Surat
-
ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్య
సూరత్ : ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్లోని వార్డ్నెంబర్ 30లో బీజేపీ మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.అయితే, ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తన నివాసంలో దీపికా పటేల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్, కుటుంబసభ్యులు బాధితురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీపికా పటేల్ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.దీపికా పటేల్ మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న దీపికా పటేలా్ బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కాగా, దీపికా పటేల్ భర్త వ్యవసాయం చేస్తుండగా ఆమెకు ముగ్గురు పిల్లలు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్షాప్లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
వజ్రాల ధగధగలపై చీకట్ల ముసురు!
సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. ▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.▸ల్యాబ్లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు. -
11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్లోని సూరత్కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్లలో పలువురు షేర్ చేస్తున్నారు. सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్ -
Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
సూరత్: గుజరాత్లోని సూరత్లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు. -
‘టీ’పాట
‘చాయ్ హోటల్కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్వాలా అలియాస్ సింగింగ్ చాయ్వాలా హోటల్కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
సూరత్లో కుప్పకూలిన ఆరు అంతస్తుల బిల్డింగ్.. 15 మందికి గాయాలు
గాంధీనగర్: గుజరాత్లోని సూరత్లో ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో భవనంలోని పలువురు చిక్కుకున్నారు. దాదాపు పదిహేను మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ కాంక్రీట్ బండల కింద ఎవరైనా చిక్కుకొని ఉండచ్చని గాలిస్తున్నారు. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భవనం శిథిలావస్థలో ఉందని, దానికి తోడు భారీ వర్షాలతో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో బిల్డింగ్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #WATCH | Gujarat: A Four-floor building collapsed in Sachin area of Surat. Many people feared trapped. Police and fire department team at the spot. Rescue operations underway. pic.twitter.com/FIJJUGzbEQ— ANI (@ANI) July 6, 2024 -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్ను సూరత్లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి మిస్సింగ్.. అదే కారణమా?
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుచి బీజేపీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నీలేశ్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవంటూ రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తిరస్కరించడం, మిగతా అభ్యర్ధులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముకేశ్ గెలుపు తథ్యమైంది.. తాజాగా సూరత్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలేష్ కుంభానీ కనిపించడం లేదు. కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేడని, ఆయన ఇంటికి తాళం వేసి ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే కుంభానీ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. ఇంటి గోడలపై ‘ప్రజల ద్రోహి’ అంటూ పోస్టర్లు అంటించారు. అయితే గుజరాత్లో అధికార బీజేపీ తప్పుడు ప్రభావం చూపిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సూరత్లో ఎన్నికలను వాయిదా వేయాలని, అలాగే ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభానీ అభ్యర్ధిత్వాన్ని నలుగురు ప్రతిపాదకులు నామినేట్ చేశారని, అయినా.. అకస్మాత్తుగా నలుగురు తమ సంతకాలను తిరస్కరించడం ఆశ్యర్యంగా ఉందన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, అభ్యర్థి చాలా సమయం నుంచి కనిపించడం లేదని ఆరోపించారు. చదవండి: MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు సాధారణంగా రాజ్యసభకు సభ్యులు నామినేట్ అవడం చూస్తుంటాం. కానీ లోక్సభలో ఏకగ్రీవం అనేది చాలా అరుదైన విషయం. కోట్లు కుమ్మరించి వ్యూహప్రతివ్యూహాలు పన్నిగెలుపు గుర్రాన్ని ఎక్కాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, మిగతా వాళ్లు నామినేషన్లు ఉపసంహరించుకున్న ఘటనల్లో ఏకైక అభ్యర్థి పోటీలో నిలవడంతో.. వారే విజయపీఠాన్ని అధిరోహించిన సందర్భలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిణామమే సూరత్లో బీజేపీ అభ్యర్ధి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంతో చోటుచేసుకుంది. సూరత్ కాంగ్రెస్ తరపున నీలేశ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాలు సరిపోలడం లేదని ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. అంతేగాక నీలేశ్కు ప్రత్యామ్నాయంగా సురేశ్ పడ్సాలాతోనూ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయించినప్పటికీ అది కూడా ఇతర కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది సైతం తమ నామినేషన్లను చివరి రోజైన సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ముకేశ్ దలాల్ ఒక్కరే పోటీలో నిలవడంతో ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సూరత్లో బీజేపీ బోణీ కొట్టడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పందించారు.‘ ప్రధాని మోదీకి సూరత్ మొదటి కమలాన్ని అందజేసిందని తెలిపారు. ’’ అని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘ సూరత్లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార వర్గాలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. 1984 తర్వాత తొలిసారిగా సూరత్లో ఓడిపోతామన్న భయంతో ఇలా మ్యాచ్ఫిక్సింగ్ చేశారు’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్లో జనవరి 19 నుంచి జరిగే ఏస్టెక్ ట్రేడ్ ఫెయిర్లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్తోపాటు గుజరాత్లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ
సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: Delhi: 22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు -
Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్ పక్కా!
సూరత్: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సూరత్ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు. సూరత్ భాగస్వామ్యం పెరగాలి వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు నేడు ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్ టెరి్మనల్ బిల్డింగ్ను మోదీ ఆదివారం ప్రారంభించారు. -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్కు మన ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్లోని సూరత్లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
సూరత్లో ‘దీపావళి ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను రద్దీగా మారాయి. ఈ నేపధ్యంలో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్లోని సూరత్ రైల్వే స్టేషన్కు సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఉన్న వారు కూడా రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. दीपावली घर जाने को सूरत रेलवे स्टेशन पहुंचे यूपी और बिहार के मजदूर दम घुटने के कारण घायल हो गए। pic.twitter.com/zPMRZ0mpbg — Rakesh chaudhari (@Rakeshchau58578) November 11, 2023 ఈ సమయంలో తోపులాట జరిగి, పలువురు ప్రయాణికులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బాధిత ప్రయాణికులకు సీపీఆర్ ఇచ్చి వారిని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉపాధి రీత్యా సూరత్లో ఉంటున్నారు. వీరంతా దీపావళి పండుగకు తమ ఊళ్లకు వెళ్లాలని రైల్వే స్టేషన్కు తరలివస్తున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంటోంది. ఇది కూడా చదవండి: ‘గ్రేవ్యార్ట్ ఫర్ చిల్డ్రన్’ అంటే ఏమిటి? -
యుద్ధనౌక సూరత్.. సిద్ధమైంది.!
సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్గా నామకరణం చేశారు. ఈ 4 షిప్స్ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. బ్రహ్మోస్ను మోసుకెళ్లగల సామర్థ్యం విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విశేషాలు.. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు బీమ్: 17.4 మీటర్లు డ్రాఫ్ట్: 5.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు (56 కిమీ) స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ఏవియేషన్ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్ వార్ఫేర్: డీఆర్డీవో శక్తి సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ ఏర్పాటు, 4 కవచ్ డెకాయ్ లాంచర్లు, 2 కౌంటర్ టార్పెడో సిస్టమ్స్. -
ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య
సూరత్: గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. సూరత్లోని పాలన్ పూర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్ సహోద్యోగి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
సూరత్లో బాలుడి వీరగాథ.. సముద్రంలో గల్లంతై..
సూరత్: వినాయక నిమజ్జనాల సందర్బంగా గుజరాత్లోని సూరత్లో అద్భుతం జరిగింది. నిమజ్జనం సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన టీనేజి బాలుడు 24 గంటలపాటు జీవన్మరణ పోరాటం చేసి చివరికి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. ప్రతి ఏటా జరిగినట్లే ఈ యేడు కూడా వినాయాక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడు అనంతరం గంగాదేవి ఒడిలో ఒదిగిపోయాడు. అయితే ఉత్సవాల సందర్బంగా సూరత్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి భక్తుల్లాగే నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు డుమాస్ బీచ్కు తన బామ్మ, సోదరుడు సోదరితో కలిసి వెళ్ళాడు. అందరిలాగే ఆ సంబరాల్లో ఉన్న లఖన్ను సముద్రంలోని అలలు లోపలి లాక్కెళ్లిపోయాయి. లఖన్ దేవీపూజక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన తర్వాత అతని అమ్మమ్మ అక్కడి వారిని సాయమడగటంతో కొంతమంది యువకులు సహాయం చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగడంతో గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలుడు గల్లంతై 24 గంటలు దాటడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. కానీ ఆ గణనాధుని చల్లని దయ వలన బాలుడు నడిసంద్రంలో నిమజ్జనం చేసిన ఒక గణేశుడి ప్రతిమ కింద ఉండే చెక్కబల్లను పట్టుకుని రాత్రంతా నీటిపై తేలియాడుతూ అలాగే ఉన్నాడు. ఆ మరునాడు అటుగా వచ్చిన జాలరులు పడవ కనిపించడంతో చేతిని పైకి ఊపుతూ వారికి సైగ చేశాడు లఖన్. అది గమనించిన మత్స్యకారుడు రసిక్ తండేల్ బాలుడిని రక్షించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి కబురు పంపించారు. అప్పటికే బాలుడిపై ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు లఖన్ మళ్ళీ మృత్యుంజయుడై వారి కళ్లెదుట ప్రత్యక్షమవడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది కూడా చదవండి: ఆసుపత్రి డీన్తో టాయ్లెట్ శుభ్రం చేయించిన ఎంపీ -
దేశీయ దిగ్గజం కొత్త స్క్రాపింగ్ ప్లాంట్ - ఏడాదికి 15,000 వాహనాలు తుక్కు.. తుక్కు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలో తన మూడవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) ప్రారంభించింది. గుజరాత్ సూరత్లో ప్రారంభమైన ఈ ఫెసిలిటీ పేరు Re.Wi.Re Recycle with Respect. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను భువనేశ్వర్, జైపూర్ ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు తన మూడవ ఫెసిలిటీని సూరత్లో ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి ఏటా 15,000 వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ఆర్విఎస్ఎఫ్ని టాటా మోటార్స్ భాగస్వామి శ్రీ అంబికా ఆటో అన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. Re.Wi.Re లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సూరత్లో ఈ ఫెసిలిటీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! నిజానికి పాత వస్తువులు కాలుష్య కారకాలుగా మారతాయి. వీటిని తుక్కు కింద మార్చి మళ్ళీ రీ-సైకిల్ పద్దతిలో ఉపయోగిస్తారు. ఈ విధానంలో పనికిరాని వస్తువులు మళ్ళీ ఉపయోగించడానికి అనుకూలంగా మారతాయి. స్క్రాపింగ్ పాలసీ కింద 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కమర్షియల్ వాహనాలు & 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తుక్కు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు -
రెండు కాదు ఏకంగా 4 చక్రాల బైక్
-
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్లోనే. దాంతో భారత్లో జెమ్ క్యాపిటల్గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్కు ఆహ్వానించగా భారత్కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్హీట్ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలో ఎత్తైన భవనాలు, లగ్జరీ మాన్షన్స్ అనగానే మనకి దుబాయ్ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్ నిర్మాణం ఆసక్తికరంగా మారింది. పాపులర్ పెంటగాన్, బుర్జ్ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్ కేంద్రంగా. డైమండ్స్ అనగానే జెమ్ క్యాపిటల్, గుజరాత్లోని సూరత్ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేకింగ్ బిల్డింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గుజరాత్లోని సూరత్లో రానున్న భవనం పెంటగాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. (యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు ) Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv — Narendra Modi (@narendramodi) July 19, 2023 బెల్జియన్ నగరమైన ఆంట్వెర్ప్ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ నగరం ఇపుడు యుఎస్లోని ఆర్లింగ్టన్లోని పెంటగాన్, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్లో నిలిచింది. ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ప్రపంచంలో టాప్లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్ నిర్మించడానికి నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్తో అద్భుతమైన ఈ భవనంలో ఈ సంవత్సరం 65వేల ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది నవంబర్లో అఫీషియల్గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్ సీఈవో మహేష్ గాధవి మాటల్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. -
రాక్షస తండ్రి.. కూతురు టెర్రస్పై పడుకుంటానని చెప్పడంతో..
ఇటీవల చాలామంది చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకులోనై ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగడుతున్నారు. చివరికి కటకటాలపాలై వారిని నమ్మకున్నవారిని నట్టేట ముంచుతున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అసహనంతో చేయకూడని పనులు చేసి నేరస్తులుగా మారుతున్నారు. సూరత్లో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ కోవలోనిదే! వివరాల్లోకెళ్లే.. సూరత్లో ఓ వ్యక్తి సత్య నగర్ సొసైటీలోని అద్దె అపార్ట్మెంట్లో కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె టెర్రస్పై పడుకునేందుకు వెళ్తానని అడిగింది. ఆ విషయమై ఇంట్లో వాగ్వాదం చోటుచేసుంది. అక్కడ పడుకోవద్దంటూ అతడు తన కూతురుకు కరాకండీగా చెప్పేశాడు. అయినా ఆమె మాటవినకపోవడంతో భార్య, పిల్లలతో గొడవపడ్డాడు. ఐతే కూతురు తాను టెర్రస్పైకే వెళ్తానంటూ మొండిపట్టుతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. అతడు తన కూతుర్ని అడ్డుకోవడమే గాక, ఏమాత్రం కనికరం లేకుండా కత్తితో 25 సార్లు దాడి చేసి హతమార్చాడు. విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తి ఆ తర్వాత భార్యపై దాడి చేసేందుకు యత్నించాడు. ఐతే ఇతర పిల్లలు జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు కూడా గాయపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ దారుణానికి పాల్పడిన నిందితుడిని రామానుజులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం) -
వజ్రంలో వజ్రం..బీటింగ్ హార్ట్గా పేరు.. అమూల్యమైన విలువ!
సూరత్: వజ్రాన్ని చూస్తేనే కళ్లు చెదురుతాయి. ధగధగలాడుతూ చూపరుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పాలా. కళ్లు కూడా తిప్పుకోలేం. అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లో సూరత్లో వి.డి. గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా లోపల అటూఇటూ ఎంచక్కా కదులుతోందని ఆ కంపెనీ వెల్లడించింది. 0.329 క్యారట్ల ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారు. వజ్రాల గనుల తవ్వకాల్లో గత ఏడాది అక్టోబర్లో ఈ వజ్రం లభించింది. అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దానిపై మరింత అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిదే బీటింగ్ హార్ట్ కూడానని తేల్చింది. అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల కిందటిదని, విలువ అమూల్యమని చెప్పుకున్నారు. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. రష్యాలో తయారు చేసే ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే చెక్క బొమ్మల్ని మత్రోష్కా అని పిలుస్తారు. ఇప్పుడు అచ్చంగా అదే మాదిరి వజ్రం మన దేశంలో కూడా లభించడం విశేషం. ఈ వజ్రం లోపలి వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయనం చేసే ‘డి బీర్స్’గ్రూప్కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్ హార్ట్లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. -
15 రాష్ట్రాలు.. 15000 మహిళలు చీరలో వాక్థాన్.. ఎందుకంటే!
గాంధీనగర్: భారతీయ సంప్రదాయంలో చీరకున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలను మెప్పిస్తూ ట్రెండీ దుస్తులు మార్కెట్లోకి ఎన్ని వచ్చినా అవి చీరకు పోటీనివ్వలేవు. ముఖ్యంగా వివాహాలు, పండుగలు కార్యక్రమాలలో మహిళలు చీరలు ధరించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చీరలను ధరించి తొలిసారిగా సూరత్లో శారీ వాకథాన్ నిర్వహించారు. ఏకంగా 15 వేలమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఎందుకంటే.. 15 రాష్ట్రాలు నుంచి వచ్చిన మహిళలు ఫిట్నెస్ను ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి సుమారు 15,000 మంది మహిళలు ఆదివారం సూరత్లో తొలిసారిగా నిర్వహించిన ‘సారీ వాకథాన్’లో పాల్గొన్నారు. అథ్వా పార్టీ ప్లాట్ నుంచి ప్రారంభమై పార్లే పాయింట్ మీదుగా మూడు కిలోమీటర్ల కొనసాగింది. సూరత్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి యు-టర్న్ వరకూ ఈ సూరత్ శారీ వాకథాన్ జరిగింది. మహిళల పిట్నెస్గా అవగాహన కల్పించడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలు, చీరకట్టు గొప్పదనం మరోసారి చాటిచెప్పిందని పలువులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి చీర ధరించిన మహిళలు, బాలికలను మాత్రమే పాల్గొనడానికి అనుమతించారు. సూరత్ మునిసిపల్ కమీషనర్ షాలినీ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ, “ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం జీ 20 అధ్యక్ష పదవిని పొందడం గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇక్కడ చీర వాకథాన్ నిర్వహించారు. దాదాపు 15,000 మంది మహిళలు ఈ ఈవెంట్ కోసం నమోదు చేసుకున్నారు. ఇందుకోసం 15 రాష్ట్రాల నుంచి మహిళలు ఇక్కడకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు’. పౌరులలో ఫిట్నెస్తో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC), సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఈ వాకథాన్ను నిర్వహించాయి. -
సూరత్లో వజ్రాల సదస్సు
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్లోని సూరత్లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్లో ఎల్జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. -
గుజరాత్లో భూకంపం..రిక్టర్ స్కేలుపై..
అహ్మదాబాద్: గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున రిక్టర్స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోందైందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మొలాజికల్ రీసెర్చ్(ఐఎస్ఆర్) అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత 12.52 నిమిషాలకు భూమి కంపించినట్లు వెల్లడించారు. సూరత్లోని పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. భూ ప్రకంపనలు 5.2 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. రాష్ట్రం అధికంగా భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాల్లో భారత్లో సంభవించిన మూడవ అతి పెద్ద, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. కాగా ఈ వారంలోనే టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వాటి శిథిలాలకింద చిక్కుకొని అనేకమంది ప్రాణాలు విడిచారు. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 20 వేలు దాటింది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు -
900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు..
న్యూఢిల్లీ: 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవల సోదరులు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రులు షోక సంద్రంలో మునిగిపోయారు. రాజస్థాన్కు చెందిన ఈ కవల సోదరుల పేర్లు సుమేర్ సింగ్, సోహన్ సింగ్. వయసు 26 ఏళ్లు. సుమేర్ గుజరాత్ సూరత్లోని టెక్స్టైల్ సిటీలో పని చేస్తున్నాడు. సోహన్ గ్రేడ్-2 టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సన్నద్ధమవుతూ జైపూర్లో నివాసముంటున్నాడు. అయితే సుమేర్ బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. తల్లిదండ్రులు పిలవడంతో ఇంటికి వెళ్లిన సోహన్.. గురువారం వేకువ జామున నీళ్లు తెచ్చేందుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. అతని మృతదేహం ట్యాంకులో కన్పించడంతో షాక్ అయ్యారు. ఇద్దరు కుమారులు గంటల వ్యవధిలోనే మరణించడంతో తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. అయితే సోహన్ కాలుజారి వాటర్ ట్యాంక్లో పడిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కవలలకు మరో ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు. చదవండి: వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ -
వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ
సూరత్: గుజరాత్లోని సూరత్లో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లోకి ప్రవేశించి వాళ్లను నిర్బంధించారు. అనంతరం గొంతుపై కత్తిపెట్టి బెదిరించి డబ్బులు, నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పదునైన కత్తి మెడపై పెట్టి డబ్బు, నగలు ఇవ్వకపోతే చంపేస్తానని దొంగ తనను బెదిరించాడని యజమాని సునీల్ కుమార్ శర్మ తెలిపారు. డబ్బులు, నగలు కలిపి వాటి విలువ మొత్తం రూ.కోటి వరకు ఉంటుందని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇంట్లో ఇద్దరూ వృద్ధులు ఉంటున్నారని తెలిసే దొంగలు కావాలనే వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
ప్రాణం తీసిన పతంగి దారం.. బైకర్ గొంతు తెగి..
