ఆ పనుల వేగం పెంచండి | Increase the speed of those works | Sakshi
Sakshi News home page

ఆ పనుల వేగం పెంచండి

Published Fri, Aug 25 2017 1:57 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

ఆ పనుల వేగం పెంచండి - Sakshi

ఆ పనుల వేగం పెంచండి

ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌ శర్మ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌ శర్మ ఆదేశించారు. ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణాలపై గురువారం సచివాలయంలో రాజీవ్‌ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

టెక్స్‌టైల్‌ పార్కుకు సంబంధించి రోడ్డు నిర్మాణంతో పాటు మాస్టర్‌ ప్లాన్, ఇంటర్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిధుల సమీకరణ, వివిధ కంపెనీలతో ఎంవోయూ, యాంకర్‌ యూనిట్, డీపీఆర్, సీఈటీపీ నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు. ఫార్మాసిటీకి సంబంధించి, రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement