- రాష్ట్ర ప్రభుత్వ బృందంతో సూరత్లోని తెలంగాణ కార్మికులు
సాక్షి, హైదరాబాద్ : వరంగల్లో టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని సూరత్లో అధ్యయనానికి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ బృందం నిర్ధారించింది. ఎంపీ కడియం శ్రీహరి సారథ్యంలోని ఉన్నతస్థాయి బృందం గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 2 లక్షల మంది సూరత్లో వస్త్ర పరిశ్రమలో జీవనోపాధి పొందుతున్నారని ఈ బృందం గుర్తించింది. అక్కడి తెలంగాణ కార్మికులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్లో టెక్స్టైల్ పార్కు నెలకొల్పితే స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు కార్మికులు తెలిపారు.