టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు  | Government measures for development of textile industry | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు 

Aug 13 2023 4:56 AM | Updated on Aug 13 2023 6:27 PM

Government measures for development of textile industry - Sakshi

మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సు

సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి.

వీ­టికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.  

మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సు 
టెక్స్‌టైల్స్‌ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్‌ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్‌ టెక్స్‌టైల్, అపారల్‌ మాన్యుఫాక్చరింగ్‌ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది.

ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్‌ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్‌ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్‌ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి.

8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్‌ తెలిపారు. గుంటూరులోని టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్‌ మేనేజర్, టెక్నికల్‌ మేనేజర్, మిల్‌ మేనేజర్, గ్రూప్‌ మేనేజర్‌ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. 

ఇది మంచి అవకాశం 
గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అ­ధ్యాప­కు­లు­గా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రా­ణిం­చవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్‌ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. 
– కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ, గుంటూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement