రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు | Theft In Rajendranagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు

Published Sun, Sep 30 2018 10:03 PM | Last Updated on Sun, Sep 30 2018 10:03 PM

Theft In Rajendranagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాగేశ్వరరావు అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారంతో పాటు రెండు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్‌: హైదర్ గూడా పరిధి నలందానగర్లోని ఓ ఇంట్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాగేశ్వరరావు అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారంతో పాటు రెండు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి వెనుక డోర్ పగలగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి సభ్యులు ఓ శుభకార్యానికి బయలుదేరిన కొద్ది సేపటికే దొంగలు తమ చేతులకు పనిచెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement