
ఘటనాస్థలంలో అగర్వాల్ బంధువులు
హైదరాబాద్: రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి లభించింది. అగర్వాల్ దగ్గర పని చేసిన ఆరుగురు డ్రైవర్లలో ఓ డ్రైవరే ఈ హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పట్నాకు పంపించామని పోలీసులు తెలిపారు. గత గురువారం రాత్రి రాజేంద్రనగర్ పరిధి తిరుమలనగర్లోని ఓ ఇంట్లో దోపిడీ జరిగింది.
ఇంటి యాజమాని రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ దాడిలో అగర్వాల్ ప్రాణాలు కోల్పోగా..ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దోపిడీలో డ్రైవర్తో పాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment