మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో జాబ్మేళా ప్రారంభమైంది. ఆణిముత్యాలు పేరుతో ఈ మేళాను సింగరేణి జీఎం వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకుని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం 1,500 మంది యువతీయువకులు హాజరై పేర్లు నమోదు చేయించుకున్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.
మందమర్రిలో సింగరేణి జాబ్మేళా
Published Fri, Jan 29 2016 12:46 PM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM
Advertisement
Advertisement