
పాలమూరు ప్రాజెక్ట్కు రూ.5.73 కోట్లు
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల, పాకాల ప్రాజెక్ట్లపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఇరిగేషన్ అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సాగునీటి శాఖపై బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీష్రావు, ఈటెల రాజేందర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
సర్వే కోసం పాలమూరు ప్రాజెక్ట్కు రూ. 5.73 కోట్లు, జూరాల, పాకాల ప్రాజెక్ట్లకు రూ. 3.03 కోట్ల నిధులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.