన్నరు. పోరెన్సీ ల్యాబ్కు పంపించి పూర్తి వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. కాగా ఎక్కడో హత్య చేసి ఈ ప్రాంతంలోని డ్రైనేజీలో వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులైన్ గూండా శవం దొరికిందని తెలియడంతో స్థానికుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం
-
అగ్నిప్రమాదం: ఆరుగురు సజీవదహనం
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అత్తాపూర్లోని ఏవీ-1 కూలర్ల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన.. సద్ధాం, సాధు, ఇర్ఫాన్ ఖాన్, ఆయుబ్ ఖాన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసీపీ గంగిరెడ్డి పరిశీలించారు. -
అత్తాపూర్లో సెల్టవర్కు మంటలు!
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గృహసముదాయాల్లో ఓ అపార్ట్మెంట్పై ఉన్న సెల్టవర్ జనరేటర్లో ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మాయి. సెల్టవర్కు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున ఎగిశాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కారుతో మైనర్ల బీభత్సం..
-
కారుతో మైనర్ల బీభత్సం..
హైదరాబాద్: రాజేంద్రనగర్ రోడ్లపై మైనర్లు ర్యాష్ డ్రైవింగ్తో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి కారుతో రొడ్డెక్కారు. తమ ఇష్టం వచ్చినట్లు కారు నడపడంతో వాహనంలో ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మైనర్లు వెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్నారు. ఓ అబ్బాయి సహా ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్
రాజేంద్రనగర్: వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్ద పోలీసులమని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బహదూర్పురాకు చెందిన మహ్మద్ ఖాలేద్, మహ్మద్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతోపాటు వారి నుంచి ఇష్టమొచ్చినంత వసూళ్లకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అదే సమయంలో వారి వద్ద నుంచి రూ.8వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించారు. -
జన పథం - రాజేంద్రనగర్ ప్రభుత్వ బాలుర హాస్టల్
-
ఉత్సాహంగా సదర్
రాజేంద్రనగర్: ప్రేమావతిపేట శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ సలహాదారులు మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు. వీటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలలో ప్రతిభ చూపిన దున్న పోతుల యజమానులకు లక్ష్మణ్ బహుమతులను అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాలమూరు జానపద కళాకారులు ఆటాపాట ఆకట్టుకున్నాయి. మైలార్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి, అనంతయ్య యాదవ్, నర్సింగ్ యాదవ్, బండి ప్రతాప్రెడ్డి, శ్రీధర్, మల్లారెడ్డి, కొమరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.