agarwal
-
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణ పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మూడో పసిడి పతకం చేరింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో బుధవారం జరిగిన మహిళల ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది. ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. మంగళవారం జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది. -
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
వృత్తి అగర్వాల్కు స్వర్ణం
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది. వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది. -
ప్రభుత్వ లాంఛనాలతో నేడు అగర్వాల్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/సంతోష్నగర్: అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్, దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. గురువారం కన్ను మూసిన అగర్వాల్ అంత్యక్రియలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక క్షిపణి తయారీ కార్యక్రమంలో డాక్టర్ అరుణాచలం, డాక్టర్ అబ్దుల్ కలాంతో కలసి అగర్వాల్ పనిచేశారు. అగర్వాల్ హైదరాబాద్లోనే నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. ఇదిలా ఉండగా డీఆర్డీఓ హైదరాబాద్ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ ఆర్అండ్డీలో ఉద్యోగులు శుక్రవారం అగర్వాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ అండ్ ఎస్టేట్ మేనే జర్ షేక్ గౌస్ మోహినుద్దీన్ పాల్గొన్నారు. -
‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ (84) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్తాన్లోని జైపూర్లో జన్మించిన రామ్ నరైన్.. 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్లో చేరారు. ఆ మిషన్కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసి.. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్గా పిలుస్తారు. రామ్ నరైన్ చేసిన సేవలకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్నగర్లోని నివాసం నుంచి రామ్ నరైన్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని.. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.అగ్ని క్షిపణులకు ఆద్యుడు: డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్రెడ్డిఅగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలలో రామ్ నరైన్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్ పాడ్స్ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారని చెప్పారు. రామ్ కృషి వల్లే ఈరోజు భారతదేశం రక్షణరంగంలో చాలా ముందుందన్నారు. రామ్ నరైన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. -
కొత్త పన్ను విధానంలోనే 66% రిటర్నులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
నూతన విధానమే ఎంపిక
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. -
Rashi Agarwal: కళను 'రాశి' పోస్తోంది..!
ఒక ఠావు పేపర్ తయారు కావాలంటే పది లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. రాసుకోవడానికి ఒక రీము పేపర్ సిద్ధం అవ్వాలంటే పాతికేళ్లు పెరిగిన చెట్టు కొమ్మలను సమూలంగా నరకాలి. చెట్టును నరక్కుండా, నీటిని వృథా చేయకుండా ఒక డైరీ తయారయితే? అంతకంటే ఇంకేం కావాలి? ఇంతే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వృథాను హరాయించుకోవడానికి భూమాత పడే యాతన కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి తెర తీసింది సూరత్లో ఓ ఆర్కిటెక్ట్. స్టేషనరీ వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్ని కలగలుపుతూ చేసిన ప్రయోగమే రుహానీ రంగ్. ఆ ప్రయోగం వెనుక దాగిన నేపథ్యాన్ని వివరించింది రాశి అగర్వాల్. ఆమె మదిలో వెలిగిన ఈ ఆలోచన తొమ్మిది వేల కిలోల పత్తికి పుస్తక రూపాన్నిచ్చింది.మనదేశంలో కళ ఉంది!‘‘నేను ఆర్కిటెక్చర్ ఫైనలియర్లో ఉన్నప్పుడు మన సంప్రదాయ నిర్మాణాలు, కళలు, చేతివృత్తుల అధ్యయనం కోసం విస్తృతంగా పర్యటించాను. ఢిల్లీ నుంచి జైపూర్, అహ్మదాబాద్, కచ్, పాండిచ్చేరి నుంచి పూనా వరకు పరిశీలిస్తే మనదేశంలో రకరకాల కళలు, కళా నైపుణ్యాలున్న పని వాళ్లున్నారని తెలిసింది. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదికలు తగినంతగా లేవు.అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి, నా వృత్తిలో ఇంటీరియర్ డిజైనింగ్కు దోహదం చేసే విధంగా ఒక ప్రయోగం చేశాను. అది విజయవంతమైంది. రకరకాల కళలను ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రుహానీ రంగ్’ పేరుతో ఆర్ట్ స్టార్టప్ మొదలు పెట్టాను. ప్లానర్ బుక్ కవర్ పేజీ మీద మధుబని ఆర్ట్ ఉంటే ఇంట్లో అందమైన షో పీస్ ఉన్నట్లే. ప్లానర్ బుక్ని కార్నర్ స్టాండ్లో అందంగా అమరిస్తే డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హస్త కళలను పునరుద్ధరించగలుగుతున్నాను. రుహానీ రంగ్ను ఐదు వేల రూపాయలతో మొదలు పెట్టాను. నాతో కలిసి 50 మంది కళాకారులు, 40 మంది ఇతర ఉద్యోగులు పని చేస్తున్నారు. వస్త్రాలను తయారు చేసే భారీ పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు వస్తుంటాయి. ప్రతి బేలు లోనూ మెషీన్లో అమరికకు తగినట్లు ఉపయోగించగా మిగిలిన పత్తి వృథా అవుతూ ఉంటుంది.అది భూమిలో కలిసి పోవాల్సిందే తప్ప మరో పనికి ఉపయోగించేవారు కాదు. ఎందుకూ పనికి రాదని వదిలేస్తున్న ఆ పత్తే నా కుటీర పరిశ్రమకు ముడిసరుకు. నాకు కోవిడ్ సమయం కూడా మంచే చేసింది. ఆ టైమ్లో పెద్ద చిన్న పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. హస్తకళాకారులు పని లేక ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కొక్కరిని కలిసి నా ఆలోచన చెప్తుంటే వాళ్లు ఉత్సాహంగా నాకు మరికొన్ని ఐడియాలు చెప్తూ తమ అనుభవాన్ని జోడించారు.అలా 2020లో మొదలు పెట్టిన నా కుటీర పరిశ్రమ ఇంత వరకు హ్యాండ్ మేడ్ పేపర్తో ప్లానర్స్, క్యాలెండర్లు, నోట్బుక్స్, జర్నల్స్, స్కెచ్ బుక్స్ వంటి 15 వేల ఉత్పత్తులకు రూపమిచ్చింది. వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే నలభై వేల ఫాలోవర్స్ను తెచ్చి పెట్టింది. ఆర్ట్ పీస్ కేవలం కళాభిరుచి, కళారాధన కోసమే కాదు. అది మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. అప్పుడే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని వివరించింది రాశి అగర్వాల్.ఇవి చదవండి: పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు! -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్వాజ్లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్మెంట్లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పర్యావరణంపై యంగ్ టాలెంటెడ్ వుమెన్ వారియర్గా.. 'ఈష్న అగర్వాల్'
"పర్యావరణ ప్రేమికురాలైన ఈష్న అగర్వాల్ డాక్యుమెంటరీ 'శాలరీ' దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్ 28)లో ప్రదర్శించబడింది. పర్యావరణంపై ఉప్పు పరిశ్రమ చూపుతున్న ప్రభావం, ఉప్పును పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకొని ఈష్న అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రపంచ ప్రతి నిధుల నుంచి ప్రశంసలు లభించాయి." 'కాప్ 28లో నా డాక్యుమెంటరీని ప్రదర్శించడం నాకు మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న ఎంతో మంది యువతీ, యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. చర్చను రేకెత్తించే, మార్పును ప్రేరే పించే, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి యువతకు ఉంది. వాతావరణ మార్పును కేవలం ఒక సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశంగా భావిస్తాను. విభేదాలకు అతీతంగా అందరికీ ఒకే భూమి పేరిట ఐక్యత రాగం ఆలపించడానికి ఇది మంచి తరుణం' అంటుంది అగర్వాల్. పర్యావరణ కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆగర్వాల్కు హిందు స్థానీ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రతిభ చూపుతుంది. తైక్వాండోలో రెడ్బెల్ట్ సాధించింది. మోటివేషనల్ స్సీకర్గా కూడా రానిస్తోంది. వ్యక్తిత్వ వికాసం నుంచి పర్యావరణ సంక్షోభం వరకు ఎన్నో అంశాలపై ప్రసంగాలు చేసింది. ఇవి చదవండి: ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్తో రెడీగా ఉన్నట్లే కదా! -
ఏపీ నుంచే నేరుగా విదేశాలకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్లో ‘ఆంధ్రప్రదేశ్–విమానయానం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై లవ్ అగర్వాల్ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్ అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేటు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా సదుపాయాల్ని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే సాధ్యం విమానయానం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నప్పుడు.. ఆ సౌకర్యాలు ఏపీకి ఎందుకు కల్పించలేకపోతున్నారని ఎయిర్పోర్టు డైరెక్టర్లను అగర్వాల్ ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణాల మధ్య, రాష్ట్ర పట్టణాలకు దేశంలోని ఇతర పట్టణాలతో కనెక్టివిటీని పెంచేందుకు తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా విశాఖ నుండి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, సమీప నగరాలైన భువనేశ్వర్, కలకత్తాలకు సర్వీసులు అవసరమన్నారు. వీటితో పాటు థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలకు విమాన సర్వీసులను నడపాల్సిన అవసరం ఉందని వివరించారు. సుమారు రెండు కోట్ల మంది తమ విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం విమానాశ్రయంపై ఆదారపడుతున్నారని చెప్పారు. మరోపక్క తిరుమలకు ప్రతిరోజూ వచ్చే లక్ష మంది భక్తులకు విమాన సర్వీసును అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. 3 కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే అని వాణిజ్య శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్ తెలిపారు. దేశంలో రెండవ పొడవైన సముద్ర తీర ప్రాంతం గల ఏపీకి విస్తృత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా నుండి ప్రజలు అధిక సంఖ్యలో వారణాసికి వెళుతుంటారని, వారి సౌకర్యార్థం వారణాసికి విమాన సర్వీసులను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. -
బికనీర్వాలా చైర్మన్ అగర్వాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: స్వీట్స్, స్నాక్స్ బ్రాండ్ బికనీర్వాలా చైర్మన్ కేదార్నాథ్ అగర్వాల్ (86) సోమవారం కన్నుమూశారు. ‘కాకాజీ’ అంటూ అంతా ఆప్యాయంగా పిల్చుకునే అగర్వాల్ మరణం తమకు తీరని లోటని సంస్థ డైరెక్టరు, ఆయన కుమారుడు రాధే మోహన్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు రసగుల్లాలు, భుజియా వంటి తినుబండారాలను విక్రయించిన అగర్వాల్.. అంచెలంచెలుగా బికనీర్వాలాతో దేశ, విదేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారత్తో పాటు అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాల్లో 60 పైచిలుకు అవుట్లెట్స్ ఉన్నాయి. -
వృత్తి అగర్వాల్కు ఐదో పతకం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రీడల్లో శుక్రవారం ఆమె ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. గుజరాత్లో జరిగిన గత జాతీయ క్రీడల్లో వృత్తి మూడు రజతాలు, ఒక కాంస్యంతో నాలుగు పతకాలు సాధించింది. ఈసారి ఆమె మూడు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఫైనల్లో రష్మిక–శివాని జోడీ జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ ఈవెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రష్మిక –శివాని ద్వయం 6–4, 6–7 (5/7), 10–5తో షర్మదా బాలూ–సోహా సాదిక్ (కర్ణాటక) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
వ్రితి అగర్వాల్కు కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్లో ఉంది. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్గా అవతరించారు. -
ఫిట్టా.. ఫట్టా
ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయ నేత గెలవడం అంటే...తనకు ఓటేసిన లక్షల మంది ప్రజల ఆశల్ని మోయడం. అంతటి బరువు బాధ్యతల్ని మోసే నేత ఆరోగ్యంగా ఉండాలి..అంతకన్నా ముందు ఆ నేత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి...అది వారి హక్కు అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). ఏళ్లనాటి ఈ డిమాండ్ ఇంకా డిమాండ్గానే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతల ఆరోగ్యంపై అవగాహన నిజంగా ప్రజల హక్కుగానే భావించాలా? అయితే ఎందుకు? 2015లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు తమ ఆర్థిక పరమైన ఆస్తులను ప్రకటించినట్లే తమ ఆరోగ్య స్థితిగతుల్ని కూడా ప్రకటించాలని ఐఎమ్ఎ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజాసేవ చేయగలరా లేదా అని తెలుసుకోవడం తమ అభ్యర్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఓటరు హక్కు ’’ అని అప్పటి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెకె అగర్వాల్ స్పష్టం చేశారు. అది తప్పనిసరి చేయాలి.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు, అభ్యర్థి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. వైద్య పరీక్షలో ముందుగా ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తిస్తే సదరు అభ్యర్థి ఉద్యోగానికి అనర్హులవుతారనేది మనకి తెలుసు. అలాగే క్రీడల్లో కూడా ఫిట్నెస్ పరీక్ష జరపకుండా ఆడటానికి అనుమతించరు. అలాంటప్పుడు పాలనకు బాధ్యత వహించే రాజకీయ నేతను ఎలా అనుమతిస్తారు? ప్రపంచంలోని అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేత ఆరోగ్యాన్ని తనిఖీ చేయకుండా ఎన్నికలలో పోరాడటానికి అనుమతివ్వడం సరైనదేనా? అనేవి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. దీనిని దృష్టిలో ఉంచుకునే... ‘‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మార్చి దీని కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు అప్పటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎ మార్తాండ పిళ్లై. యువతపై ప్రభావం... మన దేశంలో రాజకీయ నాయకులను సెలబ్రిటీలుగా పరిగణిస్తారని, వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి యువ తరాన్ని ప్రభావితం చేస్తాయని ఐఎంఏ అంటోంది. నేతలు ఊబకాయంతో ఉండడం అలాగే పొగ తాగటం లేదా మద్యపానం వంటి దురలవాట్లు కలిగి ఉండడం... యువ తరానికి తప్పుడు సందేశం ఇస్తుందనేది తమ ఆందోళనగా పేర్కొంది. రాజకీయ నేత... అట్టడుగు స్థాయిలో పని చేయగలమని, శారీరకంగా చురుగ్గా ఉన్నామని, ఏ సమయంలోనైనా ఆకస్మిక విపత్తు సంభవించిన ప్రదేశాలకు రాగలమని, మైళ్ల దూరం నడిచి ప్రజలకు కావలసిన సేవలు అందించగలమనే నమ్మకం ప్రజలకు అందించాలి. ఐఎంఎ నాటి ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని నేతలు ఇప్పటికైనా గుర్తించి...తప్పనిసరి నిబంధన రాకున్నా...ఆస్తుల వెల్లడి తరహాలోనే స్వచ్ఛందంగానైనా తమ ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే... అది గొప్ప మార్పుకు దారి తీయవచ్చు. అనారోగ్యంతో మరణిస్తే... ఒక నేత తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే... ఉపఎన్నిక అనివార్యమై. అది ప్రజాధనం వృధాకి కారణం అవుతుంది. నాయకులు అంటే ప్రజలకు సేవకులు అనేది అందరూ చెప్పే మాటే... అయితే ఒడిదుడుకులను ఎదుర్కొని తమకు 5ఏళ్ల పాటు సేవలు అందించే శారీరక మానసిక సామర్థ్యం నేతలకు ఉందో లేదో తెలుసుకోవడం ప్రజల హక్కు కూడా. –డా.బీఎన్రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా...చెప్పింది చేయగలరు.. ఏ మనిషైనా ఆరోగ్యం అత్యవసరం అనేది తెలిసిందే. నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా నేతలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. కాబట్టి... నేతల ఆరోగ్య వివరాలు ప్రజల హక్కు అనేది నిర్వవాదం.. దీనిపై తాజాగా ఐఎంఎ ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ...గతంలో చేసిన ఈ డిమాండ్ ఎప్పటికీ సజీవమే అని నేను భావిస్తున్నా. –డా.గుత్తా సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు, ఐఎంఏ. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్పూర్ నుంచి అహ్మద్నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్కు ఎంటర్ప్రెన్యూర్గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా..
ఫ్యాషన్ డిజైనర్కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్షిప్ న్యూయార్క్లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్వేర్ లేబుల్కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్చార్జ్లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్గా అనిపించాయి. డిజైనింగ్లో హర్ష్కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు. -
అంకిత భావమే అమోఘ విజయం
నలుగురు నడిచే దారిలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దారి మార్చి వెళ్లే వారికి మాత్రం సవాలక్ష ప్రశ్నలు ఎదురొస్తుంటాయి. వాటికి అదేపనిగా సమాధానాలు చెప్పడం కంటే ఎంచుకున్న దారిలో వేగంగా నడవడానికే కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు. అంకిత్ అగర్వాల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘ఇన్సూరెన్స్దేఖో’ ద్వారా ఇన్సూరెన్స్ సెక్టార్లో గెలుపు జెండా ఎగరేశాడు... ‘మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్తో పనిలేదు’ అనే అంకిత్ అగర్వాల్ హరియాణా, రాజస్థాన్లోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగాడు. మూడు వేలమందికి పైగా ఇన్సూరెన్స్ ఏజెంట్లను కలిశాడు. ‘ఇన్సూరెన్స్ దేఖో’ ప్రారంభించడానికి ముందు ఊరూవాడా అనే తేడా లేకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ దేఖో’కు సంబంధించిన ఆలోచనలను ఇతరులతో, మిత్రులతో పంచుకునేప్పుడు ‘పిచ్చి ముదిరింది’ అన్నట్లుగా చూసేవాళ్లు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఏమిటీ కర్మ’ అని మందలించేవాళ్లు కొందరు. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో ఎంబీఏ(ఫైనాన్స్) చేశాడు అంకిత్. అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్లో చేస్తున్న ఉద్యోగానికి అంకిత్ రాజీనామా చేసి, ఇన్సూర్టెక్ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘తెలివి తక్కువ పనిచేశావు’ అన్నవాళ్లే ఎక్కువ. ఇన్సూరెన్స్ సెక్టార్లోకి అడుగు పెట్టిన తరువాత ఆఫ్లైన్(ఇన్సూరెన్స్ ఏజెంట్స్) సామర్థ్యాన్ని, ఆన్లైన్లో తనకు పనికివచ్చే సాంకేతికతను బాగా ఉపయోగించుకున్నాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగులు ఖాళీగా ఉండాలని మొదటి లక్ష్యంగా నిర్ణయించుకున్నాను’ నవ్వుతూ అంటాడు అంకిత్. ఎందుకంటే, సంప్రదాయ ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగ్లు నోటుబుక్స్, బోలెడు డాక్యుమెంట్స్తో నిండిపోయి భారంగా ఉంటాయి! అందుకే స్మార్ట్ఫోన్ ప్లస్ యాప్ ద్వారా ఆ బ్యాగులు తేలికయ్యేలా చేయడంలో అంకిత్ విజయం సాధించాలనుకున్నాడు. అయితే అంకిత్ వేసే ప్రతి అడుగులో ప్రతికూల మాటలు వినిపించేవి. అవేమీ పట్టించుకోకుండా ‘మొదటి దశలో ఏజెంట్. ఆ తరువాత టెక్’ అంటూ తన దారిలో తాను వెళ్లాడు అంకిత్. ‘ఆర్మీ ఆఫ్ ఏజెంట్స్’ పేరుతో యువబృందానికి తయారుచేసుకొని గట్టి శిక్షణ ఇచ్చాడు. ఈ బృందంలో ఎక్కుమందికి ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ప్రసిద్ధ నినాదం ‘రోటీ కప్డా మకాన్’లో ‘బీమా’ చేర్చి తన బృందంతో ఊరూవాడా తీసుకెళ్లాడు అంకిత్. గురుగ్రామ్(హరియాణా) కేంద్రంగా చిన్నగా మొదలైన ‘ఇన్సూరెన్స్దేఖో’ ప్రయాణం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించింది. తమ అవసరాలకు సరిపోయే పాలసీలను ఎంచుకోవడంతో పాటు ఎన్నో విధాలుగా వియోగదారులకు దారి చూపే నేస్తంగా మారింది ఈ ఇన్సూర్టెక్ స్టార్టప్. ‘పిచ్చి అగర్వాల్’ అని చాటుమాటుగా వెక్కిరించినవాళ్లే ఈ విజయం చూసి ‘అగార్వల్ మెథడ్’ అని గొప్పగా పిలుచుకునేవారు! ‘ఇన్సూరెన్స్దేఖో అనేది ఇన్సూరెన్స్ సెక్టార్లో భారీ మార్పు తీసుకురావడమే కాదు సామాజిక ప్రభావాన్ని కలిగించింది’ అంటాడు కార్దేఖో గ్రూప్ కో–ఫౌండర్ అమిత్ జైన్. ‘ఇన్సూరెన్స్దేఖో’ ఇటీవల ముంబైకి చెందిన ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ‘వెరాక్’ను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఎంతోమంది యంగ్స్టర్స్ అంకిత్ను ‘వన్–పాయింట్ అడ్వైజ్’ అడుగుతుంటారు. అతడి నోటి నుంచి వచ్చే ‘అంకితభావం’ అనే జవాబును ఊహించడం కష్టం కాదేమో! నా కంపెనీ లాభాలతో దూసుకుపోతుంది అని చెప్పడం నా లక్ష్యం కాదు. నా అసలు సిసలు విజయం ఆరులక్షల గ్రామాల్లోకి ఇన్సూరెన్స్ను తీసుకెళ్లడం. – అంకిత్ అగర్వాల్ -
గిన్నిస్లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్నుమా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్గా, ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్లర్స్ టీమ్కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్ కన్నుమూత
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్గా పని చేసి.. కార్డియాలజిస్ట్గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. pic.twitter.com/uy7JzOyGWK — Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021 చదవండి: కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష -
ఇంటికి రా... నీ పని చెప్తా...
జనవరి 23 శనివారం. ఢిల్లీలో డాక్టర్ కె.కె.అగర్వాల్ టీకా తీసుకున్నారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఢిల్లీలో ప్రముఖ కార్డియాలజిస్ట్. మెడికల్ అసోసియేషన్స్– ఆసియా అధ్యక్షుడు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తుంటారు. తాను కోవిడ్ టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన ఫేస్బుక్ లైవ్ పెట్టారు. టీకాతో భయం లేదని చెబుతున్నారు. ఇంతలో భార్య ఫోన్ మోగింది. ‘ఏంటి... నువ్వు టీకా తీసుకున్నావా?’ అని అడిగారామె. లైవ్ వెళుతోంది. ‘అవును’ అన్నాడీయన. ‘ఇంటికిరా నీ సంగతి చెప్తా’ అందామె. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్ అయిపోయింది. కాని ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ‘నువ్వు లైవ్లో ఉన్నప్పుడు నీ భార్య ఫోనెత్తకు’ అని ఇప్పుడు దేశమంతా సందేశం అందుతోంది. దాంతోపాటు డాక్టర్ కె.కె.అగర్వాల్ వీడియో కూడా. ఇదంతా జరిగి ఒక నాలుగైదు రోజులవుతోంది. అసలేం జరిగిందంటే డాక్టర్ కె.కె.అగర్వాల్ ఢిల్లీలో పేరు మోసిన కార్డియాలజిస్ట్. టీవీ పర్సనాలిటీ. పద్మశ్రీ కూడా వచ్చిందాయనకు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన కరోనా అవగాహన వీడియోలు, జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మొన్నటి శనివారం తాను కోవిడ్ వాక్సిన్ తీసుకుంటూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. ‘ఇదిగోండి.. నా వయసు 63. నేను బ్లడ్ థిన్నర్లు వాడతాను. అయినా సరే నేను వాక్సిన్ తీసుకున్నాను. నాకేం కాలేదు. కాబట్టి మీరూ వేయించుకోండి’ అని ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. భార్య నుంచి. ఆయన లైవ్లో ఉండి ఫోన్ ఎత్తాడు. భార్య: ఏంటి... నువ్వు వాక్సిన్ వేయించుకున్నావా? అగర్వాల్: అవును. అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి వెళ్లాను. ఖాళీ ఉంది వేయించుకోండి అంటే వేయించుకున్నాను. భార్య: నన్నెందుకు తీసుకెళ్లలేదు. అగర్వాల్: నీకు సోమవారం వేస్తారు. భార్య: వాక్సిన్ వేయించుకున్నది గాక ఇంకా ఏంటేంటో చెప్తావా... ఇంటికిరా నీ పని చెప్తా... దాంతో అగర్వాల్ గారి ముఖం వాడిపోయింది. ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. భార్యకు ఎంతటివాడైనా భయపడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నిన్న (బుధవారం) డాక్టర్ గారు తన ఫేస్బుక్ వాల్ మీద వీడియో రిలీజ్ చేశారు. ‘నా భార్య కోప్పడటం సబబే. నా ఆరోగ్యం గురించి వర్రీ అయ్యింది. టీకా గురించి అందరికీ సందేహాలు ఉన్నాయి కదా. తను పక్కన ఉన్నప్పుడు వేయించుకోవాల్సింది అని ఆమె ఉద్దేశ్యం. నేనేమో ఆమెకు చెప్పకుండా ఈ పని చేశాను. దీనిని పెద్దగా చర్చ పెట్టాల్సిన పని లేదు’ అన్నాడాయన. అయితే ఈ వెర్షన్ను సగంమంది నెటిజన్లు నమ్ముతుంటే అగర్వాల్ ఒక్కడే వెళ్లి అలా టీకా వేయించుకోవడం గురించి ఆమెకు నిజంగా కోపం వచ్చిందని మిగిలిన సగం అన్నారు. ‘అయినా భర్తను అదిలించి అదరగొట్టే శక్తి భార్యకు కాక ఇంకెవరికి ఉంటుంది’ అని మరికొందరు అన్నారు. అగర్వాల్ భార్య పేరు వీణాఅగర్వాల్. ప్రస్తుతం కెకె అగర్వాల్తో పాటు ఆమె కూడా అందరికీ తెలిశారని మాత్రం చెప్పక తప్పదు. -
టర్మ్ ప్లాన్లకు డిమాండ్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాహుల్ అగర్వాల్. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు.. మీ వ్యాపారంపై కరోనా వైరస్ ప్రభావమేంటి? కరోనా వైరస్ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్డౌన్లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్డౌన్కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది. మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది? పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్డౌన్ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం. కోవిడ్–19 సంబంధ క్లెయిమ్స్ ఏమైనా వచ్చాయా? జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్సైట్లో ప్రత్యేకంగా కోవిడ్–19 సెక్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం. కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా? సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్ టర్మ్ ప్లాన్, స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్ వీటిలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది? టర్మ్ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్ను బట్టి చూస్తే టర్మ్ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత? ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్ పోర్ట్ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్షిప్ మేనేజర్లు, సూపర్వైజర్ స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. -
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-
పథకాల పేరు మార్పే.. జరిగిందేమీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే కొత్త పేర్లు పెట్టడంలో పేరుపొందిన నరేంద్ర మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళన పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం అనేక కొత్త పేర్లను తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం రాకముందున్న ‘వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ (జలవనరుల మంత్రిత్వ శాఖ)’ని ‘మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్వునేషన్ (జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ)’గా మార్చింది. ‘ది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ని ‘నేషనల్ గంగా కౌన్సిల్’గా మార్చింది. 2015లో నమామి గంగా ప్రాజెక్ట్ను ప్రారంభించి 20 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి గంగా ప్రక్షాళన పథకాన్ని 2018, జూలై నెలలోగా పూర్తి చేస్తామని శపథం చేయగా, 2019లో పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ‘గంగా రిజ్వునేషన్ బేసిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను కూడా తీసుకొచ్చింది. సలహాలు, సూచనల కోసం ఈ నివేదికను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు పంపించాల్సి ఉండగా, ఇంతవరకు ఏ మంత్రిత్వ శాఖకు పంపించిన దాఖలాలు లేవు. నేషనల్ రివర్ గంగా (రిజువినేషన్, ప్రొటెక్షన్, మేనేజ్మెంట్) బిల్ను 2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గంగా ప్రొటెక్షన్ కోర్ పేరిట ఓ సాయుధ దళం ఏర్పాటుకు, గంగా కాలుష్యానికి కారకులవుతున్న వారికి భారీ నష్ట పరిహారం, జైలు విధించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. గంగా ప్రక్షాళనకు స్వయం ప్రతిపత్తి గల సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయకుండా బిల్లును తీసుకరావడం ఏమిటని గంగా ప్రక్షాళన కోసం గురువారం నాడు ప్రాణాలర్పించిన అగర్వాల్ నాడు ప్రశ్నించారు. కాలుష్యానికి కారకులవుతున్న వారికి రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉన్న ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. ఈలోగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ గంగా ప్రక్షాళన పనులను పక్కన పెట్టి గంగా, బ్రహ్మ పుత్ర నదుల అనుసంధానంపై దృష్టిని కేంద్రీకరించింది. 2002లో అప్పటి అటల్ బిహారి వాజపేయి ప్రతిపాదించిన ఈ పథకానికి 8,700 కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నదుల అనుసంధానం వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు జల వనరులు అందుబాటులో ఉంటాయని, వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందిగానీ, నదుల అనుసంధానం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కెన్–బెట్వా నదుల అనుసంధానం వల్ల పన్నా టైగర్ రిసర్వ్లో ఎక్కువ భాగం నీట మునిగి పోతుంది. ఉత్తరాఖండ్కు 2013లో భారీ వరదలు రావడంతో ఏకంగా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న 24 జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. వాటిని పునర్ సమీక్షించాల్సిందిగా కోరుతూ జల వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. గంగా ప్రక్షాళన కార్యక్రమాలపై గత నాలుగేళ్లుగా నేతల ఊక దంపుడు ఉపన్యాసాలేగానీ, చెప్పుకోతగ్గ పురోగతి మాత్రం సాధించలేదు. అదే గనుక జరిగి ఉంటే నేడు అగర్వాల్ ప్రాణాలు పోయేవి కావు. చదవండి: నా మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్ గంగా ప్రక్షాళన గంగపాలు! -
నా మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : కొంత మంది ప్రాణాలకు ఎప్పటికీ విలువ కట్టలేం. అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మందిలో గంగా ప్రక్షాళన కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రముఖ పర్యావరణ వేత్త జీడీ అగర్వాల్ (86) ఒకరు. సాధ్యమైనంత త్వరగా గంగా నదిని ప్రక్షాళించాలని, అది నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం గంగా ఉప నదులపై చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అగర్వాల్ గురువారం నాడు రూర్కెలాలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు తేనె మంచి నీళ్లను మాత్రమే తీసుకున్న అగర్వాల్ తన ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి తేనె మంచి నీళ్లను కూడా మానేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా బుధవారం నాడు రూర్కెలా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని ఢిల్లీలోని ఏయిమ్స్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుకు అంగీకరించలేదు. చివరకు గురువారం నాడు కన్నుమూశారు. స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్గా కూడా సుపరిచితుడైన అగర్వాల్, మామూలు నిరసనకారుడో, మొండి పర్యావరణ వేత్తనో కాదు. ఉన్నత విద్యావంతుడు. కాన్పూర్ ఐఐటీలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా పనిచేశారు. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ బోర్డు సభ్యుడిగా, కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు మొట్టమొదటి సభ్య కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోని నదుల పరిరక్షణ కోసం వివిధ స్థాయిల్లో, వివిధ రీతుల్లో ప్రభుత్వంతో కలసి పనిచేశారు. నదుల పరిరక్షణ కోసమే ఆయన 2008 నుంచి 2012 మధ్య నాలుగు సార్లు ఆమరణ దీక్షలు చేశారు. గంగా నదీ జలాల ప్రక్షాళన గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్న కారణంగా ఆయన ‘నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగతా సభ్యులను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఈసారి తప్ప ఆయన ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా దాన్ని ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. గంగానదిలో కలిసే ప్రధాన నదుల్లో ఒకటైన భగీరథిపై డ్యామ్ల నిర్మించరాదంటూ అగర్వాల్ 2010, జూలైలో నిరాహార దీక్ష చేపట్టారు. అప్పటి పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రి జైరామ్ రమేశ్ స్వయంగా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. డిమాండ్లను అంగీకరించి దీక్షను విరమింప చేశారు. పోలీసుల ప్రవర్తనపై కేసు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో అగర్వాల్ జూన్ 22వ తేదీన తన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. జూలై 10వ తేదీన పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా ఆయన్ని గుర్తుతెలియని చోటుకు తరలించారు. ఆ మరుసటి రోజు వారి చెర నుంచి విడుదలైన అగర్వాల్ పోలీసు చర్యను సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో కేసు పెట్టారు. తాను శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగించకుండా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకున్నారని, తన అనుచరుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రాణాలకు ముప్పన్నా పట్టించుకోలేదు! అగర్వాల్తో సంప్రతింపులు జరిపి వచ్చే 12 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని కోరతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు జూలై 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గంగా నదిలో కలిసే భగీరథి, పల్మనారి, లోహరి నాగ్పాల్, భెరోఘాటి నదులపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని అగర్వాల్ డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలో లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతులు దులిపేసుకున్నారు. రామన్ మెగసెసె అవార్డు, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ జల వనరుల కార్యకర్త రాజేంద్ర సింగ్ జోక్యం చేసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా ఓ లేఖ రాశారు. అగర్వాల్ ప్రధాన డిమాండైన నదులపై డ్యామ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లోనే ప్రతిపాదించిన ‘గంగా ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్’ బిల్లును ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో రాజేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అప్పటికీ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న అగర్వాల్ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆయన ఆ లేఖలో హెచ్చిరించినట్లు తెలుస్తోంది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. నా మరణంతో దీక్ష ముగింపు: అగర్వాల్ హరిద్వార్లో 109 రోజుల పాటు కేవలం కొంచెం తేనే, మంచినీరు తీసుకుంటూ నిరాహార దీక్ష కొనసాగించిన అగర్వాల్ సెప్టెంబర్ 9వ తేదీన తాను ఇక నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని శపథం చేశారు. ‘నా చావుతోనే నా దీక్ష ముగుస్తుంది’ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని సెప్టెంబర్ పదవ తేదీన ఆయన్ని హరిద్వార్ నుంచి రూర్కెలాలోని ఏయిమ్స్కు తరలించారు. అప్పటికే 9 కిలోల బరువు తగ్గిన అగర్వాల్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. గంగా ప్రక్షాళన పనుల్లో జాప్యం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, 2018. జూలైలోగా గంగా ప్రక్షాళన జరక్కపోతే అదే గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని (2017, ఫిబ్రవరి 22న) శపథం చేసిన కేంద్ర మంత్రి ఉమా భారతి ఇప్పటికీ నిక్షేపంగా ఉండడమే కాకుండా బరువు తగ్గిన దాఖలాలు కూడా లేవు. చదవండి: గంగా ప్రక్షాళన గంగపాలు! -
గంగా ఉద్యమ యోధుడు కన్నుమూత
గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్(86) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్.. గంగానది ప్రక్షాళనకు తన జీవితాన్ని అంకితం చేశారు. గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్ గత జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ ఈనెల 9న ప్రకటించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్లో 1932లో జన్మించిన అగర్వాల్.. రూర్కీ వర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ పొందారు. అనంతరం కాన్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1979లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మొదటి మెంబర్ సెక్రెటరీగా పని చేశారు. అదే సమయంలో ఐఐటీ రూర్కీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్గా మార్చుకున్నారు. -
గంగానది ప్రక్షాళనకై మాజీ ప్రొఫెసర్ దీక్ష.. మృతి!
