
ఇసుక దొంగలు
జోరుగా ఇసుక దందా
ప్రభుత్వ క్వారీ పేరిట అక్రమాలు
వేబిల్లులో 18 టన్నులు.. తెచ్చేది 30 టన్నులు..
సర్కారు ఆదాయానికి రూ.కోట్ల నష్టం
చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
వరంగల్: జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ క్వారీల్లో ఇసుకను తెస్తున్నట్లుగా పేర్కొంటూ కొందరు వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించే డబ్బులకు రెట్టింపు పరిమాణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వరంగల్ కేంద్రంగా ఇసుక వ్యాపారం చేస్తున్న కొందరు రోజు వందల లారీల్లో ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను ప్రభుత్వ క్వారీల్లోనే తెచ్చినట్లు పేర్కొంటూ వినియోగదారులకు అధిక ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నా రు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) మానేరు నదిపై నిర్వహించే క్వారీ నుంచి వరంగల్కు వస్తున్న ఇసుక విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.
వేబిల్లులతో అక్రమాలు
వరంగల్ నగరంలో వేలాది భవన నిర్మాణాలు ఏడాది పొడవునా జరుగుతున్నారుు. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్ ఉంటోంది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు వినియోగదారులకు అధిక ధరకు విక్రయించి దోపిడీ చేసేవారు. అన్ని వర్గాల నుంచి నిరసన మొదలవడంతో ప్రభుత్వం మెల్లిగా చర్యలు చేపట్టింది. నిర్మాణాల్లో అతి ముఖ్యమైన ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వమే ఇసుక క్వారీలను ప్రారంభించింది. టీఎస్ఎండీసీ ఈ క్వారీలను నిర్వహిస్తోంది. క్వారీల నుంచి కొంత దూరానికి ఇసుకను తెచ్చి ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తోంది. ఇలా టీఎస్ఎండీసీ వ్యాపారులకు విక్రయించే గరిష్ట ధరను ప్రభుత్వం టన్నుకు రూ.320(క్యూబిక్ మీటరు రూ.550)గా నిర్ణయించింది. లారీల్లో లోడింగ్ పరిమాణాన్ని బట్టి ఇసుక క్వారీల్లో ధర రెండు రకాలుగా ఉంది. 13.5 క్యూబిక్ మీటర్ల(21 టన్నులు)కు రూ.7425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775గా నిర్ణయించారు. అవసరమైన ఇసుక మేరకు డబ్బును టీఎస్ఎండీసీ పేరిట చెక్కు రూపంలో లారీల నిర్వాహకులు క్వారీ నిర్వహణ అధికారులకు ఇస్తారు. చెక్కులో పేర్కొన్న మొత్తం మేరకు లారీల నిర్వాహకులకు అధికారులు టోకెన్ నంబరు, వే బిల్లు ఇస్తారు. లోడింగ్ చేసుకున్న లారీ వేబిల్లుతో వచ్చి వినియోగదారులకు విక్రయిస్తారు. వేబిల్లుల ప్రక్రియలోనే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
నగరానికి జిల్లాలోని ఏటూరు, కరీంనగర్ జిల్లా మానేరు ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుక వస్తోం ది. పుష్కరాల కారణంగా ప్రస్తుతం ఏటూరు క్వారీ మూతపడింది. దీన్ని ఆసరాగా చేసుకుని మానేరు ఇసుకను వరంగల్కు తీసుకువచ్చి విక్రయిస్తున్న వ్యాపారులు ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మానేరు ఇసుకను తెస్తున్న వ్యాపారుల్లో కొందరు టీఎస్ఎండీసీకి 18 టన్ను ల మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారు. వినియోగదారులకు విక్రయించేటప్పుడు మాత్రం వీరి లారీల్లో ఇసుక 30 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు చొప్పున ఉంటోంది. ప్రభుత్వ క్వారీలో లోడింగ్ చేసేటప్పు డే అనధికారికంగా అధిక పరిమాణంలో లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల్లో కొందరు మాత్రం అసలు విషయం చెబుతున్నారు. ప్రభుత్వ క్వారీల్లో వేబిల్లో పేర్కొ న్న ప్రకారమే లోడింగ్ చేస్తున్నారు. మధ్యలో మరోచోట అక్రమంగా తవ్వి లారీల్లో నింపుకొస్తున్నారు. ఇలా వరంగల్ జిల్లాకు వచ్చే సరికి ఇసుక పరిమా ణం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. దీని వల్ల ఒక్కో లారీ లోడ్కు ప్రభుత్వానికి రూ.7 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం జరుగుతోంది. నెలకే ఈ మొత్తం కోట్ల రూపాయల్లో ఉంటోంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టే ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అధికారులు ఈ విషయంలో చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.