Textile industry
-
అందని దారం.. వ్రస్తోత్పత్తి ఆగం
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి గండి స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది. మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.సమస్య ఏంటంటే..!ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.మహిళాశక్తి చీరల ఊసేది?సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాంకొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్రావు, టెస్కో జీఎం, హైదరాబాద్ -
వస్త్ర రంగం అభివృద్ధికి ‘జీటీటీఈఎస్ 2025’లో చర్చలు
భారతదేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తూ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులపై ఇటీవల చర్చ జరిగింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 2025 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన గ్లోబల్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (జీటీటీఈఎస్ 2025) వస్త్ర పరిశ్రమకు కీలకంగా మారింది. ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మెషినరీ ఎగ్జిబిషన్స్ సొసైటీ (ఐటీఎంఈ సొసైటీ) నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమంలో టెక్స్టైల్ టెక్నాలజీలో పురోగతిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ వర్గాలు, ఆవిష్కర్తలు, వాటాదారులు ఒకచోట చేరారు.జీటీటీఈఎస్ 2025 ముఖ్యాంశాలుభారత టెక్స్టైల్ కమిషనర్ రూప్రాశి మహాపాత్ర, దక్షిణాఫ్రికా, బెలారస్, బుర్కినా ఫాసో వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో రోజున సెషన్ను ప్రారంభించిన అనంతరం ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్, స్టీరింగ్ కమిటీ మెంబర్ కేతన్ సంఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్గఢ్ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-2030ను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఈ వేదిక కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్తోపాటు వ్యూహాత్మక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగం పురోగతికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.ఛతీస్గఢ్ రాష్ట్ర పారిశామిక కార్పొరేషన్ అభివృద్ధి సభ్యులు, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ శుక్లా మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 24 ఏళ్లల్లో ఎగుమతులు 35.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.97 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 2.3 శాతానికి సమానమని తెలిపారు. జాతీయ ఎగుమతులకు ఈ పరిశ్రమ 10.5 శాతం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాంగీర్చంపాలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమతో భవిష్యత్తులో ఛతీస్గఢ్ వస్త్ర కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25,000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు, 1,400 కంటే ఎక్కువ నమోదిత సార్టప్లతో రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా మాటాడుతూ..‘మేము ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు దైపాక్షిక వాణిజ్యం, దిగుమతి-ఎగుమతులు పెంచడంలో, పెట్టుబడుల పరంగా రెండు వైపులా ఉన్న కంపెనీలకు సాయం అందించడంలో విజయం సాధించాం. వస్త్ర రంగంలో పనిచేయడంతోపాటు ప్రపంచ పర్యటనలో భాగంగా ఏ ప్రాంతాన్ని సందర్శించినా హాస్పిటాలిటీ రంగం రంగం మా అజెండాలో భాగంగా ఉంటుంది. ఆయా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐడీస్ పర్సనల్ కన్సలెంట్ పురోహిత్, గురత్ భాటియా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్ తదితరులు ఉన్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్కు రోడ్ మ్యాప్జీటీటీఈఎస్ 2025లో 39 దేశాలకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, వ్యాపార సహకారాలకు కేంద్రంగా పనిచేసింది. స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజిటల్ ప్రింటింగ్, టెక్స్టైల్ రీసైక్లింగ్లో పురోగతితో సహా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ టెక్స్ టైల్ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులను ఈ కార్యక్రమంలో హైలైట్ చేశారు. ఎక్స్క్లూజివ్ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వాటాదారుల జాయింట్ వెంచర్లు, వాణిజ్య సహకారాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ప్రపంచ టెక్స్టైల్ మెషినరీ మార్కెట్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో చర్చలు జరిగాయి. -
ఏటా రూ.9 లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రతిఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2030ని డెడ్లైన్గా విధించింది. అయితే, గడువు కంటే ముందే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న విశ్వాసం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ‘భారత్ టెక్స్–2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్త్రాల ఎగుమతిలో ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని తెలిపారు. మనం ప్రతిఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దీన్ని మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో వస్త్ర టెక్స్టైల్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మనం ఇలాగే కష్టపడి పనిచేస్తే గడువు కంటే ముందే ఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయగలమని స్పస్టంచేశారు. టెక్స్టైట్ రంగంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.75 కోట్లు అవసరమని, దీంతో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంక్లకు సూచించారు. వస్త్ర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 5ఎఫ్ విజన్ను ప్రధానమంత్రి ప్రతిపాదించారు. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ విజన్తో రైతులకు, నేత కార్మికులకు, డిజైనర్లకు, వ్యాపారులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన నూతన పరికరాల తయారీ కోసం ఐఐటీల వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. భారత్ టెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హై–గ్రేడ్ కార్బన్, ఫైబర్ తయారీ దిశగా మన దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
టెక్స్టైల్స్, అప్పారెల్ (వస్త్రాలు, దుస్తులు) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్–అక్టోబర్) 21.35 బిలియన్ డాలర్లకు (రూ.1.82 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే ఏడు శాతం వృద్ధి నమోదైంది. 8,733 మిలియన్ డాలర్ల(USD) ఎగుమతులు (మొత్తం ఎగుమతుల్లో 41 శాతం) రెడీమేడ్(readymade) వస్త్ర విభాగంలోనే నమోదయ్యాయి.కాటన్ టెక్స్టైల్స్ విభాగం నుంచి 7,082 మిలియన్ డాలర్లు (33 శాతం), మనుషుల తయారీ టెక్స్టైల్స్ ఎగుమతులు 3,105 మిలియన్ డాలర్లు (15 శాతం) చొప్పున ఉన్నట్టు కేంద్ర టెక్స్టైల్స్(Textile) శాఖ గణాంకాలు విడుదల చేసింది. వూల్ విభాగంలో 19 శాతం, హ్యాండ్లూమ్ విభాగంలో 6 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించగా, మిగిలిన అన్ని విభాగాల్లో ఎగుమతుల వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు ఇదే కాలంలో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు ఒక శాతం క్షీణించి 5,425 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రకటించింది. అత్యధికంగా మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్ దిగుమతులు 1,859 మిలియన్ డాలర్లు (34 శాతం)గా ఉన్నాయి. కాటన్ టెక్స్టైల్స్ విభాగంలో, ప్రధానంగా కాటన్ ఫైబర్(Cotton Fiber) దిగుమతులు పెరిగినట్టు టెక్స్టైల్స్ శాఖ నివేదిక వెల్లడించింది. ఇది దేశీ తయారీ సామర్థ్యం పెరగడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అంతర్జాతీయంగా 3.9 శాతం వాటా..2023–24లో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు 8.94 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం తగ్గాయి. 2023 సంవత్సరం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా ఆరో అతిపెద్ద దేశంగా నిలిచింది. ‘టెక్స్టైల్స్, అప్పారెల్ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. యూఎస్ఏ, ఈయూ 47 శాతం వాటాతో భారత్కు అతి పెద్ద ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. టెక్స్టైల్స్, అప్పారెల్ పరంగా వాణిజ్య మిగులుతో మన దేశం ఉంది.’అని టెక్స్టైల్స్ శాఖ వెల్లడించింది. -
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
Chandana Jayaram: వస్త్రోత్పత్తుల సోయగం! హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్లు..సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్లు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్లెస్–స్టీల్ వాచ్ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
బంగ్లా బ్రాండ్ ను అందిపుచ్చుకోగలమా!
సాక్షి, అమరావతి : కోవిడ్ సంక్షోభంతో తయారీ రంగం చైనా నుంచి ఇండియాకు ఏ విధంగా మారుతోందో.. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడ్డ సంక్షోభం దేశంలోని టెక్స్టైల్ రంగానికి సదవకాశాన్ని అందిస్తోంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇదో మంచి చాన్స్గా టెక్స్టైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మంచి వనరులు, ఎగుమతికి అన్ని అవకాశాలు ఉన్న మన రాష్ట్రంలో దుస్తుల తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను తయారు చేసి, ఎగుమతి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్లో దుస్తుల తయారీ, సంబంధిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల దుస్తులు అత్యధికంగా బంగ్లాదేశ్లోనే తయారవుతుంటాయి. ఈ దేశం నుంచి నెలకు సగటున రూ.31,540 కోట్లు విలువచేసే దుస్తులు ఎగమతి అవుతుంటాయి. అంటే ఏటా 3.60 లక్షల కోట్లకు పైగా విలువైన ఎగుమతులు ఒక్క టెక్స్టైల్ రంగంలోనే ఉంటాయి. బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, కర్ఫ్యూ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ప్రపంచ టెక్స్టైల్ రంగం ఉలిక్కిపడింది. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం అందిపుచ్చుకున్నా ఇండియా నుంచి ప్రతి నెలా రూ.3,320 కోట్ల ఎగుమతులు అదనంగా చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని, బంగ్లాదేశ్ సంక్షోభంతో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనంబంగ్లాదేశ్ సంక్షోభాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంటే రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అనకాపల్లిలో బ్రాండిక్స్, పులివెందులలో బిర్లా గార్మెంట్స్ తప్ప అతిపెద్ద గార్మెంట్స్ తయారీ సంస్థలు లేవు. కోవిడ్ తర్వాత ఎల్రక్టానిక్స్, ఫార్మా రంగాల్లో పీఎల్ఐ స్కీం కింద రాష్ట్రం అవకాశాలు అందిపుచ్చుకున్న విధంగానే ఇప్పుడు గార్మెంట్స్ రంగంలో అందివచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన వనరులన్నీ రాష్ట్రంలో ఉన్నాయని చెబుతున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభం స్వల్పకాలంలో రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు ఇబ్బందులకు గురి చేసినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టెక్స్టైల్ మాన్యుఫాక్చరింగ్ డైరెక్టర్ సుధాకర్ చౌదరి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం బంగ్లా సంక్షోభంతో తమిళనాడులోని తిరుపూర్, పంజాబ్లోని లూథియానా బాగా ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు. బంగ్లా సంక్షోభం ప్రభావం వల్ల నూలు ఎగుమతులు కొంతమేరకు దెబ్బతిని, స్పిన్నింగ్ మిల్లులు ఇబ్బందుల్లో పడ్డాయి. కొంత కాలంగా రాష్ట్ర టెక్స్టైల్ అమ్మకాలు అంతంతగానే ఉంటున్న సమయంలో బంగ్లాదేశ్ సంక్షోభం మరింతగా భయపెట్టినా, వెంటనే సమసి పోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యాదర్శి మల్లేశ్వర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో పత్తి బేళ్లు, యార్న్ బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతున్నాయని, అదే దేశీయంగా గార్మెంట్ పరిశ్రమలు వస్తే స్థానికంగానే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగంలో తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్తోపాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉందని, దీన్ని తట్టుకునేలా టెక్స్టైల్స్ పాలసీలో ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 21,000 మంది పనిచేస్తున్న బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ పార్కు, వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ బ్రాండ్ల గార్మెంట్స్ తయారు చేసే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్. ఇవి కాకుండా అరవింద్, వర్థమాన్, గోకుల్దాస్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్,టోరే, షోర్ టు షోర్, యూనిచార్మ్, వంటి ప్రముఖ బ్రాండ్ల యూనిట్లు ఉన్నాయి. ఏపీ టైక్స్టైల్స్ రంగంఏటా 5,970 టన్నుల పట్టు (సిల్్క) ఉత్పత్తితో దేశంలోరెండో స్థానంఏటా 19 లక్షల బేళ్ల పత్తినిఉత్పత్తితో దేశంలో ఏడో స్థానంఏటా 3.6 కోట్ల స్పిండిల్స్ తయారు చేస్తూ ఈ రంగంలో ఏపీ 7% వాటా కలిగి ఉంది100రాష్ట్రంలో స్పిన్నింగ్, టెక్స్టైల్స్కంపెనీలు18,000పవర్లూమ్స్,23 ప్రోసెసింగ్యూనిట్లు,653 చేనేతరెడిమేడ్ గార్మెంట్స్ యూనిట్లు ఉన్నాయి -
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
‘పీఎల్ఐ పథకం విస్తరణ’... ఏ రంగానికి.. ??
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్)లో పాల్గొని మాట్లాడారు.‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్ మేడ్ ఫైబర్(ఎంఎంఎఫ్) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్మ్యాప్ను రూపొందిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల పథకం(ఎస్ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్టైల్ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్టైల్ పార్కులు మంజూరయ్యాయి. -
సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్టెక్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్టెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాక్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్టెల్స్, జియో టెక్స్టైల్స్లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్ టెక్స్టైల్స్) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్)కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. ♦ మొబిటెక్: కియా, ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్టెక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ♦ జియో టెక్స్టైల్స్: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో జియో ట్యూబులు, జియో బ్యాంగ్లకు డిమాండ్ ఉంది. ఓడరేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. ♦ ఆగ్రోటెక్ టెక్స్టైల్స్: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్ నెట్లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్టైల్స్కు అవకాశాలు ఉన్నాయి. చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ౖటెల్స్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రోటెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్టైల్స్కు 30 శాతం డిమాండ్ ఉంది. అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్.. టెక్నికల్ టెక్స్టైల్స్లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది.. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్టైల్స్.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్టైల్స్కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది. – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. జిల్లా ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు అనంతపురం సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్లు చిత్తూరు శానిటరీ ప్యాడ్స్ తూర్పుగోదావరి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు ప్రకాశం కన్వేయర్ బెల్ట్ పశ్చిమగోదావరి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం విశాఖపట్నం సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు -
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్టైల్పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్టైల్పార్క్లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్లూమ్స్పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
ఆధునిక మగ్గాలు ఆగాయి
సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్టైల్పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్క్లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు. వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఉపాధి లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్టైల్ పార్క్లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్ను అమ్మేసుకున్నారు. విద్యుత్ చార్జీలూ భారమే టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. నెలకు రూ.12వేలు వచ్చేవి పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉంది మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్దాస్ అనిల్కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్టైల్స్కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
హోమ్ టెక్స్టైల్ పరిశ్రమకు పునరుజ్జీవం
ముంబై: హోమ్ టెక్స్టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్టైల్లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎగుమతులు పెరుగుతాయి.. భారత హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది. ‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది. -
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
హిందూపూర్లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా దీపాలీ..
‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్స్పన్’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్టెల్ కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా... రాజస్థాన్లోని జైపుర్కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్స్పన్’ చైర్మన్ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) తొలిరోజుల్లో ‘బాస్ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్ షూటర్గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?) ఇంతలోనే కోవిడ్ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు ఇండియన్ మార్కెట్పై కూడా దీపాలీ దృష్టి సారించింది. ‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ. ఈఎస్జీ–ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్ వాటర్ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు. ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం. -
టెక్స్టైల్ పార్క్కు సహకరించడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. భారత్ బ్రాండ్ పేరుతో యూరియా నానో యూరియాతో పాటు భారత్బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్క్రెడిట్కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు. ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. ♦ 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్రెడ్డి వివరించారు. అవేంటంటే... ♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత ♦ రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం. ♦ సించాయ్యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి. ♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు. ♦ రూ.23,948 కోట్లతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు. ♦ ఆయిల్ పామ్ మిషన్ కింద రూ.214 కోట్లు. ♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ. ♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు ♦ తెలంగాణలో ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
టెక్స్టైల్ పార్కుల పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, ఆదాయ, వృత్తి నైపుణ్యం పెంచేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. బీఆర్కే భవన్లో ఆయన జౌళి శాఖపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్ టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అత్యంత సులభంగా నేతన్నలకు అందేలా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ టెక్స్టైల్ పార్కులు, ఆప్పారెల్ పార్కుల అభివృద్ధిని చేపట్టిందన్నారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులుంటే వెంటనే వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ లెవెల్ క్లస్టర్ల పనితీరుపైన, వాటి పురోగతి పైన వెంటనే నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పవర్లూమ్పై కూడా... రాష్ట్రంలో ఉపాధి కోసం నేతన్నలు విస్తృతంగా ఆధారపడిన పవర్లూమ్ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం దేశంలోనే ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ మాదిరి ఒక సమీకృత పద్ధతిన,అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్ లూమ్ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.ఇందుకోసం తిర్పూర్లో పర్యటించి అనేక అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు ఎల్.రమణ, గూడూరి ప్రవీణ్, టెక్స్ టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్ (ఫార్మ్–ఫైబర్–ఫ్యాక్టరీ–ఫ్యాషన్–ఫారిన్) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు మోదీ శుక్రవారం ట్వీట్లో తెలిపారు. తెలంగాణలో వరంగల్తో పాటు ఉత్తర్ప్రదేశ్ (లక్నో), మధ్యప్రదేశ్ (ధార్), మహారాష్ట్ర (అమరావతి), తమిళనాడు(విరుదునగర్), కర్ణాటక (కల్బుర్గి), గుజరాత్ (నవ్సారీ)ల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కలి్పంచేందుకు అవకాశం ఉండనుంది. అంతేగాక ఒక్కో మెగా టెక్స్టైల్ పార్కు సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది. మోదీ ఇచ్చిన మాట మేరకు.. లక్షలాదిమంది రైతులకు, చేనేత కారి్మకులకు ఉపయోగపడటంతోపాటు, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణకు ప్రకటించటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన విజయ సంకల్పసభలో మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణకు ఇస్తామన్న ప్రధాని ఇచి్చన మాటకు కట్టుబడి అధికారికంగా ప్రకటన చేశారని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వ్రస్తాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు. కాకతీయ మెగా టెక్స్టైల్కు ఊతం.. ‘ఫైబర్ టు ఫ్యాబ్రిక్’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా లోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని 1200 ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ను ఏర్పాటు చేసింది. 2017లో ఈ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన టీఎస్ఐఐసీ ద్వారా కొంత మేర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పను లు కూడా జరిగాయి. అంతర్గత రహదారులు, విద్యుత్ తదితర వసతులను సమకూర్చడంతో యంగ్వన్, గణేశా ఈకో వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి. అయితే దీనికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కలి్పంచేందుకు రూ.897 కోట్లు ఇవ్వాలని గతంలో మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో కేంద్రా నికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పీఎం మిత్ర’టెక్స్ టైల్ పార్కు పథకంలో వరంగల్ను చేర్చడం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కొత్తగా కాలుష్య శుదీ్ధకరణ ప్లాంటు, ఇతర మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో టీఎస్ఐఐసీ ద్వారా కొంత మేర వసతుల కల్పన జరిగిందన్నారు. ఇప్పుడు ‘పీఎం మిత్ర’ కింద ఎంత మేర నిధులు వస్తాయనే సమాచారం ఇంకా తమకు అందలేదన్నారు. -
వెల్ స్పన్ టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
అరవింద్ లాభం డౌన్!
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది. చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం -
కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా.. తెలంగాణకు దక్కింది శూన్యమే
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా తెలంగాణతోపాటు టెక్స్టైల్ రంగానికి దక్కింది శూన్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ చివరిదని, అందులో నేత కార్మికులు, టెక్స్టైల్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు. ఈమేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాధాన్యతను కేంద్రం గుర్తించడం లేదని, రూ.1600 కోట్లతో చేపట్టిన ఈ పార్క్లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం లేనందునే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల విధానం లేనందునే మేకిన్ ఇండియా నినాదంగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సహకరించాలని కోరారు. మెగా క్లస్టర్కు రూ.100 కోట్లు ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 25 వేల మరమగ్గాలు ఉన్నందున మెగా క్లస్టర్గా గుర్తించి రూ.100 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల కోసం రూ.990 కోట్లు కేటాయించాలన్నారు. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరమగ్గాల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ‘ఇన్–సిటు పవర్లూమ్ అప్గ్రెడేషన్’కింద 13వేల మరమగ్గాల ఆధునికీరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రంలో 40వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నందున ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమలో 80శాతం చిన్న, సూక్ష్మ యూనిట్లు ఉన్నందున పన్నుల భారం తగ్గించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలి’అని కోరారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ టెక్స్టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. టెక్స్టైల్ రంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండూŠల్మ్, పవర్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ మండళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పీఎల్ఐ పథకంతో టెక్స్టైల్స్లోకి
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమ రూ. 1,536 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన 56 దరఖాస్తుదారులకు ఇప్పటికే అనుమతి పత్రాలను జారీ చేసినట్లు వివరించింది. దేశీయంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్, తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం టెక్స్టైల్స్ రంగం కోసం రూ. 10,683 కోట్లతో పీఎల్ఐసీ స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ దరఖాస్తులు స్వీకరించింది. 64 దరఖాస్తుదారులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా, 56 దరఖాస్తుదారులు కొత్త కంపెనీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. దీనితో వారికి అనుమతి పత్రాలను కేంద్రం జారీ చేసింది. -
తెలంగాణ చేనేతకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రపంచ మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని అమెరికాకు చెందిన చేనేత, వస్త్ర పరిశోధకురాలు కైరా వెల్లడించారు. భారత్లో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఇతర దుస్తులు, ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమను అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ విస్తృతి పెరుగుతుందని ఆమె తెలిపారు. చేనేత, వస్త్ర రంగంపై పరిశోధనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కైరా బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనలో తాను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్కు వివరించారు. మరమగ్గాల కార్మికులు డబుల్ జకార్డ్ వంటి వినూత్న టెక్నిక్తో వస్త్రాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో జరుగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై తాను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు 9 దేశాల్లో పర్యటించగా, చేనేత అధ్యయనానికి భారత్లో తెలంగాణను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్లు కైరా చెప్పారు. చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు. -
వస్త్ర ఎగుమతులకు భారత్–యూఏఈ ఎఫ్టీఏ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే.. యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్ను ఒక సోర్స్గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు. -
హస్తకళాకారులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ హస్త కళలు, టైక్స్టైల్స్ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్కు చెందిన గద్దె అశోక్కుమార్ (సిల్వర్ ఫిలిగ్రీ)కి అందజేసినట్లు తెలిపింది. ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్లో కొండ్ర గంగాధర్ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. పీయూష్ గోయల్ నుంచి అవార్డు అందుకుంటున్న గద్దె అశోక్కుమార్ -
నకిలీ వస్త్రాలతో అడ్డంగా దొరికిన షాపింగ్ మాల్ యాజమాన్యం..
-
లాభాల్లో వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్
న్యూఢిల్లీ: వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం ఎగసి రూ.125 కోట్లు సాధించింది. టర్నోవర్ 2.93 శాతం అధికమై రూ.2,170 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 3.5 శాతం హెచ్చి రూ.2,072 కోట్లుగా ఉంది. వస్త్రాల ద్వారా ఆదాయం 1.88 శాతం పెరిగి రూ.1,759 కోట్లకు, అడ్వాన్స్ మెటీరియల్స్ 5 శాతం అధికమై రూ.313 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే అరవింద్ లిమిటెడ్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 1.88 శాతం తగ్గి రూ.94 వద్ద స్థిరపడింది. -
టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా, వియత్నాం దేశాలతో పోటీపడేందుకు ఇది పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని. టెక్స్టైల్స్ రంగానికి ప్రకటించిన పీఎల్ఐ పథకం పనితీరుపై ఆ శాఖ వ్యవహరాలను చూస్తున్న గోయల్ సమీక్షించారు. టెక్స్టైల్స్ పీఎల్ఐ 2.0 ప్రకటించానికి ముందు భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో బలమైన పోటీనిచ్చే విధంగా పీఎల్ఐ 2.0ని రూపొందించాలన్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఉపాధి అవకాశాల కల్పనకు, ఎగుమతులు, వృద్ధి బలోపేతానికి తగినన్ని సామర్థ్యాలు టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉన్నట్టు చెప్పారు. -
స్పిన్నింగ్ పరిశ్రమపై మాంద్యం దెబ్బ
కొరిటెపాడు (గుంటూరు): కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆ ప్రభావం స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కోవిడ్ విపత్తు తర్వాత ఆర్డర్లులేని పరిస్థితుల్లో ముడిసరుకు దూది ధరకంటే నూలు ధర తక్కువ కావడం, ఎగుమతులు క్షీణించడం.. స్వదేశీ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వంటి వరుస పరిణామాలు పరిశ్రమను వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం స్పిన్నింగ్ మిల్లులకు రూ.947 కోట్లు రాయితీలను బకాయి పెడితే కోవిడ్ కష్టాలను గమనించిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.380 కోట్ల బకాయిలను చెల్లించింది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండంతో మిల్లులను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగి మిల్లులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి ప్రకటించారు. 50 శాతం ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమల అసోసియేషన్ గత సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని తీర్మానం చేసిందని, కానీ.. ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించిన దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాలబారి నుంచి బయటపడాలని నిర్ణయించినట్లు రఘురామిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను, ఎంసీఎక్స్ను కట్టడిచేసి, పత్తి ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కోరారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం కరోనా వేళ గతేడాది సెప్టెంబర్లో రూ.237 కోట్లు విడుదలచేసి ఆదుకుందన్నారు. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. -
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్కు చెందిన పాలియెస్టర్ బిజినెస్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్లో ఈ తప్పులు చేయకండి! -
ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు పరిశీలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ జీఎడ్ పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఏర్పాటు చేయనున్న ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 1,188 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ.. అప్పట్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ హెచ్ఎస్ నంద నేతృత్వంలోని కేంద్రబృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులతో పాటు టెక్స్టైల్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ టెక్స్టైల్ అసోసియేషన్లతో బృందం సమావేశమై రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను చర్చించింది. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలు, ప్రయోజనాలను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని నంద పేర్కొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర బృందం కడపకు వెళ్లింది. శనివారం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని భూములను బృందం పరిశీలించనుంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్, సీజీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
టెక్స్టైల్ పార్క్ మూసివేత
సిరిసిల్ల: కార్మికుల దినోత్సవం రోజునే టెక్స్టైల్ పార్కు మూతపడింది. మరమగ్గాలపై నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూని ట్లను ఆదివారం మూసివేశారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్లో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని ఆధునిక మరమగ్గాలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆదివారం మొత్తం పరిశ్రమలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే 1,500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే టెక్స్టైల్ పార్క్ మూతపడటం చర్చనీయాంశమైంది. కరెంట్ ‘షాక్’ కారణం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైంది. ఇక్కడ 7,000మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాల్సి ఉండగా.. 3వేల మందికే పని లభిస్తోంది. పార్క్లో 113 యూనిట్లలో (1,695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంక్షోభానికి గురైన 25మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్ను అమ్మేసుకున్నారు. వసతుల లేమి.. విద్యుత్ చార్జీల భారం పార్క్లోని పరిశ్రమ లకు శాపంగా మారాయి. సిరిసిల్లలోని పాత మర మగ్గాలకు 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అమ లుచేస్తోంది. అదే టెక్స్టైల్ పార్క్లో వస్త్రోత్పత్తిదా రులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీ రూ.3గా ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా.. అంతకుమించి వినియోగిస్తే.. ప్రతి యూనిట్కు రూ.2.50గా ఉంది. గతంలో టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లకు.. 2014 డిసెంబర్ నాటికి 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. మరోవైపు నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. యజమానుల డిమాండ్లు ఇవీ.. ♦2015 జనవరి – 2020 డిసెంబర్ వరకు విద్యుత్ సబ్సిడీ రీయింబర్స్ చేయాలి. ♦పార్క్లో మరమగ్గాల ఆధునీకరణకు, కొత్త యూనిట్లకు 25% ప్రోత్సాహకం ఇవ్వాలి. ♦పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకు ‘ఎన్వోసీ’ సరళతరం చేయాలి. ♦టెక్స్టైల్ పార్క్లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటు చేయాలి. ♦ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లను 25% టెక్స్టైల్ పార్క్కు ఇవ్వాలి. ♦యువకులకు మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. మంత్రి కేటీఆర్ చొరవచూపాలి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ చొరవచూపి ఆదుకోవాలి. ప్రధానంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ రాయితీ రీయింబర్స్మెంట్ అందించాలి. – అన్నల్దాస్ అనిల్కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
61 ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్,టెక్స్టైల్స్లో రూ.19,000 కోట్ల పెట్టుబడులు!
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. 61 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి రూపంలో రూ.19,077 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రూ.1,84,917 కోట్ల టర్నోవర్ నమోదు అవుతుందని.. 2.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. పీఎల్ఐ కింద మొత్తం 67 ప్రతిపాదనలు అందాయని టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వెల్లడించారు. గిన్ని ఫిలమెంట్స్, కింబర్లీ క్లార్క్, అరవింద్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. పీఎల్ఐ పథకం కింద ఎంఎంఎఫ్ (మానవ తయారీ) వ్రస్తాలు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తులు తదితర వాటి తయారీపై ఐదేళ్ల కాలంలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దేశీయంగా టెక్స్టైల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించుకోవడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. పార్ట్–2 కింద ఎక్కువ దరఖాస్తులు మొత్తం 67 దరఖాస్తుల్లో పార్ట్1 కింద 15 రాగా, పార్ట్2 కింద 52 వచ్చాయి. పార్ట్1 కింద కనీసం రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలు పొందాలంటే రూ.600 కోట్ల టర్నోవర్ నమోదు చేయాలి. పార్ట్2 కింద కనీస పెట్టుబడి పరిమితి రూ.100 కోట్లు. కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. గిన్ని ఫిలమెంట్స్, అవ్గోల్ ఇండియా, గోవా గ్లాస్ ఫైబర్, హెచ్పీ కాటన్ టెక్స్టైల్స్ మిల్స్, కింబర్లీ క్లార్క్ ఇండియా, మధుర ఇండ్రస్టియల్ టెక్స్టైల్స్, ఎంసీపీఐ ప్రైవేటు లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్పోర్ట్స్, ట్రిడెంట్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో అరవింద్ లిమిటెడ్ రూ.170 కోట్లు, గిన్ని ఫిలమెంట్స్ రూ.180 కోట్లు, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ రూ.143 కోట్లు, కింబర్లీ క్లార్క్ ఇండియా రూ.308 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆమోదం పొందిన 61 ప్రతిపాదనల్లో ఏడు విదేశీ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి. మరిన్ని ఎగుమతులు.. అంతర్జాతీయంగా మానవ తయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్టైల్స్లో భారత వాటా పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని యూపీ సింగ్ తెలిపారు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఎగుమతులను 2 బిలియన్ డాలర్ల నుంచి 8–10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం గురించి సింగ్ మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల నుంచి 17 ప్రతిపాదనలు వచి్చనట్టు చెప్పారు. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఏడు పార్క్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. -
‘లాయల్ టెక్స్టైల్స్’లో భారీ అగ్ని ప్రమాదం
నాయుడుపేట టౌన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు పరిశ్రమల కేంద్రంలో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం మేరకు.. పరిశ్రమలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రావడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్ని మాపక శాఖ ఇన్చార్జి అధికారి టి.చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్చించారు. పరిశ్రమలోని దూది గోదాముతో పాటు వస్త్రాలు భద్రపరిచే గోడౌన్లను మంటలు చుట్టముట్టాయి. రాత్రి పొద్దు వరకు కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి వెళ్లి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. -
టెక్స్టైల్ చక్కగా.. ప్లాన్ పక్కాగా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పథంలో వెళ్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ వస్త్ర రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కేటీఆర్ టెక్స్టైల్ శాఖ తరఫున చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు బడ్జెట్లో పొందుపరచాల్సిన వివిధ అంశాలపై సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెక్స్టైల్ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. గత ఏడున్నరేళ్లుగా ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్న కార్యక్రమాలను తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవవనరులను, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్లో ఐటీ టవర్, టైక్స్టైల్ పార్క్
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్లో త్వరలో ఐటీ టవర్తోపాటు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సంజీవ్ దేశ్పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరిస్తే కొత్త కంపెనీ తరహాలో రాయితీలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పలువురు జిల్లా నేతలు బుధవారం మంత్రి కేటీఆర్తో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశా లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుం డగా, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థను అమ్మేందుకు కుట్ర చేస్తోందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తే, సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపింద న్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధర ణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ చేపడ తామని ఆ జిల్లా నేతలు వెల్లడించారు. ఈ విష యమై బీజేపీ ఎంపీపై ఒత్తిడి తెస్తామన్నారు. అటవీ భూములపై హక్కులిచ్చేందుకు సానుకూలం ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. టీఆర్ఎస్కి చెందిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రగతిభవన్లో కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యలపై త్వరలో ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల ప్రతినిధులు కేటీఆర్ను కోరారు. భేటీలో ప్రభుత్వ విప్ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం
సాక్షి, అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రకటించిన ఆఫర్ల కారణంగా ఆప్కో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పండుగ సీజన్లలో అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. పండుగ సీజన్లలో 30 శాతం డిస్కౌంట్పై ఆప్కో అమ్మకాలు సాగించడంతో ఆప్కో షోరూమ్ల ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా రూ.9 కోట్లకుపైగా వస్త్ర విక్రయాలు జరిగాయి. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు రాష్ట్రంలోని పలు సొసైటీల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల నిల్వలను కరోనా కష్టకాలంలోనూ కొనుగోలు చేస్తున్న ఆప్కో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సొసైటీల్లో పేరుకుపోయిన రూ.కోటి 60 లక్షల విలువైన బెడ్షీట్లను ఆప్కో కొనుగోలు చేసి విక్రయాలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 ఆప్కో షోరూమ్లున్నాయి. వాటిలో నామ మాత్రపు విక్రయాలు జరిగే వాటిని తొలగించి వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఆప్కో సిద్ధమైంది. అయితే ఇటీవల ప్రారంభించిన గుంటూరు, ఒంగోలు, కడపలో రోజుకు రూ.లక్షకుపైగా అమ్మకాలు జరగడంతో రాష్ట్రంలో మరో పది మెగా షోరూమ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
వస్త్ర పరిశ్రమకు ఊరట
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్టైల్స్) జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడంతో అత్యవసరంగా జీఎస్టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్టైల్స్పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్పై 18 శాతం, మానవ తయారీ యార్న్పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం. డిమాండ్ల వల్లే.. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు.. టెక్స్టైల్స్పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు. -
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
జీఎస్టీ పెంపు కార్మికులపై సమ్మెట పోటు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమపై జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించనున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. జీఎస్టీ పెంపుతో దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మందికి ఇది సమ్మెట పోటులాంటిదని కేటీఆర్ అభివర్ణించారు. చేనేత కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. జీఎస్టీ పెంపు ద్వారా చేనేత, జౌళి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, దాంతో సామాన్యులు ఇబ్బంది పడతారని, కొనుగోళ్లు తగ్గి వస్త్ర, దుస్తుల తయారీ యూనిట్లు నష్టాలబారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నేతన్నలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా ముందుకు వెళితే వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఉద్యమించినట్లుగానే నేత కార్మి కులు కూడా తిరగబడతారన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు వస్త్ర పరిశ్రమ, పారిశ్రామికవర్గాలు, నేత కార్మికులకు తెలంగాణ తరపున అండగా నిలబడతామన్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ను ఉద్దేశిస్తూ జీఎస్టీ పెంపు ప్రతిపాదనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ మీ సొంత పార్టీకి చెందిన కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ సహా య మంత్రి దర్శనా వి జర్దోశ్తో పాటు గుజరా త్ బీజేపీ అధ్యక్షుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా మాట సరే.. కనీసం గుజరాత్ గొంతునైనా వినండి పీయుష్ గారూ’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వస్త్ర పరిశ్రమపై GST పిడుగు...
-
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
AP: పెట్టుబడులకు పెట్టని కోట
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. పాత బకాయిలు సైతం.. గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు.. ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం ఇలా.. ► జపాన్కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. ► తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక స్వయంగా ప్రకటించారు. ► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్ బ్యాంక్, రూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యూనిట్ను సెల్కాన్ రెజల్యూట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్ఆర్ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ► యాపిల్, రెడ్మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ సెల్ఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్ ఫల్గర్ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ► రాష్ట్రం నుంచి కియా మోటార్స్ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో సరికొత్త నినాదం.. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
జీఎస్టీ పెంపు సరికాదు వస్త్రపరిశ్రమ బతికి బట్టకట్టలేదు
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్త్ర పరిశ్రమపై 7 శాతం జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఇప్పటికే 5 శాతం విధిస్తున్న పన్నుకు ఇప్పుడు 7 శాతం పెంచడం వల్ల 12 శాతానికి చేరుతుందని, దీంతో ఆ పరిశ్రమ కుదేలవుతుందని చెప్పా రు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం లేఖ రాశారు. జనవరి 1 నుంచి అమలుకానున్న 7 శాతం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో చేనేతరంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ రంగమని, అలాంటి రంగానికి ప్రోత్సాహకాలు అందించాల్సింది పోయి జీఎస్టీ పెంచడం సబబు కాదన్నారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, తొలిసారి 5 శాతం విధించినప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ చ్చిందని గుర్తుచేశారు. ఇప్పు డు మళ్లీ ఏడు శాతం జీఎస్టీ పెంచితే చేనేతరంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాం చిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఒకవేళ పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే.. ప్రస్తుతం చేనేత, పవర్లూమ్ వ్యాపారులకు ఉన్న జీఎస్టీ శ్లాబ్ను రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికే ముడి సరుకుల ధరలు పెరిగాయ్.. వస్త్ర పరిశ్రమకు అవసరమైన కాటన్, పాలి స్టర్ నూలు ధరలు 30–40 శాతం పెరిగాయ ని, కరోనా సంక్షోభంతో విదేశాల నుంచి ది గుమతులు తగ్గి రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగాయని కేటీఆర్ తెలిపారు. 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుం బాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్ర మే ఉన్నాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేశంలో చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతను బలోపేతం చేయాలి 2015లో ప్రధాని మోదీ చేనేతకు చేయూతనిస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని, గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి ‘వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్’అన్న నినాదం ఇచ్చారని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి రూ.1.25 లక్షల కోట్లకు, దేశీయ చేనేత ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి రూ.10 వేల కోట్లకు తీసుకుపోతామన్న హామీని దృష్టిలో పెట్టుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
స్వదేశీ వస్తువులకు విదేశాల్లో డిమాండ్
పెదవేగి : చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తయారైన చేతివృత్తుల వస్తువులకు ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉందని, చేతివృత్తుల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వస్తువుల తయారీపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మాణిక్యాలరావు, ఎస్ఎంసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రామన్న, పాఠశాల హెచ్ ఎం ఉషారాణి పాల్గొన్నారు. -
కొప్పర్తిలో భారీ టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని.. అక్కడ భారీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రికి గౌతమ్రెడ్డి గురువారం పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి కొప్పర్తిలో ఏర్పాటుచేయాలన్నారు. విద్యుత్ ఉపకరణాల తయారీకి మన్నవరం అనుకూలం అలాగే, భారీ విద్యుత్ ఉపకరణాల యూనిట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా మన్నవరం అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేకపాటి కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 2008లో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల యూనిట్ను ఏర్పాటుచేశారని.. ఇందుకోసం ఏపీఐఐసీ 750 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గోయల్ దృష్టికి గౌతమ్రెడ్డి తీసుకొచ్చారు. కానీ, బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో 2015 నుంచి ఈ యూనిట్ మూతపడి ఉందని.. దీనిని భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్కు పరిశీలించాలని కూడా కోరారు. కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం కింద దేశంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు భారీ విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాల జోన్లలో ఒకటి మన్నవరంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీయుష్ గోయల్.. త్వరలోనే ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గౌతమ్రెడ్డి వెల్లడించారు. రైల్వే కారిడార్ను ఏపీలోనూ చేపట్టాలి ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్లో ప్రస్తుతం ఏడీబీ 80, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతంగా ఉందని.. రాష్ట్ర వాటాను 10 శాతానికి తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కోరారు. అలాగే, రక్షణ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న రైల్వే కారిడార్ను రాష్ట్రంలో కూడా చేపట్టాల్సిందిగా మేకపాటి విజ్ఞప్తి చేశారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గతిశక్తి మిషన్లో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకోవచ్చని సూచించారు. త్వరలో విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ఏర్పాటుచేసిన మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పీయూష్ గోయల్ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గౌతమ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, మెడ్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర రంగం: ఏపీలో ఉన్న మినీ ముంబై ఏదో తెలుసా?
కావలి రూరల్: దేశవ్యాప్తంగా వస్త్ర రంగంలో ముంబైదే పైచేయి.. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ స్థానం నెల్లూరు జిల్లా కావలికే దక్కింది. దీంతో మినీ ముంబైగా పేరు గాంచింది. 1930.. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది. అప్పట్లో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ (వస్త్రాల బ్లీచింగ్, నీలి రంగు) లాంటి ముడి పదార్ధాలను కావలిలోనే తయారు చేసి సముద్ర మార్గం ద్వారా లండన్కు పంపేవారని వాటి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద తయారీ తొట్టేలు గత 30 సంవత్సరాల క్రితం వరకు ఉండేవని ప్రచారం. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు!) 1933వ సంవత్సరంలోనే కావలి ట్రంకు రోడ్డు వెంబడి 100 వస్త్ర దుకాణాలు ఉండేవని అవి కాస్త ప్రస్తుతం ప్రధానంగా 4 వస్త్ర మార్కెట్లు, 2 గార్మెంట్లు, 1 తయారీ పరిశ్రమ, 500లకు పైగా వస్త్ర దుకాణాలు ఉండటంతో ఇక్కడ అన్నీ రకాల వస్త్రాలు హోల్సేల్ ధరలకే లభిస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా క్వాలిటీతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా కావలి నడిబొడ్డులో రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటంతో వ్యాపారాలకు అనుగుణంగా సుదూర ప్రాంతాలైన ముంబాయి, అహ్మాదాబాద్, కలకత్తా, సూరత్, వారణాసి, చెన్నై వంటి మహా నగరాల నుంచి నేరుగా పరిశ్రమల నుంచి డీలర్ షిప్ పొంది నాణ్యమైన వస్త్రాలను దిగుమతి చేసుకుని.. దేశంలోని పలు రాష్ట్రాలకు కావలి నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. వస్త్ర వ్యాపార రంగంపై దాదాపు 15 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తుంటారు. వస్త్ర రంగంలో కావలిలో సంవత్సరానికి సరాసరి రూ.500 నుంచి 800 కోట్లుపైగా అమ్మకాలు సాగిస్తూ నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. నగరాలలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేకపోయిన క్వాలిటీ వస్త్రాలకు కావలి పేరుగడించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంది. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్ఫీల్డ్కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
విస్తరణ బాటలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా
న్యూఢిల్లీ: హోమ్ టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా విస్తరణ బాట పట్టింది. రానున్న రెండేళ్లలో హోమ్ టెక్స్టైల్స్, ఫ్లోరింగ్ బిజినెస్ల విస్తరణకు రూ. 800 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల(2022–23)లో హోమ్ టెక్స్టైల్స్ విభాగంపై రూ. 656 కోట్లకుపైగా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. వీటిలో భాగంగా రుమాళ్ల(టవల్స్) తయారీ సామర్థ్యాన్ని 20 శాతంమేర పెంచాలని చూస్తున్నట్లు తెలియజేసింది. విదేశీ కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఇందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. గుజరాత్, కచ్లోని అంజార్లోగల తయారీ ప్లాంటు సామర్థ్యాన్ని ప్రస్తుత 85,400 మెట్రిక్ టన్నుల నుంచి వార్షికంగా 1,02,000 ఎంటీకి చేర్చేందుకు వారాంతాన సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్స్పన్ ఇండియా వివరించింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టవల్ వస్త్రాలలో 40 మగ్గాల(లూమ్స్)కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వల్సాద్పైనా దష్టి గుజరాత్, వపీలోని వల్సాద్ ప్లాంటులో ఆటోమేషన్ ఏర్పాటుకు సైతం బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వెల్స్పన్ ఇండియా పేర్కొంది. తద్వారా తక్కువ వ్యయాలతో ఉత్పత్తిలో వేగవంత టర్న్అరౌండ్ను సాధించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. వపీలో 80 శాతం రగ్గుల సామర్థ్య పెంపును గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినట్లు తెలియజేసింది. విస్తరణ ఫలితాలు దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్) నుంచి కనిపించనున్నట్లు వివరించింది. విస్తరణతో రెండో ఏడాది నుంచీ రూ. 1,207 కోట్ల ఆదాయానికి అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఈ బాటలో రెండేళ్లకుగాను సొంత అనుబంధ సంస్థ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్లో దాదాపు రూ. 144 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
ప్రోత్సాహక పథకంలో మార్పులు అవసరం
సాక్షి, హైదరాబాద్: వస్త్రోత్పత్తి రంగంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్)లో మరిన్ని మార్పులు చేయడంతోపాటు సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మరిన్ని అంశాలను జోడిస్తే వస్త్రోత్పత్తి రంగం మరింత బలోపేతమవుతుందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్కు శనివారం రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం కృత్రిమ దారాలకు (మాన్ మేడ్ ఫైబర్) మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయని, ఇవే ప్రోత్సాహకాలను పత్తి ఆధారిత వస్త్రోత్పత్తులు చేసే వారికి కూడా వర్తింపజేస్తే జౌళి పరిశ్రమతో పాటు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. అన్ని రకాల ఫైబర్ వస్త్రోత్పత్తిని ప్రోత్సహిస్తే ఈ రంగంలో 7.5లక్షల మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కనీస పెట్టుబడిని తగ్గించండి కృత్రిమ ఫైబర్ సెగ్మెంట్లో రూ.300 కోట్ల కనీస పెట్టుబడులు పెడితేనే కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు పొందే వీలుంటుందని, చైనా లాంటి దేశాలతో పోటీ పడేందుకు కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్ కోరారు. గార్మెంట్ రంగంలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్ల నుంచి రూ.50కోట్లకు తగ్గిస్తే మరింతమంది యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారన్నారు. భారీ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు భూమి, ఇతర మౌలిక వసతుల కల్పన అవసరమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో యాంగ్వాన్, కైటెక్స్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
టెక్స్టైల్స్కు ‘పీఎల్ఐ’ బూస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమ (టెక్స్టైల్స్)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్ (మేన్–మేడ్ ఫైబర్) దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, టెక్నికల్ టెక్స్టైల్స్కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్ఐ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. ఉపాధి, వాణిజ్య అవకాశాల మెరుగుదల ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పత్తి, సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దోహదపడనుంది. కొన్ని నిర్దిష్ట జిల్లాలతోపాటు, టైర్–3, టైర్– 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. వస్త్ర పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంనది వివరించింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ వల్ల రూ. 19,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. రూ. 3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని వివరించింది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్కు మెరుపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమలో కీలక పరిణామం. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్ భారత తయారీ సామర్థ్యం పటిష్టతకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దారం సరఫరాలను భారత్ కలిగి ఉంది. అయితే అయితే నాణ్యమైన ఎంఎంఎఫ్ వస్త్ర ఉత్పత్తి తగినంతగా లేదు. ఈ సమస్యను అధిగమించడానికి తాజా కేబినెట్ నిర్ణయం సహాయపడుతుంది. భారత్ మొత్తం వస్త్ర ఉత్పత్తిలో ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తుల వాటా 20 శాతం మాత్రమే. ఈ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తులు ఇకపై ప్రతి ఏడాదీ పెరుగుతాయి. వచ్చే మూడేళ్లలో వస్త్ర ఎగుమతులూ రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఏ శక్తివేల్, ఏఈపీసీ చైర్మన్ -
7 కోట్ల మీటర్లు.. 288 డిజైన్లు..
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందిస్తోంది. సిరిసిల్లలోని నేతన్నలకు ఉపాధి కలి్పంచాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకోవడంతోపాటు నేతన్నలకు ప్రభుత్వపరంగా ఉపాధి కలి్పస్తున్నారు. ఈసారి పవర్లూమ్స్ (మరమగ్గాల)పై డాబీ డిజైన్స్ చీరలను ఉత్పత్తి చేయాలని జౌళి శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పవర్లూమ్స్కు అదనంగా జకార్డ్, డాబీ పరికరాలను అమర్చి చీరలపై రకరకాల డిజైన్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో చీరల కొంగులు, అంచులపై నెమలి పించం, ఆకులు, కమలం వంటి కంటికి ఇంపైన డిజైన్లతో కూడిన చీరలను సిరిసిల్ల నేతన్నలు నేస్తున్నారు. ఈ ప్రయోగంతో నేతకారి్మకులకు పని ఒత్తిడి, యజమానులకు ఆర్థిక భారం పడింది. అయినా.. నవ్యతను, నాణ్యతను పెంచేక్రమంలో జౌళి శాఖ డాబీ డిజైన్లకు మొగ్గుచూపింది. దీంతో 288 రకాల డిజైన్లలో వందకుపైగా రంగుల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. లక్ష్యం దిశగా అడుగులు: సిరిసిల్లలో వ్రస్తోత్పత్తిదారులకు ఈ ఏడాది జనవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. నూలు కొనుగోలు, జకార్డ్, డాబీల దిగుమతి, పవర్లూమ్స్కు బిగింపు వంటి పనులతో చీరల ఉత్పత్తి ఆలస్యంగా మొదలైంది. మరోవైపు కరోనా లాక్డౌన్తో కారి్మకులు వెళ్లిపోవడం, నూలు, పవర్లూమ్స్ విడిభాగాల దిగుమతిలో కూడా జాప్యమైంది. సిరిసిల్లలోని 136 మ్యాక్స్ సం ఘాలకు, మరో 138 ఎస్ఎస్ఐ యూనిట్లకు, టెక్స్టైల్ పార్క్లోని 76 యూనిట్లకు బతుక మ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. తొలుత జాప్యం జరగడంతో ప్రస్తుతం సిరిసిల్లలో రేయింబవళ్లు వేగంగా వస్త్రోత్పత్తి సాగుతోంది. ఉత్పత్తి అయిన చీరల వ్రస్తాన్ని టెస్కో అధికారులు వెంట వెంటనే సేకరిస్తూ.. ప్రాసెసింగ్కు పంపిస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మీటర్ల వ్రస్తాన్ని ప్రాసెసింగ్ కోసం తరలించారు. ఇదిలా ఉండ గా తొలిసారి ఆర్టీసీ కార్గో సేవలను బతుకమ్మ చీరల రవాణాకు వినియోగించుకుంటున్నారు. గత ఏడాది సాంచాలపై మిగిలిపోయిన వస్త్రాన్ని సైతం అధికారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరల వ్రస్తాన్ని సకాలంలో అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి డిజైన్లలో చీరలు ఉన్నాయి.. సిరిసిల్లలో బతుకమ్మ చీరలు మంచి డిజైన్లలో ఉత్పత్తి అవుతున్నాయి. మొదట్లో వస్త్రోత్పత్తిదారులు కొంత ఇ బ్బంది పడినా.. నాణ్యమైన చీరల ఉత్పత్తి దిశగా సాగుతున్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం. ఇప్పటికే చీరల బట్టను ప్రాసెసింగ్కు పంపించాం. -
మెగా రిటైల్ టెక్ట్స్టైల్ పార్క్కు స్పెషల్ ప్యాకేజీ
విజయవాడ: తాడేపల్లిలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు మెగా రిటైల్ టెక్ట్స్టైల్ పార్క్కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 900 టెక్ట్స్టైల్ ఔట్ లెట్లను 7 లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమ్మయ్యప్పర్ టెక్ట్స్టైల్ ప్రైవేటు లిమిటెడ్కు కూడా స్పెషల్ ప్యాకేజి ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలక టూర్ లో గ్రీన్ ఫీల్డ్ గార్మెంట్స్ మ్యానుఫాక్చరింగ్ ఏర్పాటు చేయనున్నది. వాల్యూ యాడెడ్ ఎంబ్రాయిడరీ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నది. -
టెక్స్టైల్పై ‘మహా’దెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర టెక్స్టైల్ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే యార్న్ను వినియోగించుకునే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో యార్న్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మన రాష్ట్రంలో మొత్తం 120 టెక్స్టైల్ మిల్స్ ఉండగా వీటిద్వారా ఏటా 6.87 లక్షల టన్నుల యార్న్ ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది నవంబర్ నుంచి ఊపందుకున్న వ్యాపారం పదిరోజుల నుంచి ఒక్కసారిగా ఆగిపోయిందని టెక్స్టైల్ కంపెనీల యజమానులు వాపోతున్నారు. గత పదిరోజుల్లో సుమారు రూ.900 కోట్ల విలువైన ఎగుమతులు ఆగిపోయాయని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా రఘురామిరెడ్డి చెప్పారు. ఒక్కో మిల్లు వద్ద కనీసం రూ.6 కోట్ల విలువైన యార్న్ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయినట్లు తెలిపారు. మహారాష్ట్ర, బెంగాల్లకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోగా, తమిళనాడు మార్కెట్కు కొద్దిగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. దీంతో పెద్ద మిల్లులు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటుంటే, చిన్న మిల్లులు షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. చిన్న మిల్లులు రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా మిల్లులు మూడునెలల నుంచి ఉత్పత్తి సామర్థ్యంలో 90 శాతానికి చేరుకున్నాయని, ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో ఉత్పత్తిని 60 శాతానికి తగ్గించాయని పేర్కొన్నారు. కూలీలను నిలబెట్టుకునేందుకు.. రాష్ట్రంలోని టెక్స్టైల్ మిల్లులపై ప్రత్యక్షంగా లక్షమంది, పరోక్షంగా నాలుగు లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో రెండులక్షల మందికిపైగా ఇతర రాష్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. లాక్డౌన్ మొదటి దెబ్బకి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కూలీలను వెనక్కి రప్పించుకోవడానికి కంపెనీలు చాలా వ్యయప్రయాసలు పడ్డాయి. ఇప్పుడు తిరిగి కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కూలీలను కాపాడుకోవడం కోసం ఉత్పత్తిని కొనసాగించాల్సి వస్తోందని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దండా ప్రసాద్ తెలిపారు. ఉత్పత్తి లేకపోయినా పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి మరో 3 వారాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. -
మంటలు ఆర్పుతుండగా బిల్డింగ్ కూలి..
చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విలక్కుతున్ సమీపంలో ఉన్న నవబత్కన వీధిలోని టెక్స్టైల్స్ దుకాణంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి 11 గంటల వరకు టెక్స్టైల్స్ దుకాణం ముసివేయగా.. సుమారు శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ దుకాణం ఓ పాత బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి పంపించాయి. చదవండి: తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్ మంటలను అదుపులోకి తీసుకు వస్తున్న క్రమంలో బిల్డింగ్ తమపై కూలి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది (క్రిష్ణమూర్తి, శివరాజన్) గాయాలపాలయ్యారు. వీరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇది గమనించిన మిగతా సిబ్బంది ఇద్దరిని వెలికి తీసి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణమూర్తి, శివరాజన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరితోపాటు మరో ఇద్దరు సిబ్బందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. కాగా మధురై జిల్లా ఫైర్ ఆఫీసర్ కే కళ్యాణా కుమార్, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
ఫ్యాబ్రిక్ హబ్గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఫ్యాబ్రిక్ హబ్గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నూలును గార్మెంట్స్గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్లో ఏడు శాతం ఇక్కడే తయారవుతుండగా, ఇందులో అత్యధిక భాగం ఎగుమతి అవుతోందని తెలిపారు. టెక్స్టైల్ రంగంపై ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన వెబినార్లో మంత్రి పాల్గొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► పోర్టులకు సమీపంలో టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయడమేగాక వస్త్రాల తయారీలో సాంకేతికతను పెంపునకు తోడ్పాటునందిస్తాం. ► రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 50% వరకు రాయితీలిస్తాం. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు పూర్తి ప్రోత్సాహకాలిస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు ఆరేళ్ల బకాయిలను ఒకేసారి చెల్లించడంతో పాటు టెక్స్టైల్ రంగానికి ఏడేళ్ల కాలానికి సంబంధించి రూ.1,300 కోట్ల బకాయిలు చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైఎస్సార్ చొరవతోనే ఏర్పాటు ► బ్రాండిక్స్ ఇండియా హెడ్ నైల్ రొసారో మాట్లాడుతూ శ్రీలంకలో అతిపెద్ద అప్పరెల్ ఎక్స్పోర్ట్ కంపెనీని వైఎస్సార్ చొరవతో విశాఖలో ఏర్పాటు చేసేందుకు 2006లో ఒప్పందం కుదుర్చుకుని, 2008లో ఉత్పత్తి ప్రారంభించడమేగాక ఏటా 25 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ► ప్రస్తుతం ఈ సంస్థలో 17,000 మంది మహిళలు పనిచేస్తున్నారు.. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఇదే విధమైన వృద్ధిని కొనసాగిస్తాం. ► రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం వివరించారు. ► వెబినార్లో కేంద్ర చేనేత శాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి రవికపూర్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ను టైక్స్టైల్ హబ్గా మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర చేనేత మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైన ఇన్వెస్ట్ ఇండియా వెబినార్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్ర టెక్స్టైల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.(వైరల్ : ఇద్దరు యువతులను ఒకేసారి పెళ్లి..) రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్గా మార్చడం, గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్టైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. దిగుమతి, ఎగుమతులు సహా పోర్టులకు సమీపంలో కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాలలో అనుసంధానం చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. (సీఎఫ్ఓ ఔట్, 700 ఉద్యోగాలు కట్) వస్త్రాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సంస్థల ఏర్పాటు, శిక్షణతో పాటు పరిశ్రమలతో సమన్వయం చేసుకోవటానికి తగిన ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రోత్సాహక విధానాలను కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందిపుచ్చుకుంటామని వెల్లడించారు. చేనేత రంగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చేనేత రంగానికి సంబంధించిన గత ఏడేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలోని బ్రాండిక్స్కు పునాది వేశారని చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 30వేల కుటుంబాలకు శాశ్వత ఉపాధి దొరుకుతోందని వెల్లడించారు. బ్రాండిక్స్లో ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. వరల్డ్క్లాస్ వర్క్ఫోర్స్ కొత్త పారిశ్రామిక విధానంతో వరల్డ్క్లాస్ వర్క్ ఫోర్స్ను తీసుకొస్తామని మంత్రి చెప్పారు. 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవవనరులను సృష్టిస్తామని వెల్లడించారు. అన్ని రంగాలల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను శాశ్వత గమ్యస్థానంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలో విధానంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలను, పారిశ్రామిక పాలసీ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక పరిపుష్ఠి కలిగించిన ప్రభుత్వ చర్యలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది వెబినార్లో వివరించారు. ఈ వెబినార్లో కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్కు చెందిన చేనేత శాఖ మంత్రులు, కేంద్ర టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి రవి కపూర్, జాయింట్ సెక్రటరీ జోగి రంజన్ పాణిగ్రహి, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు, 'ఇన్వెస్ట్ ఇండియా' సీఈవో, ఎండీ దీపక్ బగ్లా తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు వస్త్ర పరిశ్రమ అనుకూలం
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతివాచీ పరుస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులకున్న మెరుగైన అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పలు వివరాలను వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టెక్స్టైల్ అపెరల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ వెబినార్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్టంలో వస్త్ర, దుస్తుల తయారీ రంగంలో పెట్టుబడులకున్న సానుకూలతలను వివరించారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, నాణ్యత విషయంలో ఇక్కడి పత్తి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు దీటుగా ఉందని చెప్పారు. పెట్టుబడులతో వచ్చేవారికి అత్యంత అనుకూల పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే తాము అగ్రభాగాన ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా నిరాటంకంగా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. (ఆ ఇంటి కరెంట్ బిల్లు రూ. 25,11,467) పరిశ్రమల కోసం నైపుణ్యశిక్షణ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఖర్చుతోనే నైపుణ్య శిక్షణ ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపి దేశంలోనే అత్యుత్తమ టెక్స్టైల్ పాలసీని రూపొందించామన్నారు. టెక్స్టైల్ను ప్రాధాన్యతారంగం గా గుర్తించామని,ప్రోత్సాహకాల విష యంలో పెట్టుబడిదారులకు టైలర్మే డ్ పాలసీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు సం దర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వెల్స్పాన్ సీఈవో దీపాలి గొయెంకా వివరించారు. కాగా, కేటీఆర్ ప్రసంగాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అభినందించారు. కోవిడ్ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుని.. గతంలో పీపీఈ కిట్లు తయారు చేయలేనిస్థితి నుంచి ప్రస్తుతం ప్రపంచలోనే అతి ఎక్కువ సంఖ్యలో కిట్లు తయారు చేస్తున్న రెండోదేశంగా భారతదేశం నిలిచిందని స్మృతి ఇరానీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పాలసీలు, ఇతర అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెబినార్లో వివరించారు. (సర్కారు, గవర్నర్.. ఓ కరోనా) -
ఆశలన్నీ ఆషాడంపైనే..
కడప కల్చరల్: వస్త్ర వ్యాపారుల ఆశలన్నీ ఆషాడంపైనే ఉన్నాయి. సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే వస్త్ర వ్యాపారులు ‘ఆషాడం డిస్కౌంట్ సేల్’ పేరిట తగ్గింపు ధరకు ఇస్తారు. దీంతో మహిళల నుంచి వ్రస్తాలకు మంచి డిమాండ్ ఏర్పడి వ్యాపారులు నాలుగు డబ్బులు కళ్లచూసే అవకాశం లభిస్తుంది. పండుగలు, వివాహాల సీజన్ ముగిసిన తర్వాత ఆషాడం డిస్కౌంట్ సేల్స్పైనే వస్త్ర వ్యాపారులు నమ్మకం ఉంచుతారు. వీలైనంత తక్కువ ధరకు అంతకుముందు వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం తెప్పించిన వస్త్రాలను విక్రయించి కొత్త స్టాకును తెచ్చి పెట్టుకోవాలని భావిస్తారు. అందుకే కొద్దిపాటి మార్జిన్ ఉన్నా వస్త్రాలను డిస్కౌంట్ సేల్స్లో ఉంచి విక్రయిస్తారు. విక్రయాలకు లాక్డౌన్ కరోనా లాక్డౌన్ కారణంగా మంచి సీజన్లో వస్త్ర వ్యాపారాలు మూతపడ్డాయి. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు పండుగలు, అంతకుమించి వివాహ ముహూర్తాలు ఉండేవి. దీని కోసం వ్యాపారులు కొత్తకొత్త రకాల వ్రస్తాలను పెద్ద ఎత్తున తెచ్చి స్టాక్ ఉంచుకున్నారు. ఊహించని విధంగా లాక్డౌన్తో వ్యాపారాలకు బ్రేక్ డౌన్ కావడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వారం, పదిరోజులు లేదా ఒక నెల మాత్రమే లాక్డౌన్ ఉంటుందని వారు తొలుత భావించినా ఆ తర్వాత వరుసగా దాదాపు మూడు నెలలపాటు దుకాణాలు మూసి ఉంచాల్సి రావడంతో అటు దుకాణ గదుల అద్దెలు చెల్లించలేక, ఇటు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేక మినిమ్ కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో ఆర్థికంగా కుదేలయ్యారు. జూన్ 4 నుంచి షరతులపై దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా అప్పటికే సీజన్ ముగిసిపోవడంతో ఆషాడ మాసం ఆఫర్లతోనైనా వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆషాడం ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా మునుపటిలా వ్యాపారాలు జరుగుతాయన్న ఆశలేవీ కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిజానికి ఎప్పటిలా ఆషాడం పేరిట వ్రస్తాలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ అంతో ఇంతో వ్యాపారం జరుగుతుందన్న విశ్వాసంతో కొందరు వ్యాపారులు మాత్రం డిస్కౌంట్ ప్రకటనలు ఇస్తున్నారు. నాడు కళకళ.. నేడు వెలవెల సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే చిన్నా, పెద్ద వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతాయి. కొన్ని దుకాణాలు 50 శాతం వరకు ఇవ్వజూపడంతో ఆ దుకాణాల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఈసారి ఆ అవకాశం లేదు. మూడు మాసాలపాటు వ్యాపారాలు లేక నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వస్త్ర వ్యాపారులు విన్నవిస్తున్నారు. లాక్డౌన్ ముందు ఆషాఢం ఆఫర్ మంత్రం పనిచేయడం లేదని, ఈ మాసం కూడా భారీగా నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశలు శ్రావణమాసంలోనేనని భావిస్తున్నారు. ఆషాడమాసం మరో మూడు వారాలు ఉంది గనుక ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకునే అవకాశం కూడా ఉందని మరికొందరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశ ఆషాడం ఆఫర్లు ఇచ్చే పరిస్థితి పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తుపై ఆశ ఉంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా కార్మికుల జీతాలు, మెయింటెన్స్ ఖర్చులు వస్తే చాలనుకుంటున్నాం. శ్రావణమాసం, ఆపై వచ్చే సీజన్లోనైనా వ్యాపారాలు జరుగుతాయన్న విశ్వాసం ఉంది. – దినేష్సింగ్, వస్త్ర వ్యాపారి, కడప లాక్డౌన్తో తీవ్ర నష్టం లాక్డౌన్ను ఊహించకపోవడం, మూడు నెలలు దుకాణాలు మూసి వేయడంతో వస్త్రాల స్టాకు కొద్దిమేర పాడై నష్టం చేకూరింది. పనిలేకపోయినా బాడుగలు, కరెంటు బిల్లు, ట్యాక్సు, కారి్మకుల జీతాలు కట్టాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – చెన్నంశెట్టి మురళి, వస్త్ర వ్యాపారి, కడప -
మూఢాలు దాటితే మార్కెట్కు కళ!
సాక్షి, హైదరాబాద్: ‘ఆషాఢం ధమాకా సేల్స్.. పెళ్లయినా, మరే శుభకార్యమైనా సకుటుంబ సపరివార దుస్తులకు మా వస్త్రాలయానికే విచ్చేయండి.. శ్రావణంలో బ్రహ్మాండమైన తగ్గింపు.. అన్ని రకాల వస్త్రాలకు కేరాఫ్ మా షోరూం.’ఏటా ఆషాఢం నాటికి హైదరాబాద్వ్యాప్తంగా కనిపించే సందడి ఇది. ఇక మూఢాలు ముగిసి పెళ్లిళ్లు మొదలయ్యే వేళ వస్త్రాలయాల ముందు కొనుగోలుదారుల వరుసలు.. షోరూంలన్నీపెళ్లింటిలాగా ముస్తాబు.. రంగవల్లికలు, మామిడి తోరణాలు, అరటి పందిళ్లు, విద్యుద్దీపాల వెలుగుజిలుగులు.. ఒకటేమిటి నగరవ్యాప్తంగా పెళ్లికళ తాండవించేది. ఇప్పుడు సరిగ్గా ఆ వేడుక ముందున్నాం కానీ ఆ కళ మాత్రం లేదు. కరోనా ధాటికి మార్కెట్ అంతా కకావికలమైంది. గతంలో ఎన్నడూ ఊహకందని రీతిలో అంతా దెబ్బతిన్నది. ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియని అయోమయం నెలకొంది. కానీ ఆశ మిణుకుమిణుకుమంటోంది. మరికొన్ని రోజుల్లోనే క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటుందన్న భావన వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడుప్పుడే తెరుచుకుంటున్న వస్త్రాలయాలు కొనుగోలుదారులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. సరి–బేసి పద్ధతిలో దుకాణాలు తెరుచుకొని సరిగ్గా వారమైంది. వస్త్ర వ్యాపారం 20 శాతం బిజినెస్తో ముందుకు సాగుతోంది. లాక్డౌన్ తర్వాత రంజాన్తో కొనుగోళ్లు మొదలవగా మూఢం దాటాక వచ్చే శుభముహూర్థాల కోసం వస్త్రాల మార్కెట్ ఎదురుచూస్తోంది. జూన్ చివర్లో కొనుగోళ్ల జోరు పెరిగే చాన్స్.. ఈమాత్రం వ్యాపారమన్నా ఉంటుందో లేదోనన్న అనుమానంతో తెరుచుకున్న వస్త్ర వ్యాపారం రంజాన్ బోణీ కొట్టింది. లాక్డౌన్ తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో రంజాన్ కొనుగోళ్లు జరిగాయి. ఈ పరిణామం వస్త్ర వ్యాపారుల్లో కొంత సానుకూల దృక్పథాన్ని కలగజేసింది. ఈమాత్రమన్నా జనం ఇళ్లు విడిచి వస్తారన్న భావన లేని సమయంలో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. జూన్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్కు మరిన్ని సడలింపులు ఇవ్వనున్నందున మరికాస్త ఉత్సాహం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని మార్కెట్ వ్యక్తం చేస్తోంది. జూన్ చివరి వరకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని, జూన్ చివర్లో ఆషాఢం మొదలవుతూనే జోరు పెరుగుతుందని ఓ ప్రముఖ షోరూం యజమాని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటికి దేశంలో కరోనా పరిస్థితి, తదనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనల ఆధారంగా పరిస్థితి మెరుగుపడటమనేది ఆధారపడనుంది. మూఢాలు దాటే నాటికి ‘మంచి రోజులు’.. మూఢాలు దాటితే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆ మంచిరోజులు మార్కెట్కు కూడా వస్తాయని వస్త్ర వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. మే రెండో వారం దాటాక మూఢాలు ప్రారంభమయ్యాయి. జూన్ చివర్లో అషాఢం మొదలు కానుంది. జూలైలో మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. అప్పటికి ప్రజల్లో కరోనా భయాందోళనలు తగ్గి కొనుగోళ్లపై దృష్టిసారిస్తారనే అంచనా ఏర్పడింది. భయం కొంత.. పొదుపు మరింత లాక్డౌన్ వల్ల చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా మారాయి. చిరు వ్యాపారులు నష్టపోవడం, కొన్ని కేటగిరీ ఉద్యోగులకు జీతాల్లో కోతపడటం.. వెరసి పొదుపుపై దృష్టిసారించాల్సి వచ్చింది. వానాకాలం అనగానే వ్యాధుల కాలం అంటారు. సీజనల్ వ్యాధులతోపాటు మళ్లీ కరోనా మరింతగా విజృంభిస్తే మళ్లీ కఠినంగా లాక్డౌన్ అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో మరింత పొదుపునకు ప్రాధాన్యమిస్తూ కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. ఇది కూడా కొనుగోళ్లు మందగించేందుకు ఓ ప్రధాన కారణమని కొందరు వ్యాపారులంటున్నారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుచుకుంటుండగా కొన్ని రోజులు వేచిచూద్దాం, అప్పుడే దుకాణాలకు వెళ్లకపోవడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. దీనివల్ల మందగమనం కొనసాగుతోందని ఎక్కువ మంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. జూలై నాటికి 70 శాతం వ్యాపారానికి చాన్స్ లాక్డౌన్ తర్వాత 20 శాతం బిజినెస్తో వ్యాపారం ప్రారంభించాం. పరిస్థితులు మెరుగవుతాయన్న పూర్తి ఆశాభావంతో ఉన్నాం. కొన్ని రోజులు గడిస్తే జనం షోరూంలకు పెద్ద సంఖ్యలో వచ్చే పరిస్థితులు మొదలవుతాయి. జూన్లో మరో 15 శాతం వ్యాపారం జరుగుతుంది. పెళ్లిళ్లు జరగడం మొదలైతే జూలైలో 70 శాతం వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. ఇక అక్టోబర్లో పూర్వ పరిస్థితులు వస్తాయన్న నమ్మకం ఉంది. – రాజేంద్రకుమార్, ఫౌండర్ ఎండీ, వీఆర్కే సిల్క్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆర్థిక ఇబ్బందుల కంటే కరోనా భయంతోనే జనం ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్కు రావట్లేదు. మరో రెండు నెలల్లో చాలా మెరుగైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితులు దాదాపు చక్కబడొచ్చు. అయినా మేం కొనుగోలుదారులకు భరోసా ఇచ్చే రీతిలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్కు వస్తే ఇబ్బంది ఉండదు. కొనుగోలుదారులనే కాదు.. మా సిబ్బందిలో కూడా కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా షోరూమ్లోకి అనుమతించట్లేదు. భౌతికదూరం, శానిటైజేషన్ లాంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నాం. జనంలో భయం పోయే రోజులు త్వరలోనే ఉంటాయి. - పి. వెంకటేశ్వర్లు, ఫౌండర్ ఎండీ, ఆర్.ఎస్. బ్రదర్స్ -
చేనేత, జౌళి రంగాలను ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తక్కువ ఖర్చు, తక్కువ భూ వినియోగంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే శక్తి ఈ రంగాలకే ఉందన్నారు. చేనేత, టెక్స్టైల్, అపరెల్ పరిశ్రమలపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ రూ.36 బిలియన్ డాలర్లు కాగా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీ నెలకొందన్నారు. చైనాలో పెట్టుబడుల వికేంద్రీకరణపై బహుళ జాతి కంపెనీలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో, వాటిని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. వస్త్ర పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ.. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 6 నెలలు 50% కూలీ ఇవ్వడంతో పాటు, బంగ్లాదేశ్ తరహాలో దీర్ఘకాలిక రుణ సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. అంతేకాకుండా 3 నెలల పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిని కేంద్రమే చెల్లించాలన్నారు. అదనంగా బ్యాంకు రుణాలు, ప్రస్తుత రుణాలపై వడ్డీ మాఫీ లేదా మారటోరియం ఏడాది పొడిగించాలని, ఎన్పీఏ నిబంధనలను సవరించాలన్నారు. టెక్స్టైల్ ఎగుమతులపై ఏడాది పాటు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. పత్తి కొనుగోలు మద్దతు ధరకు సంబంధించి రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే సబ్సిడీలు వేయాలన్నారు. భారీ టెక్స్టైల్ జోన్లకు ఆహ్వానం.. దేశంలో భారీ టెక్స్టైల్ జోన్ల ఏర్పాటును స్వాగతించిన కేటీఆర్.. తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్ మూలంగా కార్మికుల వద్ద పేరుకు పోయిన చేనేత ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు జరపాలని కోరారు. చేనేత వస్త్రాలను కేవీఐసీ, కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. 50% యార్న్పై సబ్సిడీ ఇవ్వాలని, రెండేళ్ల పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఆదివారం పదినిమిషాలు కేటాయించండి పది ఆదివారాలు పది నిమిషాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సీజనల్గా వచ్చే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటి కీటక వ్యాధులను అరికట్టవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి తన నివాసంలో ప్రారంభించారు. కేటీఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి లోని పూల కుండీలు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ప్రాంగణంలో కలియతిరిగిన మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహా మేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏర్పడిందని, వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే సీజనల్ వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతిభవన్లో యాంటీ లార్వా మందును చల్లుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మేయర్ బొంతు రామ్మోహన్ -
‘యంగ్వాన్’తో టెక్స్టైల్కు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన టెక్స్టైల్ దిగ్గజ కంపెనీ యంగ్వాన్ కార్పొరేషన్ రూ.900 కోట్లతో మెగా టెక్స్టైల్ పార్కులో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు బుధవారం కేటీఆర్ సమక్షంలో తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘గుజరాత్ లో 2017లో జరిగిన టెక్స్టైల్ సమ్మిట్లో యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్తో సమావేశమై, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించాం. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుంగ్ సానుకూలత వ్యక్తం చేశారు. యంగ్వాన్తో టెక్స్టైల్కు మహర్దశ పట్టనుంది’అని అన్నారు. 13 దేశాల్లో యంగ్వాన్ కార్యకలాపాలు టెక్స్టైల్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో యంగ్వాన్ కార్పొరేషన్ ఒకటని, ప్రస్తుతం బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియా వంటి 13దేశాల్లో తమ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కిసాక్ సుంగ్ వెల్లడించారు. రూ.900 కోట్ల పెట్టుబడికి సంబంధించి బుధవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఒప్పందం కుదరగా, 290 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను యంగ్వాన్ కార్పొరేషన్ ప్రతినిధులు అందుకున్నా రు. దీని ద్వారా 12వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, కొరియాలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్, గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ కొరియా ఇన్ హైదరాబాద్ సురేష్ చుక్కపల్లి, టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కు సందర్శన.. సాక్షి, వరంగల్ రూరల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు స్థలాన్ని బుధవారం దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఏడుగురు ప్రతినిధుల బృందం.. తమ కంపెనీకి కేటాయించిన స్థలంలో జరుగుతున్న పనుల గురించి టీఎస్ఐఐసీ అధికారులను అడిగి తెలుసుకుంది. అధికారులు ఇచ్చిన వివరణపై కొరియా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్టైల్స్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్ఎఫ్, సిమెంట్ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్ఎఫ్, కాస్టిక్ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్అలోన్) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్ఎఫ్(విస్కోస్ స్టేపుల్ ఫైబర్–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్ ఫైబర్. దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, డ్రెస్ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అ్రల్టాటెక్ సిమెంట్లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్అలోన్ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్ఎఫ్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎలాంటి కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్ఎఫ్కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. బాటా ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,736 టార్గెట్ ధర: రూ.1,955 ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్ మోడళ్లను రీ డిజైనింగ్ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ‘మాస్’ నుంచి ‘ప్రీమియమ్’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్ను నిర్వహిస్తోంది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
పార్టీల ఎజెండా ఏదైనా.. ‘జెండా’ సిరిసిల్లదే..!
సాక్షి, సిరిసిల్ల :ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల వరకు సిరిసిల్లలో సందడి నెలకొంది. ఏ పార్టీకి అయినా.. ఎజెండా లేకున్నా.. సరే కానీ ఆ పార్టీ జెండాలు లేకుంటే.. కుదరని పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేతలు ప్రచారానికి వచ్చినా.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసినా.. జెండాలు, కండువాలు తప్పని సరి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమ జెండాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా ఊరంతా ఉపాధి పొందుతోంది. బట్ట నుంచి బ్యానర్ల వరకు.. ఎన్నికలు ఏవైనా, పార్టీలేవైనా.. అభ్యర్థి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించే జెండాలు, కండువాలు వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల నుంచే సరఫరా అవుతాయి. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి సాగుతుండగా.. మరో ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పాలిస్టర్ బట్టపై ఆర్డర్ వచ్చినట్లుగా వివిధ పార్టీల గుర్తులు, రంగులు, అభ్యర్థుల పేర్లు ప్రింటింగ్ చేసి సరఫరా చేస్తారు. పాలిస్టర్ బట్టను పార్టీ రంగుల్లో ప్రాసెసింగ్ చేయించి సరఫరా చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పాటు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సిరిసిల్ల నుంచి ప్రచార సామగ్రి ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా సిరిసిల్లలో తయారైన జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతున్నాయి. సిరిసిల్లలోనే చౌక.. దేశంలోని బీవండి, సూరత్, మాలేగావ్ ప్రాంతాల్లో మరమగ్గాలపై పాలిస్టర్ గుడ్డ ఉత్పత్తి అవుతున్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రం సిరిసిల్ల వస్త్రంలాగా చౌకగా లభించదు. దీంతో హైదరాబాద్కు చెందిన మర్వాడీ సేట్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల ఆర్డర్లు ముందుగానే తీసుకుని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఒక్క బ్యానర్ను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.25 నుంచి రూ.50, టోపీ (క్యాప్)లకు రూ.20 నుంచి 30 వరకు తోరణాల జెండాలు పదివేల జెండాలకు రూ.3000 నుంచి రూ.4000 వరకు అమ్ముతారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లను సైతం ఇక్కడే ముద్రించి ఇస్తారు. వీఐపీ కండువాలను రూ.100 ఒక్కటి సరఫరా చేస్తారు. రూ.5కోట్ల మేర వ్యాపారం.. ప్రతి ఎన్నికల సమయంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు రూ. 5 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇక్కడికి ఆర్డర్లు రావడం కొత్తేం కాదు. సిరిసిల్ల నేతన్నలు గత నలుబై ఏళ్లుగా జెండాలు అందిస్తున్నారు. 1978లో తొలుత సిరిసిల్లలో రామ్బలరామ్ స్క్రీన్పింటర్స్ రంగురంగుల పార్టీల జెండాలను ముద్రించడం ఆరంభించింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్సీపీ, బహుజన సమాజ్పార్టీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా ఆయా పార్టీల రంగుల్లో జెండాలను ప్రింట్ చేసి అందిస్తారు. అభ్యర్థుల పేర్లు, నినాదాలు సైతం బట్టపై అద్దడం విశేషం. ఎన్ని‘కళ’ సిరిసిల్లలో పాతిక వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తరచూ ఆటుపోట్లతో వస్త్రపరిశ్రమ సంక్షోభానికి గురికావడం, ఉపాధి లేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని లభిస్తోంది. ఎన్నికల సామగ్రి సరఫరాతో 500 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాలను కుట్టుమిషన్లపై కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే బట్ట తయారు కావడంతో ఇక్కడి కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జెండా ఆర్డర్లు సైతం సిరిసిల్లకు రావడం విశేషం. చేదు అనుభవం.. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలిసారి సిరిసిల్లకే వచ్చారు. ప్రజాచైతన్య యాత్రను సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడం భారీ ఎత్తున పీఆర్పీ జెండాలు, కండువాల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఆర్డర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రచార సామగ్రిని తీసుకెళ్లలేదు. దీంతో సిరిసిల్ల వస్త్రవ్యాపారులు ఉద్దేర భేరానికి స్వస్తి పలికారు. ‘‘మిషన్పై జెండాలు కుడుతున్న ఈమె మేర్గు లావణ్య. సిరిసిల్లలోని వెంకట్రావునగర్. లావణ్య రోజుకు వెయ్యి జెండాలు కుడుతుంది. ఒక్కో జెండాకు 25పైసల చొప్పున రోజుకు రూ.250 కూలి లభిస్తోంది. నెలకు సగటున లావణ్య ఇంట్లో ఉంటూనే రూ.5వేలు సంపాదిస్తోంది. లావణ్య భర్త శ్రీనివాస్ నేత కార్మికుడు. సాంచాలు నడుపుతూ నెలకు రూ. 8వేలు సంపాదిస్తాడు. ఇంట్లోనే పాపను చూసుకుంటూ లావణ్య ఉపాధి పొందుతోంది’’. ‘‘ఈమె కాటబత్తిని అనిత. సిరిసిల్ల సాయినగర్. అనిత పార్టీల జెండాలు, కండువాల, క్యాప్లు కట్చేస్తూ.. సరిచేస్తూ.. నెలకు రూ.6వేల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త సత్యనారాయణ డయింగ్ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు బీడీలు చేసేది. రోజుకు వెయ్యి బీడీలు చేసినా.. నెలకు రూ.3వేలకు మించి రాకపోయేవి. ఈ డబ్బులతో ఇల్లు కిరాయి చెల్లిస్తూ.. పిల్లలను సాకడం కష్టమైంది. దీంతో ఆమె పార్టీల జెండాల తయారీ కార్ఖానాలో పనికి చేరింది. దీంతో ఇప్పుడు రూ.6వేలు వస్తున్నాయి. ప్రభుత్వం వితంతు పింఛన్ రూ.వెయ్యి ఇస్తోంది. పిల్లలను చదివిస్తోంది’’. 16 ఏళ్లుగా ఇదే పని నేను 2002 నుంచి 16 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఎన్నికల సమయంలో కొద్దిగా ఎక్కు వ పని ఉంటుంది. మిగితా రోజు ల్లో స్కూల్, కాలేజీల బ్యా నర్లు, యాగాలు, యజ్ఞాల కండువాలు, జెం డాలు సరఫరా చేస్తాను. ఏడాది పొడువునా ఇ దే పని ఉంటుంది. నా వద్ద 25 మంది కార్మికు లు పని చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. దేశమంతా సరఫరా చేస్తున్నాను. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి చదువుకుంటూ.. సంపాదిస్తూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మా అమ్మ నిర్మలతో పాటు నేను జెండాలు కుడుతాను. చదువుకుంటేనే తీరిక వేళల్లో పనిచేస్తాను. రెండు మిషన్లు ఉన్నాయి. అంతకు ముందు మా అమ్మ బీడీలు చేసేది. బీడీల పని కంటే ఈ పని బాగుంది. మంచి ఉపాధి లభిస్తుంది. ఇంటి వద్దనే నీడ పట్టున ఉండి పని చేస్తాం. ఎన్నికల రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది. – సామల దీప్తి, ఇంటర్ విద్యార్థి -
మాకు ఆ చీర కావాలి..!
గాంధీనగర్ : గత వారం జరిగిన పుల్వామా ఉగ్ర దాడి నుంచి భారతావని ఇంకా కోలుకోలేదు. దేశమంతా ఓ వైపు తమ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళుర్పిస్తూనే.. మరో పక్క దాయాది దేశం పట్ల తీసుకోబోయే ప్రతీకార చర్యల గురించి చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు నివాళులర్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు గుజరాత్ వస్త్ర వ్యాపారులు. భారతీయ సంప్రదాయానికి చిహ్నమైన చీర మీద.. సరిహద్దుల్లో పహరా కాస్తూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించే సైనికుల ఫోటోలను చిత్రించారు. ప్రస్తుతం ఈ చీరకు విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకోవడమే కాక మాకు కూడా కావాలంటూ క్యూ కడుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటున్నారు చీరను తయారు చేసిన వ్యాపారి. సూరత్కు చెందిన అన్నపూర్ణ బట్టల మిల్లు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయం గురించి మిల్లు యజమాని మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మనం కోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాలకు చిహ్నంగా జవాన్ల ఫోటోలతో ఈ చీరలను రూపొందించాము. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందిస్తాము. ఈ చీరల మీద మన సైన్యం శక్తిని, యుద్ధ ట్యాంకులను, తేజోస్ విమానాల బొమ్మలను ముద్రించామ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ చీరలకు ఫుల్ డిమాండ్ ఉందని.. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మిల్లు యజమాని. ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
సిరిసిల్లకు సంక్రాంతి శోభ
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. సిరిసిల్లకు పండుగ శోభ ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది. పని బాగుంది మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి. – వెల్ది హరిప్రసాద్, ఆసామి బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్ కంటే తమిళనాడు చీరలు నయమే. – మహేశుని ప్రసాద్, కార్మికుడు -
వాణిజ్య, వ్యాపార కేంద్రంగా సిరిసిల్ల
సాక్షి, హైదరాబాద్: నేతన్నల సంక్షేమం ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు పాలన సాగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్స్టైల్ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులను సంపూర్ణంగా మార్చడంతో పాటు నూతన పెట్టుబడులను ఆకర్షించి, మరింత మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పని చేశామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నల ప్రతినిధులు మంగళవారం కేటీఆర్ను హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల ప్రాంత నేతన్నల స్థితిగతులు మారడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా గొప్ప ఆత్మ సంతృప్తి లభించిందని పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల స్థితిగతులు తనను ఎంతగానో కలచివేసేవని, తెలంగాణ ఏర్పడ్డాక అక్కడి నేతన్నలకు గౌరవంగా బతికేలా ఆదాయం కల్పించే కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. బతుకమ్మ చీరల వల్ల ఒక్కో కార్మికుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నెలసరి వేతనం పొందే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అపెరల్ పార్కు ఏర్పాటుతో 10 వేల మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సిరిసిల్లను టెక్స్టైల్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు. మిడ్ మానేరు పూర్తి కావడంతో సిరిసిల్లకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పారు. వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, నేతన్నల ఆధ్వర్యంలో సిరిసిల్లలో నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు రావాలని నేతన్నలు కేటీఆర్ను కోరగా అందుకు అంగీకరించారు. టీఆర్ఎస్కు సంచార జాతుల మద్దతు టీఆర్ఎస్కు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ సంచారజాతుల సంఘం ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపింది. తెలం గాణ సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వొంటెద్దు నరేందర్ ఆధ్వర్యంలో 80 కులాల బాధ్యులు ఎంపీ కవితను మంగళవారం నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. సీఎం కేసీఆర్ సంచారజాతులకు మేలు చేస్తున్నారని, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ప్రతినిధులు పేర్కొన్నారు. -
వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. భారీ సంఖ్యలో ఈ ఉత్పత్తులపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ను మంగళవారం ప్రభుత్వం లోక్సభకు సమర్పించింది. 328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ (1962) సెక్షన్ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే ఎక్కువగా ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. -
టెక్స్టైల్స్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: దేశీయ టెక్స్టైల్స్ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇలా దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచనున్నట్టు తెలిపాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. -
కూర్చునే హక్కు
చక్కటి చీర కట్టు. పెదవులపై చెరగని చిరునవ్వు. ప్రాంగణ ద్వారంలోనే ఎదురై.. రారమ్మని ఆహ్వానించే ఆత్మీయమైన పలకరింపులు! షాపింగ్ మాల్స్లో సేల్స్ గర్ల్స్ ఇచ్చే నమస్కారాన్ని అందు కున్నాక కొనాలనుకున్న వస్తువు కొనకుండా మానం. ఒకవేళ వద్దనుకున్నా మనతో కొనిపించే వారి వేడికోలు.. ఏ కొంచెం మొహమాటం ఉన్నవారినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ వారి మర్యాదల వెనుక దయనీయమైన వేదన ఒకటుందని కేరళ మహిళలను చూశాక కానీ అర్థం కాదు. ఆ వేదనే కేరళ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులను ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఆ ఉద్యమం పేరే మలయాళంలో ఇరుప్పు సమరం.’ పన్నెండు గంటల పాటు ఏకధాటిగా నిలబడి ఉండాలి. అదీ పెదవులపై చిర్నవ్వు చెదరకుండా. 12 గంటల్లో రెండే రెండు సార్లు వాష్రూమ్కు వెళ్లొచ్చు. అది కూడా ఐదు నిమిషాలకు మించకూడదు! లంచ్కి 30 నిమిషాలు టైం ఇస్తారు. అంతకన్నా మించితే జీతంలో కోత. అంతే కాదు. పొరపాటున ఎవరూ చూడట్లేదని నేలమీద కూర్చున్నారో కెమెరా కన్నెర్రజేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడినా సూపర్వైజర్ కంఠం ఖంగుమంటుంది. కాళ్లు పీక్కుపోయి ఒక్క క్షణం గోడకి ఒరిగి ఒంటికాలుపై నుంచున్నా కూడా ఫైనే. ఇక కనీస వేతనం కూడా కాని జీతంలో ఇంటికి తీసుకెళ్లేది కోతలే తప్ప జీతం రాళ్లు కాదు. ఇది ఎక్కడో బానిస దేశంలో కాదు.. మహిళల హక్కుల విషయంలో అగ్రభాగాన ఉన్న కేరళ రాష్ట్రంలో. ఈ పరిస్థితి చివరికి టెక్స్టైల్ ఇండస్ట్రీలోనూ, బట్టల షాపుల్లోనూ మహిళా కార్మికులు ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల మహిళా ఉద్యోగుల ‘కూర్చునే హక్కు’ ఉల్లంఘనకు గురి కాగా ఇప్పుడిక 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులు కూర్చునే హక్కుని సాధించుకున్నారు. ‘రైట్ టు సిట్’ ఉద్యమానికి అనుకూలంగా కేరళ ప్రభుత్వం స్పందించింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న కార్మికులకు కూర్చునేందుకు స్టూల్ తదితరాలను ఏర్పాటు చేయాలనీ, ఎనిమిది గంటల పనిదినాన్ని తప్పనిసరిగా పాటించాలని, అంతకు మించి పని చేయించుకోకూడదనీ అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు చట్టంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం టీ బ్రేక్, లంచ్ బ్రేక్లను తప్పనిసరి చేసింది. ఉద్యమ సార«థి విజి పెన్కూట్ అయితే ఇది కేవలం కేరళకు సంబంధించిన విషయం కాదు. అనేక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లు కూర్చోవడం నేరం. కూర్చుంటే ఫైన్.. లాంటివి సర్వసాధారణంగా అమలైపోతున్నాయి. అయితే అసంఘటిత రంగంలో.. ప్రధానంగా భారీ మాల్స్లోనూ, బట్టల దుకాణాల్లోనూ మహిళల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తోన్న అమానవీయ చర్యలను మొదటిసారిగా కేరళ మహిళలు ధిక్కరించారు. కేరళకు చెందిన విజి పెన్కూట్ ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. ‘ఆ ఇదేం పెద్ద సమస్యా?’ అంటూ పెదవి విరిచేసిన పురుష యూనియన్లకు దీటుగా విజి పెన్కూట్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేకంగా 2010లో మహిళా సంఘాన్ని (ఏఎంటీయూ) ఏర్పాటు చేసి ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించారు. అలా కేరళ మహిళలు తమ కూర్చునే హక్కు కోసం ఎనిమిదేళ్ల పాటు నిలబడ్డారు. చీరల షాపులో తొలి తిరుగుబాటు షాప్ యాజమాన్యాల కాఠిన్యంతో అనేక గంటలపాటు అలాగే నించొని ఉండాల్సి రావడంతో ఈ రంగంలో పనిచేస్తోన్న అనేక మంది మహిళలకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, కాళ్లు వాయడం లాంటి అనారోగ్య సమస్యలెదురయ్యాయి. కేవలం రెండేసార్లు టాయ్లెట్కి వెళ్లే అవకాశం ఉండటంతో మిగిలిన సమయమంతా (యూరినల్స్కి వెళ్లాల్సి వస్తుందని) నీళ్లు తాగకుండా ఉండడంతో చివరకు ప్రాణాంతకమైన కిడ్నీ సమస్యలకు దారితీసేది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది కారణమయ్యేది. దీంతో మొదట 2014లో కేరళ, త్రిస్సూర్లోని కల్యాణ్ చీరల షాప్లో మహిళలు తమ ‘కూర్చునే హక్కు’కోసం స్ట్రైక్ చేశారు. కల్యాణ్ చీరల దుకాణంలో స్ట్రైక్తో ఉద్యమం ఊపందుకుంది. దిగివచ్చిన మర్చంట్స్ ‘‘మీరు కూర్చోదల్చుకుంటే, లేదా తరచూ టాయ్లెట్కి వెళ్లాలనుకుంటే, అలాంటి వాళ్లు ఇంట్లో కూర్చోవాలి తప్ప ఉద్యోగాలు చేయకూడదు’’ అని కేరళ మర్చంట్స్ అసోసియేషన్తో పాటు వస్త్ర దుకాణాల యాజమాన్యాలు వ్యాఖ్యానించడం ‘కూర్చునే హక్కు’ (ఇరుప్పు సమరం) కోసం పోరాటానికి ఉసిగొల్పిందంటారు ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన విజి. అయితే ఈ ఉద్యమంపై ప్రభుత్వం దృష్టి సారించేందుకు చాలా కాలం పట్టింది. ఈ జూలై 4న కేరళ క్యాబినెట్.. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ మార్పులు చేయాలని నిర్ణయించడంతో కేరళ మహిళల ‘రైట్ టు సిట్’ ఉద్యమం విజయవంతమైంది. గతంలో ఉన్న కార్మిక చట్టంలో.. ప్రత్యేకించి మహిళల కూర్చునే హక్కు ప్రస్తావన లేదనీ, దీన్ని సవరించడం వల్ల మహిళా కార్మికులందరికీ మేలు జరుగుతుందని కేరళ లేబర్ కమిషనర్ తోజిల్ భావన్ వ్యాఖ్యానించారు. అజిత అనే మాజీ వామపక్ష కార్యకర్త ద్వారా స్ఫూర్తిపొందిన విజి టీనేజ్లోనే ఫెమినిస్ట్ ఉద్యమంలో చేరారు. కోళికోడ్లోని అసంఘటిత రంగ కార్మికులతో కలిసి పనిచేస్తోన్న విజీ అంటే అక్కడి మహిళలకు అంతులేని గౌరవం. అదే గౌరవాన్ని ఇప్పుడు కేరళ ప్రభుత్వమూ ఆమెపై కనబరిచిందనడానికి సాక్ష్యం.. త్వరలోనే చట్టంలో జరగబోతున్న సవరణే. -
పట్టు ఉత్పత్తిలో చైనాతో పోటీపడదాం
సాక్షి, హైదరాబాద్: పట్టు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీపడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో పట్టు రైతుల అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ వెనకబడి రెండోస్థానంలో నిలిచిందన్నారు. అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్లతో పాటు భారత్ కూడా పట్టును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. పట్టు ఉత్పత్తులకు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. ఐదో స్థానంలో తెలంగాణ.. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని జూపల్లి సూచించారు. భారత్లో 45 వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉంటే 31వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. మనదేశంలో 9,571 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 119 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో మల్బరీ సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎకరం సాగుతో ఏడాదికి రూ.4 లక్షలు ఒక ఎకరం మల్బరీ సాగు చేయడం వల్ల ఐదుగురికి ఏడాదంతా ఉపాధి కల్పించవచ్చునని, ఏడాదిలో 8 నుండి 10 పంటలు సాగు చేయవచ్చునని జూపల్లి చెప్పారు. ఎకరానికి దాదాపుగా రూ.4 లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశముందని వివరించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యానవన శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టు దారం–రైతు జీవనాధారం బుక్లెట్, సీడీని జూపల్లి ఆవిష్కరించారు. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య
సిరిసిల్లటౌన్: కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న సిరిసిల్లలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సుభాష్నగర్కు చెందిన మేర్గు సుధాకర్(42) సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు.మూడు నెలలుగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య రమాదేవి సుధాకర్తో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో శుక్రవారం ఉదయం డైయింగ్లో కలిపే రసాయనం(నైట్రాప్)తాగి ఇంట్లోనే చనిపోయాడు. మృతుడికి కొడుకు రేవంత్, కూ తురు లహరి ఉన్నారు. అంత్యక్రియల్లో తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి జూకంటి జగన్నాథం, సెస్ వైస్చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, జిల్లెల్ల పీఏసిఎస్ చైర్మన్ పబ్బతి విజయేందర్రెడ్డి పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వస్త్ర పరిశ్రమల యజమానులు రాష్ట్రానికి తిరిగి రావాలని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్బాగ్ పరిశ్రమ భవన్లోని టీఎస్ఐఐసీ బోర్డు రూమ్లో తెలంగాణ నుంచి వలసవెళ్లిన షోలాపూర్, భీవండి చేనేత పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త యూనిట్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా వస్త్ర పరిశ్రమ క్లస్టర్లను నెలకొల్పుతామని చెప్పారు. అంతేకాకుండా స్థలంతో పాటు సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలమల్లు సూచించారు. సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, చేనేతశాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్రెడ్డి, జహీరాబాద్ నిమ్జ్ సీఈవో మధుసూదన్, వరంగల్జిల్లా మడొకిండ టెక్స్టైల్ పార్కు యజమానుల సంఘం అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. -
మగ్గాలపై..ఆఖరితరం!
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు. ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది. 1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి. -
సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్
సాక్షి, హైదరాబాద్: టెక్స్టైల్ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్లలో పవర్లూమ్ యూనిట్ల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం అండగా ఉండాలన్నారు. సమీకృత పవర్లూమ్ క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లకు మెగా క్లస్టర్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతంలో సుమారు 80 శాతం మంది పవర్ లూమ్ రంగంపైనే ఆధారపడి ఉన్నారని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. దాదాపు 36 వేల పవర్లూమ్ యూనిట్లు అక్కడ ఉన్నాయన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పవర్ లూమ్లను ఆధునీకరించకపోవడంతో అధిక విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. అంతేకాకుండా నిర్వాహకులకు పెట్టుబడి స్థోమత సరిగా లేకపోవడంతో ముడిసరుకు కోసం వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలాగే నైపుణ్యంగల కార్మికులు, మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోందన్నారు. ఈ సమస్యలవల్ల దేశంలోని మిగతా పవర్లూమ్ పరిశ్రమలతో సిరిసిల్ల పోటీపడలేకపోతోందని పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల పవర్లూమ్ రంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు కొన్ని చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే స్కూల్ యూనిఫాంలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా పేదలకు అందించేందుకు చీరలకు ఆర్డర్లను ఇచ్చిందని వివరించారు. అలాగే ప్రభుత్వ విభాగాలకు అవసరమైన దుస్తులను కొనడం వం టి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అయితే సిరిసిల్ల పవర్ లూమ్ రంగం సమగ్రాభివృద్ధికి మరిన్ని చర్యలు అవసరమని, ఇందుకోసం మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తే ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది మందికి గరిష్ట ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. 2013–14లో ఈరోడ్, భివండీ ప్రాంతాల్లో మెగా పవర్లూమ్ క్లస్టర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. వాటి ఏర్పాటుతో అక్కడ గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. అదే తరహాలో సిరిసిల్ల కార్మికులకు కూడా చేయూతనివ్వాలని కోరారు. జ్యూరిచ్లో కేటీఆర్కు ఘన స్వాగతం దావొస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం నేతలు కేటీఆర్కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం జ్యూరిచ్ చేరుకుంది. ఆదివారం ఇక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ బృందం దావోస్లో జరగనున్న ప్రపంచ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లనుంది. కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా సదస్సుకు హాజరవుతున్నారు. 22 నుంచి 26 వరకు ఫోరంలో కేటీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతోపాటు, సమావేశాల్లో ప్రసంగిస్తారు. ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు మహేష్, అనిల్ కూర్మాచలం, అశోక్, నవీన్, తెలంగాణ జాగృతి యూకే ప్రతినిధి స్పందన మంత్రికి స్వాగతం పలికారు. -
దక్షిణ కొరియాలో కేటీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణ కొరియా వెళ్లిన పరిశ్రమలు, ఐటీల శాఖ మంత్రి కె.తారక రామారావు తొలి రోజున అక్కడి పలు వ్యాపార సంస్థల సీఈఓలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార, పెట్టుబడుల అవకాశాలను వివరించి.. ఆటో మొబైల్, టెక్స్ టైల్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్పొ రేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నామ్ గుహ్నో, హ్యుందాయ్ రోటెమ్, గ్లోబల్ రైల్వే విభాగం డైరెక్టర్ కేకే యూన్తో సమావేశమై తెలంగాణలో ఆటో మొబైల్ రంగానికి ఉన్న సానుకూలతలు, పెట్టు బడుల అవకాశాలను వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక అనుమతులు ఇస్తామని వివరించగా.. ఈ విధానం బాగుం దని హ్యుందాయ్ ప్రతినిధులు ప్రశంసించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో కార్యకలాపాలు కొనసా గిస్తున్న అగ్రగామి గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఓపీఐ సీఈఓ వుహైన్ లీతోనూ కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వా నించారు. ‘మొయిబా’తో సహకార ఒప్పందం మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మొయిబా) సీఈవో చొయ్డాంగ్ జిన్తో మంత్రి కేటీఆర్ సమావేశమై.. ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ ఐటీ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. 500కు పైగా కంపెనీల నుంచి సభ్యులు కలిగిన ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర అంశా ల్లో మొయిబా, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది. ‘టెక్స్టైల్’లో పెట్టుబడులు పెట్టండి కొరియా టెక్స్టైల్స్ పరిశ్రమల సమాఖ్య చైర్మన్ కిహుక్ సుంగ్, ఇతర టెక్స్టైల్స్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీఎస్ ఐపాస్ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు ఆ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రదేశమని.. పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా కిహుక్ చైర్మన్గా ఉన్న యంగ్వాన్ సంస్థ ఇప్పటికే కాకతీయ టెక్స్టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. నార్త్ ఫేస్ బ్రాండ్ పేరుతో ఆ కంపెనీ వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. మరో టెక్స్టైల్ సంస్థ ‘హ్యోసంగ్’ ఉపాధ్యక్షుడు జే జూంగ్ లీతోనూ కేటీఆర్ సమావేశమై టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అనంతరం కొరియా డయింగ్ అండ్ ఫినిషింగ్ టెక్ ఇన్స్టిట్యూట్ (డైటెక్)ను పరిశీలించి.. ఆ సంస్థ అధ్యక్షుడు యూన్ నామ్ సిక్తో సమావేశమయ్యారు. టెక్స్టైల్ పార్కులో వాటర్ ట్రీట్మెంట్, మానవ వనరుల నిర్వహణ వంటి అంశాల్లో సాంకేతిక సహకారం అందించాలని కోరారు. మరో ప్రముఖ టెక్స్ టైల్ దిగ్గజం కోలాన్ గ్రూపు ప్రతినిధుల తోనూ కేటీఆర్ సమావేశ మయ్యారు. కొరియా టెక్స్టైల్ సిటీ పరిశీలన కొరియన్ టెక్స్టైల్స్, ఫ్యాషన్, హైటెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రమైన దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది. ఆ నగర డిప్యూటీ మేయర్ కిమ్ యాన్ చాంగ్తో సమావేశమై అక్కడ టెక్స్టైల్ పరిశ్రమల ప్రగతిపై చర్చించారు. దైగు నగర ఇన్నోవేషన్, ఆర్థిక విభాగ బృందంతోనూ సమావేశమై గేమింగ్, గ్రాఫిక్స్ రంగం కోసం హైదరాబాద్లో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ ప్రాజెక్టులో భాగస్వాములవ్వాలని కోరింది. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్లు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు వివేక్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ టెక్స్టైల్స్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ బృందం -
ధర్నా చేపట్టిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
సాక్షి, ప్రొద్దుటూరు: చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేదు. దీంతో చేనేత కార్మికులు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వారికి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు మద్దతు పలికారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే వారికి మద్ధతుగా ధర్నాకు దిగారు. చేనేత కార్మికులకు పింఛన్ పంపిణీ చేసే వరకు తాను ధర్నా కొనసాగిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
సర్కారు ఆర్డర్లు వద్దు సారూ!
సిరిసిల్ల: మొన్నటివరకు ఆశతో, ఆసక్తిగా వర్క్ ఆర్డర్లు స్వీకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేతకార్మికులు ఇప్పుడు సర్కారు ఆర్డర్లు వద్దంటున్నా రు. పవర్లూమ్ కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్స్, సంక్షేమ శాఖలకు అవసరమైన వస్త్రాలు, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ పండుగ దుస్తులు ఉత్పత్తి చేసే బాధ్యతను ఇక్కడి నేత కార్మికులకు ఇచ్చింది. అయితే, గతంలో తయారు చేసిన వస్త్రానికి నేటికీ నిధులు విడుదల కాకపోవటం.. నూలుపై జీఎస్టీ బాదుడు, ధరలు గిట్టుబాటు కాకపోవటంతో సర్కారీ ఆర్డర్లను నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిద్ధం.. సిరిసిల్లలోని నేత కార్మికుల కోసం ప్రభుత్వ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ద్వారా రూ. 42 కోట్ల విలువైన కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్ ఉంది. అలాగే, వచ్చే క్రిస్మస్కు అవసరమైన రూ.6.73 కోట్ల విలువైన 25.52 లక్షల మీటర్లు, సంక్షేమశాఖకు చెందిన రూ.12 కోట్ల విలువైన 40 లక్షల మీటర్ల ఆర్డర్లు రెడీగా ఉన్నా.. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇవిపూర్తి కాగానే క్యాలెండర్ ప్రకారం మళ్లీ బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీకి ముందు నిర్ణయించిన ధరతోనే వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడంతో వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వ ఆర్డర్లపై ఆసక్తి చూపడంలేదు. మళ్లీ అవే నష్టాలు.. వస్త్రోత్పత్తికి అవసరమైన నూలుపై గతంలో 2 శాతం సీఎస్టీ విధించేవారు. జీఎస్టీ అమలు చేయటంతో ఇప్పుడది 18 శాతం శ్లాబులోకి వెళ్లింది. దీంతో నూలు ధరలు పెరిగాయి. ఆ మేరకు ప్రభుత్వం వస్త్రం ధరను పెంచలేదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతన్నకు రూ.15 వేలకు తగ్గకుండా కూలి ఇవ్వాలని ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ మేరకు నేత కార్మికులకు మీటరుకు రూ.2.25, ఆసాములకు రూ.2.75 చెల్లించాలని జౌళిశాఖ అధికారులు నిబంధన పెట్టారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా ఉన్న వైపని, వార్పిన్, టాకాలుపట్టే కార్మికులు, హమాలీలు సైతం కూలి రేట్లు పెంచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్వీఎం ఆర్డర్ల ద్వారా సూటింగ్ మీటరు వస్త్రం రూ.54, షర్టింగ్కు రూ.34, ఓణీ వస్త్రానికి రూ.31, ప్యాకెట్ క్లాత్కు రూ.28 చెల్లిస్తోంది. 2016 నాటి ఒప్పం దం మేరకు ఈ ధరలు అమలవుతున్నాయి. కానీ, జీఎస్టీ బాదుడుతో కూలి రేట్లు గిట్టుబాటు కావడం లేదని వస్త్రోత్పత్తిదారులు అంటున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. సర్కార్ ఆర్డర్లు పొంది వస్త్రం సరఫరా చేస్తే.. ఆరు నెలలదాకా బిల్లు రావడంలేదు. దీంతో కార్మికుల వేతనాలు చెల్లించడం ఇబ్బందిగానే మారింది. చివరికి 10 శాతం బిల్లును అధికారులు ఆపేసి నాణ్యతనిర్ధారణ చేసిన తర్వాత చెల్లించడంతో ఆసాములు ఇబ్బందిపడుతున్నారు. మంత్రి కేటీఆర్పైనే ఆశలు.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్కు సిరిసిల్ల నేత కార్మికులు, యజమాని, ఆసామి అనే మూడంచెల వస్త్రోత్పత్తి రంగంపై అవగాహన ఉంది. ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి వస్త్రోత్పత్తి రేట్లను సవరించి, జీఎస్టీకి అనుగుణంగా ధర పెంచాలి. శాస్త్రీయంగా విశ్లేషించి వాస్తవాలను పరిగణనించాలి. ఇలాగైతేనే ప్రభుత్వ ఆర్డర్లకు ఆసాములు ముందుకు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం వస్త్రోత్పత్తిదారులకు ఇచ్చేందుకు ప్రస్తుతం ఆర్వీఎం ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని పొందేందుకు పవర్లూమ్ మ్యాక్స్ సంఘాలు, చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎస్ఐ)యజమానులు ముందుకు రావడంలేదు. వస్త్రం ధర గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రస్థాయిలో టెక్నికల్ కమిటీ రేట్ల నిర్ధారణను పరిశీలిస్తోంది. – వి.అశోక్రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ -
జై వరంగల్ .. జై తెలంగాణ
వరంగల్ ప్రజల రక్తం మీద ఉన్న విశ్వాసంతో చెబుతున్నా.. వందకు వందశాతం అద్భుతమైన టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటది. పెట్టుకున్న పేరు కాకతీయ రాజులది. కాబట్టి బర్కత్ ఉంటది. సూరత్లో చీరలు, సోలాపూర్లో దుప్పట్లు, తిర్పూరులో బనీన్లు దొరుకుతాయి. కానీ.. వరంగల్లో ఒకే చోట అన్ని దొరికేలా టెక్స్టైల్ పార్కుకు రూపకల్పన చేసినం. – సీఎం కేసీఆర్ సాక్షి, వరంగల్ రూరల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాబోతున్నాయి.. ఇక చాలు సార్ అనే వరకు వస్తాయి.. దమ్మున్న రైతులు మూడు పంటలు పండించే జిల్లా వరంగల్. ఈ నీటితో బంగారు వరంగల్ అవుతుంది. ఆ తర్వాతనే బంగారు తెలంగాణ అవుతది.. మొట్టమొదటి అవకాశం మీ జిల్లాకే రాబోతున్నది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లోని చింతలపల్లి ప్రాంతంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు,కాజీపేట ఆర్ఓబీ, ఐటీ ఇంక్యుబేష¯Œన్ సెంటర్, ఔటర్ రింగ్రోడ్డులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రమిక, విద్యా రంగాల్లో రాబోయే రోజుల్లో అద్భుతమైన జిల్లాగా వరంగల్ రూపుదిద్దుకోబుతున్నదని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో లక్ష మందికి ఉపాధి కల్పించి, లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందిస్తాం.. బంగారం పండించి, విద్యారంగంలో అభివృద్ధి సాధించి దేశంలోనే గొప్ప జిల్లాగా మారుతుంది.. ఇది నా అకాంక్ష.. నేరవేరుతది అని స్పష్టం చేశారు. దేశంలోనే పెద్ద నగరం.. రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో నగరం వరంగల్ కాబట్టి రాబోయే రోజుల్లో గిరిజన యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు ఏవి వచ్చినా వరంగల్కే తీసుకొస్తానని హామీ ఇచ్చారు. హైదారాబాద్లో ఇప్పటికే అన్ని ఉన్నాయి.. వరంగల్కే తరలిస్తామన్నారు. ఉద్యమ గురువు జయశంకర్ సార్, వరంగల్కు ఎప్పుడు వచ్చినా ఊపిరిని ఇచ్చింది మీరే.. అని గుర్తు చేశారు. సభకు ఏ పదివేల మంది వస్తారనుకున్నా.. కానీ లక్షలాదిగా ప్రజలు తరలిరావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ‘వరంగల్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోయిన.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడుతానని చెప్పిన.. భగవంతుడు మన్నించిండు.. మీరు దయకల్పించిండ్లు.. అదే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టిన’ అని కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకంతోనే రాష్ట్రం సాధించామని చెప్పారు. ఈ సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవదాలు తెలిపారు. సభలో తప్పిపోయిన మహిళ గీసుకొండ(పరకాల): మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు లక్ష్మి అనే మూగ మహిళ సీఎం సభలో పాల్గొని వస్తుండగా ఆదివారం రాత్రి తప్పిపోయిందని ఆమె బంధువు గుడిమెట్ల రాధాకృష్ణ తెలిపారు. బస్సులో గ్రామ మహిళలతో కలిసి వెళ్లిన ఆమె తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉండడంతో తప్పిపోయిందని బంధువులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు గీసుకొండ పోలీస్స్టేష న్లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
22న టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్లో నెలకొల్పనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కునకు అక్టోబరు 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేస్తారని, అదే రోజు వరంగల్ ఓఆర్ఆర్, కాజీపేట ఆర్వోబీ పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జ్ (టా స్క్) రీజనల్ కార్యాలయాన్ని శనివారం హన్మకొండలో కేటీఆర్ ప్రారంభించారు. కాగా, టెక్స్టైల్ పార్కు వద్ద 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్న పైలాన్ నమూనాను మంత్రి కేటీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంయుక్తంగా ఆవిష్కరించారు. రూ. 25 కోట్లతో ఐటీ టవర్ అత్యుత్తమ ప్రతిభ గల ఓరుగల్లు విద్యార్థులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు నిట్, వరంగల్లలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ చెప్పారు. మడికొండలోని ఇంక్యూబేషన్ సెంటర్లో రూ.25 కోట్లతో మరో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబరు 22న దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు. టాస్క్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్, మహీంద్రా ప్రైడ్, మేథా ఇంజనీరింగ్, క్రిష్ణమాచారి ఫౌండేషన్కు చెందిన ఇంగ్లిష్ స్ట్రోక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం (మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయూ) కుదుర్చుకున్నారు. టెక్స్టైల్ పార్క్ స్థల పరిశీలన వరంగల్ రూరల్ జిల్లా సంగెం–గీసుకొండ మండలాల పరిధిలో నిర్మించనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు స్థలాన్ని శనివారం కడియం, కేటీఆర్లు పరిశీలించారు. ఫార్మ్ టూ ఫ్యాషన్ అనే లక్ష్యంతో వరంగల్లో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వల్ల 1.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్కిల్, సెమీ స్కిల్, నాన్ స్కిల్లుగా మూడు రకాల ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. శంకుస్థాపన రోజే 12 కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తిర్పూర్ తరహాలో టెక్స్టైల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్సిస్టిట్యూషన్ (నిఫ్ట్) సెంటర్ను వరంగల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 22న జరగనున్న టెక్స్టైల్ పార్కు శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. దాదాపు 45 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా జనాలను సమీకరిస్తామన్నారు. -
మెగా హిట్ చేయాలి
వరంగల్ , గీసుకొండ(పరకాల): సీఎం కేసీఆర్ ఈనెల 20న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ ‘మెగా’ కార్యక్రమాన్ని హిట్ చేయాలని అన్నారు. శుక్రవారం శాయంపేటహవేలి శివారులోని టెక్స్టైల్ పార్కు స్థలంలో బహిరంగ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పోలీసు, టీఎస్ఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే సభావేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను గుర్తించామన్నారు. శాయంపేటహవేలి శివారు ఊకల్–స్టేషన్చింతలపెల్లి దారి పక్కనే ఉన్న మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసే సభాస్థలికి అరకిలోమీటరు దూరంలోనే వాహనలు పార్కింగ్ చేసేలా పోలీస్ అధికారుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్కింగ్ స్థలాలను గుర్తించాం పరకాల, నర్సంపేట, ములుగు నియోజవర్గాల ప్రజలు మచ్చాపూర్, పర్వతగిరి, సంగెం మండలం చింతలపల్లి మీదుగా రావాల్సి ఉంటుం దని, ఈ మేరకు ప్రాథమికంగా రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు. పర్వతగిరి, రాయపర్తి మండలాల నుంచి సంగెం మీదుగా వచ్చే వారికి చింతలపెల్లి గేట్ సమీపంలో, పాలకుర్తి, ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలు, హన్మకొండ, మామునూరు, రంగశాయిపేట, వంచనగిరి, శాయంపేట మీదుగా వచ్చే వారికి శాయంపేట రైల్వే గేటు సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. టీఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్రాథోడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.రాజగోపాల్, వరంగల్ ఆర్డీఓ మహేందర్జీ, ఈస్ట్ జోన్ డీసీపీ ఇస్మాయిల్, పరకాల ఏసీపీ సుధీంద్ర, ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, శాయంపేట సర్పంచ్ కొంగర చంద్రమౌళి, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, గీసుకొండ, పర్వతగిరి, మామునూరు సీఐలు సంజీవరావు, సత్యనారా యణ, శివరామయ్య, టీఆర్ఎస్ నాయకులు పోలీస్ ధర్మారావు, వెంకన్న, గోలి రాజయ్య, జయపాల్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. ‘పార్కు’ స్థలాన్ని పరిశీలించిన టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు టెక్స్టైల్ పార్క్ వద్ద బహిరంగ సభ స్థలాన్ని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు శుక్రవా రం రాత్రి పరిశీలించారు. పొద్దుపోయిన తర్వా త ఆయన ఇక్కడికి రావడం, చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించక శనివారం వస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలమల్లుతో పాటు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి హన్మకొండలో బసచేసి శనివారం మంత్రి కేటీఆర్ పర్యటనలో పాల్గొననున్నారు. -
ఆ పనుల వేగం పెంచండి
ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణాలపై గురువారం సచివాలయంలో రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ పార్కుకు సంబంధించి రోడ్డు నిర్మాణంతో పాటు మాస్టర్ ప్లాన్, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిధుల సమీకరణ, వివిధ కంపెనీలతో ఎంవోయూ, యాంకర్ యూనిట్, డీపీఆర్, సీఈటీపీ నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు. ఫార్మాసిటీకి సంబంధించి, రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
చిత్తూరు: పట్టణంలోని చర్చి వీధిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపూర్వ టెక్స్టైల్స్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టల దుకాణం పూర్తి కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. షార్ట్ సర్య్యూట్ అనంతరం దుకాణం తాళాలు సకాలంలో దొరకకపోవడంతో ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి కుదరలేదు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
చేనేత వ్యాపారాలు బంద్
- నేటి నుంచి నేతన్నల పోరుబాట –జీఎస్టీ ఎత్తివేసేవరకూ కొనసాగనున్న ఆందోళనలు –రూ. కోట్లలో నిలిచిపోనున్న వ్యాపార లావాదేవీలు –శుభమూహార్తాల సీజన్లో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ధర్మవరం: శ్రావణ మాసం.. శుభముహూర్తాల సీజన్..ఈ సీజన్ వెళ్లిపోతే మరో మూడు నెలలు ఖాళీగా ఉండాల్సిందే.. ఇటువంటి పరిస్థితుల్లో చేనేతలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు..చేనేత రంగంపై జీఎస్టీ భారం ఎత్తివేసేవరకూ చేనేతకు సంబంధించిన ఏ లావాదేవీ నిర్వహించమని, అప్పటి దాకా ఏ ఒక్క శిల్క్హౌస్ను తెరవబోమని తేల్చిచెబుతున్నారు. దీంతో దాదాపు రోజూ కోట్లలో టర్నోవర్ జరిగే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. ధర్మవరం పట్టణంలో దాదాపు 2,000 శిల్క్హౌస్లు ఉన్నాయి..వీటిలో సాధారణ పరిస్థితుల్లో అయితే రూ. 5 కోట్ల నుంచి సీజన్లో అయితే ప్రతి రోజూ దాదాపు రూ.25 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. సరాసరిగా ఇక్కడ ప్రతి రోజూ పట్టుచీరల విక్రయం/ కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ. 10 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేనేత ముడిసరుకులైన పట్టు దారంపై 5 శాతం, జరీపై 12 శాతం, పట్టుచీరల విక్రయంపై 5 శాతం జీఎస్టీని విధించింది. దీంతో ఇటు చేనేత కార్మికులపైనా, అటు వస్త్ర వ్యాపారులపైనా భారం పడుతోంది. ఇప్పటి దాకా చేనేతకు సంబంధించిన లావాదేవీలపై ఎటువంటి పన్నులు విధించిన దాఖలాలు లేవు. అయితే జీఎస్టీ అమలులో భాగంగా చేనేత రంగాన్ని కూడా ఇందులో చేర్చడం పట్ల చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేసే వరకూ తాము వ్యాపారలావాదేవీలు నిర్వహించబోమంటున్నారు. రోజుకో రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కోట్లలో నష్టం చేనేతల నిరవధిక బంద్ నిర్ణయంతో చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదముంది. ముఖ్యంగా శ్రావణమాసం శుభమూహూర్తాల సీజన్.. ఈ సీజన్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు పట్టు వస్త్రాల కొనుగోలు అధికంగా ఉంటాయి. ఇటుపరిస్థితుల్లో నిరవధిక బంద్ చేస్తే చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. మరోవైపు వినియోగదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక సీజన్ వెళ్లిపోతే మూడు నెలల పాటు చీరలను నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయకపోతే చేనేత రంగానికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి చేనేత రంగంపై ఇప్పటి వరకు పన్నులు విధించ లేదు. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో కనుమరుగైపోతోంది. జీఎస్టీ అమలైతే చేనేతలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలి. అంతవరకూ పోరాడుతాం. - మామిళ్ల ప్రసాద్, శిల్క్హౌస్ యజమాని, ధర్మవరం చేనేతరంగానికి పెద్ద దెబ్బ జీఎస్టీ అమలైతే చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే «ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలు మరింత భారం కానుంది. చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి ఉపసంహరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాం. ఎత్తివేసే వరకూ పోరాడుతాం. -చందా రాఘవ, మాస్టర్ వీవర్, ధర్మవరం -
టెక్స్టైల్ పరిశ్రమకు GST భారంగా మారింది
-
సిరిసిల్ల టెక్స్టైల్పార్క్లో వ్యక్తి దారుణ హత్య
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న తిరుపతి(45)ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
టెక్స్టైల్ రంగానికి భారీ ప్రోత్సాహం
- అత్యుత్తమ విధానం, పారదర్శకత మా బలం: కేటీఆర్ - టెక్స్టైల్ ఇండియా సమ్మిట్లో మంత్రి ప్రసంగం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు సూచించారు. గుజరాత్లోని గాంధీనగర్, మహాత్మానగర్లో శుక్రవారం జరిగిన టెక్స్టైల్ ఇండియా సమ్మిట్లో కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా జరిగిన సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని మంత్రి వివరించారు. ప్రాధాన్య రంగంగా టెక్స్టైల్ పరిశ్రమను ప్రభుత్వం గుర్తించిందని, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కును నిర్మిస్తోందని చెప్పారు. పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. త్వరలో టెక్స్టైల్ పాలసీ.. త్వరలోనే టెక్స్టైల్ పాలసీని తెస్తామని కేటీఆర్ చెప్పారు. పారిశ్రామిక విధానంలానే ఈ పాలసీ కూడా విప్లవాత్మకంగా ఉంటుందని పేర్కొన్నారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబ డులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఫైబర్ టు ఫ్యాషన్ పద్ధతిలో ముడి సరుకు నుంచి తుది ఉత్పత్తి దాకా అన్నీ ఈ పార్కులోనే జరుగుతాయని చెప్పారు. దేశీయ అవసరాల నుంచి అంతర్జాతీయ ఫ్యాషన్ వరకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు ఈ పార్కు నుంచి వచ్చేలా చూస్తామన్నారు. కార్మికులకు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసున్నామని పేర్కొన్నారు. వారిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు కోయంబత్తూర్లోని పీఎస్జీ సంస్థతో కలసి ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. ఈ పరిశ్రమ విస్తృతికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి పత్తి మంచి నాణ్యతతో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, మౌలిక వసతులు, సరుకు రవాణా పరంగా దేశానికి కేంద్రస్థానంలో ఉండటం వంటికి తెలంగాణలో పెట్టుబడులకు సానుకూల అంశాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రా మిక వేత్తలకు ప్రపంచంలో ఎవరైనా ఇచ్చే ప్యాకేజీ, ప్రోత్సాహకాలకు సరితూగేటట్లు లేదా అంతకుమించి ఇస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. -
పన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్
హైదరాబాద్: నేటి (శుక్రవారం) అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయని, అయితే కేంద్రం ఈ సమస్యపై స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఎస్టీ అంశంపై తమ ఇబ్బందులను తెలిపేందుకు వస్త్ర వ్యాపారులు ఉత్తమ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చిన్న వ్యాపారులకు పన్ను మినహాయింపు ఇచ్చేలా చూడాలని కోరారు. జీఎస్టీని తట్టుకునే స్థోమత తమకు లేదని, సింగిల్ పాయింట్లో పన్ను వేస్తే మొయ్యలేని భారమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడి, పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతానని ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. మోదీ సబ్ కా వికాస్ కాదు, సబ్ కా సర్వనాశ్లా ఉంది.. త్వరలో వస్త్ర వ్యాపారులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ జులై 3న రాష్ట్రానికి వస్తున్నారని, ఆమెకు ఓటు వేసేందుకు మజ్లిస్ మద్దతు కూడా అడుగుతామని ఉత్తమ్ తెలిపారు. -
వస్త్ర వ్యాపారం బంద్
రాజమహేంద్రవరం సిటీ : వస్తు, సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వల్ల సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని, వ్యాపారులపై అ«ధికారుల ఒత్తిడి ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్లో 600 షాపులు, మెయిన్రోడ్లో 15 పెద్ద షోరూమ్లు, మిగిలిన షాపులు వెరసి 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి. జీఎస్టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. బంద్తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు వ్యాపారాల బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు వస్త్ర హోల్సేల్ వర్తకుల సంఘం అధ్యక్షుడు బిళ్లా రాజు పేర్కొన్నారు. వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. -
షట్టర్ క్లోజ్!
శ్రీకాకుళం అర్బన్: వస్త్రాలపై వస్తు వినియోగ పన్ను 5 శాతం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. వస్త్ర వ్యాపారుల సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు మంగళవారం బంద్ పాటించారు. దీంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. బుధ, గురువారాల్లో కూడా వ్యాపారులు బంద్ను పాటించనున్నారు. దేశ వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలుకానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వస్త్రంపై పూర్తిగా పన్నును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర వస్త్రవ్యాపార సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపింగ్మాల్స్, షాపులను మూసేశారు. జిల్లా వ్యాప్తంగా.. శ్రీకాకుళం నగరంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పట్టణాల్లోని వస్త్రదుకాణాలు తెరుచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా వస్త్ర దుకాణాల్లో సుమారు కోటిన్నర రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు జిల్లా వస్త్ర వ్యాపార సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. వస్తవానికి తొలుత నాలుగు రోజులు బంద్ నిర్వహించాలని నిర్ణయించిన వస్త్రవ్యాపార సంఘ ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమై మూడు రోజులు చేయాలని నిర్ణయించుకున్నారు. వస్త్ర దుకాణాలను మూసివేయడంతో కొంతమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డాయి. అయితే తొలిరోజు బంద్ విజయవంతమైంది. వస్త్రాలపై విధించిన పన్నును ఎత్తివేయాలి వస్త్రాలపై విధించిన 5 శాతం పన్నును ఎత్తివేయాలని వస్త్రవ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోణార్క్ శ్రీను డిమాండ్ చేశారు. చిన్నబజారు రోడ్డులోని వస్త్రవ్యాపారుల సంఘ కార్యాలయంలో మంగళవారం వస్త్రవ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వస్త్రవ్యాపారులంతా జీఎస్టీను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీన ఒకరోజు బంద్ పాటించామన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మూడు రోజులపాటు బంద్ చేస్తున్మాన్నారు. ఇచ్ఛాపురం నుంచి గ్రామస్థాయిలో వ్యాపారులంతా బంద్లో పాల్గొన్నారన్నారు. స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకూ వస్త్రాలపై పన్ను లేదని, ఇపుడు కొత్తగా అమలు కానున్న జీఎస్టీలో 5 శాతం విధించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వస్త్రాలపై పన్ను విధిస్తే వస్త్రవ్యాపారులంతా దీటుగా ఎదుర్కొని ఉద్యమించి పన్నును ఎత్తివేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చామన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికశాతం వస్త్రవ్యాపారమేనన్నారు. దీనిపై పన్ను విధించడం దారుణమన్నారు. వస్త్రవ్యాపారుల సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులతో బుధవారం సమావేశాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండపంలో ఏర్పాటు చేయనున్నామని, అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్తామని.. అనంతరం కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ ర్యాలీలో వస్త్రవ్యాపారులు, షాపులు, దుకాణాల్లో పనిచేసే కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధి అంధవరపు రఘు మాట్లాడుతూ వ్యాపారులంతా ఐకమత్యంగా ఉండి పోరాడితేనే సమస్యను సాధించుకోగలమన్నారు. సమావేశంలో వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధులు బరాటం చంద్రశేఖర్, శిల్లా వేణుగోపాల్, శిల్లా కాళి, డి.సతీష్, మావూరి శ్రీనివాసరావు, లక్ష్మణ్, గుడ్ల శ్రీను, బి.ముత్యాలరావు, బరాటం మురళి, బరాటం నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
టెక్స్టైల్స్పై పన్ను పోటు
చీరాల అర్బన్/ మార్కాపురం : కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధించడాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీని నిరసనగా ఆలిండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు వ్యాపారులు నాలుగురోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, చీరాల, ఒంగోలు, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, పర్చూరు, సింగరాయకొండ, అద్దంకి తదితర ముఖ్య పట్టణాల్లో వస్త్ర దుకాణాలు మూత పడనున్నాయి. క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్లో 21 సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు రెండు వేల వస్త్ర దుకాణాల యజమానులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా జీఎస్టీకి నిరసనగా సమ్మెలో పాల్గొంటున్నారు. చిన్న బొంబాయిగా పేరొందిన చీరాల వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. సూరత్ నుంచి నేరుగా వస్త్రాలు ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. చీరాల కేంద్రంగా జరుగుతున్న వస్త్ర వ్యాపారంపై ఎంతోమంది చిన్న చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం జరగనుంది. ప్రతి 15 రోజులకు జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించా లని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్ను తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతినెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్వేర్లో ఆన్లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు సాధ్యమవుతుందే గాని, చిన్న వ్యాపారులకు సాధ్యమయ్యే పని కాదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీరాలలో రిలే నిరాహార దీక్షలు.. చీరాల టెక్స్టైల్స్ మర్చంట్స్ అసోసియేషన్ (టీటీఎంఏ) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజులు రోజులు పాటు స్థానిక ఆర్.ఆర్.రోడ్డులో రిలే నిరాహారదీక్ష చేపడుతున్నట్లు టీటీఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని లీలాధరరావు, ఎ.శ్రీనివాసరావులు తెలిపారు. స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ (ఎంజీసీ)మార్కెట్లోని టీటీఎంఏ కార్యాలయంలో సమావేశమైన ప్రతినిధులు నాలుగు రోజుల కార్యాచరణ ప్రకటించారు. ప్రతిరోజు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్ష శిబిరంలో పాల్గొనడం, ఈనెల 30న బ్లాక్ డేగా ప్రకటించి నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇటీవల జీఎస్టీ విధింపుపై వస్త్ర వ్యాపారులు ఒక్కరోజు బంద్ పాటించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భారమంతా ప్రజలపైనే.. వస్త్రాలపై జీఎస్టీ విధించడం వలన భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా చదువు, వస్త్రాలు, మందులు, వృత్తి సేవలపై పన్ను విధించారు. వెయ్యి రూపాయలు విలువ గల చీర కొంటే 5శాతం, వెయ్యి పైన కొంటే 12శాతం పన్ను చెల్లించాలి. ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది. ప్రతి బిల్లు ఆన్లైన్ చేయాలంటే చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందికరం. చదువుకున్న వారు, చదువుకోని వారు ఉంటారు. జీఎస్టీ ఎత్తివేయాలని కోరుతూ బంద్ పాటిస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలి. – చిన్ని లీలాధరరావు, టీటీఎంఏ అధ్యక్షుడు, చీరాల వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి. వస్త్రాలను నిత్యావసర వస్తువులుగా గుర్తించాలి. వినియోగదారులపై పన్ను భారం వేయాలంటే మాకు బాధగా ఉంది. ఇటీవల కాలంలో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటంతో వస్త్ర దుకాణాల్లో వ్యాపారాలు లేక, పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి వస్త్రాలపై పన్ను ఎత్తివేయాలి. – పి.కేశవరావు, కమలా వెడ్డింగ్ మాల్ అధినేత, మార్కాపురం వినియోగదారులకూ భారమే.. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12శాతం వరకు పన్ను పడుతుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రావటంతో 12శాతం వరకు ధరలు పెరగనున్నాయి. వెయ్యి రూపాయల లోపు 5శాతం, ఆ మొత్తం దాటితే 12శాతం వరకు పన్ను విధిస్తారు. ఇవి కాక మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జిల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రూ.5వేల లోపు కొనుగోళ్లకు అదనపు చార్జిలు లేవు. ఇప్పటి నుంచి ప్రతి రూ.5 వేలకు రూ.600 అదనపు భారం పడనుంది. ఇప్పటికే అధిక శాతం ప్రజలు రేడీమేడ్ వస్త్రాలపై ఆసక్తి చూపుతూ క్లాత్ కొనుగోలుకు ముందుకు రాక వ్యాపారాలు సాగడం లేదని, ఇక జీఎస్టీ రాకతో తమ పరిస్థితి మరింత కష్టంగా మారనుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆందోళన బాట
► జీఎస్టీని వ్యతిరేకిస్తూమూడు రోజుల బంద్ ► టెక్స్టైల్స్, ఫర్నిచర్స్ అసోసియేషన్ల నిర్ణయం ► లైసెన్సు నమోదుకూ నిరాకరిస్తున్న వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన జీఎస్టీని వస్త్ర, ఫర్నిచర్ వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.అసలు పన్ను పరిధిలోకి రాని టెక్స్టైల్స్పై జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పన్ను విధానంలో ఫర్నిచర్పై 14.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఇకపై జీఎస్టీలో ఈ పన్ను రేటు 28 శాతానికి పెరగనుంది. సాక్షి, నిజామాబాద్ : ఒకే దేశం.. ఒకే పన్ను.. నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన జీఎస్టీపై కొన్ని వ్యాపార వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. వచ్చేనెల 1 నుంచి అమలు కానున్న ఈ నూతన పన్ను విధానంతో కోలుకోలేని విధంగా నష్టపోతామని ఆయా వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు పన్ను పరిధిలోకి రాని టెక్స్టైల్స్పై జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని టెక్స్టైల్స్ వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ సరుకులపై ఎలాంటి పన్నులు లేవని, ఇప్పుడు కొత్తగా జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధిస్తే ఇబ్బందులకు గురవుతామని ఆ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో సుమారు మూడు వేల వరకు వస్త్ర దుకాణాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ వస్త్రవ్యాపారంపై ఉపాధి పొందుతున్నారు. ఈ నూతన పన్ను విధానం ఈ వ్యాపార వర్గంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతం గార్మెంట్, ఓజరీ, రెడీమేడ్ వస్త్రాలపై ఐదు నుంచి 12 శాతం వరకు వ్యాట్ రూపంలో ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోంది. కానీ టెక్స్టైల్స్పై ఎలాంటి పన్నులేదు. కానీ ఇప్పుడు జీఎస్టీలో ఈ టెక్స్టైల్స్పై ఐదు శాతం చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యాపార వర్గాలు ఆందోళన బాట పట్టాయి. మూడు రోజులు బట్టల దుకాణాలు బంద్.. టెక్స్టైల్స్పై జీఎస్టీ పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్త్రవ్యాపారులు 72 గంటల పాటు బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో బట్టల దుకాణాలను మూసివేసి నిరసన తెలపాలని భావిస్తున్నారు. అఖిల భారత వస్త్ర సమాఖ్య పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్రవ్యాపారి కన్న ‘సాక్షి’తో పేర్కొన్నారు. బంద్కు ఫర్నిచర్స్ అసోసియేషన్ పిలుపు నూతన పన్ను విధానం జీఎస్టీ ఫర్నిచర్ వ్యాపార రంగంపై కూడా ప్రభావం పడుతోందని ఆ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో ఫర్నిచర్పై 14.5 శాతం చొప్పున వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఇకపై జీఎస్టీలో ఈ పన్ను రేటు 28 శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయంతో ఫర్నిచర్ వ్యాపారం ఇబ్బందిగా మారుతుందని ఆ వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో సుమారు రెండు వందలకుపైగా ఫర్నిచర్ దుకాణాలున్నాయి. పెరగనున్న ఈ పన్నుతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 28 వరకు ఫర్నిచర్ దుకాణాలు బంద్ పాటిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ ఫర్నిచర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్కు.. నూతన పన్ను విధానం అమలులో భాగంగా ప్రభుత్వం జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఇప్పటికే శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ప్రస్తుతం వ్యాట్, సీఎస్టీ లైసెన్సులున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇకపై జీఎస్టీలోకి మారాల్సి (మైగ్రేషన్) ఉంటుంది. అలాగే కొత్త సంస్థలు కూడా జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి పన్ను పరిధిలో లేని వస్త్ర వ్యాపారులు ఇప్పుడు జీఎస్టీలో పన్ను పరిధిలోకి వస్తున్నారు. అయితే ఈ వ్యాపారులు ఇప్పటి వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. -
‘టెక్స్టైల్’ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్
మేడ్చల్రూరల్: టెక్స్టైల్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధతో పలు విధానాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు. బుధవారం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలోని అపరెల్ పార్క్లో జర్మనీ, ఇండియా భాగస్వామ్యంతో హెల్సియా, ఐకాన్ ఇండియా కంపెనీ నెలకొల్పిన షోల్డర్ ప్యాడ్ల పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో దేశం మొదటి స్థానంలో ఉండగా గార్మెంట్ రంగంలో మాత్రం దీనస్థితిలో ఉందనిదేశ వస్త్రపరిశ్రమ వాటా కేవలం 3.87 శాతం ఉందని, బంగ్లాదేశ్ 10, చైనా 30 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని, వస్త్ర పరిశ్రమ పాధాన్యతను గుర్తించి రూ.12 వేల కోట్ల బడ్జెట్ను ఈ రంగానికి కేటాయించామన్నారు. త్వరలో మిషన్ మెగా టెక్స్టైల్ పేరుతో వరంగల్ జిల్లాలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు. వస్త్ర ఉత్పత్తిలో దూసుకుపోయేలా కృషి పత్తి ఉత్పత్తిని ప్రారంభించనప్పటి నుండి దుస్తులు తయారు చేసే వరకు అన్ని కంపెనీలు ఒకే పార్కులో ఏర్పాటు చేసి, అన్ని వసతులు, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వస్త్ర ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోయేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మారుతున్న ప్యాషన్కు అనుగుణం గా ముందుకు సాగాలని, అప్పుడే మార్కెట్ లో నిలువగలుగుతామని అన్నారు. గుండ్లపో చంపల్లిలోని అపరెల్ పార్క్లో 174 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలలో 3 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అనం తరం కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు. -
నేతన్నకు దన్ను
తెలంగాణ టెక్స్టైల్, అపెరల్ విధానానికి రూపకల్పన - ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్న ప్రభుత్వం - ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయం - రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్టైల్ పార్కులు - 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం - చేనేత, పవర్లూమ్ కార్మికుల వేతనాలు పెరిగేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: చేనేత, మరమగ్గాల కార్మి కులకు అండగా నిలవడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్టైల్, అపెరల్ పాలసీ–2017 రూపొందిస్తోంది. టెక్స్టైల్స్, అపెరల్ రంగాల్లోని ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రధానంగా స్పి న్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్ రంగా ల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ కి రూపకల్పన చేస్తోంది. రానున్న ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను ఇందులో పొందు పరిచారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయటం, కనీసం 5 అంతర్జాతీయ, 50 దేశీయ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందులో కనీసం 60 శాతం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చేనేత కార్మికుని నెలసరి వేతనం 50 శాతం, పవర్లూమ్లోని కార్మికుని ఆదాయం 30 శాతం పెరిగేలా చూడాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్త య్యే వస్త్రాల్లో కనీసం 20 శాతం ఎగుమతి చేయాలన్నది మరో లక్ష్యం. ప్రస్తుతమున్న పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికతను జోడించడంతోపాటు శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కొత్త విధానంలో ప్రాధాన్యం కల్పిస్తోంది. చేనేత కళాకారుల ఉత్పత్తులకు ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణను (బెస్ట్ బ్రాండ్) కల్పించా లన్నది లక్ష్యంగా ఎంచుకుంది. చేనేత వస్త్రాలకు అందుకు అనువైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. నేతన్న కష్టాలను తీర్చేలా.. కొత్త పాలసీ కింద చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది శాతం రాయితీకి అదనంగా నూలుపై 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కెమికల్స్, కలర్ డైలపై కూడా ఇదే తరహా రాయితీ అందుతుంది. చేనేత వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు ఉండేలా చేనేత వస్త్రాల డిజైనింగ్, ఫ్యాషన్ ఇంజ నీరింగ్ లో డిగ్రీ, డిప్లమో కోర్సులతో చేనేత శిక్షణా సంస్థ ఏర్పాటు చేయనుంది. మార్కెటింగ్పై ఫోకస్.. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. మరమగ్గాల ఆధునీకరణకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభు త్వం ఇచ్చే ఆర్డర్లకు నూలుపై 20 శాతం రాయితీ ఇస్తారు. మరమగ్గాలకు విద్యుత్ రాయితీ కల్పి స్తారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించే వస్త్రాలను మరమగ్గాల నుంచే కొనుగోలు చేస్తారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సేవలు వినియోగిం చుకుంటారు. చేనేత దుస్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్థల సహకారంతో చేనేతలో కొత్త నమూనాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తారు. చేనేత వస్త్రాల విక్రయాలకు రిటైల్ దుకాణాలతో ఒప్పందం, ప్రభుత్వ షోరూం లను బొటిక్లుగా తీర్చిదిద్దుతారు. పరిశ్రమలకు బాసట.. నూతన పాలసీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. పెట్టుబడులు, నిర్వహణతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సాయం, రాయితీలు ఇస్తుంది. అవసరమైన భూమిని టీఎస్ఐఐసీ ద్వారా సమకూర్చుస్తుంది. వ్యర్థాల నిర్వహణ, పరిశోధన అభివృద్ధికి సౌకర్యాలు కల్పిస్తారు. టెక్స్టైల్ పార్కుల్లోనే కార్మికులు, సిబ్బందికి అవసరమైన నివాసాలకు స్థలాలు కేటాయిస్తారు. శిక్షణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3,000 చొప్పున శిక్షణ రాయితీగా ఇస్తారు. శిక్షణ పొందిన ఉద్యోగి కనీసం ఏడాది పాటు సంబంధిత సంస్థలోనే పని చేయాల్సి ఉంటుంది. వలస వెళ్లిన చేనేత కార్మికులు రాష్ట్రానికి తిరిగి వస్తే వాళ్లకు పని కల్పించేందుకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో వరంగల్లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మొదటి దశను 1,250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. సిరిసిల్లలో వంద ఎకరాల విస్తీర్ణంలో టెక్స్టైల్, అపెరల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. కొత్తగా గోదాములు నిర్మిస్తారు. ప్రైవేట్ టెక్స్టైల్ పార్క్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించనుంది. -
సిరిసిల్లలో స్తంభించిన వస్త్రపరిశ్రమ
నేత కార్మికుల సమ్మె.. సాక్షి, సిరిసిల్ల: మరమగ్గాలకు కేంద్రమైన సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ స్తంభించింది. కూలీ పెంచాలనే డిమాం డ్తో దాదాపు 8 వేల మంది నేత కార్మికులు సోమవారం సమ్మెకు దిగడంతో మరమగ్గాలు నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ప్రతీ కార్మికుడికి నెలకు కనీసం రూ.15 వేలు కూలీ గిట్టుబాటు అయ్యేట్లు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నేతకార్మికులు కలెక్టరేట్ను ముట్టడించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చెప్పినా వినని యజమానులకు రాయితీలు రద్దు చేయాలని, ప్రభుత్వ ఆర్డర్లు నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. వస్త్రపరిశ్రమ స్తంభించడంతో జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పవర్లూం యజమానులు, కార్మికులతో చర్చలు జరిపారు. కూలీ పెంచా లని యజమానులకు సూచించారు. పాతఒప్పం దాలను అమలు చేస్తామని యజమానులు ఇచ్చిన హామీతో టెక్స్టైల్ పార్కు కార్మికులు ఒక రోజు సమ్మె చేశాక సమ్మె విరమిస్తునట్లు ప్రకటించారు. -
చేనేతరంగంపై పిడుగుపాటు జీఎస్టీ
సందర్భం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ ఫైబర్ విధానం రూపకల్పనకు 2009 జూలై నెలలో శ్రీకారం చుట్టింది. దేశీయంగా పత్తి, కృత్రిమ నూలు మధ్య ఉన్న నిష్పత్తిని మార్చడం. కృత్రిమ నూలు ఉత్పత్తిని పెంచి, పత్తిపై ఆధారపడడాన్ని తగ్గించి ఆధునిక జౌళి రంగ అభివృద్ధి సాధించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ నిష్పత్తి 40:60 ఉండగా దేశంలో ఇది 59:41గా ఉన్నది. అంటే, పత్తి ఉత్పత్తి కృత్రిమ నూలుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయంగా తక్కువ. మనం అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పత్తి, కృత్రిమ నూలు ఉత్పతి మధ్య ఉన్న నిష్పత్తిని అందుకోవాలని ఈ ముసాయిదాలో చెప్పారు. భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో రెండవ స్థానంలో ఉంది. 2008లో జరిగిన ఉత్పత్తి 5 బిలియన్ కేజీలు. పత్తి నూలు, పత్తి ఆధార వస్త్ర ఉత్పత్తిలో కూడా అగ్రగామి. 17 మిలియన్ కేజీల ఉత్పత్తితో సిల్క్లో కూడా రెండవ స్థాయిలో ఉంది. జనపనార ఉత్పత్తి 1.7 బిలియన్ కేజీలు చేరుకొని ప్రపంచంలో మొదటి స్థాయిలో ఉంది. ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులు చేసే సామర్థ్యం లేదు. ఇంతటి వైవిధ్యం కలిగిన భారత జౌళి రంగంలో కనీసం 10 కోట్ల మంది కేవలం సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఒప్పందాలలో భాగముగా భారత ప్రభుత్వం దేశీయ జౌళి రంగాన్ని సంస్కరించ పూనుకున్నది. 2005లో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వస్త్ర వాణిజ్యం అమలులోకి వచ్చిన తర్వాత కూడా సంస్కరణల పరంపర కొనసాగింది. ఎగుమతుల ద్వారా భారత జౌళి రంగం ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని జౌళి విధానాలలో మార్పులు తీసుకుని వచ్చారు. ఈ మార్పులలో కుటీర, చిన్న చేనేత రంగాలకు ప్రాధాన్యం కల్పించలేదు. గత పదేళ్లలో, పెద్ద పారిశ్రామికులకు ఆధునీకరణ పేరుతో దాదాపు లక్ష కోట్ల రూపాయల రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇంకా రాయితీలు, సబ్సీడీలు, ప్రోత్సాహకాలు కల్పించే దిశగా జాతీయ ఫైబర్ విధానం రూపొందించారు. జీఎస్టీ వల్ల ఆ ప్రయోజనాలు ఇంకా విస్తృతం అవుతాయి. ఇప్పటికే, గత ఇరవై ఏళ్ళ విధానపర వివక్షతో కుదేలైన చేనేత పరిశ్రమ, దాని మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు జీఎస్టీ ఒక గొడ్డలిపెట్టు. జీఎస్టీలో ఉన్న ఆలోచనలు, అమలు పద్ధతుల వల్ల, ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం, ఇప్పుడు పడుతుంది. సహజ నూలు మీద కూడా పన్నులు కట్టాల్సి వస్తుంది. సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద మాత్రం 4 నుంచి 12 శాతం వరకు భారం పడుతుంది. దీని వలన, దాదాపు పది కోట్ల చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాల మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. భారత జౌళి రంగంలో జీఎస్టీ పెను మార్పులు తీసుకు వస్తుంది. కృతిమ నూలు దిశగా అభివృద్ధి అడుగులు వేసే ప్రతిపాదనలు చెయ్యటం ఆత్మహత్యాసదృశ్యం. గత పదేళ్లలో జాతీయ జౌళి విధానంవల్ల అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పేదరికం పెరిగింది. నిపుణులు కనుమరుగవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ ఫైబర్ విధానం తీసుకు వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చెయ్యకుండా గోరుచుట్టుపై రోకటి పోటు లాగ జీఎస్టీ పేరుతో చేనేత ఉత్పత్తి మీద భారం పెరుగుతున్నా పట్టించుకోకపోవటం అత్యంత బాధాకరం. క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగుతుంది. ఇప్పటికే కుదేలు అయిన పరిశ్రమకోసం, జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. చిన్న, సన్నకారు రైతులు.. చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి. దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉంది. జీఎస్టీ అమలులోకి వస్తే భారత జౌళి రంగం యొక్క స్వరూపం మారిపోయే అవకాశం ఉన్నది. మొదటగా, చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు. దేశీయ జౌళి రంగం యొక్క ప్రాశస్త్యం సహజ నూలు ఉత్పత్తులు కనుక వీటిని ప్రోత్సహించేలా వ్యూహాలు పొందుపరచాలి. మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా జౌళి ఉత్పత్తులకు లేబులింగ్ చట్టం తీసుకురావాలి. సహజ నూలుకోసం ఒక నిధిని ఏర్పాటు చెయ్యాలి. నూలు ధరల స్థిరీకరణకు ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. జీఎస్టీ మినహాయింపుల జాబితాలో చేనేత ఉత్పత్తులు, సహజ నూలు వస్త్రాలు మరియు దుస్తులను విధిగా చేర్చాలి. ఈ దిశగా, చేనేత వ్యాపార వర్గాలు, చేనేత కార్మికులు, కుటుంబాలు, చేనేత వినియోగదారులు, దేశీయ పరిశ్రమ కోసం పాటు పడే వర్గాలు కలిసికట్టుగా పని చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యాలి. డా డి. నరసింహారెడ్డి చేనేత జౌళి విధాన నిపుణులు ఈ–మెయిల్ : nreddy.donthi16@gmaill.com -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
టెక్స్టైల్స్ పార్క్ కలేనా?
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రతిపాదన ► ఆయన మరణంతో అటకెక్కిన వైనం జిల్లాలో వస్త్ర వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న కావలిలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కలగా మారింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించిన టెక్స్టైల్స్ పార్క్కు సంబంధించి ప్రాథమిక అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్ట్ మరుగునపడింది. ఏటా వందల కోట్ల రూపాయల వస్త్ర వ్యాపారం సాగుతున్న కావలిలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయి. కావలి : తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులకు కావలి నుంచి హోల్సేల్ ధరలకు వస్త్రాలు సరఫరా సాగుతోంది. సుమారు 70 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావలి వస్త్ర వ్యాపార కేంద్రంగా ఉంది. నాలుగు వస్త్ర మార్కెట్లతో 450 హోల్సేల్, రిటైల్ దుకాణాలు కావలిలో ఉండటం గమనార్హం. ఏడాదికి ఇక్కడ రూ.750 కోట్ల వస్త్ర వ్యాపారం జరుగుతోంది. వస్త్ర వ్యాపారంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న కావలిలో టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్పట్లో స్థానిక వస్త్ర వ్యాపారులు కోరారు. ఆయన మరణించడం, తర్వాత స్థానిక వస్త్ర వ్యాపారులు దీని గురించి కొందరు శ్రద్ధ చూపినా ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. కావలి ప్రత్యేకత ఏమిటంటే.. కావలికి చెందిన వస్త్ర వ్యాపారులు ముంబయి, సూరత్, అహమ్మదాబాద్, జెట్పూర్ (రాజస్థాన్), కాశీ, కోల్కతా, ఈ రోడ్డు, కోయంబత్తూర్, తిరుపూర్ తదితర చోట్ల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమల వద్దకు వెళ్లి ఒకేసారి భారీ ఎత్తున ఒకే రకం వస్త్రాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఒకే రకమైన వస్త్రాలను భారీగా కొనుగోలు చేయడంతో పరిశ్రమల వారు చాలా తక్కువ ధరకే వ్యాపారులకు ఇస్తుం టారు. దీంతో కావలి వస్త్ర వ్యాపారులు వాటిని కొంత మార్జిన్ పెట్టుకుని హోల్సేల్, రిటైల్ అమ్మకాలు చేయడంతో మార్కెట్లో తక్కువ ధరలకే అమ్మకాలు చేస్తారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది వస్త్ర దుఖాణదారులు, ఇళ్ల వద్ద అమ్మకాలు చేసే వారు కావలి నుంచి వస్త్రాలు తీసుకెళ్లి వ్యాపారం చేసుకుంటారు. ఐదు వేల మందికి ఉపాధి 1955 సంవత్సరం నుంచి కావలిలో జరగుతున్న ఈ వస్త్ర వ్యాపారంపై ప్రస్తుతానికి ఐదు వేలమందకి పై చిలుక గుమస్తాలుగా, ముఠా కూలీలుగా, ఎంబ్రాయిడరీ, పాల్సు, పెట్టీ కోట్స్ పనులు చేసేవారుగా జీవనోపాధి పొందుతున్నారు. కాగా ఇటీవల వస్త్రాలతో రెడీమేడ్ గార్మెట్స్ తయారు చేసే సంస్థలు పది వరకు వెలిశాయి. ఈ రెడీమేడ్ గార్మెట్స్ డ్రెస్సులను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుంచి తీసుకెళుతుంటారు. చదువులకు పెద్దగా ప్రాధాన్యంలేని రోజుల్లో కావలిలో మొదలైన వస్త్ర వ్యాపారం రంగంలో రెండు తరాలు పూర్తిగా గడిచిపోయింది. వేరే ఉపా«ధి అవకాశాలు లేక పోవడంతో వస్త్ర వ్యాపారంపైనే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు మూడో తరం మొదలైంది. వీరిలో ఉన్నత చదువులు చదవడంతో పాటు, పాత మూసలో కాకుండా వ్యాపారంలో తమ ప్రతిభను ప్రదర్శించాలనే పట్టుదల కూడా పెరిగింది. వస్త్ర పారిశ్రామికీకరణ దిశగా వస్త్ర వ్యాపారం నుంచి వస్త్ర పరిశ్రమను స్థాపించాలని నేటి తరం వారు ఆలోచనలు మొదలు పెట్టారు. ఎక్కడో తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం కన్నా, స్థానికంగానే వస్త్రాలను తయారు చేయాలనే పట్టుదల పెరిగింది. అందులో భాగంగానే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్త్ర పరిశ్రమల సముదాయంతో కూడిన టెక్స్టైల్స్ పార్క్ను కావలిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్థానిక వస్త్ర వ్యాపారులు ఆయనను కలిసి చెప్పారు. అందుకు వైఎస్సార్ కూడా సుముఖత వ్యక్తం చేసి దానిపై పూర్తి వివరాలతో మాట్లాడుకుందామని స్థానిక వ్యాపారులకు తెలిపారు. అంతలో ఆయన మరణించడంతో ఆ విషయం అటకెక్కింది. వస్త్ర వ్యాపారులు ఏమి కోరుకుంటున్నారంటే.. కావలి పట్టణానికి పడమర వైపున ఉదయగిరి రోడ్డులో అటవీ శాఖ భూమి ఉంది. దానిని డీఫారెస్ట్ చేసి అందులో కనీసం 200 ఎకరాలు టెక్స్టైల్స్ పార్క్కు కేటాయిం చి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రకటించి, అందులో ఎస్సీ,ఎస్టీ, మహిళలు ఆసక్తి కనపరిచేలా విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తే కావలికి మహర్దశ పట్టినట్లే. దేశం నలుమూలకు వెళ్లి కొనుగోలు చేసే వస్త్రాలను స్థానికంగానే తయారు చేసే వెసులుబాటు కలుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది కావలిలో టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని వనరులు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల అనుమతులు వస్తేనే ఈ పరిశ్రమ కు అవసరమైన ప్రోత్సాహకాలు అందుతాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం లేదు. కావలిలో టెక్స్టైల్స్ పార్క్ ఆవశ్యకతపై రాష్ట్ర ఉన్నత స్థాయి వర్గాలకు పలుమార్లు చెప్పినా వారు పెడచెవిన పెడుతున్నారు. –కందుకూరి వెంకట సత్యనారాయణ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ ఆఫ్ కందుకూరి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి కావలిలో టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేస్తే విద్యావంతులైన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులు మన రాష్ట్ర ఖజానాకే జమ అవుతాయి. –తన్నీరు మాల్యాద్రి, జిల్లా కన్వీనర్, ఏపీ టెక్స్టైల్స్ అసోసియేషన్ -
వరంగల్లో అతి పెద్ద టెక్స్టైల్ పార్క్
- దేశంలోకెల్లా అతి పెద్దది - ఏప్రిల్ చివర్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన - కడియం, కేటీఆర్,చందూలాల్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ను వరంగల్లో ‘కాకతీయ’ పేరుతో ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. దీనిపై బుధవారం కడియం నేతత్వంలో మంత్రులు కేటీఆర్, చందూలాల్, ఎంపీ దయాకర్, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్ష జరిపారు. ఈ టెక్స్టైల్ పార్కుకు ఏప్రిల్ నెలాఖరులో సీఎం కె.చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేస్తారని మంత్రులు చెప్పారు. ‘‘పార్కులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఇన్వెస్టర్ల క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుం ది. స్థానికులకే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లభిస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రత్యే క కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శంకు స్థాపన నాటికి పార్క్ రోడ్డు, ముఖద్వారాల అభివద్ధిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ అవసరాలను పూర్తిగా తీర్చేలా ఎస్సారెస్పీ నుంచి నీటి వసతి, ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటుచేయాలని సూచించారు. చేనేత కార్మికులకు భారీగా ఉపాధి అవకాశాలతోపాటు పరిసర అసెంబ్లీ నియో జకవర్గాల వారికీ ఉపాధి కల్పించేలా పార్కు అభివద్ధి చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దారం నుంచి వస్త్రం దాకా అన్నీ టెక్స్టైల్ పార్క్లోనే తయారయేలా ఏర్పాటు చేయాలని సీఎం ఆకాం క్షిస్తున్నారన్నారు. కార్మికుల ఆవాసానికి క్వార్టర్లు, చుక్క కాలుష్యం కూడా బయటకు రాకుండా అత్యాధునిక కాలుష్య నివారణయంత్రాన్ని పార్కు లోనే ఏర్పాటు చేయడం, భారీ వాహనాల కోసం 150 అడుగుల రోడ్ల అభివద్ధి వంటివి చేపడతామన్నారు. వరంగల్ సుందరీకరణ వరంగల్లో ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్లీనరీ, భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నగర సుందరీకరణ చేయాలని అధికా రులను కడియం, కేటీఆర్, చందూలాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ‘‘నెలలోగా రోడ్లను అందంగా తీర్చిదిద్దండి. భారీగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయండి. ముఖ్యంగా వీలైనన్ని చోట్ల షీ టాయిలెట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి’’ అని సూచించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ నగరానికి నాలుగు వైపుల భూ సేకరణ చేపట్టాల న్నారు. ఈ భూమిని భావి అవసరాలకు ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. స్థానిక సాక్షి కార్యాలయం నుంచి మడికొండ వరకున్న రోడ్డు, స్టేషన్ ఘన్పూర్ హెడ్క్వార్టర్ రోడ్లను నెలలోపు అభివద్ధి చెయ్యాలని కడియం ఆదేశించారు. అసెంబ్లీలో జరిగిన ఈ సమీక్షల్లో వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్కే అధిక ఫలాలు
► కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీరు ► మల్కాపూర్ రిజర్వాయర్కు మంత్రివర్గం ఆమోదం ► సంగెంలో టెక్స్టైల్ పార్క్ ► త్వరలోనే శంకుస్థాపన చేస్తాం ► కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు ► ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సాక్షి, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫలాలు పూర్వపు వరంగల్ జిల్లాకే ఎక్కువగా చెందనున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. యావత్ ప్రజలు ఎన్నడూ ఊహించని వరంగల్ జిల్లాను చూడబోతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మొక్కుల్లో భాగంగా రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ వీరభద్రస్వామికి శుక్రవారం బంగారు కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంచ్యాతండాలోని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్ట్తో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. కాళేశ్వరుడి ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి లోయర్, మిడ్ మానేరు డ్యాంల ద్వారా 40 టీఎంసీల నీటిని రెండు పంటలకు సరిపడా అందిస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పట్టుబట్టారని, అది కూడా కేబినెట్లో అప్రూవల్ అయిందన్నారు. దేశంలోనే నంబర్వన్ టెక్స్టైల్ పార్క్ వరంగల్ రూరల్ జిల్లాలోని సంగెం మండలంలో టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసి సూరత్, భీమండికి కూలీ కోసం వెళ్లినవారు అంత తిరిగొచ్చేలా దేశంలోనే పెద్ద టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పరిశ్రమ దేశంలోనే నంబర్వన్ టెక్స్టైల్ హబ్గా మారబోతుందన్నారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్కు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. త్వరలో టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఇప్పటికే తిరుపూర్, సోలాపూర్కు ప్రత్యేక బృందాలు వెళ్లి టెక్స్టైల్ మీద అధ్యయనం చేశాయని గుర్తుచేశారు. కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు. కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున , మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున, 77 గ్రామాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, దేవాదాయ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ .శివశంకర్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, ఎంపీలు అజ్మీర సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, కోరం కనుకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి, భరత్ కుమార్రెడ్డి, జాయింట్ కలెక్టర్ దామోదర్రెడ్డి పాల్గొన్నారు. మూడు గంటలపాటు జిల్లాలో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సుమారు మూడు గంటలపాటు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉదయం 10.50 గంటలకు కురవికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో 11.15 గంటలకు కురవి శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి చేరుకున్నారు. 11.32 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 11.50 గంటలకు బస్సులో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంటికి బయల్దేరి వెళ్లారు. 12.25 గంటలకు రెడ్యానాయక్ ఇంటికి చేరుకొని, భోజనం, ప్రెస్మీట్ తర్వాత 1.45 గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. -
వస్త్ర ఉత్పత్తిలో నాణ్యత పెరగాలి
⇒ వస్త్రోత్పత్తిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ⇒ సిరిసిల్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ⇒ వారంలోగా పార్క్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి సిరిసిల్ల: ‘ఉత్పత్తులు పెరగాలి.. వస్త్రం నాణ్యంగా ఉండాలి.. అప్పుడే మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడగలం.. వస్త్రం ఎగుమతులను సాధించగలం’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ను ఆయన శనివారం సందర్శించారు. అనంతరం వస్త్రోత్పత్తిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘నేతన్నలు ప్రపంచస్థాయికి చేరాలి.. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్గా వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధి సాధించాలి’ అని అన్నారు. టెక్స్టైల్పార్క్తోపాటు సిరిసిల్లలోనూ కామన్ ఫెసిలిటీ సెంటర్ల(సీఎఫ్సీ)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునికమైన సైజింగ్, వార్పిన్ యంత్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టెక్స్టైల్ పార్క్లో 220 పరిశ్రమలు స్థాపించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 110 పరిశ్రమలే వస్త్రోత్పత్తిని ప్రారంభించాయని, వాటి స్థాపనకు ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేసి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని, లేకుంటే వాటిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటాయించాలని అధికారులకు సూచిం చారు. వారం రోజుల్లోగా వస్త్రోత్పత్తిదారు లు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కమిటీని వేసుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే కమిటీ వేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి వస్తున్నాడని తెలిసినా పార్క్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అంతా చెత్త పేరుకుపోయిందని, పార్క్ దుస్థితి ఇదా అని ఏడీ అశోక్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు తిరుపూర్కు అధ్యయన యాత్రకు వెళ్లి రావాలని మంత్రి సూచించారు. ‘నేను మంత్రిగా ఉన్నా.. కొత్తపరిశ్రమల స్థాపనకు, ప్రభుత్వ సాయం పొందేందుకు ఇదే మంచి తరుణం’ అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తే.. కార్మికులతో సమావేశం పెట్టరా అని కొందరు నెగటివ్గా మాట్లాడుతున్నారని, ముందు యజమానులను ఒప్పించాలని వారితో సమావేశం నిర్వహించామని చెప్పారు. శివరాత్రి జాతర ఏర్పాట్లు వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ కృష్ణభాస్కర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. టెక్స్టైల్ పార్క్ను గాడిలో పెట్టాలని, నీటి వసతి కల్పించాలని, ఇందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, సౌత్ ఇండియా మిల్స్ అధ్యక్షుడు సెంథల్కుమార్, ఐఎల్ఎఫ్ఎస్ అధ్యక్షుడు అక్షయపటేల్, సెల్వరాజ్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. -
వీరభద్రుడికి కోరమీసాలు
-
కాంగ్రెస్ ఓ దొంగల ముఠా!
ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్ ► కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు.. ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లాలో త్వరలోనే టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ దగ్గర రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్ ఓకే చెప్పిందని వెల్లడించారు. ఈసారి బీసీల బడ్జెట్ ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు. వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు.. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
టెక్స్టైల్ పార్కులో ‘తిరుపూర్’ పెట్టుబడులు
తమిళనాడు పర్యటనలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పది యూనిట్ల ఏర్పాటుకు తిరుపూర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ (టీఈఏ) సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తమిళనాడు పర్యటనలో భాగంగా గురువారం తిరుపూర్, పల్లడం గ్రామాల్లో టెక్స్టైల్స్ పరిశ్రమలను సందర్శించారు. వరంగల్లో నెలకొల్పనున్న మెగాటెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టాలని టీఈఏ ప్రతినిధులను ఆహ్వానించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాల ప్యాకేజీ ఇస్తామని, కార్మికులు, ఇన్వెస్టర్లకు హౌజింగ్, విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. అనంతరం పల్లడం చేనేత పార్కును సందర్శించారు. పల్లడం తరహాలో సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి పరస్పర సహాయ సహకారం కోసం కోయంబత్తూరులోని పీఎస్జీ టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. -
బడా వస్త్రవ్యాపారులకే వత్తాసు
అధికారుల తీరు సరికాదు ► చున్నీ వస్త్రం కొనుగోళ్లలో పక్షపాతం ► మ్యాక్స్ సంఘాలకు చెప్పకుండానే నిర్ణయం ► ఒకే వస్త్రవ్యాపారిపై జౌళిశాఖ అమిత ప్రేమ ఏమిటి? ► జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగిన నేతకార్మికులు సిరిసిల్ల : చేనేత, జౌళిశాఖ అధికారులు వస్త్రం కొనుగోళ్లలో బడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని నేతకార్మికులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వస్త్రం కొనుగోళ్ల గోదాం వ ద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు యూ నిఫామ్స్ అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నేతకార్మికుల నుంచి 1.14 కోట్ల మీటర్ల వ స్రా్తన్ని చేనేత జౌళిశాఖ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో బాలికలకు అవసరమైన ఓనీ(చు న్నీ) బట్ట సుమారు 51వేల మీటర్లు తక్కువ పడడంతో మళ్లీ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చిందన్నారు. కానీ, సంఘాలకు సమాచారం ఇవ్వకుండా ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఒక్కో మీటర్ ఓనీ వస్రా్తనికి రూ.31 చెల్లిస్తున్నారని, ఈ లెక్కన 51 వేల మీటర్ల వస్రా్తన్ని రూ.15.81 లక్షలతో కొనుగోలు చేస్తున్నారని అన్నా రు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అయిన ఆ వస్త్రవ్యాపారి వద్దనే ఓనీ బట్టను కొనుగోలు చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆసాములు కోరారు. ఈసందర్భంగా గోదాములో వస్త్రం కొనుగోళ్లను అడ్డుకున్నారు. మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు మంచికట్ల భాస్కర్, చిమ్మని ప్రకాశ్, పోలు శంకర్, మూషం రాజయ్య, వెల్దండి శంకర్, గౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పాం.. ఎవరూ స్పందించలేదు – వి.అశోక్రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ ఓనీ వస్త్రం ఉత్పత్తి చేయాలని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులదరికీ చెప్పాం. ఎవరూ స్పందించలేదు. కొన్ని సంఘాల ద్వారా కొనాలని భావించాం. కానీ 51 సంఘాలకు ఈఆర్డర్లు ఇస్తే ఒక్కో సంఘం వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అవుతుంది. ఒక్క బీము రెండు వేల మీటర్లు ఉంటుంది. ఎవరికీ సరిగా పని సాధ్యం కాదు. ఇప్పటి వరకు 20వేల మీటర్ల ఓనీ బట్టను కొన్నాం. ఇంకా ఎవరైనా ఇస్తే కొనుగోలు చేస్తాం. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. -
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నివేదిక
వస్త్ర నిల్వలు, నూలు ధరలపై జౌళిశాఖ అధికారుల ఆరా సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై చేనేత జౌళిశాఖ నివేదిక సిద్ధం చేసింది. వస్త్రపరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ‘నేతన్న బతికి ‘బట్ట’కట్టేదెలా?’శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో మం గళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన చేనేత, జౌళిశాఖ అధికారులు.. సిరిసిల్లలో పేరుకు పోయిన పాలిస్టర్ వస్త్రం నిల్వలు, నూలు ధరల పెరుగుదలపై మంగళవారం క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. అమ్ముడుపోని వస్త్రంతో నేత కార్మికులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతర్జాతీయ మార్కెట్లో నూలు ధరలు పెరగడంతో నేతన్నలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అందరూ పాలిస్టర్ వస్త్రాన్నే ఉత్పత్తి చేయడంతో మార్కెట్లో ధర లేదని నిర్ధారించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా సూచిస్తూ.. చేనేత, జౌళిశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ ద్వారా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్కు నివేదిక పంపుతున్నట్టు జౌళిశాఖ ఏడీ వి.అశోక్రావు మంగళవారం రాత్రి తెలిపారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగం పెరిగిన నూలు ధరలతో ఇబ్బందుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. -
చేనేతకు చేయూతనిద్దాం
మంత్రులు, ఎమ్మెల్యేలను కోరిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు కలసి రావాలని ప్రజా ప్రతినిధులను చేనేత, టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. శాసనసభ, శాసనమండలిలో స్పీర్, చైర్మన్, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను మంగళవారం కేటీఆర్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో) తయారు చేసిన చేనేత వస్త్రాలను వారికి అందజేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను అదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందని, ‘చేనేత లక్ష్మి’ని ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మది నెలల పాటు నెలకు వెయ్యి రూపాయాలు పొదుపు చేస్తే పదో నెలలో రూ.14,400 విలువైన చేనేత వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. ‘చేనేత లక్ష్మి’లో మంత్రులు, వారి ఉద్యోగులు చేరేలా, చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేలా చూడాలన్నారు. చేనేత వస్త్రాలను టెస్కో వెబ్సైట్లో కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు అమేజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన అన్లైన్ స్టోర్లలో టెస్కో వస్త్రాలు అందుబాటులోకి ఉంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వారంలో ఒక రోజు... ఇక తన పరిధిలో ఉన్న మున్సిపల్, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులుతో మాట్లాడిన మంత్రి... కచ్చితంగా వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలన్నారు. ప్రతివారం గ్రీవెన్స్ డే రోజు తమ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి మంత్రికి తెలిపారు. చేనేతలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం చేపట్టిన మంత్రి కేటీఆర్ను మంత్రులు, ప్రతిపక్ష నేతలు అభినందించారు. -
రెడీమేడ్స్లోకి బాంబే డైయింగ్
రిటైల్లో మరిన్ని విభాగాల్లోకి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాంబే డైయింగ్.. పెద్దగా పరిచయం చేయక్కరలేని టెక్స్టైల్ బ్రాండ్. 137 ఏళ్ల ప్రస్థానంలో కోట్లాది మంది కస్టమర్లను చూరగొన్న ఈ సంస్థ ఇప్పుడు రిటైల్ రంగంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే తయారీ నుంచి పూర్తిగా వైదొలిగింది. కేవలం టెక్స్టైల్ రిటైల్ బ్రాండ్గా కొనసాగాలని నిర్ణయించింది. వ్యవస్థీకృత రంగ విపణిలో పట్టు సాధించాలన్నది సంస్థ వ్యూహం. ఇందుకు దేశవ్యాప్తంగా తనకున్న నెట్వర్క్ను సద్వినియోగం చేసుకోనుంది. వచ్చే నాలుగేళ్లకుగాను బ్రాండింగ్, మార్కెటింగ్కు రూ.100 కోట్లు వ్యయం చేస్తోంది. వాడియా గ్రూప్లో ఇప్పటికే బ్రిటానియా, గో ఎయిర్ వాటివాటి రంగాల్లో దూసుకెళ్తున్నాయి. రెడీమేడ్స్లోకి కంపెనీ.. 2020 నాటికి దేశవ్యాప్తంగా రిటైల్ విభాగాన్ని పటిష్టం చేస్తోంది. బ్రాండ్ స్టోర్ల సంఖ్యను ప్రస్తుతమున్న 230 నుంచి 500లకు చేర్చాలని నిర్ణయించింది. అలాగే టచ్ పాయింట్లను రెండింతలు చేసి మొత్తం 10,000ల మార్కును దాటాలని భావిస్తోంది. తద్వారా రిటైల్ విపణిలో కంపెనీ బ్రాండ్ను విస్తృతం చేయనుంది. ప్రస్తుతం బెడ్ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్ను కంపెనీ విక్రయిస్తోంది. ఇవేగాక టెక్స్టైల్ రంగంలో మరిన్ని కొత్త విభాగాలను పరిచయం చేయాలన్నది ఆలోచన. ముందుగా రెడీమేడ్స్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టెక్స్టైల్ రంగంలో ఉన్న విదేశీ దిగ్గజ బ్రాండ్లను భారత్లో మార్కెట్ చేసేందుకూ సంసిద్ధంగా ఉన్నామని సంస్థ రిటైల్ విభాగం సీఈవో నగేష్ రాజన్న సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీకి ఉన్న నెట్వర్క్ బలం కొత్త విభాగాలు సులభంగా విజయవంతం కావడానికి దోహదం చేయనుందన్నారు. ఫోకస్ సడలకుండా..: ఉత్పత్తులను థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచి కంపెనీ కొనుగోలు చేస్తోంది. బ్రాండింగ్, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధిపై బాంబే డైయింగ్ ఇక నుంచి దృష్టి పెడుతుంది. రిటైల్పై ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ‘చైనా నుంచి చకవ ఉత్పత్తుల దిగుమతులతో మార్కెట్పై ఒత్తిడి ఉంది. వస్త్రాల తయారీలో ప్రధాన ముడి సరుకు అయిన పత్తి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. తయారీ అంటే భారీ పెట్టుబడితో పాటు కార్మికులపై ఆధారపడాల్సిందే’ అని నగేష్ తెలిపారు. ఈ పరిస్థితులతో పెద్ద బ్రాండ్లు తయారీ నుంచి తప్పుకుని, కేవలం మార్కెటింగ్ పైనే దృష్టిసారిస్తున్నాయని గుర్తు చేశారు. తయారీ నుంచి తప్పుకోవడం ద్వారా రిటైల్ లక్ష్యంగా పెట్టుబడి చేసేందుకు వీలవుతుందన్నారు. యూత్ను దృష్టిలో పెట్టుకుని మరింత ట్రెండీ డిజైన్స్ తీసుకొస్తామని, ఇందుకోసం విదేశీ డిజైనర్లతో చేతులు కలుపుతామన్నారు. ప్రీమియం బ్రాండ్గానే.. బాంబే డైయింగ్కు పుణే సమీపంలో తయారీ ప్లాంటు ఉంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో కార్యకలాపాలు పూర్తిగా మూసివేశారు. బ్రాండ్కు కావాల్సిన బెడ్ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్ను పలు ప్రైవేటు తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ప్రతి ప్లాంటులోనూ ఉత్పత్తుల నాణ్యతను మూడు దశల్లో బాంబే డైయింగ్ ప్రతినిధులు పర్యవేక్షిస్తారు. ఇక అన్ని ధరల శ్రేణిలో కంపెనీ పోటీ పడాలని నిర్ణయించింది. అంటే తక్కువ ధరల ఉత్పత్తులను విక్రయించబోమని, ప్రీమియం బ్రాండ్గానే కొనసాగుతామని సీఈవో స్పష్టం చేశారు. ఫ్యాబ్రిక్ విషయంలో మరింత నూతనత్వం తీసుకొస్తామని చెప్పారు. బాంబే డైయింగ్లో రిటైల్ వాటా ప్రస్తుతం 17 శాతముంది. నాలుగేళ్లలో దీనిని 30 శాతానికి చేరుస్తామన్నారు. వ్యవస్థీకృత రంగంలో.. కంపెనీ పోటీపడుతున్న విపణి పరిమాణం భారత్లో వ్యవస్థీకృత రంగం కేవలం రూ.1,000 కోట్లకు పరిమితం అయింది. అదే అవ్యవస్థీకృత రంగంలో రూ.45,000 కోట్లుంది. 50 శాతం మార్కెట్ రూ.1,000–2,000 ధరల శ్రేణిదే. వచ్చే 10 ఏళ్లు మార్కెట్ 8–10 శాతం వృద్ధి ఉంటుందని బాంబే డైయింగ్ అంటోంది. -
టెక్స్టైల్ రంగంపై డీమానిటైజేషన్ ఎఫెక్ట్
-
‘నోటు’ దెబ్బకు ఆ‘దారం’ తెగుతోంది!
► సూరత్లో టెక్స్టైల్ రంగం విలవిల ► తెలంగాణ కార్మికుల అష్టకష్టాలు ► మూతపడుతున్న దుకాణాలు ►30 శాతం తగ్గిన గ్రే బట్ట ఉత్పత్తి.. కోట్లలో నష్టం ► పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని సూరత్లో టెక్స్టైల్ రంగం విలవిల్లాడుతోంది. ఈ రంగంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్న తెలంగాణ కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. పలు జిల్లాల నుంచి పొట్టచేతబట్టుకుని ఇక్కడకు వచ్చిన వారంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూరత్లో ప్రతినిత్యం గ్రే బట్ట సుమారు 4 కోట్ల మీటర్ల మేర ఉత్పత్తి అవుతుంది. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు దీని ఉత్పత్తి 30 శాతం తగ్గింది. ఫలితంగా టెక్స్టైల్ రంగం కోట్లల్లో నష్టపోతోంది. అనేక మంది ఫ్యాక్టరీలను నడపలేక కార్మికులకు వారానికి రెండు నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ఇస్తున్నారు. కొందరైతే కొన్నిరోజులపాటు పరిశ్రమను పూర్తిగా మూసేయాలనే ఆలోచనలో ఉన్నారు. మనోళ్లే ఎక్కువ సూరత్లోని టెక్స్టైల్ రంగంలో అత్యధికంగా తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పవర్లూమ్స్ పరిశ్రమలన్నీ కుదేలవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా నానా అవస్తలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు కోసం వచ్చే బట్టల వ్యాపారులతో ఇక్కడి మార్కెట్లన్నీ కిటకిటలాడేవి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ మార్కెట్లన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. అనేక మంది తమ దుకాణాలను మూసివేసుకుని కూర్చుంటున్నారు. ఇలాగైతే ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. నోట్ల రద్దుతో మార్కెట్లోని 30 శాతం దుకాణాలు మూతబడ్డాయి. బట్టలు కొనేందుకు ఎవరు రావడంలేదు. ఇప్పటికే కార్మికులకు జీతాలు ఇవ్వలేకున్నాం. తాత్కాలికంగా మా ఫ్యాక్టరీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రుద్ర శ్రీనివాస్, పవర్లూమ్స్ యజమాని, గుమ్మడవెల్లి, సూర్యాపేట జిల్లా జీతాలకే కష్టమైంది.. మార్కెట్లన్నీ బోసిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం తగ్గింది. కార్మికుల జీతాలు ఇవ్వడమే కష్టతరం గా మారింది. మార్కెట్లలో లావాదేవీలన్ని నిలిచిపోయాయి. – ఎనగందుల శ్రీధర్, గణేష్ సిల్క్ మిల్ షాపు యజమాని,తూర్పుగూడెం, సూర్యాపేట పనుల్లేవు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు సరిగ్గా లభించడం లేదు. మా యజమాని ఫ్యాక్టరీకి రెండు రోజులు సెలవులు ప్రకటించాడు. పనుల్లేక పస్తులుంటున్నాం. – సిలివేరి నాగేష్, పవర్లూమ్స్ కార్మికుడు, కుక్కడం, సూర్యాపేట అంచనాలన్నీ తారుమారయ్యాయి.. నాలుగు నెలలకిందటే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టా. పది మంది వర్కర్లున్న నా ఫ్యాక్టరీకి దీపావళి వరకు మంచి ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇలా పనులు లభించక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. –చిట్యాల నరేశ్, టెక్స్టైల్ డిజిటల్ ప్రింటింగ్ యజమాని, నర్సింహులపేట, మహబూబాబాద్ -
పార్కుతో పరుగులే!
‘జిన్నింగ్’ పూర్వవైభవానికి తోడ్పడనున్న టెక్స్టైల్ పార్కు {పెస్సింగ్, జిన్నింగ్ మిల్లులు అభివృద్ధి చెందే అవకాశం పత్తి రైతులు, వ్యాపారులకు మేలు.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటైతే ఈ ప్రాంతంలోని పత్తి, జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లుల వ్యాపార అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా సాగిన జిన్నింగ్ వ్యాపారం కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితుల కారణంగా మందగించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం భూసేకరణను వేగంగా చేపడుతోంది. ఇదంతా పూర్తరుు పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో కార్మికులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నారుు. అలాగే, ఎగుమతి విషయంలో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు కలిసొస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెబుతున్నారు. వ్యాపారులకు తొలగనున్న ఇబ్బందులు జిల్లాలోని గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో పెద్దసంఖ్యలో పత్తి మిల్లులు ఏర్పాటయ్యారుు. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూరు, నెక్కొండ, ములుగు, స్టేషన్ఘన్పూర్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్ ప్రాంతాలకు విస్తరించారుు. అరుుతే, ఈ మిల్లుల్లో ఉత్పత్తి అరుున పత్తి బేళ్లను ఎక్కువగా తమిళనాడుకు, ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి వ్యాపారుల తీరుతో పాటు రవాణా విషయంలో వ్యయప్రయాసల కారణంగా జిల్లాలోని ప్రెస్సింగ్ మిల్లుల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడుకు ఎగుమతి చేసిన బేళ్ల విషయంలో అక్కడి వ్యాపారులు అనేక సాకులు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు నష్టపోతుండగా.. చిన్న వ్యాపారులు ఆర్ధికంగా దవాళా తీస్తూ మిల్లులను మూసివేస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాలకు బేళ్లను ఎగుమతి చేయాల్సిన దుస్థితి ఉండదు. ఇక్కడ తయారైన బేళ్లను టెక్స్టైల్ పార్కులో స్పిన్నింగ్, వస్త్రాల తయారీ కోసం ఉపయోగించవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు పాటు పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అంతే కాకుండా కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతారుు. ముమ్మరంగా భూ సేకరణ ఇదిలా ఉండగా గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో టెక్స్టైల్ పార్కు కోసం భూసేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 800 ఎకరాలు సేకరించినట్లు గీసుకొండ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే మొత్తం భూమి సేకరించి అప్పగిస్తే ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేయనుంది. టెక్స్టైల్ పార్కు వస్తే ఎంతో మేలు వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. త్వరగా పార్కు ఏర్పాటైతే రాష్రంలోనే కాకుండా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పత్తి, జిన్నింగ్ వ్యాపారం ఊపందుకుంటుంది. తద్వారా వ్యాపారులకు, రైతులకు మేలు జరుగుతుంది. - నూనేటి భాస్కర్, ప్రెస్సింగ్ మిల్లు వ్యాపారి చిన్న వ్యాపారులకు మేలు టెక్స్టైల్ పార్కు వస్తే ప్రెస్సింగ్ మిల్లులను నడిపే చిన్న వ్యాపారుల ఇబ్బందులు తొలిగిపోతారుు. పెద్ద వ్యాపారుల రీతిలో లాభాలు కళ్ల చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అరుున పత్తి బేళ్లను గతంలో మాదిరిగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉండదు. - తొర్రూరు రామన్న, ప్రెస్సింగ్ వ్యాపారి -
దుబ్బాకలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలి
దుబ్బాక: చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దుబ్బాక ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని భారత చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ్ల విఠోబా డిమాండ్ చేశారు. గురువారం ఆయన దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులు హోటళ్లలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల వలసలు ఆగాలంటే దుబ్బాక, మిరుదొడ్డి ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. చేనేత కార్మికులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికునికి పింఛన్ సౌకర్యం కల్పించాలని, ఇటీవల కరిసిన భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. మహాత్మా గాంధీ భీంకర్ యోజన పథకాన్ని ఎందుకు రద్దు చేసిందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాపెల్లి రాజేశం, వైద్యనాథ్, బొమ్మ కిషన్, శ్రీనివాస్, రవీందర్, అంబదాస్ పాల్గొన్నారు. -
ఓ వైపు ఆందోళనలు.. మరోవైపు భూసేకరణ
ఆగని రిజిస్ట్రేషన్లు రేపు రైతు గర్జన పేరిట సభ గీసుకొండ : గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే, సేకరణ నిరసనల మధ్య కొనసాగుతోంది. రెండు మండలాల్లోని ఊకల్, శాయంపేట హవేలీ, స్టేషన్చింతలపెల్లి, రాయనికుంట, కృష్ణానగర్ గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో రెవెన్యూ అధికారుల బృందం భూ సేకరణ ముమ్మరం చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 75 ఎకరాలను పట్టాదారులైన రైతుల నుంచి సేకరించి రిజిసే్ట్రషన్లు చేసినట్లు తెలుస్తోంది. రైతుల భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలుపుకుని ఇప్పటివరకు సుమారు 600 ఎకరాలు సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సుమారు 1500 ఎకరాల వరకు భూసేకరణ జరిగే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకులు, అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూములను సేకరించొద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ చేయాలని, తమ భూములను బలవంతంగా లాక్కోవద్దంటూ బాధిత గ్రామాల రైతుల భూ పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళన చేశారు. పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన రైతు గర్జన పేరుతో వరంగల్ నగరంలో జరిగే సభలో గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్లైట్ పార్కు ఏర్పాటు కోసం చేస్తున్న బలవంతపు భూసేకరణనే ప్రధాన ఎజెండాగా పెట్టారు. ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ భూములకు ప్రభుత్వం ఆశించిన రీతిలో ధర ఇచ్చి సేకరిస్తోందంటూ భూములను అప్పగించడానికి ముందుకు వస్తుండడం గమనార్హం. రైతుల భూములకు ఆశించిన రీతిలో పరిహారం చెల్లించి సేకరించడానికి ప్రభుత్వం ముందుకు రావడానికి తాము చేస్తున్న ఆందోళనలే ప్రధాన కారణమని, ఇది ఒక రకంగా రైతులు సాధించిన విజయమని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. -
కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘మోంటే కార్లో’ తాజాగా ‘కార్పొరేట్ కలెక్షన్’ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ శ్రేణులకు చెందిన స్మార్ట్ ఆఫీస్వేర్ను అందుబాటులో ఉంచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్త్రీ, పురుషులకు అనువైన రీతిలో, వారి ఫ్యాషన్లకు అనుగుణంగా ఈ నూతన వస్త్ర శ్రేణిని రూపొందించామని పేర్కొంది. పురుషుల కోసం షర్టులు, ట్రౌజర్లు.. మహిళలకు టాప్స్, టునిక్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలి పింది. తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన వస్త్ర శ్రేణి వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని మోంటే కార్లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ జైన్ విశ్వాసం వ్యక్తంచేశారు. -
త్వరలో 10 చేనేత క్లస్టర్ల ఏర్పాటు
వెదురుపాక (రాయవరం) : త్వరలో జిల్లాలో 10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎస్ఎస్ఎస్ఆర్కేఆర్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఉప్పాడ, తాటిపర్తి, గొల్లప్రోలు, ఒమ్మంగి, పసలపూడి, పులుగుర్త, కొట్టాం తదితరచోట్ల బ్లాక్ లెవెల్ హేండ్లూమ్ క్లస్టర్లు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్లస్టర్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాలుంటాయన్నారు. ఒక్కో క్టస్టర్కు అవి చేసే వ్యాపారాన్నిబట్టి రూ.కోటి నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించగానే క్లస్టర్ పరిధిలోని చేనేత కార్మికులకు శిక్షణ, పనిముట్లు ఇవ్వడంతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్, యార్న్ డిపో ఏర్పాటు చేస్తామని వివరించారు. జిల్లాలోని 50 చేనేత సహకార సంఘాల పరిధిలో 12,800 మగ్గాలు ఉన్నాయని, వీటిపై సుమారు 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న 50 చేనేత సంఘాల ద్వారా ఏటా రూ.15కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు ప్రసాద్ వెల్లడించారు. చేనేత రంగంపై కార్మికులకు ఏటా ఆసక్తి తగ్గుతున్నట్లు గుర్తిస్తున్నామన్నారు. జిల్లాలో సహకార రంగంలో 12 వేలు, సహకారేతర రంగంలో 3 వేల మగ్గాలున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 వేల వరకూ మగ్గాలు తగ్గినట్లు గుర్తించామన్నారు. 35 ఏళ్లు పైబడినవారు మాత్రమే ఈ రంగంలో ఉంటున్నారని, ప్రస్తుత తరం యువకులు ఈ రంగంపై ఆసక్తి చూపడంలేదని అన్నారు. 2014 జూలై నెలాఖరు వరకూ ఉన్న వస్త్రనిల్వలపై 20 శాతం రిబేటు ఉందన్నారు. ఏటా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దారాలపై చేనేత సంఘాలకు 20 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఉన్న 2,300 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ రూ.5 కోట్లు మంజూరైందన్నారు. ఈ సొమ్మును త్వరలోనే బ్యాంకులకు సర్దుబాటు చేస్తామని ప్రసాద్ తెలిపారు. -
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో అగ్ని ప్రమాదం
రూ. 10లక్షల ఆస్తినష్టం సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తుల్జాభవాని కార్ఖానాలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రూ.8లక్షల విలువైన యంత్రాలు, రూ.2లక్షల విలువైన వేస్టేజ్ కాటన్ కాలిబుడిదయ్యాయి. యజమాని నాగారం వెంకటేశం అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం చేరవేశారు. అప్పటికే యంత్రాలు, కాటన్వేస్టేజ్ కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఏఎస్సై చీనా నాయక్ విచారణ జరుపుతున్నారు. కానరాని ఫైర్సేఫ్టీ..? టెక్స్టైల్ పార్క్లో రూ.కోట్లు వెచ్చించి పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, ఫైసెఫ్టీ నిబంధనలు పాటించడం లేదని, అందుకే ప్రమాదాలు సంభవించకా నష్టాలు అధికంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆస్తినష్టం సంభవించాక లబోదిబోమనడం మినహా యజమానులు చేసేదేమీ ఉండడంలేదు. -
చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్టైల్శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత... వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. -
మరో వివాదంలో స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ చేనేత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా కాలేదు.. అప్పుడే మరో వివాదానికి తెరలేపారు. అత్యంత సీనియర్ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మి వర్మతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నప్పటికీ కార్యదర్శితో స్మృతీ విభేదించారట. జూన్ 22న కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్లో జరుగబోయే టెక్స్టైల్ సదస్సు విషయాల్లో, విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వర్మతో విభేదించిన స్మృతి ఇరానీ ఇతర అధికారుల సమక్షంలోనే కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి జరిగిన ఓ మంత్రివర్గ సమావేశంలో కూడా వస్త్రాలు, దుస్తులు ప్యాకేజీ అనుకరణపై ఇరానీ ఈ సమస్యను లేవనెత్తారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అనంతరం వర్మతో పాటు ఇతర అధికారులతో పీఎంఓ సమావేశం ఏర్పరచిందని, మూడేళ్లలో కోటి కొత్త ఉద్యోగవకాశాల కల్పనకు సంబంధించి మెగా ప్రాజెక్టు అమలు గురించి వివరించి, పరిష్కారానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. ఈ వివాదంలో రెండు డజన్లకు పైగా నోటీసులను కూడా వర్మకు స్మృతి ఇరానీ పంపారట. అయితే స్మృతి ఇరానీతో వివాదాన్ని వర్మ ఖండించారు. నోటీసులపై స్మృతి ఇరానీ స్పందన కోరగా.. దీనిపై కామెంట్ చేయదలుచుకోలేదని, ఇవి మామూలు కమ్యూనికేషన్స్ మాత్రమేనని దాటవేశారు. రష్మీ వర్మ 1982 బ్యాచ్ కు చెందిన బిహార్ కేడర్ అధికారి. కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సోదరి. గత డిసెంబర్లోనే టెక్స్టైల్ కార్యదర్శిగా ఎంపికయ్యారు.. స్మృతి ఇరానీ.. తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జూలై 5న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నుంచి చేనేత, జౌళి శాఖ మంత్రిగా మారిన సంగతి తెలిసిందే. -
జాతీయ అవార్డును స్వీకరించిన రాములు
పోచమ్మమైదాన్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆదివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మం త్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా జిల్లావాసి పిట్ట రాములు జాతీయ ఉత్తమ చేనేత అవార్డును అందుకున్నారు. దీంతోపాటు ఆయనకు నగదు పారితోషికాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. -
టెక్స్టైల్ పార్కు భూసేకరణకు కొత్త సమస్య
మూడు వేల ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రైవేట్ పట్టాభూములు 1200 ఎకరాలు ఆగస్టు 7న ప్రధాని మోడీ శంకుస్థాపన! భూములు ఇవ్వబోమంటున్న కొందరు రైతులు 2013 చట్టం అమలుకు మరికొందరి డిమాండ్ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న రాష్ట్ర పర్యటకు వస్తున్న నేపథ్యంలో అదేరోజు టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు టెక్స్టైల్ పార్కుకు అవసరమైన భూముల సేకరణలో ఇబ్బందులు మొదలవుతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కొందరు రైతులు పట్టుబడుతున్నారు. మరికొందరు మాత్రం తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉండడంతో టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటను ఉంటుందనే సమాచారం నేపథ్యంలో ఇప్పుడు టెక్స్టైల్ పార్కు భూసేకరణ సమస్యల అంశం తెరపైకి వస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట ఉత్పత్తుల ఆధారంగా భారీ స్థాయిలో వస్త్ర, అనుబంధ పరిశ్రమ సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్టైల్ పార్కు పేరుతో వరంగల్ జిల్లాలో దీన్ని స్థాపించాలని నిర్ణయించింది. వరంగల్ నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో మూడు వేల ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాల్లోని భూములు టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి అనువైనవిగా గుర్తించారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం మూడు వేల ఎకరాల భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. దేవునూరు, ముప్పారం గ్రామాల పరిధిలో 1016.33 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరో 1328.13 ఎకరాల ప్రైవేటు పట్టా భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి దశలో రెండు గ్రామాల పరిధిలోని 279.35 ఎకరాల సాగు భూముల సేకరణ కోసం ఈ నెల 20న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 123 జీవో ప్రకారం భూసేకరణ జరుపుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో అభ్యంతరాలను తెలపాలని... అభ్యంతరాలు రాకుంటే అందరూ సమ్మతించినట్లుగా భావిస్తామని సూచించారు. అభ్యంతరాల గడువు దగ్గరపడుతుండడంతో రెండు గ్రామాల్లోని కొందరు రైతులు భూములు ఇవ్వబోమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజీ ఇస్తేనే భూములు ఇస్తామని కొందరు అంటున్నారు. భూమిని ఇచ్చేది లేదు ప్రభుత్వం ఎంత నష్టపరిహారం చెల్లించినా నాకున్న వ్యవసాయ భూమి అప్పగించేది లేదు. ప్రభుత్వ భూమిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. టెక్స్టైల్ పార్క్ కోసం ప్రభుత్వం గుర్తించిన భూములు బలవంతంగా అయినా తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అప్పగించాలని రెవిన్యూ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. – మర్రిపెల్లి ఎల్లయ్య, రైతు ముప్పారం వ్యతిరేకం కాదు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. ముప్పారం, దేవునూరు శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో టెక్స్టైల్ పార్క్ను నిర్మించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మా భూములు తీసుకోవాలని నిర్ణయిస్తే... 2013 చట్టం ప్రకారం న ష్టపరిహారం అందించాలి. అధికారులు మాతో సమావేశాలు నిర్వహించనప్పుడు భూసేకరణ చట్టం–2013, జీవో 123 మధ్య లాభనష్టాల్లో తేడాలను వివరించలేదు. ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – కుడుతాజీ రవీందర్, రైతు ముప్పారం -
7న టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన
అంచనా వ్యయం రూ.3000 కోట్లు 3500 ఎకరాల్లో నిర్మాణం ఎమ్మెల్యే టి.రాజయ్య స్టేషన్ ఘన్పూర్ టౌన్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలంలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి ఆగస్టు 7న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మసాగర్ మండలంలో 3,500 ఎకరాల్లో రూ.3వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న టెక్స్టైల్ పార్క్ను ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారన్నారు. ఉప్పుగల్లులో రూ. 320 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఈనెల 27న మంత్రి చందూలాల్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే రోజున స్టేషన్ ఘన్పూర్ గిరిజన బాలికల వసతి గృహంలో జరిగే హరితహారం, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు పూర్తయితే నియోజకవర్గం ఆరు రిజర్వాయర్లతో సస్యశ్యామలం అవుతుందన్నారు. -
స్మృతి ఇరానీపై ట్విట్టర్ లో సెటైర్లు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి, ఆమెకు తక్కువ ప్రాధాన్యత గల జౌళి శాఖను కేటాయించడం పట్ల సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో వ్యంగోక్తులు వెల్లివెరిశాయి.‘విద్యా రంగంలో ఒకే ఒక భారీ సంస్కరణ జరిగింది. అదే స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి తప్పించడం’ అని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఆధ్వర్యంలోనే విద్యా సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ‘నా పని విధానం ఎలా ఉందండీ మోదీగారు? అంటూ ఇరానీ ప్రశ్నించారు. అందుకు మోదీ తగిన సమాధానం ఇచ్చారు.....నా పనిని జడ్జ్ చేయండి అని మోదీని అడిగి ఉండాల్సిందికాదు, బాస్ తీర్పు ఇచ్చారు....జౌళి శాఖ ఇవ్వడంతో ఇక ఆమె ఇంట్లోని కబోర్డులన్నీ జౌళీ వస్త్రాలతో నిండిపోతాయి....మోదీజీ మీరు ఓ జీనియస్.....ఆహా ఇదెంత ఉపశమనం.....ఇక స్మృతి ఇరానీ బీజేపీకి మరో కిరణ్ బీడీ అవుతారు....2019 తర్వాత టీవీ సీరియళ్లుకు మంచి సీరియళ్లు ప్రింట్ చేసుకోవచ్చు.....ఇక బాలాజీ టెలీ ఫిల్మ్స్ కోసం స్మృతి ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ కలసి పనిచేసుకోవచ్చు....మోదీ రైట్ నౌ, పూర్ ఇరానీ....జౌళి శాఖకు మారక ముందు ఆ తర్వాత (కామెంట్తో ఆమె నవ్వుతున్న ఫొటోను, ఏడుస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు)....’ ఇలా వ్యంగోక్తులు హల్చల్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే. -
ఇరానీ శాఖ మార్పు వెనుక ఆయన హస్తం
న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి జుబిన్ ఇరానీకి .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఆలోచించకుండా మావవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)ను అప్పగించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన ఆమె రెండేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రాజకీయంగా కీలకమైన ఈ శాఖ నుంచి స్మృతిని తప్పించి అంతగా ప్రాముఖ్యత లేని చేనేత, జౌళిశాఖకు మారుస్తూ కేబినేట్ తీసుకున్న నిర్ణయం వెనుక బీజేపీ ప్రముఖనేత హస్తం ఉందని ఓ వైపు వినవస్తుండగా, మరో వైపు ఇరానీ శాఖ మార్పునకు కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని గుసగుసలు వినవస్తున్నాయి. ఇరానీ శాఖను మార్పునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసిద్ధత వ్యక్తం చేయకపోయినా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకు ఆమెకు జౌళి శాఖను అప్పజెప్పినట్లు సమాచారం. తనను జౌళి శాఖకు పంపడంతో ఆమె కూడా అప్ సెట్ అయ్యారని ఉన్నతవర్గాల సమాచారం. ఇరానీ ప్రవర్తన వల్లే ఆమె హెచ్ఆర్డీ శాఖ నుంచి బయట పడ్డారని కొందరు అంటున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తదితరాలు ఆమెను విలన్ గా చిత్రీకరించాయని వారు అభిప్రాయపడుతున్నారు. స్మృతి ఇరానీ పద్ధతి సంఘ్ పరివార్ కు కూడా నచ్చకపోవడంతోనే ఆమెను వేరే శాఖకు మార్చడానికి ప్రధానకారణం అని మరో గొంతుక కూడా వినవస్తోంది. దీంతో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన హెచ్ఆర్డీకు ఎలాంటి వివాదాలు లేని ప్రకాశ్ జవదేవకర్ కు అప్పగించారని అంటున్నారు. -
ఫార్మా, టెక్స్టైల్స్పై తీవ్ర ప్రభావం
బ్రెగ్జిట్ ప్రభావం యూరోపియన్ యూనియన్కు మాత్రమే పరిమితం కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటి మీదా ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడిన దేశీ ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై ఈ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరికరాల ఎగుమతి సంస్థలు, బ్రిటన్లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలపైనా కొంత ఉంటుంది. ఇక ఐటీ, బీపీవో కంపెనీలు అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోయి... రూపాయి విలువ క్షీణించి... ముడిచమురు ధరలు పెరిగితే గనక సమస్య తీవ్రమవుతుంది. దేశీయంగా వివిధ రంగాలు ఒడిదుడుకులకు లోనుకాక తప్పదు. కానీ త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి. ఆర్బీఐ, ఆర్థిక శాఖ కలిసి ఈ దిశగా పనిచేస్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండు సుమారు 20 శాతం మేర పతనమయ్యే అవకాశముంది. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో డి.ఎస్.రావత్, సోచామ్ సెక్రటరీ జనరల్ -
చేనేత సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
- చేనేత కార్మిక సంఘం విమర్శ - ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర - జూలై 1న పోచంపల్లి సభతో యాత్ర ముగింపు సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని, చేనేత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు టి.వెంకట్రాములు విమర్శించారు. చేనేత కార్మికులను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూలై 1 వరకు చేనేత బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో పి.లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకట్రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. చేనేత సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామని, నిపుణుల కమిటీ ద్వారా చేనేతరంగ అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఈ రెండేళ్లలో వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చేనేతను జౌళిశాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఇంతవర కు అమలుకు నోచుకోలేదన్నారు. చేనేత బస్సుయాత్ర షెడ్యూలిదీ ఈ నెల 23 నుంచి చేపట్టే చేనేత బస్సుయాత్ర షెడ్యూలును వెంకట్రాములు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23న మహబూబ్నగర్ జిల్లా రాజోలిలో బస్సు యాత్ర ప్రారంభమై రెండురోజుల పాటు అదే జిల్లాలో కొనసాగుతుంది. 25న మెదక్, 26, 27 తేదీల్లో కరీంనగర్, 28, 29 తేదీల్లో వరంగల్ జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, జూలై 1న పోచంపల్లిలో నిర్వహించే బహిరంగసభతో బస్సుయాత్ర ముగుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పెండెం సర్వేశంను చేనేత సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏశాల అశోక్, ఎం.జనార్దన్, ఎల్.యాదగిరి, జల్దిరాములు, సీహెచ్ ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆప్కోలో అవకతవకలు వాస్తవమే
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణ కమిటీ సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక చేనేత సొసైటీల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా ఆప్కో (టీఎస్) ఇష్టారీతిన వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం విచారణలో తేలింది. క్షేత్ర స్థాయి అవసరాలతో పొంతన లేకుండా ఇండెంట్ ఆర్డర్లు.. మగ్గాలు లేని సొసైటీలు వస్త్రాన్ని సరఫరా చేయడం.. చేనేత పేరిట పవర్లూమ్ ఉత్పత్తులను అంటగట్టడం వంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించిన వైనం విచారణలో వెల్లడైంది. రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో టీఎస్)లో జరిగిన అవకతవకలపై చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ.. ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనేక అంశాలపై ఆప్కో (టీఎస్) నుంచి అరకొర సమాచారం అందినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, ఆప్కో విక్రయ షోరూంల నుంచి అందే ఇండెంట్ల ఆధారంగా సొసైటీలకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నట్లు నివేదికలో పేర్కొంది. వస్త్రం నాణ్యత, సొసైటీల ఉత్పత్తి సామర్థ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బంది స్టాంపింగ్ వేశారు. ఆప్కో గోదాముల్లోనూ వస్త్ర నిల్వలకు సంబంధించి గేట్ ఎంట్రీలు శాస్త్రీయంగా లేవు. చాలా సొసైటీల్లో మగ్గాల సంఖ్యకు, వస్త్ర ఉత్పత్తికి మధ్య పొంతన లేదని కమిటీ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనలు బేఖాతర్: మెదక్ జిల్లాలో ఒక సొసైటీలో ఉత్పత్తి చేసే మగ్గాలు లేకున్నా.. వస్త్రాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించిన వైనం వెల్లడైంది. ఎన్హెచ్డీసీ నుంచి కనీసం 40% ముడి ఊలు కొనాలనే నిబంధన వున్నా అధికారులు.. వంద శాతం ఊలును బయటి సంస్థల నుంచి కొనుగోలు చేశారు. సొసైటీల నుంచి సరఫరా అయిన వస్త్రానికి చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించకుండా.. పలుకుబడి కలిగిన సొసైటీలకే డబ్బులు చెల్లించారు. ఏపీ సొసైటీల నుంచి వస్త్ర సేకరణ నిలిపేయాలని, తెలంగాణ సొసైటీల నుంచే సేకరించాలనే నిబంధనను పాటించలేదని విచారణలో వెల్లడైంది. విచారణ కమిటీ సూచనలివే.. ఆప్కో (టీఎస్)లో జరిగిన అవకతవకలను ప్రాథమికంగా నిర్ధారించిన విచారణ కమిటీ.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఆప్కో ఆర్థిక లావాదేవీలు, స్టాక్ వివరాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. సొసైటీల నుంచి కొనుగోలు చేసే వస్త్రం నాణ్యతను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించాలి. ఆప్కో (టీఎస్) సభ్య సంఘాల నుంచి మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. సొసైటీలు అవసరమైనంత వస్త్రాన్ని సరఫరా చేయలేని పక్షంలో.. టెండర్ లేదా ఇతర పద్ధతుల ద్వారా పవర్లూమ్ వస్త్రాన్ని సేకరించాలి. -
వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం
టోలి చౌకి ప్రాంతంలోఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గెహాన వస్త్ర దుకాణంలో పై అంతస్తులు మంటలు ప్రారంభమయ్యాయి. గుర్తించిన సిబ్బంది భయంతో వెంటనే బయటకు వచ్చేశారు. రెండు ఫైరింజన్లతో అగ్ని మాపక విభాగం సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
చేనేతకు తప్పని దిగులు..!
సందర్భం పాలకవర్గాల తీవ్ర నిర్లక్ష్యంతో విభజనకు ముందు, ఆ తరువాత కూడా, చేనేత రంగం కష్టాలు పెరిగాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో, చేనేత కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని, తగు నిర్ణయాలు ప్రకటించే ప్రభుత్వ విధాన పత్రం అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగిన కాలంలో పాలనా యంత్రాం గం చతికిలపడినప్పుడు, గోడు వినే వారు లేక, చేనేత కుటుంబాల వృత్తి వలసలు జరుగుతూనే వచ్చాయి. నేడు సైతం చేనేత కుటుంబాల ఆదాయం పెరిగే అవకాశాలు తగ్గిపోతున్నాయి. చేనేత కూలీ, నానాటికీ పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల సూచీతో పోటీ పడలేక ఎప్పుడో చతికిలపడింది. ఫలితంగా చేనేత కుటుం బాలకు అప్పులు, దిగజారుతున్న జీవన ప్రమాణాలు మిగి లాయి. ఒకప్పుడు గ్రామంలో ఇతర వృత్తులకు కళ్ళు కుట్టేలా ఒక వెలుగు వెలిగిన చేనేతలు కట్టెలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అక్కడే ఉండలేక, ఆదాయం పెంచుకునే మార్గంలేక, నమ్ముకున్న వృత్తి వదలలేక, అనేక కష్టాల మధ్య తమ కళా నైపుణ్యం బతికిం చుకుంటున్న చేనేత కుటుంబాలు ఆత్మస్థైర్యంలో, త్యాగంలో కర్షకులతో పోటీ పడుతున్నాయి. గ్రామీణ వాతావరణం, ఈ వృత్తి కొనసాగింపునకు అనుకూలంగా లేదు. ప్రస్తుతం ఆదాయం ఎలా అనే ప్రశ్నతోపాటు, తమ పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా చేనేత కుటుంబాలలో ఉంది. అనేక కుటుంబాలు పిల్లలకు ఇప్పటికీ తమ శక్తి మేరకు చదువులు చెప్పించి కష్టాల కడలి దాటించే ప్రయత్నం చేస్తున్నా యి. ఇప్పటి పోటీ ప్రపంచంలో ఈ అరకొర చదువుల వల్ల పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నాల్లోను విఫలం అవుతు న్నారు. ఫలితంగా పిల్లలకు నైపుణ్యం లేక, చదువు లేక, ఉద్యో గాలు లేక, పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నాయి. ఈ చేనేత కుటుంబాల పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న రాజకీయ నేతలు, ఎన్నికల సమయంలో చేసిన ఆశలు రేకెత్తించే వాగ్దానాలు చేసి తర్వాత మరిచిపోవడం పరిపాటి అయ్యింది. చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినా, చేనేత సమా జం నుంచి ప్రతిస్పందన ఉండదు అని గమనించిన రాజకీయ చాణక్యులు వీరిని మోసం చేయడం అలవాటుగా మార్చుకు న్నారు. ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్ర బాబు చేనేత రంగానికి రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని వాగా ్దనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఎన్నికల ప్రణాళికలో చేనేత అభివృద్ధికి ఒక సమగ్ర విధానం ప్రకటిస్తామని వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాలు కార్యరూపం దాల్చలేదు. సరి కదా, దానికి వ్యతిరేకమైన చర్యలు మాత్రం తీసుకున్నారు. 2014 ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చేనే తకు ఆశల హరివిల్లు పేనిన పార్టీలలో మొదటి స్థానంలో తెలం గాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం ఉన్నాయి. అధికారం వచ్చినాక, చేనేతలు ఓపికతో వేచి చూస్తున్నా కూడా ఇచ్చిన వాగ్దానాల మాట దేవుడెరుగు, చేనేత కష్టాలను పెంచే చర్యలు క్రమంగా తేలుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా చేనేతకు బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. ఇచ్చిన నిధులు ఖర్చు చేయడం లేదు. అవసరమైన పథకాలు పూర్తిగా ఎత్తివేశారు. ఆప్కో విభజన ఆలస్యమవుతుంటే ప్రాథమిక సహకార సంఘాలు దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఆప్కో విభజనకు ముందు నుంచే ఉన్న ప్రభుత్వ బకాయిల చెల్లింపు ఇప్పుడు ఏ ప్రభుత్వ బాధ్యత అన్నది తేలలేదు. ఆస్తులు, అప్పులు, నిరర్ధక వస్త్రాల స్టాకు బాధ్యత తేలేదాక, రెండు రాష్ట్రా ల ప్రాథమిక సహకార సంఘాలకు దిక్సూచి అయిన రాష్ట్ర చేనేత సహకార సంఘం ఏర్పడి, సమర్థంగా పనిచేసే పరిస్థితి లేదు. ఈ మార్గంలో చేనేత కుటుంబాలకు పని, ఉపాధి పూర్తిగా మూసుకు పోయే ప్రమాదం ఉన్నది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ‘భేషజాల’ పోరులో ఆప్కో మరియు టెస్కో సంస్థల అభివృద్ధి మీద ఆశలు ఆవిరి అవుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటికి మూడు బడ్జెట్లు వచ్చి నాయి. ఒక్కొక్క బడ్జెట్ మారుతున్న క్రమంలో, చేనేత రంగం పట్ల ప్రభుత్వ ఆలోచనల వ్యతిరేక దిశ స్పష్టమవుతోంది. చేనేత శాఖను, సిబ్బంది పనితీరును మెరుగుపరిచి, సమర్థవంతంగా చేనేత కుటుంబాల ఉపాధి కొనసాగించే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. అత్యంత ఉన్నత స్థానమైన చేనేత సంచాల కులు ఎవరు? అనే సందిగ్ధత నాలుగు ఏళ్ల నుంచి రెండు రాష్ట్రా లలో కొనసాగుతున్నది. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఆధునిక పరిశ్రమల స్థాపనపై పూర్తిగా దృష్టి పెడుతున్న వైనంలో అదే ‘ముఖ్య’ శాఖలో ఒక విభాగం అయిన చేనేత శాఖ పట్టించు కోని ‘పెద్ద పిల్ల’ లాగా అయ్యింది. మంత్రుల తీరు కూడా అదే. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు చేనేతను పీడించిన ఈ దౌర్భా గ్యపు పాలన సంస్కృతి ఇప్పటికి కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ర్టంలో 2013-14లో జౌళి శాఖకు రూ. 214 కోట్లు కేటాయించగా, 2014-15లో తెలంగాణ రూ.142.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.99.86 కోట్లు కేటాయించాయి. 2015 -16లో తెలంగాణ రూ.201.72 కోట్లు కేటాయించగా, ఆంధ్ర ప్రదేశ్ కేవలం రూ. 45.92 కోట్లు కేటాయించింది. 2016-17లో తెలంగాణ రూ. 83.05 కోట్లు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ రూ. 124.56 కోట్లు ఇచ్చింది. ఉమ్మడి రాష్ర్టంలోనే చేనేతకు బడ్జెట్ పెంచాలని చేనేత కుటుంబాలు కోరగా, రెండు రాష్ట్రాలు అయినాక బడ్జెట్ అంతకంటే తక్కువ కావడం దారుణం. అనేక సంవత్సరాల నుంచి చేనేత రంగం... జౌళి పరిశ్రమ శాఖ నుంచి విముక్తి కోరుతున్నది. జౌళి శాఖ కేటాయింపులలో కూడా అచ్చంగా చేనేతకు ఇస్తున్న నిధులు చాలా తక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో చేనేతకు కేటాయింపులు రూ. 148.77 కోట్లు కాగా, 2014-15లో తెలంగాణ కేటాయించింది రూ. 93.47 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 57.29 కోట్లు. 2015- 16లో తెలంగాణ రూ. 53.29 కోట్లు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 16.37 కోట్లు కేటాయించింది. 2016-17లో తెలం గాణ చేనేత పథకాలకు నయా పైసా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం రూ. 27.65 కోట్లు విదిల్చింది ప్రపంచీకరణ నేపథ్యంలో, చేనేత కార్మికులు ఎదుర్కొం టున్న సవాళ్ళను అర్థం చేసుకుని, వాటికి అనుగుణమైన విధాన నిర్ణయాలు ప్రకటించే ప్రభుత్వ విధాన పత్రం అవసరం ఎం తైనా ఉంది. విస్తృత సంప్రదింపుల తరువాత చేనేత విధానం ప్రకటించాలి అని చేనేత రంగం ఎప్పటి నుంచో కోరుతున్నది. ముసాయిదా జాతీయ ఫైబర్ విధానం చేనేతకు వ్యతిరేకంగా ఉంది. దీనిని సవరించి సహజ నూలుకు, చేనేతకు అనుకూలంగా తయారు చేస్తే చేనేత రంగానికి, కోట్లాది చేనేత కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు. డి. నరసింహారెడ్డి, వ్యాసకర్త జాతీయ చేనేత జౌళి నిపుణులు మొబైల్: 9010205742 -
స్టాక్స్ వ్యూ
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.3845 టార్గెట్ ధర: రూ.4,900 ఎందుకంటే: అదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ఈ కంపెనీ దుస్తుల తయారీలో వినియోగించే విస్కోస్ స్టేపుల్ ఫైబర్(వీఎస్ఎఫ్), సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 90 శాతానికి పైగా ఆదాయం, నిర్వహణ లాభాలు వీఎస్ఎఫ్, సిమెంట్ రంగాల నుంచే వస్తున్నాయి. దేశీయ సిమెంట్ రంగంలో అగ్రగ్రామి సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ కంపెనీ అనుబంధ సంస్థే. వీఎస్ఎఫ్కు సంబంధించి 9 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్లోని విలాయత్లో కొత్తగా 550 ఎకరాల్లో వీఎస్ఎఫ్, కెమికల్స్ విభాగాలకు చెందిన ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పూర్తిగా ఆటోమేటెడ్ అయిన ఈ ప్లాంట్ల కారణంగా కంపెనీకి పలు వ్యయాలు ఆదా అవుతున్నాయి. ఓడరేవుకు దగ్గరగా ఉండడం వల్ల లాజిస్టిక్స్ ప్రయోజనాలు కూడా కంపెనీకి కలసి వస్తున్నాయి. స్వల్ప పెట్టుబడి, కాలంలోనే ఈ ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఏబీసీఎల్ విలీనంతో కెమికల్స్ విభాగం సామర్థ్యం దాదాపు రెట్టింపు కావడం, విలాయత్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అధిక విలువ ఉన్న ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం.. కంపెనీకి కలసి వచ్చే అంశాలు. సమ్ ఆప్ ద పార్ట్స్ (ఎస్ఓటీపీ) ప్రాతిపదికన ఏడాది కాలానికి రూ.4,900 టార్గెట్ ధరను నిర్ణయించాం. కోల్ ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వేజ్ ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.376 ఎందుకంటే: ప్రభుత్వ రంగంలోని ఈ మహారత్న కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీ, దేశంలో 80 శాతానికి పైగా బొగ్గును ఈ కంపెనీయే ఉత్పత్తి చేస్తోంది. ఇటీవలనే ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ఈ వేతనపెంపు, క్లీన్ ఎనర్జీ సుంకం ప్రభావాలను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ ఏడాది 5 శాతం వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ధరల పెంచుకోవడం వల్ల వేతనాల పెంపు ప్రభావాన్ని అధిగమించుకోగలమని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలతో పోల్చితే కోల్ ఇండియా బొగ్గు ధరలు తక్కువగానే ఉండటంతో ధరల పెంపుకు అవకాశం ఉంది. కంపెనీ అమ్మకాల్లో 80 శాతం వరకూ దీర్ఘకాల ఒప్పందాలకు సంబంధించినవే కావడంతో అమ్మకాల్లో స్థిరత్వం ఉండగలదు. వ్యయాలు తగ్గించుకోవడం, వేతన పెంపు ప్రభావాన్ని ధరలు పెంచుకోవడం ద్వారా అధిగమించడం వల్ల మార్జిన్లు బాగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్కు 12 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్కు 12.5 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. లక్ష్మీ మెషీన్ వర్క్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.3,398 టార్గెట్ ధర: రూ.3,600 ఎందుకంటే: ఈ కంపెనీ టెక్స్టైల్ మెషినరీ, మెషీన్ టూల్స్, ఫౌండ్రీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెక్స్టైల్స్ రంగానికి చెందిన పూర్తి స్థాయి యంత్రాలను తయారు చేసే మూడు ప్రపంచ కంపెనీల్లో ఇదొకటి. దేశీయ టెక్స్టైల్ స్నిన్నింగ్ మెషినరీ పరిశ్రమలో 60 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. కంపెనీకి చెందిన సీఎన్సీ మెషీన్ టూల్స్... కస్టమైజ్డ్ ఉత్పత్తులు తయారు చేయడంలో అగ్రశ్రేణి సంస్థ, ఇక వివిధ పరిశ్రమలకు కావలసిన ప్రెసిషన్ క్యాస్టింగ్స్ను ఈ కంపెనీ విభాగం, ఎల్ఎండబ్ల్యూ ఫౌండ్రీ తయారు చేస్తోంది. యూరప్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.568 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 15 శాతం వృద్ధితో రూ.652 కోట్లకు పెరిగాయి. నికర లాభం 45 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు ఎగిశాయి. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 8 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 2.56గా ఉన్న మార్కెట్ ధరకు పుస్తక ధరకు ఉన్న నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.24గా ఉండొచ్చని అంచనా. టెక్స్టైల్స్ రంగానికి చెందిన యంత్రాల ఎగుమతుల్లో ఎన్నో ఏళ్లు టాప్ ఎక్స్పోర్ట్ అవార్డును గెల్చుకున్న కంపెనీ ఇది. -
దునియా మొత్తం ఇటే చూస్తోంది
► పరిశ్రమలకు అనువైన వాతావరణముందని ప్రధానే అన్నారు: సీఎం కేసీఆర్ ► సాధారణమైన గుర్తింపు కాదు... దీన్ని నిలబెట్టుకుందాం ► హైదరాబాద్లో పెట్టుబడులకు పలు దేశాల ఆసక్తి ► మౌలిక వసతులు, ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి ► విధానాలు, ప్రణాళికలు పక్కాగా ఉండాలన్న సీఎం ► ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ ఆవిష్కరణ: కేటీఆర్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు, ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధానిస్థాయివారు కూడా పేర్కొనడం సాధారణ విషయం కాదన్నారు. ‘‘ఇలాంటి గుర్తింపు సాధారణ విషయం కాదు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, పెట్టుబడులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలి’’ అని అధికారులను ఆదేశించారు. ఫార్మా సిటీ, ఐటీ, టెక్స్టైల్స్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తదితరాలపై గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రపంచమంతటా ఆసక్తి ఉందన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైన ప్రాంతమని అందరూ గుర్తించారన్నారు. మానవాళికి ఔషధాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింతగా విస్తరిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా హైదరాబాద్లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. ఫార్మా సిటీలో భాగంగానే నివాస ప్రాంతాలు, కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లుండాలి. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఎలా పని చేస్తున్నాయో అధ్యయనం చేయండి. ఘన వ్యర్థాల నిర్వహణలో కొత్త ధోరణులనూ నిశితంగా పరిశీలించండి’’ అని అధికారులను ఆదేశించారు. ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని అధికారులను సీఎం కోరారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాదే అనువైనవని అంతా గుర్తిస్తున్నారన్నారు. ‘‘ఇటీవలి పెను తుపాను కారణంగా చెన్నై నుంచి కొన్ని కంపెనీలు వెనుదిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్పై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలి. పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన పూర్వ రంగాన్ని సిద్ధం చేయాలి’’ అని సూచించారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీకి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టీ-హబ్ కూడా మంచి ఫలితాలనిస్తున్నదని ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాక్ ఆఫీసులను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. వరంగల్లో అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ రాబోతున్నది. దానితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలు భారీగా బారులు తీరుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఉండేలా ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు రావాలో ప్రణాళికలు సిద్ధం చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. మైక్రోమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పంపిన సందేశాన్ని ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ‘‘ఉత్తరాఖండ్లో ప్లాంట్ ప్రారంభించడానికి మాకు రెండున్నరేళ్లు పట్టింది. అలాంటిది, తెలంగాణలో కేవలం ఆరు నెలల్లోనే పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగాం. తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్లనే ఈ ఘనత సాధ్యమైంది’’ అని ఆ సందేశంలో కంపెనీ పేర్కొందన్నారు. ప్రభుత్వం తెచ్చిన సరళమైన పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల తాము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగామన్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏప్రిల్ 4న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. హైదరాబాద్లోని హెచ్ఐసీ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్తో పాటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితర ఐటీ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త విధానంలో ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో విధాన రూపకల్పన జరిగినట్టుసమాచారం. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ అత్యధికంగా ఉండటంతో విదేశాల నుంచి దిగుమతుల అవసరం పెరిగింది. అందుకే కేంద్రం కూడా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రాయితీలు ప్రకటించింది. దాంతో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. రెండో ప్రాధాన్యంగా యానిమేషన్, గేమింగ్లకు పెద్ద పీట వేయనుంది. ఈ సంస్థలకు, కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. హైదరాబాద్కే పరిమితమైన ఐటీ కంపెనీలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాయితీలివ్వాలని నిర్ణయించింది. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి లభించటంతో పాటు ఐటీ పరిశ్రమను మరింత విస్తరించే లక్ష్యమూ నెరవేరుతుందని భావిస్తోంది. -
ఇక బట్టలు ఉతకక్కర్లేదట!
మురికి పట్టిన బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా? ఈ మరక పోయేదెలా అని బెంగపడుతున్నారా? ఇక ఆ అలసటకు, బెంగలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. భారతీయ సంతతికి చెందిన పరిశోధకుడు రాజేష్ రామనాథన్, దిపేష్ కుమార్, విపుల్ బన్సల్ సహా పరిశోధక బృందం ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికింది. అతి తక్కువ ఖర్చుతో, అతి సునాయసంగా దుస్తులు శుభ్రం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు. వాటంతట అవే శుభ్రం అయ్యే దుస్తులు తొందర్లోనే వచ్చేస్తున్నాయ్! కేవలం కొన్నినిమిషాల పాటు సూర్యకాంతి, లేదా బల్బ్ కాంతి కింద ఉంచడం ద్వారా వస్త్రాలు శుభ్రమయ్యే పద్ధతిని కనుగొన్నామని చెప్పారు. నానో స్ట్రక్చర్లు ఉన్న దుస్తులను కాంతికింద ఉంచినపుడు, అందులోని సేంద్రియ పదార్థాలు క్షీణిస్తాయని, ఫలితంగా కొన్ని నిమిషాల్లోనే బట్టలు వాటికవే శుభ్రపడతాయన్నారు. తమ పరిశోధనలో భాగంగా కాంతికి ఆకర్షించే వెండి, రాగికి సంబంధించిన నానో స్ట్రక్చర్లను పరిశీలించినట్టు చెప్పారు. తాము రూపొందించిన టెక్నాలజీ ప్రకారం కాంతిని స్వీకరించిన నానో స్ట్రక్చర్లు హాట్ ఎలక్ట్రాన్లను క్రియేట్ చేస్తాయి. తద్వారా మరింత శక్తి జనించి, సేంద్రియ పదార్థాన్ని కీణింపజేస్తాయి. దీంతో ఆరు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే వాటంతట అవే బట్టలు శుభ్రమవుతాయని పరిశోధనలో తేలిందన్నారు. తమ ఈ పరిశోధన నానో ఎన్హాన్స్డ్ వస్త్రాల తయారీకి మార్గం సుగమం చేస్తుందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నామని, పారిశ్రామిక స్థాయిలో ఈ టెక్నాలజీని విస్తరింపచేస్తే భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని వారు తెలిపారు. టమాటా సాస్, వైన్ లాంటి వాటివల్ల ఏర్పడే మరకల్ని కూడా సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని, అది ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. తమ పరిశోధన పత్రం 'అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ ఇంటర్ ఫేసెస్ ' అనే జర్నల్ లో పబ్లిష్ అయిందని తెలిపారు. -
దేవునూరులో టెక్స్టైల్ పార్కు
స్థలం ఎంపిక చేసిన అధికారులు 3500 ఎకరాలు గుర్తించిన పరిశ్రమల శాఖ భూ సేకరణకు రూ.100 కోట్లు మంజూరు నిర్వాసితులతో ఆర్డీవో సమావేశం నేటి నుంచి సర్వే ప్రారంభం హన్మకొండ : అన్ని రకాల వస్త్ర పరిశ్రమల సమాహారంగా టెక్స్టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ సమీపంలో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. అతి పెద్ద టెక్స్టైల్ పార్కు, టౌన్షిప్ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. దేశంలోనే వస్త్ర పరిశ్రమ రాజధాని వరంగల్ అనిపించే విధంగా భారీ స్థాయిలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగల షోలాపూర్, సూరత్, తిర్పూర్లలో తయారయ్యే అన్ని రకాల వస్త్రాలు.. ఒక్క వరంగల్లోనే తయారయ్యే విధంగా భారీ స్థాయిలో పరిశ్రమను స్థాపించనున్నారు. వస్త్రం తయారీతో పాటు రెడీమేడ్ బట్టల తయారీ యూనిట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ పార్కు ఉద్యోగులు నివసించేందుకు అనువుగా టౌన్షిప్ సైతం నిర్మించనున్నారు. సకల సదుపాయాలతో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి భారీ ఎత్తున భూమిని సమీక రించాల్సి ఉంది. కనీసం రెండు వేల ఎకరాల స్థలాన్ని ఒకేచోట ఉండేలా సేకరించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండు వేల ఎకరాలకు పైగా స్థలం ఒకే బిట్టుగా ధర్మసాగర్ మండలం దేవనూరు-ముప్పారం గ్రామాల మధ్య అందుబాటులో ఉంది. ఈ రెండు గ్రామాల మధ్య పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఫారెస్టు భూములు ఉన్నారుు. వీటితో పాటు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొంత భూమి కలుపుకుంటే ఏక మొత్తంగా 3400 ఎకరాలు సేకరించవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ భూమి 2200 ఎకరాలు ఉండగా 1200 ఎకరాలు పట్టా భూమి ఉంది. టెక్స్టైల్ పార్కు భూ సేకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. దీంతో భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు సర్వే జరగనుంది. రైతులతో ఆర్డీవో సమావేశం ధర్మసాగర్ : టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం స్థల ఎంపిక పూర్తయింది. ఈ మేరకు శుక్రవారం వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల రైతులతో గ్రామ సభ నిర్వహించారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు సంతోషకరమే అయినప్పటికీ భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయి భరోసా కల్పించాలని రైతులు కోరారు. గతంలోనే కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు చాలా వరకు పట్టాలు లేవని, వీరి విషయంలో స్థానికుల అభియాప్రాన్ని సేకరించి నిర్వాసితులను గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. భూ నిర్వాసితులందరికీ నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ఎటువంటి నష్టమూ కలుగకుండా చూస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్కు ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సర్వే మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఆర్డీవో వెంకట మాధవరావు తెలిపారు. ముప్పారం, దేవునూరు గ్రామాల్లో మొత్తం 3400 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు. సర్వే జరుగనున్న ఈ మూడు రోజుల పాటు రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఆర్డీవో వెంట తహాశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్లు వెంకట్రాజం, రాజేంద్ర, ఎంపీటీసీ సభ్యులు విజయ్కుమార్, హేమ ఉన్నారు. అనంతరం టెక్స్టైల్ పార్క్ భూముల సర్వేపై ఆర్డీవో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్లు, సర్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
'వరంగల్లో టెక్స్టైల్ పార్క్, రింగ్రోడ్డు'
వరంగల్: త్వరలో వరంగల్లో టెక్స్టైల్ పార్క్, రింగ్రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 15 శాతం ఆర్థికాభివృద్ధితో తెలంగాణ దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్లో వరంగల్కు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంజీఎంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని కేసీఆర్ పేర్కొన్నారు. -
వరంగల్కు మరో వరం
జిల్లాలోనే గిరిజన వర్సిటీ ప్రకటించిన సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్క్పైనా స్పష్టత వరంగల్ : మన జిల్లాకు ఇప్పటికే విద్యా కేంద్రంగా పేరుంది. దీనికి తోడు మరో యూనివర్సిటీ కూడా వస్తుండడంతో ఆ పేరు మరింత సుస్థిరం కానుంది. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మన జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వరంగల్ నగర శివారులో లేదా ములుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మన జిల్లాకు ఉన్న ప్రత్యేకతను మరోసారి చెప్పారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుపై కూడా స్పష్టత ఇచ్చారు. భారతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కును త్వరలోనే వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్-ఆలేరు జాతీయ రహదారి(163) విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మడికొండలో శంకుస్థాపన చేశారు. 99 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి పనులను రూ.1905 కోట్లతో పూర్తి చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో... ఏటూరునాగారం ము ల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మధ్య గోదావరి నదిపై రూ.340 కోట్లతో నిర్మించిన భారీ వంతెనను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మడికొండలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉంది. సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కాబోతున్నా యి. త్వరలో గిరిజన యూనివర్సిటీ రాబోతోంది. భా రతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పా ర్కు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఆజ్మీరా చందులాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు పి.దయాకర్, ఎ.సీతారాంనాయక్, బి.నర్సయ్యగౌడ్, జి.సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టి.రాజయ్య, డి.వినయ్భాస్కర్, కొండా సురేఖ, ఎం.యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డీ.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్రావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, మడికొండ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పది నిమిషాలలోపే తన ప్రసంగాన్ని ముగించడంపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సభకు వచ్చిన ప్రజలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెట్టారు. గత ఏడాది జనవరిలో జిల్లాలో నాలుగు రోజులు పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలా గే, జిల్లాకు సంబంధించి కొత్తగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా నగరాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మరి కొన్ని వరాలు ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
జౌళి రంగానికి మరింత ఉత్తేజం!
► టీయూఎఫ్ పథకం సవరణకు ప్రభుత్వం ఆమోదం ► 30 లక్షల ఉద్యోగాల సృష్టి, ఎగుమతుల వృద్ధి లక్ష్యం న్యూఢిల్లీ: జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత రివైజ్డ్ రీస్ట్రక్చర్డ్ టీయూఎఫ్ స్కీమ్ స్థానంలో అమలుకానున్న సవరిత టీయూఎఫ్ఎస్ వల్ల జౌళి రంగంలో సాంకేతికత మరింత పురోగతి సాధించనుంది. దీనితోపాటు ఈ రంగంలో ఎగుమతుల పెంపునకు, రూ. లక్ష కోట్ల వరకూ పెట్టుబడులను ఆకర్షించడానికి, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యాంశాలు చూస్తే... పథకానికి సంబంధించి రూ.17,822 కోట్ల బడ్జెట్ ప్రొవిజన్ను ఆమోదించింది. ఈ మొత్తంలో రూ.12,671 కోట్లు ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకం కింద ఇప్పటికే నిర్ణయించిన అంశాలకు ఉద్దేశించింది. సవరించిన టీయూఎఫ్కు సంబంధించి తాజా అంశాలకు మిగిలిన మొత్తం రూ.5,151 కోట్లు కేటాయించడం జరిగింది. కొత్త పథకం ప్రకారం ప్రధానంగా దుస్తులు, వస్త్రాలు- టెక్నికల్ టెక్స్టైల్స్ అనే రెండు విస్తృత కేటగిరీల కింద, అలాగే మిగిలిన విభాగాలకు సంబంధించిన పెట్టుబడులపై సబ్సిడీలు అందుతాయి. టెక్స్టైల్స్ కమిషనర్ ఆఫీస్ (టీఎక్స్సీ) కార్యాలయాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ప్రతి రాష్ర్టంలో సంబంధిత కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ రంగంలో పారిశ్రామిక వేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పురోగతి వంటి కార్యకలాపాలను టీఎక్స్సీ నిర్వహిస్తుంది. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు
ఆర్ఆర్బీలో 18,252 పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ (ఆర్ఆర్బీ).. వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 18,252. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.rrbsecunderabad.nic.in చూడొచ్చు. ఎన్ఐవోఎస్లో సూపర్వైజర్స, ప్రాక్టర్స నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్, ప్రాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు22. ఇంటర్వ్యూ తేది జనవరి 6. వివరాలకు www.nios.ac.in చూడొచ్చు. సీ-మెట్లో వివిధ పోస్టులు పుణేలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 11,12. వివరాలకు www.cmet.gov.inచూడొచ్చు. హెచ్ఈసీలో 15 పోస్టులు రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు www.hecltd.comచూడొచ్చు. టెక్స్టైల్ కార్పొరేషన్లో 98 పోస్టులు న్యూఢిల్లీలోని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. దరఖాస్తుకు చివరి తేది జనవరి 10. వివరాలకు www.ntcltd.co.inచూడొచ్చు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కలో పోస్టులు ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మెంబర్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జనవరి 3. వివరాలకు www.stpi.inచూడొచ్చు. ముంబై పోర్ట ట్రస్ట్లో వివిధ పోస్టులు ముంబై పోర్ట ట్రస్ట్.. రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్సీ/ఓబీసీ అభ్యర్థుల నుంచి పైలట్ (7), మెరైన్ ఇంజనీర్ (5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చివరితేది డిసెంబర్ 31. వివరాలకు www.mumbaiport.gov.inచూడొచ్చు. -
వలసలు నివారిస్తాం..
టెక్స్టైల్ పార్కు పనులు జనవరి 31లోగా పూర్తి చేయాలి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండ : టెక్స్టైల్ పార్కు పనులను వచ్చే జనవరి 31 లోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాకతీయ వీవర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సుచించారు. మడికొండ శివారులోని పారిశ్రామిక వాడలో 60 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ టెక్స్టైల్ కో ఆపరే టివ్ వీవర్స్ వెల్ఫేర్ సొసెటీ ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కు పనులను ఆదివారం ఆయన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్టైల్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ పార్కులో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎం యూనిట్గా గుర్తించి, గతంలో రూ. 10 కోట్లు కేటాయించిందని చెప్పారు. 60 ఎకరాల్లో 360 మంది లబ్ధిదారులకు చిన్నచిన్న యూ నిట్లు ఏర్పాటు చేస్తామని, పవర్లూమ్ ద్వారా వస్త్రాల తయూరీ కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణం, సైడ్ డ్రెయిన్లు, రోడ్లు, ఆడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం, ప్రహరీ నిర్మాణ పనులను జనవరి 31లోపు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటారుుంచాలని సూచించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను జాయింట్ కలెక్టర్కు అప్పగించారు. జిల్లా నుంచి సూరత్కు వలస వెళ్లిన వారి స్థితిగతులను, జీవన విధానాన్ని అక్కడికి వెళ్లి పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. వలస వెళ్లిన వారిని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చేందుకే ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని సంబంధిత అధికారులపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజీ పడకుండా చుడాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి, ఈ పార్కుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కాకతీయ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి నిర్మించుకుంటున్నదని తెలిపారు. అరుుతే సొసైటీ సభ్యులకు ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. 3 వేల ఎకరాల్లో టెక్స్టైల్ హబ్.. మూడు వేల ఎకరాల విస్థీర్ణంలో టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేయూలని ప్రభుత్వం సంకల్పించింద ని, ఇందుకోసం స్థల పరిశీలన చేస్తున్నామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్థల పరిశీలన బాధ్యతను కలెక్టర్కు అప్పగించామన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే అన్ని యూనిట్లు ఒకేచోట ఉండేలా పనులు చేపడతామన్నారు. డంపింగ్ యూర్డును తరలించాలి.. డంపింగ్ యార్డుతో మడికొండ పెద్ద చెరువు నీరు కలుషితం అవుతోందని, పక్కన ఉన్న వ్యవసాయ భూములు సైతం పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన డిప్యూటీ సీఎం.. డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించారు. ఇందుకోసం హసన్పర్తి మండలంలో ఉన్న భూములను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ మేనేజర్ డి.రవి, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు దుర్గాస్వామి, ఆర్డీఓ వెంకటమాధవరావు, తహసీల్దార్ రాజ్కుమార్, వీఆర్ఓ జలపతిరెడ్డి, హన్మకొండ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరామోజు అరుణ, ఊకంటి వనంరెడ్డి, మండల అధ్యక్షుడు మేరుగు రాజేందర్, మద్దెల నారాయణస్వామి, బైరి కొంరయ్య, బోగి దేవెందర్, పోలేపల్లి శంకర్రెడ్డి, ఎలకంటి భిక్షపతి, డాక్టర్ శంకర్బాబు, మాచర్ల శేకర్, పల్లపు నర్సింగరావు పాల్గొన్నారు. -
మూడు చోట్ల మాన్యుఫాక్చరింగ్ హబ్లు
♦ నేత పాలసీ ముసాయిదాలో ప్రతిపాదన ♦ కొత్త విధానంపై మంత్రి జూపల్లి సమీక్ష ♦ వరంగల్లో సమీకృత టెక్స్టైల్ హబ్ ♦ రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్-2015లో భాగంగా దీనిని రూపొందించారు. రాష్ట్రంలో తెలంగాణ టెక్స్టైల్ అప్పరెల్ పాలసీ-2015 పేరిట రూపొందించిన ఈ పాలసీ తొలి ముసాయిదాలోని అంశాలపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పుష్పా సుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, ఆప్కో డెరైక్టర్ శైలజారామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర నేత పాలసీకి అనుగుణంగా రాష్ట్ర విధానం ఉండాలని పుష్పా సుబ్రమణ్యం సూచించారు. నూతన పాలసీ లక్ష్యాలు, ఉద్దేశాలను ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు వివరించారు. నేత, వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు అమల్లో ఉంటాయన్నారు. సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా పాలసీ రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నేత కార్మికులు సొంత యూనిట్లు స్థాపించేలా ప్రోత్సహించాలన్నారు. తొలి ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి మెరుగులు దిద్దుతామని మంత్రి జూపల్లి ప్రకటించారు. వరంగల్లో సమీకృత టెక్స్టైల్ హబ్ నేత పాలసీలో భాగంగా రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా), మహబూబ్నగర్లో టెక్స్టైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పత్తి సాగు ఎక్కువగా ఉన్న వరంగల్ కేంద్రంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాలోని నేత పరిశ్రమను ఏకీకృతం చేస్తూ సమీకృత టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులు, కళాకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించాలని, వృత్తిపై ఆధారపడినవారి ఆదాయం పెంచాలనే అంశంపై దృష్టి సారించారు. టెక్స్టైల్ రంగంలో స్థానికంగా, విశ్వవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేలా పాలసీని రూపొందించారు. నూతన పాలసీ ప్రత్యేకతలు ► చేనేత, వస్త్ర పరిశ్రమ కోసం {పత్యేక భూబ్యాంకు ► పరిశ్రమలకు నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా ► వస్త్రోత్పత్తిలో వివిధ దశలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ► నైపుణ్య, సాంకేతిక శిక్షణ, పరిశోధన కోసం ప్రత్యేక కేంద్రం ► వినూత్న డిజైన్లకు రూపకల్పన, వివిధ రకాల ఉత్పత్తులు ► మార్కెట్ అభివృద్ధితోపాటు, ఉత్పత్తుల్లో తెలంగాణ బ్రాండ్పై ప్రత్యేకశ్రద్ధ ► టెక్స్టైల్ రంగంలో వచ్చే సాంకేతిక మార్పులను ఒడిసి పట్టుకునేలా శిక్షణ ► ప్రస్తుతమున్న కార్యకలాపాల బలోపేతం, ఉత్పత్తులకు మరింత విలువ చేర్చడం ► నూలు, మరమగ్గాలకు ప్రోత్సాహం ► నేత, దుస్తుల తయారీ పరిశ్రమల అనుసంధానం ► నేత యంత్రాల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు -
లక్ష మంది నేతన్నలకు మొండిచెయ్యి!
♦ చంద్రబాబు సర్కారు చేనేత రుణ మాఫీ తీరు ♦ బ్యాంకులకు రూ.365 కోట్ల మేర బకాయిపడ్డ 1.15 లక్షల మంది నేతన్నలు ♦ కేవలం 25 వేల మందికి రూ.110 కోట్ల రుణమాఫీకే కేబినెట్ ఆమోదం ♦ తద్వారా సుమారు 90 వేల మందికి అప్పుడే ఎగనామం ♦ రూ.255 కోట్ల మేరకు రుణమాఫీ చేయకుండా ఎగవేత ♦ మార్గదర్శకాలతో మరో 10 వేల మంది అనర్హులవుతారంటున్న అధికారులు! సాక్షి, హైదరాబాద్: నేతన్నల రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు సవా‘లక్ష’ ఆంక్షలు విధించింది. మొత్తం మీద లక్ష మంది అర్హులైన నేతన్నలకు ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మార్గదర్శకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అధికశాతం మంది చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చేనేత పరిశ్రమ విస్తరించింది. జౌళి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 3,59,212 కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 1,282 చేనేత సంఘాల్లో 2,00,310 కుటుంబాలు ఉండగా.. 1,58,902 కుటుంబాలు సహకార సంఘాల పరిధిలో లేవు. సార్వత్రిక ఎన్నికలకు ముందు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాలతో పాటు నేతన్నల వ్యక్తిగత రుణాలు, నేత సంఘాల బకాయిలను మాఫీ చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణ మాఫీకి మార్గదర్శకాలు రూపొందించడానికి కోటయ్య అధ్యక్షతన జూన్ 10, 2014న ప్రభుత్వం కమిటీ వేసింది. మార్చి 31, 2014 నాటికి నేత కార్మికులు రూ.110 కోట్లు, మరమగ్గాల కార్మికులు రూ.15 కోట్లు.. చేనేత సంఘాల్లోని కార్మికులు రూ.240 కోట్లు వెరసి 1.15 లక్షల మంది నేతన్న (కుటుంబం)లు రూ.365 కోట్ల మేర బ్యాంకులకు బకాయిపడ్డారంటూ కోటయ్య కమిటీకి జూలై 21, 2014న జౌళి శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను 17 నెలలపాటు ప్రభుత్వం తొక్కి పట్టింది. ఎట్టకేలకు గత నవంబర్ 16న చేనేత రుణ మాఫీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. 24,309 మంది నేత కార్మికుల వ్యక్తిగత రుణాలు, చేనేత సంఘాల్లోని 674 మంది బకాయిలు, 584 మంది పవర్ లూమ్ కార్మికులు వెరసి కేవలం 25,567 మంది నేతన్నలకు చెందిన రూ.110.96 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే సుమారు సుమారు 90 వేల మంది నేతన్నలకు రుణమాఫీ వర్తింపజేయకుండా ప్రభుత్వం అప్పుడే నిర్ణయం తీసుకుందన్నమాట. అలాగే రూ.255 కోట్ల మేరకు రుణమాఫీ చేయకుండా ఎగవేసిందన్నమాట. తాజాగా మంగళవారం రుణమాఫీకి పలు మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను వర్తింపజేస్తే.. కేబినెట్ ఆమోదించిన 25,567 నేతన్నల్లోనూ కనీసం పది వేల మంది కార్మికులపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని జౌళి శాఖ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం మీద సుమారు లక్షమంది నేతన్నలకు రుణమాఫీ వర్తించకుండా పోతోందని ఆ వర్గాలు వివరించాయి. చేనేత రుణ మాఫీకి రూ.110.96 కోట్లు సాక్షి, హైదరాబాద్ : చేనేత కార్మికులకు రుణ మాఫీ కింద ప్రభుత్వం రూ. 110.96 కోట్లు మంజూరు చేసింది. 2014 మార్చి నాటికి వివిధ ఆర్థిక సంస్థల్లో కార్మికులు తీసుకున్న రుణాలను ఈ పథకం ద్వారా మాఫీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నరేష్ పెనుమాక మంగళవారం జీవో జారీ చేశారు. మరోవైపు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రేషన్కార్డు, ఆధార్ కార్డుల్లో చేనేత వృత్తి చేస్తున్నట్లు నిర్ధారించిన వారికే రుణ మాఫీ వర్తింపజేయాలని తేల్చిచెప్పింది. చేనేత కార్మికుడి బ్యాంకు ఖాతా, ఆధార్తో అనుసంధానం చేసి.. ఆ కుటుంబంలో సభ్యులెవరైనా డ్వాక్రా, వ్యవసాయ రుణాల మాఫీలో లబ్ధి పొందారేమో పరిశీలించాలని సూచించింది. ఒకవేళ లబ్ధి పొంది ఉంటే.. ఆ కుటుంబాలను చేనేత రుణ మాఫీకి అనర్హుల్ని చేయాలని ఆదేశించింది. నేత పని గిట్టుబాటు కాకపోవడంతో మగ్గాన్ని చుట్టేసి, కూలీనాలీ చేసుకుంటూ బతుకులీడుస్తున్న నేతన్నల రుణ మాఫీ చేయకూడదని నిర్ణయించింది. 5 హెచ్పీలోపు సామర్థ్యం ఉండి, 50 శాతం విద్యుత్ రాయితీ పొందుతోన్న మరమగ్గాల కార్మికులే రుణ మాఫీకి అర్హులని స్పష్టం చేసింది. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.లక్ష లోపు రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీలన్నింటిలో కోతలే... ఎన్నికల ముందు రైతుల వ్యవసాయ, మహిళా సంఘాల, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత అన్ని రకాల రుణాల మాఫీలో కోతలు విధిం చారు. రైతుల వ్యవసాయ రుణాల మాఫీని వడ్డీకి కూడా సరిపోకుండా చేసిన బాబు ఇప్పుడు చేనేత కార్మికుల రుణాల మాఫీలోనూ కోతలు విధించారు. ఇక మహిళా సంఘాల రుణ మాఫీకి ఎగనామం పెట్టారు. దీంతో రైతులు, మహిళ సంఘాలు, చేనేత కార్మికులపై అసలు మాఫీ దేవుడెరుగు వడ్డీలపై వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. -
పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, విజయవాడ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కరువు నివారణ, వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్ల సందర్భంగా సాకులు చెప్పి రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీసీఐ అధికారులను కోరారు. కచ్చితమైన ధర లభించేలా చూడాలని, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా అక్రమాలకు కళ్లెం వేయాలని సూచించారు. అవసరమైతే పత్తి కొనుగోళ్లను రోజువారీగా పరిశీలిస్తానన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని బాబు చెప్పారు. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. ఈ నెల 7 నాటికి మరికొన్నింటిని కరువు మండలాలుగా ప్రకటిస్తామన్నారు. గతేడాది ఉద్యాన రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను నవంబర్ 6లోగా చెల్లించాలని ఆదేశించారు. ఖాయిలా పరిశ్రమలపై అధ్యయనం ఖాయిలా పడిన, సమస్యల్లో చిక్కుకున్న పరిశ్రమలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. జూట్, చక్కెర, ఫెర్రో అల్లాయిస్, టెక్స్టైల్స్ పరిశ్రమలపై ఆ యన మంగళవారం సమీక్ష నిర్వహించారు.