న్యూఢిల్లీ : గంగానది పరిరక్షణ కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జిడి అగర్వాల్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్ గంగానది ప్రక్షాళనæకు తన జీవితాన్ని అంకింతం చేశారు. గంగానదిని కాలుష్యరహితం చేయాలని,దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్ గత జూన్ 22 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.111 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)కు తరలించారు. అక్కడ చికిత్సనందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.1932లో జన్మించిన అగర్వాల్ కాన్పూర్ ఐఐటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేశారు అక్కడ పదవి విరమణ చేసిన తర్వాత గంగానది పరిరక్షణకు నడుం కట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీగా కూడా పని చేసిన అగర్వాల్ 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్గా మార్చుకున్నారు. గంగానది పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆయన 2008,2009,2012లలో కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. గంగానదిపై ఆనకట్టలు కట్టి దాన్ని ప్రవాహ మార్గాన్ని మార్చడాన్ని,గంగానదిని కలుషితం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలకు అన్నా హజారే వంటి వారు కూడా మద్దతు పలికారు.అగర్వాల్ డిమాండ్ మేరకు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అగర్వాల్లాగే మరి కొందరు కూడా గంగానది ప్రక్షాళన కోసం తమ ప్రాణాలనుత్యాగం చేశారు. వారిలో నిగమానంద ఒకరు. హైందవ సన్యాసి అయిన స్వామి నిగమానంద సరస్వతి గంగానది కాలుష్యానికి కారణమవుతున్న ఉత్తరాఖండ్లోని అక్రమ గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ 2011 ప్రారంభంలో ఆమరణ దీక్ష చేపట్టారు. జూన్లో దీక్షలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.అనంతరం ఆయన ఆశ్రమానికి చెందిన స్వామి శివానంద 2011, నవంబర్ 25 నుంచి 11 రోజుల పాటు ఆమరణ నిరశన చేశారు.దాంతో జిల్లాలో అక్రమ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారతీయ జీవనాడి భారత దేశ జీవనాడి గంగానది. దేశంలో అతిపొడవైన, పవిత్రమైన నదిగా పేరొందింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన గంగానది 11 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. దేశ జనాభాలో 40% మంది నీటి అవసరాలు గంగానదే తీరుస్తుంది. 50 కోట్ల మంది ప్రజలు గంగానదిపై ఆధారపడి బతుకుతున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది గంగా పరీవాహక ప్రాంతంలోనే నివసిస్తున్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలతో ముడిపడి ఉన్న గంగానది మన దేశంలో 52 నగరాలు, 48 పట్టణాల గుండా ప్రవహిస్తోంది. పరిశ్రమలు వదిలే వ్యర్థాలు, మానవ విసర్జితాలు, చెత్తాచెదారం తదితరాల వల్ల గంగానది కలుషితమైపోతోంది.రాను రాను ఈ నీరు తాగడానికే కాక సాధారణ వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమైపోవడంతో నదిని ప్రక్షాళన చేయాలన్న ఆలోచన వచ్చింది. రాజీవ్ ప్రభుత్వం నుంచి మోదీ సర్కారు వరకు అన్ని ప్రభుత్వాలు గంగా ప్రక్షాళణకు నడుం కట్టాయి. కేంద్ర ప్రభుత్వం దీని కోసం వేల కోట్లు వెచ్చిస్తోంది. -
అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ క్రైమ్ : రాజేంద్రనగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ అగర్వాల్ ఇంట్లో చోరి చేసి, అతన్ని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పనిచేసే పట్నాకు చెందిన డ్రైవర్.. ఈ దోపిడీకి ప్లాన్ చేసి తన గ్యాంగ్తో ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు. దోపిడీ చేసే క్రమంలో అగర్వాల్ నోటికి ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
రాజేంద్రనగర్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి
-
అగర్వాల్ హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి లభించింది. అగర్వాల్ దగ్గర పని చేసిన ఆరుగురు డ్రైవర్లలో ఓ డ్రైవరే ఈ హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పట్నాకు పంపించామని పోలీసులు తెలిపారు. గత గురువారం రాత్రి రాజేంద్రనగర్ పరిధి తిరుమలనగర్లోని ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. ఇంటి యాజమాని రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ దాడిలో అగర్వాల్ ప్రాణాలు కోల్పోగా..ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దోపిడీలో డ్రైవర్తో పాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్లో చదివి..
సాక్షి, హైదరాబాద్: సమాజానికి సేవ చేయాలనే తపన. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆలోచన. తమకంటూ ఒక గుర్తింపును పొందాలనే ఉత్సాహం. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో విజయతీరాలను చేరుకున్నారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థినులు. ఇటీవల వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్లో బీటెక్ 2015 బ్యాచ్కు చెందిన మాధురి గడ్డం జాతీయస్థాయిలో 144వ ర్యాంకు సాధించగా, బీటెక్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ (డ్యుయల్ డిగ్రీ) గరిమా అగర్వాల్ 241వ ర్యాంకు సాధించడం విశేషం. మాధురి సొంత ప్రాంతం హైదరాబాద్ నగరం కాగా, గరిమది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన వీరు సివిల్స్కు ప్రిపేయిన విధానం, తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, కష్టపడిన పద్ధతులు తదితర అనుభవాలను సాక్షికి వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. అధ్యాపకుల బోధన ఎంతో ఉపకరించింది: మాధురి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చదవడం ఎంతో మేలు చేకూర్చిందని మాధురి అభిప్రాయపడ్డారు. మావనతా విలువలకు సంబంధించిన కోర్సులో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అధ్యాపకులు కమల్, రాధిక, కన్నన్ శ్రీనాథన్, నందకిషోర్ ఆచార్య చర్చలు, తరగతి గదిలో చెప్పిన పాఠాలు ఎంతో తోడ్పాటును అందించాయి. ట్రిపుల్ఐటీ తర్వాత దేనికోసం చదివారు? హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. మూడేళ్లపాటు కష్టపడ్డాను. రెండోసారి రాసి 144వ ర్యాంకు సాధించాను. సివిల్స్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ప్రజలు, సొసైటీకి సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒకవేళ సివిల్ సర్వీసెస్లో ఎంపిక కాకపోయినా మంచి నాలెడ్జి సాధించాననే తృప్తి మిగిలేది. కానీ రావడం ఎంతో సంతోషానిచ్చింది. సివిల్ సర్వీసెస్కు ఎలా ప్రిపేరయ్యారు? సివిల్ సర్వీసెస్ ఒక లాంగ్ప్రాసెస్. మూడు దశల్లో పరీక్ష ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ దశలో నెగెటివ్ మార్కులుండే విధానం. రెండో దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. చివరిదశలో 30 నిమిషాలు పర్సనాలిటీ టెస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంజినీరింగ్ చదివిన వారికి లాభనష్టాలు రెండూ ఉంటాయి. సివిల్స్ పరీక్షలకు ఎవరైనా తోడ్పాటు అందించారా? సీనియర్లు పంకజ్ కుమావత్, హిమానుజన్, గరిమా అగర్వాల్ తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసేవారు కూడా సివిల్స్కు ప్రిపేర్ కావాలి. ఇక్కడ ట్రిపుల్ ఐటీ చదవడం ఎంతో లాభించింది: గరిమా అగర్వాల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చదవడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, పృథ్వి హౌజ్లో కల్చరల్ ప్రతినిధిగా ఉన్నానని గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. 2014లో ఏఏ ఎంఏఎస్–2016లో సింగపూర్ సదస్సులో సర్టిఫికెట్ ఎక్స్లెన్స్ అవార్డు పొందడం మరిచిపోలేని సంఘటన. ప్రొఫెసర్లు కౌల్, కమలార్ కర్లపాలెమ్ ఎంతగానో స్పూర్తినిచ్చారు. ట్రిపుల్ఐటీ తర్వాత ఏం చదివారు? ట్రిపుల్ఐటీ చదివిన తర్వాత జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్లో రోబోటిక్స్లో ఇంటర్న్షిప్ చేశాను. అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యా. సివిల్స్లో 241వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. సివిల్స్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సమాజానికి ఏమైనా చేయాలనే తపనతోనే సివిల్స్కు ప్రిపేరయ్యా. ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తి చేశాక విదేశాల్లో పరిశ్రమలు, పరిశోధనలో అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని గ్రేడ్ 4లోనే ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. మధ్యప్రదేశ్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అల్కా ఉపాధ్యాయ యూపీఎస్సీ టాపర్గా నిలిచింది ఆమెను స్పూర్తిగా తీసుకొని చదివాను. సివిల్స్కు ఎలా ప్రిపేర్ అయ్యారు? న్యూఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. జనరల్ స్టడీస్. ప్రణాళికాబద్ధంగా చదవడం, టైమ్టేబుల్ ఏర్పాటు చేసుకొన్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం ఇబ్బందే అయినా ఇంజినీర్ల సైంటిఫిక్ టెంపర్మెంట్, లాజిక్ అప్రోచ్ నన్ను సివిల్స్ రాణించేలా చేశాయి. ఎవరెవరు తోడ్పాటునందించారు? ఐఏఎస్ అధికారి హిమాన్షు జైన్, ఐపీఎస్ అధికారి పంకజ్ కుమావత్, కమల్సర్ సివిల్స్ సర్వీసెస్లో ర్యాంకు సాధించడంలో ఎంతో తోడ్పాటును అందించారు. -
హైదరాబాద్ జోన్ జీఎస్టీ చీఫ్ కమిషనర్గా అగర్వాల్
ఆంధ్రప్రదేశ్కు ఇన్చార్జిగా కూడా.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జోన్ (తెలంగాణ) జీఎస్టీ కస్టమ్స్ చీఫ్ కమిషనర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు చెందిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్టీ చట్టంలోని అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్టీపై దేశంలోని 60వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి చీఫ్ కమిషనర్గా, విశాఖపట్నం జోన్ (ఆంధ్రప్రదేశ్) ఇన్చార్జి చీఫ్ కమిషనర్గా కూడా వ్యవహరించనున్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ పన్ను చెల్లింపు దారుల సమస్యలు పరిష్కరించడం, వారి సందేహాలను నివృత్తి చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు. -
ఢిల్లీ మళ్లీ ఢమాల్...
► సీజన్ మారినా మారని రాత తొలి మ్యాచ్లో చెత్త ప్రదర్శన ► 9 వికెట్లతో కోల్కతా ఘన విజయం ► ఐపీఎల్-9లో గంభీర్ సేన శుభారంభం గత మూడేళ్లలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే, 32 మ్యాచ్లు ఓడింది. ప్రతీ సీజన్కు ఆ జట్టు ఆట తీసికట్టుగా మారింది. దాంతో ఈసారి సమూల మార్పులు అంటూ సగం జట్టును మార్చి పడేశారు. యువ ఆటగాళ్లను భారీ మొత్తాలు చెల్లించి తీసుకున్నారు. మెంటార్గా ద్రవిడ్ మార్గనిర్దేశనం కూడా ఉంది. ఇక దూసుకెళ్లడమే తరువాయి అనిపించింది. కానీ రూపు మారినా జట్టు రాత మారలేదు. 2016 ఐపీఎల్ను ఆ జట్టు మరింత అధ్వాన్నంగా ప్రారంభించింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ప్రారంభ మ్యాచ్లో 98 పరుగులకే చాపచుట్టేసిన ఢిల్లీ కనీసం 18 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఏ దశలోనూ కనీస ప్రదర్శన ఇవ్వలేక ఆ జట్టు కుప్పకూలిపోయి లీగ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏడోసారి వంద లోపే ఆలౌటయింది. కోల్కతా: ఐపీఎల్-9లో మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్డెవిల్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ హాగ్ (3/19), రసెల్ (3/24), హేస్టింగ్స్ (2/6) ఢిల్లీని దెబ్బ తీశారు. అనంతరం నైట్రైడర్స్ 14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (41 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు), రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 35; 7 ఫోర్లు) రాణించారు. రసెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అందరూ అందరే... తొలి 14 బంతుల్లో 24 పరుగులు... ఢిల్లీ డేర్డెవిల్స్ ఓపెనింగ్ భాగస్వామ్యమిది. అంతే... ఆ తర్వాత పరుగులు తీయడమే చేతకాక అంతకుమించిన పార్ట్నర్షిప్ నెలకొల్పడం జట్టు బ్యాట్స్మెన్ వల్ల కాలేదు. డి కాక్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు కావడం పరిస్థితిని సూచిస్తోంది. నైట్రైడర్స్ చక్కటి బౌలింగ్ ముందు ఒక్క బ్యాట్స్మన్ కూడా క్రీజ్లో నిలవలేకపోయాడు. రసెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డి కాక్, శ్రేయస్ అయ్యర్ (0) అవుట్ కావడంతో ఢిల్లీ పతనం ప్రారంభమైంది. తన తర్వాతి ఓవర్లోనే అతను మయాంక్ అగర్వాల్ (9)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే మెయిడిన్ ఓవర్ వేసిన హేస్టింగ్స్... కరుణ్ నాయర్ (3) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత పడిన ఐదు వికెట్లను స్పిన్నర్లు హాగ్, పీయూష్ చావ్లా పంచుకున్నారు. చావ్లా తన వరుస ఓవర్లలో కార్లోస్ బ్రాత్వైట్ (6), క్రిస్ మోరిస్ (11)లను పెవిలియన్ పంపించగా... పవన్ నేగి (11), శామ్సన్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు), అమిత్ మిశ్రా (3)లను హాగ్ అవుట్ చేశాడు. కెప్టెన్ జహీర్ ఖాన్(4)ను హేస్టింగ్స్ అవుట్ చేయడంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే డేర్డెవిల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగా... స్వల్ప లక్ష్య ఛేదనలో ఉతప్ప, గంభీర్ ఎక్కడా తడబడలేదు. జహీర్ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రావడంతో వీరి జోరు మొదలైంది. ఢిల్లీ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన ఈ జోడి తొలి వికెట్కు 58 బంతుల్లో 69 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో వీరిద్దరు ఐపీఎల్లో అత్యధిక పరుగులు జోడించిన ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరగా... ఉతప్ప లీగ్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా విజయం దిశగా సాగుతున్న దశలో భారీ షాట్కు ప్రయత్నించి ఉతప్ప అవుటైనా, మనీశ్ పాండే (12 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) సహకారంతో మరో 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే గంభీర్ మ్యాచ్ను ముగించాడు. వరుసగా ఐదో సిక్సర్... సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే మైదానంలో అతనేంటో ప్రపంచానికి తెలిసింది. నాడు ప్రపంచ కప్ ఫైనల్లో వరుసగా నాలుగు సిక్సర్లతో దుమ్ము రేపిన బ్రాత్వైట్ అదే ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం దానిని కొనసాగించినట్లు కనిపించాడు. ముగించిన చోటే మొదలు పెట్టినట్లు చావ్లా ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అతను భారీ సిక్సర్ బాదాడు. ఇక్కడ అతనికి ఇది వరుసగా ఐదో సిక్సర్ కావడం విశేషం. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన బ్రాత్వైట్ ఈ జోరు మళ్లీ చూపించలేక నాలుగో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. ►ఢిల్లీ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చిన కోల్కతా బౌలర్లు హేస్టింగ్స్, రసెల్ స్కోరు వివరాలు ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) హాగ్ (బి) రసెల్ 9; డి కాక్ (సి) పఠాన్ (బి) రసెల్ 17; అయ్యర్ (ఎల్బీ) (బి) రసెల్ 0; నాయర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 3; శామ్సన్ (సి) ఉతప్ప (బి) హాగ్ 15; నేగి (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 11; బ్రాత్వైట్ (ఎల్బీ) చావ్లా 6; మోరిస్ (బి) చావ్లా 11; కూల్టర్ నీల్ (నాటౌట్) 7; మిశ్రా (సి) గంభీర్ (బి) హాగ్ 3; జహీర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 98. వికెట్ల పతనం: 1-24; 2-25; 3-31; 4-35; 5-55; 6-67; 7-84; 8-84; 9-92; 10-98. బౌలింగ్: రసెల్ 3-0-24-3; ఉమేశ్ యాదవ్ 3-0-21-0; హేస్టింగ్స్ 2.4-1-6-2; మున్రో 1-0-7-0; హాగ్ 4-1-19-3; చావ్లా 4-0-21-2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మోరిస్ (బి) మిశ్రా 35; గంభీర్ (నాటౌట్) 38; పాండే (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 99. వికెట్ల పతనం: 1-69. బౌలింగ్: కూల్టర్నీల్ 4-0-32-0; జహీర్ 2.1-0-24-0; మోరిస్ 4-0-21-0; బ్రాత్వైట్ 2-0-9-0; మిశ్రా 2-0-11-1. -
పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని మోసం
విశాఖపట్నం: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని విశాఖకు చెందిన వ్యక్తిని మోసం చేశాడు. 4వ టౌన్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన అగర్వాల్ అనే వ్యక్తి నాగాలాండ్లో పవర్ ప్రాజెక్టు కోసం మిలియన్ డాలర్ల రుణం ఇప్పిస్తానని ఇక్కడి నాగేంద్ర బాబుని నమ్మించాడు. అగర్వాల్ కోరిన ప్రకారం నాగేంద్రబాబు ఎస్బిఐ ఆన్లైన్ ద్వారా 5లక్షల రూపాయలు పంపాడు. మళ్లీ అతని నుంచి ఎటువంటి సమాచారంలేదు. ఫోన్కు అందుబాటులో లేడు. దాంతో నాగేంద్రబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ** -
ఐదు నెలల్లో రిటైర్మెంట్.. ఆ బాధ్యత వద్దు
గోదావరి బోర్డు చైర్మన్ బాధ్యతల స్వీకరణకు అగర్వాల్ విముఖత హైదరాబాద్: గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన గోదావరి నదీ యాజ మాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎంఎస్ అగర్వాల్ విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో చైర్మన్ బాధ్యతలను తాను మోయలేనని అగర్వాల్ కేంద్ర జల సంఘానికి విన్నవించినట్టు సమాచా రం. గోదావరి, కృష్ణా బోర్డులకు తాత్కాలిక చైర్మన్ల స్థానంలో ఎం.ఎస్.అగర్వాల్, ఎస్.కె.జి.పండిత్లను నూతన చైర్మన్లుగా నియమిస్తూ గత నెల 27న కేంద్ర జల సంఘం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. వీరిలో అగర్వాల్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించలేననే తన నిర్ణయాన్ని కేం ద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యా దృష్టికి తీసుకెళ్లినట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలి సింది. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న తన స్థానంలో సర్వీసు కాలం ఎక్కువగా ఉన్న వారిని నియమించాలని, అలా అయితేనే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వివరించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానం లో ఎవరిని నియమించాలన్న దానిపై కేంద్ర జల సంఘం దృష్టి పెట్టినట్లు తెలిసింది. సర్వీసుకాలం ఎక్కువగా ఉన్న సి.ఎ.వి.నాథన్, డి.పి.సింగ్, ఎస్.కె.శ్రీవాత్సవ్, ఎస్.మసూద్ హుస్సేన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఇక ఆర్థిక వెలుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలో వచ్చే సోమవారం అధికారం చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వంపై వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పూర్తి ఆశావహంగా ఉన్నాయి. మోడీ పాలనలో పారిశ్రామిక ప్రగతి వెల్లివిరుస్తుందనీ, ఆర్థిక రథ చక్రాలు పరుగందుకుంటాయనే నమ్మకం ఆయా వర్గాల్లో ద్యోతకమవుతోంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది. హామీలు అమలు చేస్తే చాలు: జేపీ మోర్గాన్ ఏఎంసీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేస్తే సమీప భవిష్యత్తులోనే ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని జేపీ మోర్గాన్ ఏఎంసీ తెలిపింది. కొత్త ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఆర్థిక పరిస్థితి మెరుగవడం మొదలవుతుంది. తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయి. సెన్సెక్స్ మరింత ఊపందుకుంటుందని సంస్థ పేర్కొంది. 2.3 శాతానికి క్యాడ్...: సిటీ గ్రూప్ అంచనా ఎగుమతుల పెంపు, దిగుమతుల తగ్గింపుపై మోడీ సర్కార్ దృష్టిసారించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం ఉండవచ్చని సిటీగ్రూప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో క్యాడ్ 3,600 కోట్ల డాలర్లు లేదా జీడీపీలో రెండు శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇది కొంచెం హెచ్చుస్థాయిలో 2.3 శాతం వరకు ఉండవచ్చని అంచనావేసింది. బుధవారం విడుదల చేసిన నివేదికలో సిటీగ్రూప్ తెలిపిన అంశాలు: చమురు, బొగ్గు, ఇనుప ఖనిజం రంగాలు 2014-15లో క్యాడ్పై ప్రభావం చూపే అవకాశముంది. ముడిచమురు ధరలు పెరిగి, డిమాండు క్షీణించడంతో ఈ ఏడాది చమురు దిగుమతుల బిల్లు 10 శాతం మేరకు తగ్గవచ్చు. ఆర్థిక అంశాలపై బీజేపీ ధోరణినిబట్టి అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలను కొత్త ప్రభుత్వం చేపట్టవచ్చు. రికవరీ గణాంకాలు క్రమక్రమంగా వెల్లడవుతాయి. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 6.5 శాతానికి పెరగవచ్చు. కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంస్థాగత సవరణల ఫలితాలు 2015-16, 2016-17లలో ప్రతిబింబిస్తాయి. మెరుగైన పాలన కావాలి: వొడాఫోన్ ఇండియా మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెరుగైన పాలనను, వాణిజ్య వ్యవహారాల్లో మరింత పారదర్శకతను అందిస్తుందని టెలికం దిగ్గజం వొడాఫోన్ పేర్కొంది. నిన్నటి వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో సుపరిపాలనను చూశామని కంపెనీ ఎండీ, సీఈఓ మార్టెన్ పీటర్స్ చెప్పారు. గుజరాత్లో వొడాఫోన్ మార్కెట్ లీడర్గా ఉంది. సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: వేదాంత చైర్మన్ అగర్వాల్ దేశంలో వెలికితీయకుండా ఉన్న సహజ వనరులను సద్వినియోగపర్చుకునే చర్యలను మోడీ సర్కార్ చేపడుతుందని ఆశిస్తున్నట్లు వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇందుకుగాను తగిన సంస్కరణలకు, విధాన నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ధరలపై ఉన్నతాధికారుల సమీక్ష నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో దేశంలో ధరల పరిస్థితిని ఉన్నతాధికారులు మదింపుచేశారు. రుతుపవనాలు విఫలమైతే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సన్నద్ధతను పరిశీలించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను సమీక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం చూపితే ఆహార ధాన్యాల లభ్యత ఏస్థాయిలో ఉంటుందనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
భర్త బాటలో... సైన్యంలో...
స్ఫూర్తి ప్రియా సెమ్వల్ని సైనిక దుస్తుల్లో చూడగానే బంధువులు, స్నేహితులు.. సంతోషంతోపాటు ఒకింత గర్వంగా భావించారు. తోటి సైనికులు మాత్రం ఆమెలో నాయక్ అమిత్ శర్మను చూసుకుని ఆనందపడ్డారు. ‘‘అమిత్ శర్మ తన భార్య ప్రియ చదువు గురించి చెప్పినప్పుడల్లా ‘ఆమెను కూడా సైనికురాలిని చెయ్యాలి నువ్వు’ అనే వాడిని. బిడ్డను చదివించే మగాళ్లుంటారు కానీ అంతే ఇష్టంతో భార్యను చదివించడం అరుదు కదా! అమిత్ స్థానాన్ని ప్రియ భర్తీ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియా సెమ్వల్లో అమిత్ని చూసుకుంటాం’’ కల్నల్ ఆఫీసర్ అగర్వాల్ అన్న ఆ మాటలు ప్రియ కళ్లనే కాదు...ఆమెతోపాటు నిలబడ్డ 194మంది జవాన్ల కళ్లనూ చెమ్మగిల్లేలా చేశాయి. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర తవాంగ్ కొండప్రాంతంలో పనిచేస్తున్న అమిత్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అమిత్ శర్మ భార్య ప్రియా సెమ్వల్ని భారత సైనికదళంలో షార్ట్ సర్వీస్ ఆఫీసర్గా నియమించడం సైనికవిభాగాన్నే కాదు సామాన్యుల్ని కూడా ఆశ్చర్యపరచింది. మొదటిసారి ఓ అమరవీరుని భార్యకు సైనిక ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించడంతో అందరి దృష్టి ప్రియపై పడింది. చిన్న వయసులోనే... ఇరవై ఆరేళ్ళ వయసుకే భర్తను కోల్పోవడం అంటే చిన్న కష్టం కాదు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రియా సెమ్వల్కి అమిత్ శర్మతో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత భార్య ఇష్టాన్ని గౌరవించి పై చదువులు చదివించాడు అమిత్. గణితంలో ిపీజీ పూర్తిచేసిన ప్రియా ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ మంచి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుండగా భర్త మరణవార్త చెవిన పడింది. ‘‘పాతికేళ్ల అమ్మాయి భర్తలేడన్న వార్తని ఎలా జీర్ణించుకోగలదు. మా చెల్లి మామూలు మనిషి కావడానికి చాన్నాళ్లు పట్టింది. భర్తను తలచుకుని ఆరేళ్ల బిడ్డను చూసుకుంటూ బాధపడుతున్న ప్రియకు భారత సైనికవిభాగం నుంచి పిలుపువచ్చింది. అమిత్ స్థానంలో ప్రియకు ఉద్యోగం ఇప్పిస్తామన్న కబురు వినగానే మేమంతా చాలా సంతోషించాం. మొదట్లో కొద్దిగా భయపడ్డా...ప్రియలోని ధైర్యం మమ్మల్ని గర్వపడేలా చేసింది’’ అని చెప్పాడు ప్రియ అన్న ప్రవేశ్ సెమ్వల్. కాశ్మీర్ పరిధిలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సైనిక విభాగంలో పనిచేయడానికి గత నెలలో వెళ్లిన ప్రియా ప్రస్తుతం తన విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మన దేశ 62వ మహిళా జవానుగా, ఓ సైనికుని భార్యగా ప్రియ అందిస్తోన్న సైనిక సేవలు మహిళలకే కాదు మగవారికీ స్ఫూర్తిదాయకమే! -
కాంగ్రెస్లో నైరాశ్యం
సర్వే ఫలితాలన్నీ నిరాశాజనకంగానే ఉండడంతో ఎంపీ స్థానాల్లో నిలబడేందుకు కాంగ్రెస్ నాయకుల నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు. ఈ పరిస్థితిని గ్రహించిన కాంగ్రెస్ సరికొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్లను ఆక ర్షించడానికి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా, కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే నాలుగు నెలల కిందట ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద శక్తి. వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించి చరిత్ర సృష్టించిన పార్టీ. లోక్సభ ఎన్నికల్లో ఏడింటికి ఏడు స్థానాలు గెలుచుకున్న ఎదురులేని పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తరువాత నగరంలో దీని పరిస్థితి దిగజారింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై రాజకీయ పండితులు పెదవి విరుస్తున్నారు. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉండగా, నాలుగింటిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపు లేవని, మిగతా మూడింటిలో గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని అంటున్నారు. కాంగ్రెస్ అంతర్గత సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నట్లు సమాచారం. పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ ఎంపీ స్థానాల్లో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ అంటేనే విసుగు ప్రదర్శిస్తున్నారని సర్వే ఫలితాల్లో తేలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల్లో టికెట్ అడగడానికి కూడా వెనుకాడుతున్నారు. కొత్త వ్యూహంతో ఫలితం దక్కేనా ? ఈ పరిస్థితిని గ్రహించిన కాంగ్రెస్ సరికొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్లను ఆక ర్షించడానికి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా, కొత్తవారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. న్యూఢిల్లీ, చాందినీచౌక్ను మినహాయించి మిగతా లోక్సభ నియోజకవర్గాలన్నింటిలోనూ కొత్తవారికి టికెట్లు ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో ఆప్వైపు మొగ్గు చూపే అవకాశముందని అంటున్నారు. ఈశాన్య లోక్సభ స్థానానికి డీపీసీసీ మాజీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇక్కడి నుంచి ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ను బరిలోకి దింపుతోంది. పూర్వాంచల్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని బీజేపీ లాల్ బిహారీ తివారీకి టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రైమరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. పశ్చిమ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పశ్చిమ ఢిల్లీకి మహాబల్ మిశ్రా, దక్షిణ ఢిల్లీకి రమేష్కుమార్, న్యూఢిల్లీకి అజయ్ మాకెన్ ఎంపీలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయాల దృష్ట్యా మహాబల్ మిశ్రా, రమేష్ కుమార్కు టికెట్లు లభించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైమరీ ద్వారా ఎన్నిక కావడంతో న్యూఢిల్లీ టికెట్ అజయ్ మాకెన్కు ఖాయమయింది. అలాగే చాందినీచౌక్ టికెట్ కేంద్ర మంత్రి కపిల్ సిబల్కే మళ్లీ దక్కుతుందని అంటున్నారు. అయితే మరో కేంద్ర మంత్రి కృష్టాతీరథ్కు మళ్లీ టికెట్ లభించే అవకాశాలు పెద్దగా లేవని అంటున్నారు. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జైకిషన్ను ఇక్కడి నుంచి లోక్సభ బరిలోకి దింపవచ్చని సమాచారం. -
త్వరలో మధ్యంతర భృతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఎంత ఇవ్వాలనే విషయమై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ఐఆర్ ఎంత ఇవ్వొచ్చో చెప్పాలంటూ ఆర్థిక శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ తన ప్రతిపాదనలను సీల్డ్ కవర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి సమర్పించారు. 15-20% వరకు ఇవ్వొచ్చని ఆయన సిఫారసు చేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖ తాను రూపొందించిన ఫైల్లో 25% వరకు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందని ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఆర్ నిర్ధారణపై చర్చించడానికి అధికారులు గురువారం సమావేశం కానున్నారు. శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరగనున్న భేటీలో తుది ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం ఉంది. శనివారం లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఆర్థిక శాఖ ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగానే సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. 30-35% మధ్య ఐఆర్ నిర్ణయం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే 50% ఐఆర్ కోసం పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకపోతే నేరుగా పీఆర్సీ సిఫారసులు అమలు చేయమని ఉద్యోగ సంఘాలు కోరే అవకాశం ఉంది. మరోవైపు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఐఆర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పీఆర్సీ ఉద్యోగ సంఘాలతో చర్చలను ఈ నెలాఖరుకు పూర్తి చేయనుంది. ఒకవైపు చర్చలు జరుపుతూ మరోవైపు ప్రతిపాదనలను పీఆర్సీ సిద్ధం చేస్తోంది. చర్చలు ముగిసిన వారం రోజుల్లో డ్రాఫ్టు నివేదికను సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నామని పీఆర్సీ వర్గాలు చెప్పాయి. -
టీచర్లకు కనీసం రూ. 24,810 చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు కనీస వేతనంగా రూ. 24,810 చెల్లించాలని పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) కమిషనర్ అగర్వాల్కు యూటీఎఫ్ ప్రతిపాదించింది. సచివాలయంలో కమిషనర్ను యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, వెంకటేశ్వర్రావు గురువారం కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఉన్నత పాఠశాలలకు అసిస్టెంట్ హెడ్మాస్టర్ పోస్టులను, మండలాలకు అసిస్టెంట్ ఎంఈఓ పోస్టులను ఇవ్వాలని కోరారు. ప్రధానోపాధ్యాయులతో సమానంగా ఎంఈఓలకు పేస్కేలు చెల్లింపు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలన్నారు. ఫిట్మెంట్ బెనిఫిట్ 60 శాతం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉపాధ్యాయుల స్కేళ్లు నాలుగు రకాలుగా అమలు చేయాలని సూచించారు. ఎస్జీటీలకు కనీస వేతనం రూ. 24,810, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 33,480, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రూ. 35,880, అసిస్టెంట్ ఎంఈఓలకు, హై స్కూల్ హెడ్మాస్టర్లకు రూ. 35,880 కనీస వేతనాన్ని సిఫారసు చేయాలని కోరారు. వేతనంతో కూడిన సెలవులివ్వాలి: పీఆర్టీయూ-టి కుటుంబ సభ్యుల కర్మకాండలు 11 రోజుల పాటు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని రోజులూ వేతనంతో కూడిన సెలవులను ఇచ్చేలా సిఫారసు చేయాలని పదో పీఆర్సీ కమిషనర్ అగర్వాల్కు తెలంగాణ పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హర్షవర్ధన్రెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు పీఆర్సీ కమిషనర్కు ప్రతిపాదనలు సమర్పించారు. కుటుంబీకులు చనిపోయినప్పుడు కర్మకాండలు చేసే వారు 11 రోజులపాటు బయటకు వెళ్లే పరిస్థితి లేనందున వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఆర్జిత సెలవులను 20 పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2013 జూన్ నుంచే అమలు చేయాలి: ఏపీటీఎఫ్ పదో పీఆర్సీ సిఫారసు చేసే నూతన వేతన సవరణ ఆర్థిక లబ్ధిని 2013 జూన్ నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్సీ కమిషనర్కు ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘురామిరెడ్డి, పాండురంగవరప్రసాద్ తదితరులు ఈమేరకు పీఆర్సీ కమిషనర్కు ప్రతిపాదనలను అందజేశారు. ఇంక్రిమెంట్ రేటు 3 శాతం ఉండాలని కోరారు. ఇంటి అద్దె అలవెన్సు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 40 శాతం చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో 30 శాతం ఇవ్వాలని కోరారు. 14.5 శాతం చెల్లిస్తున్న పట్టణాల్లో 25 శాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజప్తి చేశారు. ఇతర గ్రామాలు, పట్టణాల్లో 20 శాతం ఇచ్చేలా సిఫారసు చేయాలన్నారు. -
అక్టోబర్ 31 నాటికి పీఆర్సీ నివేదిక పూర్తికి హామీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ నివేదికను వచ్చే నెల 31 నాటికి పూర్తి చేస్తామని పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ హామీ ఇచ్చినట్టు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి నేతృత్వంలో అగర్వాల్ను కలిసినట్లు వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించి అభిప్రాయాలు సేకరించడం, నివేదిక పూర్తి చేయడం ఈ నెలలో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. అయితే వచ్చేనెల 31 నాటికి నివేదిక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. మరోవైపు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించనున్నట్లు వారు తెలిపారు. -
జాతీయ అండర్-11 లో ప్రియాంక శుభారంభం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చెస్ చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. ఇక్కడి లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సోమవారం జరిగిన బాలికల విభాగంలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన ప్రియాంక... స్థానిక క్రీడాకారిణి కామ్యా నెగిపై విజయం సాధించింది.రెండో సీడ్ వంతిక అగర్వాల్ (ఢిల్లీ)... శ్రుతి కకార్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఓపెన్ కేటగిరీలో టాప్ సీడ్ రామ్ అరవింద్ (తమిళనాడు) తన రాష్ట్రానికే చెందిన పి. దర్శన్పై సునాయాస విజయం సాధించాడు. రెండో సీడ్ సౌరభ్ ఆనంద్... దెబంగా కలిట (అస్సాం)పై నెగ్గాడు. ఈ టోర్నమెంట్లో 26 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఓపెన్ కేటగిరీలో 181 మంది, బాలికల విభాగంలో 101 మంది బరిలోకి దిగారు.