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్లోని సూరత్లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్లోని నవగామ్లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో.. -
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్గా పనిచేసిన సంకేత్కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలే.. ట్విస్ట్ ఇచ్చిన ఆప్ అభ్యర్థి
సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు తమ నేతను బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని, దాన్ని అధికారికంగా ఆమోదించవద్దని ఆప్ నేతలు ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు. అయితే అనూహ్యంగా ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం విడుదల చేశారు. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి చేయలేది స్పష్టం చేశారు. దీంతో ఆప్ నేతలు షాక్ అయ్యారు. ఆప్ అభ్యర్థిగా ప్రచారం చేసే సమయంలో నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు తనను కేజ్రీవాల్ పార్టీ తరఫున పోటీ చేయొద్దని కోరారని కంచన్ జరీవాల్ చెప్పుకొచ్చారు. తనను యాంటీ నేషనల్, యాంటీ గుజరాత్ అని పిలిచారని పేర్కొన్నారు. అందుకే ప్రజల అభీష్టం మేరకే తన మనస్సాక్షి చెప్పేది పాటించి పోటీ నుంచి స్వతహాగా తప్పుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు తమ అభ్యర్థిని బీజేపీ గూండాలు కిడ్నాప్ చేశారని ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. బలవంతంగా లాక్కెళ్లి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని వీడియో షేర్ చేసింది. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించింది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్లోని సూరత్లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
సెక్యూరిటీ గార్డును కొరికిన ఆప్ కార్పోరేటర్.. వీడియో వైరల్
సూరత్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్పోరేటర్ సెజల్ మాలవీయ సెక్యూరిటీ గార్డును కొరికిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గుజరాత్లోని సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ బోర్డు సమావేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకుడు అమిత్ రాజ్పుత్ ఓ విషయంపై మాట్లాడుతుండగా.. ఆప్ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా సమావేశం కాస్తా రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆప్ కార్పోరేటర్ మహేశ్ అంఘన్ను సమావేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు సూరత్ మేయర్ హేమాలి భోఘవాలా ప్రకటించారు. అనంతరం ఆప్ కార్పోరేటర్లందరినీ సెక్యూరిటీ గార్డులు బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో సెజల్ మాలవీయ.. తనను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు చేతిని కొరికారు. సెజల్ చర్యను అమిత్ రాజ్పుత్ తీవ్రంగా ఖండించారు. సెక్యూరిటీ గార్డుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. SMCની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન, સભામાંથી બહાર કઢાતા ગાર્ડને ભર્યું બચકું #Surat #Gujarat #AAP pic.twitter.com/vZ1FRLi6DL — Zee 24 Kalak (@Zee24Kalak) October 22, 2022 చదవండి: బెంగాల్ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఏంపీ ఫైర్ -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్లోని సూరత్లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్లో రజతం... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకే చెందిన స్నేహిత్తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్షిప్లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్ను నిర్వహించారు. -
దూసుకుపోతున్న వైజాగ్.. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టులో వెల్లడైన వాస్తవాలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్, ఇతర నగరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయంటూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నైలను మించి ఇళ్ల ధరలు విశాఖలో పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత అమ్మకాలు పెరగడం విశేషం. సాక్షి, విశాఖపట్నం : అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందనే అభిప్రాయం ఉంది. అవకాశం వస్తే.. విశాఖలోనే నివసించాలని కోరుకునేవారు లక్షల్లో ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. తాజాగా ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో నివాసానికి అనువైన నగరాల్లో టైర్–2 సిటీలు మెట్రో సిటీలకంటే ముందు వరుసలో ఉన్నాయని తేల్చి చెప్పింది. ద్వితీయ శ్రేణి నగరాలపైనే ఆసక్తి మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్గా భావించేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు మెట్రో నగరాలంటే వెగటు పుట్టే స్థాయికి చేరుకుంటోంది. ఎందుకంటే.. పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్నవయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్–2, టైర్–3 సిటీస్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలవైపు ఆసక్తి చూపుతున్నారు. మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనంగా మారింది. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ.. విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత జోరు కోవిడ్ కారణంగా పని విధానంలో మార్పులు రావడం.. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా పనిచేయడంతో ఈ మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్కు షిఫ్ట్ అవుతున్నాయని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా క్రమంగా పెరగడం.. లివింగ్ కాస్ట్ ఈ నగరాల్లో తక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో సిటీల నుంచి ఇతర సిటీలకు మారుతున్నారని పేర్కొంది. కొత్త ఇల్లు కొనేందుకు పెద్ద నగరాలతో పోలిస్తే.. టైర్–2 నగరాల్లో ధరలు కాస్తా తక్కువ ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. డిమాండ్ క్రమంగా పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫ్రీలాన్స్ జాబ్స్ ట్రెండ్ కూడా విస్తరించడం.. ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: స్టార్టప్లకు ‘కల్పతరువు’) బెంగళూరును మించి ఆసక్తి... దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే టైర్ 2, 3 సిటీల్లో ఇళ్ల రేట్లు వేగంగా పెరుగుతున్నాయని ఎస్బీఐ సర్వే తెలిపింది. బెంగళూరు, కోల్కతా, పూణే వంటి మెట్రోలతో పోలిస్తే విశాఖపట్నం, లక్నో, రాయ్పూర్, సూరత్, వడోదరా, జైపూర్, గౌహతి, డెహ్రాడూన్ వంటి ద్వితీయ శ్రేణి, కోయంబత్తూర్, నోయిడా వంటి టైర్–3 నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. బెంగళూరు, ముంబై, పూణె, కోల్కతా కంటే ఎక్కువగా విశాఖపట్నంలో నివసించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటం విశేషం. బెంగళూరులో 2018–19లో ఇళ్ల ధరలు 8.7 % పెరగగా, 2019–20 లో పెద్దగా మార్పు కనిపించలేదు. అదే 2020–21లో 6.2 శాతం, 2021–22 లో కేవలం 3.3 % మాత్రమే పెరిగాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం 2018–19 లో 4.9 %, 2019–20 లో 10.3 % పెరిగాయి. 2020–21 కోవిడ్ కారణంగా 2.5 % తగ్గినా, 2021–22 లో మాత్రం 11.3 % పెరగడం చూస్తే.. విశాఖపట్నంలో నివసించేందుకు ఎందరు ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. (క్లిక్: విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్కు ఫుల్ డిమాండ్) ఆహ్లాదకరమైన వాతావరణానికే ఓటు.. టైర్–2 నగరాల్లో నివసించేందుకు ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసమే కాకుండా.. సరికొత్త జీవన సరళికీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన వ్యయం కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్వాలిటీలన్నీ ఉన్న నగరాల్లో విశాఖ ముందు వరసలో ఉంటోంది. అందుకే విశాఖ వంటి నగరాలకు డిమాండ్ పెరిగింది. పరిపాలన రాజధానిగా భాసిల్లుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరమే అయినా.. మహా నగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకోవడం వల్లనే డిమాండ్ ఉంది. – కె.ఎస్.ఆర్.కె.సాయిరాజు, క్రెడాయ్ అధ్యక్షుడు -
వారిది లవ్ మ్యారేజ్.. బెదిరించి భార్య చేసిన పనికి భర్త..
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. కానీ, భార్య, బావమరిది చేసిన పనికి మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వారే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషాద ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరత్కు చెందిన రోహిత్ ప్రతాప్ సింగ్, ముస్లిం మహిళ సోనమ్ కలిసి ఒకేచోట పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. రోహిత్ హిందూ, సోనమ్ ముస్లిం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కానీ.. రోహిత్ మాత్రం ప్రేమించిన సోనమ్ను వదులుకోలేక వివాహం చేసుకున్నాడు. రోహిత్ వీరి వివాహ బంధం కొద్దిరోజులు సాఫీగానే సాగింది. ఇంతలో, అనుకోకుండా.. ఈ ఏడాది జూన్లో రోహిత్ను బీఫ్ తినాలని భార్య సోనమ్, ఆమె సోదరుడు అఖ్తర్ అలీ ఫోర్స్ చేశారు. దీంతో, ఇష్టం లేకపోయినా రోహిత్.. బీఫ్ తిన్నాడు. అనంతరం, దీనిని తట్టుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రోహిత్ తన సూసైడ్కు ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇటీవల బయటపడింది. తన సూసైడ్ నోట్లో రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను.. నా భార్య, ఆమె సోదరుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించి నాతో వాళ్లు బీఫ్ తినిపించారు. ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు న్యాయం చేయండి అని సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు. అయితే, రోహిత్ ఫేస్బుక్ నోట్ అతడి ఫ్రెండ్స్ కంటపడటంతో ఈ విషయాన్ని అతడి తల్లి వీణా దేవికి చెప్పారు. ఈ క్రమంలో తన కొడుకు చావుకు భార్య సోనమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. Hindu man dies by suicide after Muslim wife, brother-in-law forcefully feed him beef in Surat https://t.co/L5OShL8w1V via @indiatoday — sekhar (@sekhar31000123) August 29, 2022 -
మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! ఉచిత కరెంటు హామీ
సూరత్: ఈసారి గుజరాత్లో ఎలాగైనా పాగావేయాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. గురువారం సూరత్లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తమను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గుజరాత్లోని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్లీ ఆప్కు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. గుజరాత్లో అవినీతిని అంతం చేస్తే తాను సీఎంగా ఉన్న ఢిల్లీ మోడల్ తరహాలోనే ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందని వివరించారు. అంతేకాదు ఆప్ను గెలిపిస్తే 2021 డిసెంబర్ ముందు వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామన్నారు. మార్పు కోరుకుంటున్నారు గుజరాత్ ప్రజలు 27ఏళ్ల బీజేపీ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులైలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోస్టు కలకలం.. బెదిరింపు కాల్స్
మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాగా, తాజాగా నూపుర్ శర్మ విషయంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్స్టాగ్రామ్లో నూపుర్ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్ మీడియా ఖాతా నుంచి నూపుర్ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు. #Gujarat: नूपुर शर्मा के समर्थन में इंस्टाग्राम पर पोस्ट डालने वाले सूरत के व्यापारी को मिली थी जान से मारने की धमकी, धमकी देने वाले 6 में से 3 आरोपी गिरफ्तार।#Surat #NupurSharma #NupurSharmaControversy #BJP #InstagramPost pic.twitter.com/7Ty4VDm7m8 — India Voice (@indiavoicenews) July 16, 2022 ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి -
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్నాథ్ షిండే?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం వేడేక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. తాజాగా అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. శివసేన నేతృత్వంలోని కూటమి కుప్పకూలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా ఆచితూచి ముందుకు సాగుతోంది. అగ్రనేత ఏక్నాథ్ షిండే కాగా మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఎక్నాథ్ షిండే.. శివసేన పార్టీలో అగ్ర నాయకుడు. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు నమ్మిన బంటు. ప్రస్తుతం మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్గా ఉన్నారు. అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సంబంధిత వార్త: Maharashtra Political Crisis:శివ సేనలో చీలిక.. డేంజర్లో మహా సర్కార్!? నాలుగుసార్లు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు పర్యాయాలు (2004, 2009, 2014, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. థానే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు. సూరత్ రిసార్ట్లో మకాం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన షిండే జాడ తెలిసింది. గుజరాత్ సూరత్లోని ఓ రిసార్ట్లో తన 10 మంది ఎమ్మెల్యేలతో ఉన్నట్లు తెలిసింది. వీళ్లంతా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్తో టచ్లో ఉన్నారని సమాచారం. అయితే ఈ మధ్యాహ్నం తన ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే అజ్ఞాతం.. ప్రస్తుతం ఉద్ధవ్ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. షిండే ఇటీవల మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. చదవండి: Maharashtra Political Crisis:ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి! -
గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు
Prophet remarks row: బీజేపీ తాజా మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు వ్యతిరేకంగా గుజరాత్లో పోస్టర్లు వెలిశాయి. ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన కామెంట్లపై దుమారం చల్లారడం లేదు. ఈ తరుణంలో గుజరాత్ సూరత్లోని జిలాని బ్రిడ్జి మీద నూపుర్ వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలంటూ ఆ పోస్టర్లో ఉంది. ఈ పని ఎవరు చేశారన్నది తెలియకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇస్లాం దేశాలు ఒక్కొక్కటిగా తమ వ్యతిరేకతను ప్రకటనల రూపంలో ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఆమెపై కేసులు సైతం నమోదు అవుతున్నాయి. చదవండి: నూపుర్కు అల్ఖైదా వార్నింగ్ -
కూతురి జుట్టు ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్లో వెదికి.. వృద్ధ దంపతులు..
ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదోఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని ఎదిరించి నిలబడి పోరాడేవాళ్లే ముందుకు సాగగలుగుతారు. కొంతమంది సమస్యను కూకటివేళ్లతో పెకిలించి భవిష్యత్ తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఓ వృద్ధజంట ఈ జాబితాలో నిలిచారు. తమ కూతురికి వచ్చిన సమస్యను వేర్లతో సహా పీకేయడానికి ఎనభై ఏళ్ల వయసులో ఈ జంట నడుం బిగించి, ఏకంగా హెయిర్ ఆయిల్ స్టార్టప్ను ప్రారంభించి ఔరా అనిపిస్తోంది. ‘‘మీలో శక్తి ఉంటే వయసు గురించి ఆలోచించకండి. మీకిష్టమైన దానిని సాధించే వరకు పోరాడండి’’ అని చెబుతున్నారు సూరత్కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వయసులో వీరికి ఏమాత్రం ఓపిక తగ్గలేదు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా.. సమస్యకు సై అని సవాలు విసురుతూ పరిష్కారం చూపుతున్నారు. ఈ చౌదరి దంపతుల కూతురి జుట్టు బాగా ఊడిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం మాత్రం తగ్గలేదు. దీంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గర వెళ్లబోసుకుంది. కూతురి బాధను చూడలేని ఆ దంపతులు అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దానికి గల కారణాలు ఏంటీ? అని ఏడాదిపాటు నెట్లో వెదికారు. వెదుకులాటలో అనేక అధ్యయనాలు, పరిశోధన పత్రాలు లోతుగా అధ్యయనం చేయగా... ‘‘పురుషులలో అయితే డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉండడవల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది’’ అని గ్రహించారు. ఈ రెండు హార్మోన్లను సక్రమంగా పనిచేయించే పదార్థాల కోసం ఇంటర్నెట్ను క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వారు దొరికిన సమాచారంతో... వారే ఒక సరికొత్త ఆయిల్ను తయారు చేయడానికి పూనుకున్నారు. యాభై రకాలతో... అనేక పరిశోధనల తరువాత ఈ వృద్ధ జంట యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో హెయిర్ అయిల్ను రూపొందించింది. వీటన్నింటిని కలిపి ఆయిల్ తయారు చేసిన వీరు..తమ కూతురుకిచ్చి వాడమన్నారు. ఆ ఆయిల్ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం కనిపించింది. దీంతో తాము రూపొందించిన ఆయిల్ బాగా పనిచేస్తుందని అర్థమైంది చౌదరి దంపతులకు. ఆ తరువాత బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం కనిపించింది. అవిమీ... మూడు నెలలపాటు ఆయిల్ను పరీక్షించి, ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అవిమీ హెర్బల్ పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మలివయసులోనూ ఇంత బాగా ఆలోచించి సమస్యకు చక్కని పరిష్కారం చూపి ఎంతోమంది యువతరానికి ప్రేరణ ఇవ్వడమేగాక, చిన్నపెద్దా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. గమనిక: ఈ వృద్ధ జంట ప్రయత్నాన్ని ఒక స్ఫూర్తిదాయక కథనంగా మాత్రమే అందించడం జరిగింది. చదవండి👉🏾Youtube Village: ఘుమఘుమలాడే బిర్యానీ, చేపలు సులభంగా ఎలా పట్టాలి? వీటన్నింటికీ సమాధానం! -
ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్నాథ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్నాథ్ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్ భారత్లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (బారాత్లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు) ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు. ఐఎన్ఎస్ సూరత్ దీనికి ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు. పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. -
IPL 2022: ఏయ్.. రాజ్వర్ధన్.. అలా కాదు.. ఇలా.. కాస్త చూసుకో! సరే భయ్యా!
IPL 2022- CSK Practice Session: అండర్ -19 వరల్డ్కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్ నెట్స్లో చెమటోడుస్తున్నాడు. బ్యాట్, బంతితో ప్రాక్టీసు చేస్తున్నాడు. మిస్టర్ కూల్ ధోని సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆటపై దృష్టి సారించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్ రాజ్వర్ధన్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్-2022 సన్నాహకాల్లో భాగంగా ధోని సారథ్యంలోని సీఎస్కే ఇప్పటికే సూరత్ చేరుకుని ప్రాక్టీసు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్వర్ధన్ గురువారం ప్రాక్టీసు సెషన్లో పాల్గొన్నాడు. సిక్సర్లు బాదుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన అతడు.. ఫీల్డింగ్ కోచ్ సలహాలతో బంతితోనూ మెరిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ..‘‘ ఏయ్.. రాజ్వర్ధన్.. అలా కాదు.. ఇలా.. కాస్త చూసుకో! అంటూ ధోని సలహాలు ఇస్తున్నాడు. సరే భయ్యా! అని రాజ్వర్థన్ అంటున్నాడు’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మార్చి 26న మ్యాచ్తో 15వ సీజన్ ఆరంభం కానుంది. ముంబై వేదికగా అత్యధిక మ్యాచ్లు జరుగనున్న నేపథ్యంలో అక్కడి పిచ్లను పోలి ఉండే సూరత్ స్టేడియంను సీఎస్కే ప్రాక్టీసు కోసం ఎంచుకోవడం విశేషం. ఇక రాజ్వర్ధన్ విషయానికొస్తే అతడు గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్తోనూ రాణించగలడు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్తో మ్యాచ్లో మూడు వరుస సిక్సర్లు బాది బ్యాటింగ్ పదును చూపించాడు. ఈ క్రమంలో చెన్నై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించాడు. స్టార్ ప్లేయర్ దీపక్ చహర్ జట్టుకు దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో రాజ్వర్ధన్ను అతడికి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
ధోని క్రేజ్ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం
ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐపీఎల్ 2022 కోసం సన్నాహాలు ప్రారంభించింది. సోమవారం సూరత్లోని లాల్బాయి కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ కోసం సీఎస్కే అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ధోని సేనకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. సీఎస్కే టీమ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్కు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. కెప్టెన్ ధోని బస్ నుంచి దిగగానే ధోని.. ధోని అని అరుస్తూ పేపర్ల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని సీఎస్కే తన ట్విటర్లో రాసుకొచ్చింది. ''మేం ఎక్కడున్నా అదే స్వాగతం. ఆ కళ్లు.. నవ్వు మాకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తున్నాయి.'' అంటూ పేర్కొంది. ఐపీఎల్ 2022 సన్నాహాలకు భిన్నమైన స్థాయిని అందించడానికి సీఎస్కే టీం ఐర్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ను జట్టులో చేర్చుకుంది. 22 ఏళ్ల జోష్ లిటిల్ చెన్నై జట్టులో నెట్ బౌలర్ పాత్రను పోషించనున్నాడు. గతేడాది సీజన్లో అంచనాలకు మించి రాణించిన సీఎస్కే నాలుగోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఈ సీజన్లో మరోసారి సత్తా చాటేందుకు ధోని తన ప్లాన్స్ను సిద్ధం చేస్తున్నాడు. సీఎస్కే, కేకేఆర్తో మ్యాచ్తో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2022: డు ప్లెసిస్కు భారీ షాక్.. ఆర్సీబీ కెప్టెన్గా దినేష్ కార్తీక్! Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం 𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 Namma Special 🦁 Footvolley segment is B⚽CK! 🔁#WhistlePodu pic.twitter.com/pXxIe994sG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 -
IPL 2022: ఆ మ్యాచ్లు అన్నీ మహారాష్ట్రలోనే.. ధోని మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదు!
IPL 2022- CSK- MS Dhoni: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ బెస్ట్ రికార్డు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్కింగ్స్ను ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. డాడీస్ గ్యాంగ్ యువకులతో పోటీ పడగలదా అంటూ హేళన చేసిన వాళ్లకు విజయాలతోనే సమాధానమిచ్చాడు ఈ జార్ఖండ్ డైనమైట్. వేలం మొదలు, ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు.. ఇలా ప్రతి అంశంలోనూ కీలకంగా వ్యవహరించే ధోని తన మాస్టర్ మైండ్తో చెన్నైని మేటి జట్టుగా నిలిపాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలోనూ ధోని తన మార్కు చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ఆరంభం కానున్న వేళ బీసీసీఐ వేదికలను ఖరారు చేసింది. మహారాష్ట్రలోనే ఎక్కువ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక టైటిల్స్ పరంగా చెన్నై కంటే ఒక అడుగు ముందున్న ముంబై ఇండియన్స్ జట్టుకు అన్ని మ్యాచ్లు ‘సొంత రాష్ట్రం’లోనే ఆడటం కలిసి వస్తుందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో ధోని వ్యూహాత్మకంగా పావులు కదిపిన తీరు విశ్లేషకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. సీజన్ ఆరంభానికి ముందు చెన్నై జట్టు 20 రోజుల పాటు ట్రెయినింగ్ నిమిత్తం క్యాంపునకు వెళ్లనుంది. సాధారణంగా చెన్నైలోని ఈ శిక్షణ ఉండాల్సింది. అయితే, మ్యాచ్లన్నీ మహారాష్ట్రలో జరుగనున్న వేళ్ల శిబిరాన్ని సూరత్కు తరలించిందట చెన్నై ఫ్రాంఛైజీ. ధోని సలహాతో జట్టు మొత్తం గుజరాత్లోని సూరత్కు చేరుకోనున్నారట. సూరత్కే ఎందుకు? సూరత్లోని లాల్భాయి కాంట్రాక్టర్ స్టేడియంను ఇటీవలే నిర్మించారు. ఇక్కడి పిచ్ల ముంబై మాదిరి పిచ్లనే పోలి ఉంటాయట. ఈ విషయం తెలుసుకున్న ధోని, సీఎస్కే వెంటనే తమ క్యాంపును సూరత్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూరత్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నైనేశ్ దేశాయి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘ఎంఎస్ ధోని, డ్వేన్బ్రావో, రవీంద్ర జడేజా వంటి జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ స్టార్లు ప్రాక్టీసు కోసం సూరత్కు రానున్నారు. ఇక్కడి మట్టి ముంబై మట్టిని పోలి ఉంటుంది. అందుకే దీనిని వాళ్లు సెలక్ట్ చేసుకున్నారు’’ అని తెలిపారు. కాగా మార్చి 2 నుంచి సీఎస్కే ప్రాక్టీసు మొదలు కానుంది. గత సీజన్లో చాంపియన్గా నిలిచిన ధోని సేన టైటిల్ను నిలబెట్టుకునే వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఐపీఎల్-2022- చెన్నై సూపర్కింగ్స్ జట్టు ఇదే! రవీంద్ర జడేజా : రూ. 16 కోట్లు దీపక్ చహర్: రూ. 14 కోట్లు ధోని : రూ. 12 కోట్లు మొయిన్ అలీ : రూ. 8 కోట్లు అంబటి రాయుడు: రూ. 6 కోట్ల 75 లక్షలు రుతురాజ్ గైక్వాడ్ : రూ. 6 కోట్లు బ్రేవో: రూ. 4 కోట్ల 40 లక్షలు శివమ్ దూబే : రూ. 4 కోట్లు క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్ల 60 లక్షలు రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు ఆడమ్ మిల్నే: రూ. 1 కోటి 90 లక్షలు సాన్ట్నర్ : రూ. 1 కోటి 90 లక్షలు రాజ్వర్ధన్ హంగార్గెకర్: రూ. 1 కోటి 50 లక్షలు ప్రశాంత్ సోలంకి : రూ. 1 కోటి 20 లక్షలు డెవాన్ కాన్వే : రూ. 1 కోటి మహీశ్ తీక్షన : రూ. 70 లక్షలు డ్వేన్ ప్రిటోరియస్ : రూ. 50 లక్షలు భగత్ వర్మ : రూ. 20 లక్షలు ఆసిఫ్: రూ. 20 లక్షలు తుషార్ దేశ్పాండే: రూ. 20 లక్షలు జగదీశన్ : రూ. 20 లక్షలు హరి నిశాంత్ : రూ. 20 లక్షలు సుభ్రాన్షు సేనాపతి : రూ. 20 లక్షలు ముఖేశ్ చౌదరి: రూ. 20 లక్షలు సిమర్జీత్ సింగ్ : రూ. 20 లక్షలు చదవండి: బౌలింగ్లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే Ruturaj Gaikwad: యువ క్రికెటర్ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్కు దూరం -
చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!
చిరుతపులిని రక్షించాలా? మనిషినా? ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్ (గుజరాత్) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు. ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు. ఆ సమయంలో మగ ఫారెస్ట్ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు. ‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు మధార్కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు. మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. -
18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!
Mohit Churiwal success Journey in telugu: జీవితంలో ఎదగాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు ఇది చాలా మంది అనేమాట. అదినిజం కాదు. ప్రతిభ ఉంటే కోట్లకు కోట్ల డబ్బు ఎలా సంపాదించవచ్చో ఈ గుజరాతీ టీనేజ్ బాలుడు నిరూపించాడు. మోహిత్ చురివాల్ కేవలం 15 యేళ్ల వయసులోనే టిక్టాక్, ఏయమ్పీ మీ వంటి అనేక బ్రాండ్లలో పనిచేశాడు. ఇక 18 యేళ్లకి ఏకంగా కంపెనీయే ప్రారంభించాడు. అతని విజయయాత్ర ఎలా ప్రారంభమైందంటే.. అవును! ఇతని జర్నీ అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్లోని సూరత్కు చెందిన మోహిత్ చురివాల్ స్కూల్లో చదివేటప్పటినుంచే ఇంటర్నెట్లో తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 15 యేళ్ల వయసులో ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచి, దాన్ని 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు కానీ ముందుకు వెళ్లలేదు. తర్వాత ఒక సోషల్ పేజ్ను క్రియేట్ చేశాడు. ఐతే అది హ్యాక్ అయ్యింది. రెండు సార్లు విఫలమయ్యాక ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి చదివేటప్పుడు అతని మొదటి సంపాదన అక్షరాల 7 లక్షల రూపాయలు. ఆతర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాడు. ఐతే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు. అనేక బ్రాండెడ్ కంపెనీల్లో పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత 18 యేళ్లకు తన కలను నెరవేర్చుకున్నాడు. సొంత కంపెనీ ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడు. ఆ కంపెనీ లాభాలబాట పట్టగానే మరో కంపెనీ ప్రారంభించాడు. ఐతే ఈ ప్రయాణంలో ఎవరి దగ్గరా (కుటుంబంతో సహా) డబ్బుకోసం ఎప్పుడూ చేయిచాచలేదు. స్వయం కృషితో ప్రారంభించి మునుముందుకు నడిపించాడు. అద్భుతం కదా! మోహిత్ చురివాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిన నేటి యువత కొత్తగా కెరీర్ నిర్మించుకోవచ్చు. నిజమేకదా.. మీరేమంటారు.. చదవండి: దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్.. -
ట్యూషన్ సెంటర్లో కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా
సూరత్: ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులకు కోవిడ్ సోకడంతో గుజరాత్లోని సూరత్ నగరంలో కలకలం రేగింది. ట్యూషన్ సెంటర్ క్లాసులకు రెగ్యులర్గా వెళ్లే విద్యార్థి ఒకరు ఈనెల 7న కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం 125 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురు కరోనా పాజిటివ్గా తేలారని సూరత్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్(హెల్త్) ఆశిష్ నాయక్ తెలిపారు. మరింత మందికి కరోనా సోకకుండా ట్యూషన్ సెంటర్ను వెంటనే మూసివేసినట్టు చెప్పారు. సూరత్ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలారంభంలో కొంత మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేటు స్కూల్ను తాత్కాలికంగా మూసివేశారు. సూరత్ నగరంలో ఇప్పటివరకు 1,11,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,09,975 రికవరీలు నమోదు కాగా, రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం సూరత్లో ఇప్పటివరకు మొత్తం 1,629 మంది కోవిడ్ -19 రోగులు మరణించారు. (చదవండి: కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?) -
తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నేరాలకు కేరాఫ్ అవుతోంది. అక్కడ ఓ ప్రదేశంలో రోడ్డు పక్కన మూత్రవిసర్జనకు వెళ్లిన ఓ పెద్దాయనకు యువతి చెయ్యి కనిపించింది. అయితే తను దానిని బొమ్మ చెయ్యి అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ చెయ్యి చుట్టూ ఈగలు ముసురుతూ నిజమైన చెయ్యి లాగే అనిపించింది. దాంతోపాటు దుర్వాసన కూడా రాసాగింది. ఇక దాంతో ఆ పెద్దాయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల గాలించగా కాళ్లు, చేతులు, మొండం, గుర్తు పట్టడానికి వీలుగా లేని ఓ యువతి ముఖం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నిందితుని పేరు సందకుమార్, పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను జాబ్ చేస్తున్న ఫ్యాక్టరీలో రెండేళ్ల కిందట బీహార్కి చెందిన ఓ యువతిని పేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆ యువతిని లొంగతీసుకున్నాడు. సందకుమార్ తనకు పెళ్లైన విషయం దాచిపెట్టాడు. ఆమెతో తరచూ శారీరక సంబంధం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోకుండా వాయిదా వెయ్యసాగాడు. అయితే ఓ రోజు ఆ యువతి గట్టిగా నిలదీసి అడగితే టైమ్ పడుతుంది అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. ఇక దాంతో తనను పెళ్లి చేసుకోకపోతే అతడిపై అత్యాచారం కేసు పెడతానని యువతి బెదిరించింది. ఈ నేపథ్యంలో అతను ఆ యువతిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.తన ప్లాన్ ప్రకారం సూరత్ రైల్వే స్టేషన్లో ఆ యువతిని రైలు ఎక్కించి ఆమెను నందర్బార్ అనే ఏరియాలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి అన్ని దిక్కులకూ విసిరేశాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఓ బండరాయితో గట్టిగా మోదాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం.. హత్య జరిగిన చుట్టుపక్కల సీసీ కెమెరాలు సీసీ కెమెరాల్ని పరిశీలించారు. యువతి, ఆమె పక్కన ఓ మధ్య వయస్కుడు వెళ్తున్నట్లు కనిపించినట్టు గుర్తించారు. దాంతో అతనే ఆమెను చంపి ఉండొచ్చు అని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అతను ఎవరో తెలుసుకునే క్రమంలో సూరత్ పోలీసులు ఓ టెక్నికల్ పర్సన్ సాయంతో యువతి పక్కన వెళ్తున్న వ్యక్తి మొబైల్ నంబర్ ట్రేస్ చేశారు. దాదాపు 15 రకాల మొబైల్ నంబర్లు ఆ ఏరియాల్లో అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. అయితే అందులో ఒక నంబర్ మాత్రం మూడు ప్రదేశాల్లో కనిపించింది. దాంతో ఆ నంబర్ గల వ్యక్తే ఆమె పక్కన ఉన్న వ్యక్తి అంటూ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తమ శైలిలో విచారణ చేయగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. -
అప్పుడేదో వ్యంగ్యం ప్రదర్శించా అంతే: రాహుల్ గాంధీ
‘‘నీరవ్.. లలిత్.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు. సూరత్: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్ను మేజిస్ట్రేట్ ఏఎన్ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్మెంట్స్ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్13న కోలార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ, రాహుల్పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్లోనే రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా. చదవండి: ఆత్మనిర్భర్ అంటే..:రాహుల్ గాంధీ -
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్
గుజరాత్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గురువారం సూరత్ కోర్టుకు చేరుకున్నారు. పరువు నష్టం కేసు విషయంలో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసిన సూరత్ బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ నిమిత్తం 2019 అక్టొబర్లోనే మొదటి సారి రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పులేదని కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
ఘోరం: మాస్క్ ధరించలేదని మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం..
ముంబై: మాస్క్ ధరించలేదని ఓ మహళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్.. ప్రజలకు నీతి విషయాలు బోధించాల్సిన వ్యక్తే ఇలా నీచమైన పనికి దిగజారడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది జరిగిన ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. 2020 లాక్డౌన్ సమయంలో 33 ఏళ్ల వివాహితను పాల్సానాలో పాలకోసం ముఖానికి మాస్క్ లేకుండా బయటికి వచ్చింది. ఈ విషయం గమనించిన నరేశ్ కపాడియా అనే కానిస్టేబుల్ ఆమెపై అనుచితంగా ప్రవర్తించాడు. తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటానని బెదిరించి అక్కడినుంచి అపహరించాడు. మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నగ్నంగా ఉంచి ఆమెపై చేయి చేసుకున్నారు. నిందితుడు సూరత్లోని ఉమర్పాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అంతేగాక మహిళకు చెందిన ప్రైవేటు ఫోటోలను తీసుకుని వాటిని బయపట పెడతానని బ్లాక్మెయిల్ చేసి కొన్ని నెలలపాటు తనపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కానిస్టేబుల్ భార్య మహిళకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు కేసు నమోదు చేసింది.. మహిళ, తన భర్తతో కలిసి ఇంటికొచ్చి తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు దూషించేవారని కానిస్టేబుల్ భార్య ఆరోపించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై షెడ్యూల్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న ఈ కేసులో ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు పోలీసు, మహిళతో ఒకరు ఎఫైర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: లైంగిక వేధింపులు: గుండెపోటు అంటూ నాటకం.. వేట మొదలు! -
నీరు కలుషితం: నలుగురు మృతి, 72 మంది ఆస్పత్రిపాలు
అహ్మదాబాద్: తాగునీరు కలుషితమవడంతో ఆ నీరు తాగిన వారిలో నలుగురు మృతి చెందగా 72 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్లోని సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైనేజీ నీరు తాగునీటి పైప్లైన్లో కలవడంతో ఆ నీరు తాగిన వారి ప్రాణం మీదకు వచ్చిందని తేలింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠోర్ గ్రామంలో ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. వాంతులు.. విరేచనాలు చేసుకోవడంతో వారంతా ఆస్పత్రి బాట పట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నాపెద్దా అందరూ ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు కన్నుమూశారు. మృతిచెందిన వారు గెమల్ వాసవ (45), హరీశ్ రాథోడ్ (42), మోహన్ రాథోడ్ (70) విజయ్ సోలంకి (38). చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో కిందపడిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో పాటు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఓఆర్ఎస్ పాకెట్లు పంపించారు. వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. -
కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి
అహ్మదాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ వైరస్ ప్రజలను భయాందోళనలో నెట్టివేయగా ఈ వైరస్ ప్రభావంతో మరో ప్రమాదకర పరిస్థితులు వచ్చి పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి కంటి చూపు పోతోంది. దేశంలో అక్కడక్కడ ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఫంగస్ రావడంతో దాని వలన కరోనా నుంచి కోలుకున్న వారి చూపు మందగిస్తోందని తెలుస్తోంది. తాజాగా గుజరాత్లోని సూరత్లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఫంగస్ బారిన 40 మందికి పైగా పడ్డారని తెలుస్తోంది. సూరత్లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించారు. వారిని పరిశీలించగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు పోయిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్పై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ ఫంగస్ ప్రాణాంతకమని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఫంగస్ రావడానికి గల కారణాలను గుర్తించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ స్వరూప్ ఫంగస్ కారణాలు వివరించారు. ‘కరోనా బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహం వారు ఉన్నారని, కరోనా నివారణకు తీసుకున్న ఔషధాల వలన ఈ ఫంగస్ రావడానికి కారణం’ అని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ బాధితులకు ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఫంగస్ వస్తే కొందరికి కంటిచూపు కోల్పోగా మరికొందరి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: ‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్ను బెదిరించిన బాలిక చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
కరోనా పేషెంట్కు ఆవు మూత్రం పోసిన నేత
-
ఘోరం: కరోనా పేషెంట్కు ఆవు మూత్రం పోసిన నేత
గాంధీనగర్: ఓ బీజేపీ నాయకుడు దారుణానికి పాల్పడ్డాడు. వెంటిలేటర్పై ఉన్న కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడు. తాగించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి తీరును ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. గుజరాత్లోని సూరత్లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలి వద్దకు బీజేపీ సూరత్ ప్రధాన కార్యదర్శి కిశోర్ బిందల్ వచ్చాడు. పీపీఈ కిట్ ధరించి బీజేపీ కండువా వేసుకుని వచ్చిన అతడు ఓ బాటిల్ తీసుకొచ్చాడు. యాసిడ్ రంగులో ఉన్న ద్రావణం ఆమె నోటిలో పోశాడు. ఆమెకు బలవంతంగా బిందల్ ఆవు మూత్రం తాగించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దాదాపు 80 వేల వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్తో పాటు ఘోరంగా తిట్లు.. విమర్శలు రావడంతో దెబ్బకు ఆ వీడియోను బిందల్ తీసేశాడు. అయితే అప్పటికే ఆ వీడియో పలువురు షేర్ చేయడం.. కాపీ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్గా మారింది. ఆ బీజేపీ నాయకుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో కరోనాకు విరుగుడు ఆవుమూత్రం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది నిరూపించేందుకు కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియడం లేదు. ఏ ఆస్పత్రి? బాధితురాలు ఎవరు? అనేది తెలియడం లేదు. పార్టీ నాయకుడిని ఆస్పత్రిలో కండువా ధరించి ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా ఇప్పుడు వైరలవుతోంది. చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి -
మాయదారి కరోనా.. పసిపిల్లలనూ వదలడం లేదు!
కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరినీ కాటేస్తోంది. కరోనా బారిన మహిళకు జన్మించిన శిశువు మృతి చెందిన సంఘటన ఆందోళన రేకిత్తిస్తోంది. అహ్మదాబాద్/సూరత్: కోవిడ్తో బాధపడుతున్న తల్లికి జన్మించిన బిడ్డ కరోనాతో మృత్యువాత పడిన ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి శిశువు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1న సూరత్ నగరంలోని డైమండ్ ఆస్పత్రిలో జన్మించిన శిశువును మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై ఉంచి వైద్యం చేశామని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణాలు రక్షించేందుకు తమకు తెలిసిన అన్ని రకాల వైద్య పద్ధతులను ఉపయోగించామని, అయితే ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న వైద్యుడి సీరాన్ని తీసి బిడ్డకు ఎక్కించామని, రెమిడిసివిర్ ఇంజెక్షన్ సైతం ఇచ్చి చూశామని అయితే బిడ్డ ప్రాణాలను రక్షించలేకపోయామని పేర్కొన్నారు. ‘నవజాత శిశువును కాపాడటానికి మా వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు గుజరాత్ కరోనావైరస్ బాధితులలో ఈ నవజాత శిశువు అతి పిన్న వయస్కులలో ఒకర’ని కోవిడ్ నుంచి ఇటీవల కోలుకున్న సూరత్ మాజీ మేయర్ డాక్టర్ జగదీష్ పటేల్ అన్నారు. శిశువు చికిత్స కోసం తన రక్త ప్లాస్మాను ఆయన దానం చేశారు. కాగా, తాపి జిల్లాకు చెందిన 14 రోజుల పసిబాలుడు కరోనా బారిన పడి సూరత్ కొత్త సివిల్ ఆసుపత్రిలో బుధవారం మరణించాడు. గతేడాది మొదటివేవ్ కంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే కొత్త స్ట్రెయిన్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకిన కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు కోవిడ్ వ్యాపిస్తోందని అహ్మదాబాద్కు చెందిన శిశువైద్యుడు డాక్టర్ నిశ్చల్ భట్ చెప్పారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం గుజరాత్లో శనివారం నాటికి 49,737 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ చదవండి: లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరం.. గంటల వ్యవధిలో వైరస్ లోడ్ కమ్యూనిటీ స్ప్రెడ్ -
2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..
సూరత్ : రెండు నెలల కుమారుడి కోసం ఏకంగా చంద్రుడిపై స్థలం కొన్నాడో వ్యాపారి. చంద్రుడిపై స్థలం కొన్న మొదటి సూరత్ వ్యాపారిగా రికార్డు కెక్కాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని సూరత్కు చెందిన విజయ్ భాయ్ కథిరియా అనే వ్యాపారి తన రెండు నెలల కుమారురు నిత్య కోసం చంద్రుడిపై స్థలం కొనాలనుకున్నాడు. ఇందుకోసం అనుమతులు పొందటానికి న్యూయార్క్లోని ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీకి మెయిల్ పెట్టాడు. మార్చి 13వ తేదీన అనుమతులు వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత సదరు కంపెనీనుంచి విజయ్ కుమారుడు నిత్య పేరిట ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు వచ్చాయి. చంద్రుడిపై గల ‘సీ ఆఫ్ మస్కోవీ’ అనే ప్రాంతంలో స్థలం కేటాయించారు. మామూలుగా చంద్రుడిపై స్థలం సంపాదించటం సాధ్యపడదు. అయితే చంద్రుడిపై స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్ను మాత్రమే సంపాదించగలం. చాలా మంది దీన్ని ఓ విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో రాజస్తాన్కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు. చదవండి.. చదివించండి : బైకర్ను ఆపిన పోలీస్.. చేతులెత్తి దండం పెడతారు! వైరల్గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో -
‘దృశ్యం’ సీన్: పోలీస్స్టేషన్లో అస్థిపంజరం
సూరత్: దృశ్యం సినిమా గుర్తుందా! దాదాపు అలాంటి సంఘటన గుజరాత్లోని సూరత్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఖటోదర పోలీసు స్టేషన్ ప్రాంగణంలో మానవ అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. స్టేషన్లో నిలవ ఉంచిన సీజ్ చేసిన వాహనాలను తొలగించే క్రమంలో ఈ అస్థిపంజరం కనిపించిందని అధికారులు చెప్పారు. రెండేళ్లుగా వాహనాల తొలగింపు జరగలేదని, దీంతో తాజాగా ఈప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో ఒక పుర్రె, దిగువ అస్థి అవశేషాలు కనిపించాయని, వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు. (చదవండి: ఒక్క రేషన్ కార్డులో 68 మంది సభ్యులు) -
‘నేడు సూరత్– రేపు ముంబై’
ముంబై సెంట్రల్: ‘నేడు సూరత్– రేపు ముంబై’ ఈ సరికొత్త నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఏడాది జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవలే జరిగిన గుజరాత్, సూరత్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాన్నే సాధించి, 27 సీట్లను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది. రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 227 సీట్లలో పోటీ చేస్తామనీ ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రూ.39 వేల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ముంబై నగర పాలిక సంస్థ దేశంలోనే ధనిక మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తింపు పొందింది. దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ పెద్దది. మున్సిపల్ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రీతీ శర్మను బాధ్యురాలిగా నియమించింది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టిన ప్రీతి మాట్లాడుతూ, ‘ముంబై, సూరత్ సంస్కృతుల్లో ఎంతో స్వారూప్యత ఉందని, ఈ రెండు నగరాల మౌలిక సమస్యలు కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నారు. సూరత్ ప్రజల మాదిరిగానే ముంబై ప్రజలు కూడా సరికొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాల్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుందర్ బాలకృష్ణ మాత్రం ప్రీతీ శర్మ వ్యాఖ్యలతో విభేదించారు. ‘సూరత్ పరిస్థితి వేరని, ముంబైలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ లేదన్నారు. ఇక్కడి స్థానిక పార్టీ వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు అనవసరమైన జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తారని, ఆమ్ ఆద్మీకి ముంబైలో విజయం సాధించడం అంత సులువేం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం 1975 ఎమర్జెన్సీ కాల దోషం పట్టిన అంశం: సంజయ్ రౌత్ -
అనూహ్యం.. మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచింది. ఈ ఎన్నికల్లో సూరత్ కార్పొరేషన్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. దీంతో ఆప్కు పంజాబ్, గోవా తర్వాత గుజరాత్లో బలపడే అవకాశం లభించింది. సూరత్ కార్పొరేషన్ ఫలితాలతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన సూరత్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సూరత్ కార్పొరేషన్లో మొత్తం వార్డులు 120 ఉండగా బీజేపీ 93 గెలవగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్కు ఒక్కటి కూడా రాలేదు. ఈ ఫలితాలపై ఆమ్ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ పాలనను గుజరాత్కు అవసరమని పేర్కొంది. అయితే ఆరు కార్పొరేషన్లలో ఒక్క సూరత్ తప్పా మిగతా చోట ఆప్ బోణీ చేయకపోవడం గమనార్హం. మిగతా కార్పొరేషన్లలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నిలిచింది. అవి కూడా చాలా తక్కువ సీట్లే. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్నగర్, జామ్నగర్ కార్పొరేషన్లో 547 స్థానాల్లో 576 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 450 స్థానాలు సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 58, ఆమ్ఆద్మీ పార్టీ 27, ఇతరులు 8 స్థానాలు సొంతం చేసుకున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని లీకులు చదవండి: కాంగ్రెస్కు షాక్ మీద షాక్: ఆ సీటు కమలం ఖాతాలోకి -
అమ్మానాన్నా.. క్షమించండి, వెళ్లిపోతున్నా!
సూరత్: హఠాత్తుగా ఊడిపడ్డ కరోనా వల్ల పిల్లల చదువులు అటకెక్కాయి. అయితే ఇలా ఎంతకాలం విద్యార్థులు పాఠాలకు దూరం కావాలని ఆన్లైన్ క్లాసులకు తెర తీశారు. కానీ ఆన్లైన్ క్లాసులంటే అంత వీజీ కాదు. టీచర్ ఏం చెప్తుందో పిల్లోడికి సరిగా బుర్రకు ఎక్కదు.. అటు వాళ్లు శ్రద్ధగా వింటున్నారో తెలీదో ఇటు టీచర్కు కూడా అర్థమై చావదు. గుజరాత్లోని సూరత్కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడి పరిస్థితి కూడా అంతే.. ఎనిమిదవ తరగతి చదువుతున్న అతడికి ఆన్లైన్ పాఠాలు అంతగా అర్థం కాలేదు. అలా అని మరోసారి పాఠాలు రిపీట్ చేయమని అడగనూలేడు. దీంతో పిచ్చెక్కిపోయిన బాలుడు ఓ లేఖ రాసి, ఇంటి నుంచి పారిపోయాడు. "అమ్మానాన్న, గతంలో నేను మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాను. కానీ ఇప్పుడు వెళ్లిపోతున్నా. ఆన్లైన్ క్లాసుల్లో చెప్తున్న పాఠాలేవీ నాకర్థం కావట్లేదు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు సారీ" అని లేఖ రాసి వెళ్లిపోయాడు. (చదవండి: ఒంటికాలిపై.. 43 రోజుల్లో 3,800 కి.మీ.) దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంతలో బుధవారం నాడు పిల్లవాడి తండ్రికి ఫోన్కాల్ వచ్చింది. పిల్లోడు తన దగ్గరకే వచ్చాడని, అతడు క్షేమంగా ఉన్నాడంటూ భయందర్ నుంచి అతడి అంకుల్ సమాచారమిచ్చాడు. దీంతో కొడుకును కలిసేందుకు తల్లిదండ్రులు ఉన్నపళంగా ముంబై పయనమయ్యారు. అయితే పిల్లోడు ఒంటరిగా అంతదూరం ఎలా ప్రయాణించాడన్నది మాత్రం తెలియరాలేదు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. "నాలుగేళ్ల క్రితం అబ్బాయి కుటుంబం భయందర్లో నివసించేది. కానీ వాళ్లు సూరత్కు షిఫ్ట్ అవడంతో అతడు తన స్నేహితులను మిస్ అయ్యాడు. పైగా సూరత్లో ఉండటం అతకి పెద్దగా నచ్చలేదు. దీనికి తోడు ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవడంతో ఇంటి నుంచి పారిపోయాడు" అని తెలిపారు. (చదవండి: అమెజాన్లో ఆవు పిడకలు.. ఛీ రుచిగా లేవంటూ..) -
ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు
సూరత్ : పాథాలజిస్టు డాక్టర్ నేహా పోఖర్న బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయి. తనకు కాబోయే డాక్టర్ భర్త ప్రమోద్ గర్గ్తో ఘనంగా పెళ్లి జరగాలని అనుకునేది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆమె కోర్కెలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ఘనంగా జరగాల్సిన పెళ్లిని క్యాన్సిల్ చేసి, అదే రోజున వర్ట్యువల్ పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించింది. పెళ్లి పత్రికను సైతం వాట్సాప్లో పంపారు. మంగళవారం జరిగిన మెహందీ వేడుక కూడా ఆన్లైన్లోనే జరిగింది. ఈ బుధవారం ముంబైలోని ఓ రిసార్టులో వివాహం జరగనుంది. య్యూట్యూబ్ లింక్ నొక్కి.. బంధువులు, స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. (ట్రక్కు ఢీ కొట్టినట్లుంది: ఆ షార్క్ నాపై..) దాదాపు 2000 మంది అతిధులు ఆన్లైన్ ద్వారా పెళ్లిని వీక్షించనున్నారు. దీనిపై వధువు నేహా పోఖర్న మాట్లాడుతూ.. ‘‘ ఓ పాథాలజిస్టుగా కరోనా పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఓ ఉదాహరణగా నిలవటానికి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న నా కలను మార్చుకున్నాను. వర్ట్యువల్ వెడ్డింగ్కు ఓటు వేశాను. నాకు నా కుటుంబం, స్నేహితులు, బంధువుల భద్రత, ఆరోగ్యమే ముఖ్యం’’ అని స్పష్టం చేసింది. ( ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! ) -
బంగారు స్వీట్.. ధర వేలల్లో..
సూరత్ : నగరానికి చెందిన ఓ స్వీట్ షాపు వినూత్న ప్రయోగం చేసింది. చాందీ పాద్వో పండుగను పురస్కరించుకుని బంగారం (24 కారెట్ల పైతొడుగు)తో స్వీటును తయారు చేసింది. దానికి ‘గోల్డ్ ఘారీ’ అని పేరు పెట్టింది. శరద్ పూర్ణిమ తర్వాతి రోజైన చాందీ పాద్వో రోజున సాంప్రదాయ వంటకం ‘ఘారీ’ తినటం అక్కడి ప్రజల ఆనవాయితీ. దీంతో గుజరాత్లోని సూరత్కు చెందిన రోహన్ అనే స్వీట్ షాపు యజమాని బంగారంతో స్వీటును తయారు చేశాడు. మామూలు ఘారీ కిలో ధర 660-900 రూపాయల వరకు ఉంటే.. కిలో ‘గోల్డ్ ఘారీ’ ధర 9000 రూపాయలు. ( సముద్రంలో మునిగిపోతున్న పక్షిని కాపాడి.. ) దీనిపై రోహన్ మాట్లాడుతూ.. ‘‘ మేము ఈ సంవత్సరమే ‘ గోల్డ్ ఘారీ’ని తయారు చేశాము. ఇది చాలా ఆరోగ్యకరం. బంగారం ఎంతో ఉపయోగకారని మన ఆయుర్వేదమే చెబుతోంది. ఈ స్వీటును మార్కెట్లోకి తెచ్చి మూడురోజులవుతోంది. మేము అనుకున్న దానికంటే తక్కువ డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నా’’మన్నారు. -
సూరత్: భారీ అగ్ని ప్రమాదం
-
సూరత్లో భారీ అగ్ని ప్రమాదం
గాంధీనగర్: గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్లాంట్లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేడు తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్లోని హజీరా ఆధారిత ఓఎన్జీసీ ప్లాంట్లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఎంతో దూరం వరకు మంటలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (చదవండి: పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!) -
వయసులో చిన్నది.. ఔదార్యంలో గొప్పది
గాంధీనగర్: మనిషికి కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును క్యాన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సూరత్కు చెందిన ఓ చిన్నారి. వివరాలు.. దేవ్నా జనార్దన్ అనే పదేళ్ల చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్గా పని చేస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్ రోగులకోసం తన జుట్టును దానం చేసింది. దీని గురించి దేవ్నా మాట్లాడుతూ.. ‘నా జుట్టు దానం చేస్తే ఎవరైనా ఆనందం పొందుతారంటే.. వారి కోసం సంతోషంగా నా జుట్టు ఇచ్చేయాలనుకున్నాను’ అంటుంది ఈ చిన్నారి. తన 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలని దేవ్నా కోరుకుంటుంది. పదేళ్ల ఈ చిన్నారి చూపిన ఔదార్యం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్నదానివైనా.. మనసు మాత్రం గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...) ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి -
కరోనా బిల్లుకు భయపడిన వ్యాపారి ఏం చేశారంటే
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. సూరత్కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు. -
వరుడికి వజ్రాల మాస్కు.. ధర తెలిస్తే..
అహ్మదాబాద్: కరోనా కాలంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ వరుడికి వింత కోరిక పుట్టింది. లాక్డౌన్ నిబంధనల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి తనకు, కాబోయే భార్య కోసం ఓ షాపులో వజ్రాల మాస్కు తయారు చేయించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కొడుకు కోరిక మేరకు తమ డిజైనర్లు రూపొందించిన మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడిందని.. దీంతో మరిన్ని వజ్రాల మాస్కులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సీ తెలిపారు. లక్షన్నర నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు పెడితే బంగారు, వజ్రాల మేళవింపుతో కూడిన మాస్కులను అందిస్తామని చెబుతున్నారు. (బడా బాబుకి బంగారు మాస్క్, ధర ఎంతంటే) ఈ విషయం గురించి దీపక్ చోక్సీ మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత ఓ వ్యక్తి మా దుకాణానికి వచ్చారు. తన పెళ్లి జరుగబోతోందని.. తనకు, వధువు కోసం వెరైటీ మాస్కులు కావాలని అడిగారు. దీంతో మాకు ఓ ఐడియా వచ్చింది. యెల్లో గోల్డ్, అమెరికన్ వజ్రాలను ఉపయోగించి మాస్కులు తయారు చేశాం. దీని ధర ఇంచుమించు లక్షన్నర. ఇక వైట్ గోల్డ్, రియల్ డైమండ్స్తో మరో మాస్కు కూడా తయారు చేశాం. దీని కోసం 4 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరానికి అనుగుణంగా.. వేరే నగలు చేయించుకున్నపుడు వజ్రాలను మాస్కు నుంచి వేరు చేయవచ్చు. ఇక ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అన్ని విధాలా సురక్షితమైన వస్త్రాన్నే మాస్కు తయారీలో వాడుతున్నాం. చాలా ఆర్డర్లు వస్తున్నాయి. పెళ్లిలో దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు తయారు చేయాల్సిందిగా వధూవరులు కోరుతున్నారు’’అని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి సుమారు 2 లక్షల 89 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్ను తయారు చేయించుకున్న సంగతి తెలిసిందే. -
వలస కార్మికుడిపై బీజేపీ నేత దాడి!
సూరత్ : వలస కార్మికుల నుంచి అన్యాయంగా డబ్బులు దండుకోవటమే కాకుండా.. ఇదేంటని అడిగిన ఓ వలస కార్మికున్ని విచక్షణా రహితంగా చితకబాదాడో బీజేపీ నేత. ఈ సంఘటన గుజరాత్లోని సూరత్లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వీరిని సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. రైలు టిక్కెట్ తీసుకునే అవకాశం లేకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. కానీ, సూరత్కు చెందిన రాజేష్ వర్మ అనే బీజేపీ నేత వలస కార్మికుల నుంచి టిక్కెట్ల ధరల రూపంలో దాదాపు రూ.లక్ష వసూలు చేశాడు. ఒక్కోటిక్కెట్ ధరకు మూడురెట్లు అధికంగా డబ్బులు వసూలు చేశాడు. ( భారత్ ప్రతీకార దాడి: పాక్ సైనికులు హతం ) వాసుదేవ వర్మ అనే వలస కూలీ టిక్కెట్ల ధరల విషయమై అతడ్ని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్, అతడి అనుచరులు వాసుదేవను చెక్క దబ్బలతో, రాళ్లతో చావగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరల్ పాటెల్ అనే కాంగ్రెస్ నాయకుడు దీన్ని తన ట్విటర్ ఖాతో పోస్ట్ చేశాడు. కాగా, దాడికి పాల్పడ్డ రాజేష్ వర్మకి బీజేపీతో అసలు సంబంధమే లేదని అధికార బీజేపీ పార్టీ చెబుతుండటం గమనార్హం. ( లాక్డౌన్ :ప్రియుడిని కలవటం కుదరక భర్తను.. ) -
లాక్డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!
సూరత్: మహమ్మారి కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలతోంది. అత్యవసర సేవలు, సర్వీసులు మినహా అన్నీ రద్దయ్యాయి. ఈనేపథ్యంలో తమను ఇళ్లకు పంపించకుండా బలవంతంగా పనిచేయించుకుంటున్నారని సూరత్లోని వజ్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది డైమండ్ బీ బౌర్స్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొందరు ఆ భవన సముదాయంపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామినిచ్చారు. (చదవండి: లాక్డౌన్: అక్కడ మరికొన్ని సడలింపులు) -
దేశంలో నాలుగు నగరాలకు కేంద్ర బృందాలు
-
కరోనా ఎఫెక్ట్; నిరాడంబర పెళ్లి
సూరత్: కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి. కొంత మంది మాత్రం అనుకున్న ముహూర్తానికే నిరాడంబరంగా వివాహాలు జరిపిస్తున్నారు. తాజాగా గుజరాత్లోని సూరత్లో ఓ జంట ఇలాగే పెళ్లి చేసుకుంది. గొప్పగా పెళ్లి చేసుకోవాలన్న వధువరులు పూజ, దిశాంక్ చివరకు ఆరుగురి సమక్షంలో ఒక్కటయ్యారు. ముఖానికి మాస్క్లు, చేతికి గ్లోవ్స్ ధరించి పెళ్లిపీటలు ఎక్కారు. అంతేకాదు పెళ్లి తంతుకు ముందు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్నారు. ‘చాలా ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కరోనా కారణంగా నిరాడంబరంగా మా ఇంట్లోనే వివాహ తంతు ముగించాం. కేవలం తల్లిదండ్రులు మాత్రమే పెళ్లికి హాజరయ్యార’ని వధువు పూజ తెలిపారు. అందరూ లాక్డౌన్ మార్గదర్శకాలను పాటించి కరోనాను తరిమి కొట్టాలని వధువరులు కోరారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్డౌన్ గడువును మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్: ఏకబిగిన 70 కి.మీ. నడక -
సొంతూళ్లకు వెళ్లనీయకపోవడంతో బీభత్సం!
సూరత్: కరోనా లాక్డౌన్ కారణంగా సూరత్లో చిక్కుకున్న వలస కార్మికులు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, పని ప్రదేశాల్లో తమకు రావాల్సిన వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన కార్మికులు వాహనాలకు నిప్పు పెట్టారు. డిజైనింగ్ పనులు చేసే మంచాలను కూడా తగులబెట్టారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. (చదవండి: కరోనాతో 14 నెలల చిన్నారి మృతి) రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 100కు పైగా నమోదైన మరునాడే ఈ ఘటన జరగడం గమనార్హం. లాక్డౌన్తో పనులు లేక... తిండి దొరక్క అల్లాడుతున్న తమను పట్టించుకున్న నాథుడే లేడని పలువురు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత ఊళ్లకైనా పంపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుజరాత్లో గురువారం ఒక్కరోజే 116 కరోనా కొత్త కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 378కి చేరింది. ఇదే క్రమంలో రెండు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 19కి చేరింది. (చదవండి: కష్టమే..అయినా తప్పదు - ఇటలీ ప్రధాని) -
మహిళా వైద్యురాలికి వేధింపులు
-
కరోనా.. మహిళా వైద్యురాలికి వేధింపులు
సూరత్ : కరోనా వైరస్పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ మహిళా వైద్యురాలికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. వైద్యురాలి పొరుగింటి వ్యక్తి ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను దూషించడమే కాకుండా.. దాడికి కూడా యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. సూరత్ సివిల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా డాక్టర్పై పొరుగింటి వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను దారుణంగా తిట్టడంతో పాటు, భౌతికంగా దాడి చేయాలని చూశాడు. ఆమె వల్ల తమకు కూడా కరోనా వస్తుందని అర్థం లేని మాటలు మాట్లాడాడు. డాక్టర్పై దాడి జరుగుతున్నా పక్కన ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు. ఓ మహిళ అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతను వినిపించుకోవలేదు. అయితే ఆ వ్యక్తి తనతో ప్రవర్తించిన తీరును ఆ వైద్యురాలు ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసిన కాంగ్రెస్ నేత శ్రీవత్స.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కోరారు. ఇప్పటికే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లభించక ఇబ్బందులు పడుతున్న వైద్యులు.. ఇప్పుడు సమాజంలో కూడా ఒంటరి కావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. -
భారత్లో ఏడుకు చేరిన కరోనా మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడి గుజరాత్లో ఓ 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. దీంతో భారత్లో కరోనావైరస్ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా సూరత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు వదిలారు. అతను రైలుమార్గం గుండా ఢిల్లీ నుంచి జైపూర్ మీదుగా సూరత్కు వెళ్లినట్లు గుర్తించారు. అంతకు ముందు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి(63), బిహార్కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏడుకు పెరిగింది. భారత్లో తొలి కరోనా మరణం కర్ణాటకలోని కలబుర్గిలో చోటు చేసుకోగా.. రెండో మరణం ఢిల్లీలో సంభవించింది. ముంబైలో ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. శనివారం రాత్రి బిహార్లో 38 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా చనిపోయాడు. -
పిల్లల పెళ్లి.. ఆ జంట మళ్లీ జంప్!
సూరత్ : వరుడి తండ్రితో వధువు తల్లి పారిపోయిన ఘటన మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగొచ్చిన ప్రేమికుల జంట మరోసారి పారిపోయింది. పిల్లలకు పెళ్లి చేయాల్సిన ఆ జంట నెలరోజుల గ్యాపులో రెండు సార్లు ఇంటి నుంచి పారిపోవటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సూరత్కు చెందిన హిమ్మత్ పాండవ్(46), నవ్సారికి చెందిన శోభ్న రావల్(43)లు చిన్నతనంలో ఒకే ఊర్లో కలిసి ఉండేవారు. ఇద్దరు ప్రేమించుకున్నప్పటికి కొన్ని అనివార్యకారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత శోభ్నకు పెళ్లి జరగటంతో ఆమె నవ్సారికి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల తర్వాత తమ పిల్లలకు పెళ్లి చేయటానికి ఈ జంట కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిమధ్యా పాత జ్ఞాపకాలు పురులు విప్పాయి, మళ్లీ ప్రేమ చిగురించింది. ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఖరారై పనులు కూడా శరావేగంగా జరిగిపోతున్నాయి. పెళ్లికి ఇంకో వారం ఉందనగా జనవరి 10న హిమ్మత్, శోభ్నలు ఇంటినుంచి పారిపోయారు. దీంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. రెండు వారాల తర్వాత ఆ ఇద్దరు ఇళ్లుకు తిరిగొచ్చారు. అయితే శోభ్న భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వక పోవటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ శనివారం ప్రేమికులిద్దరూ మరోసారి ఇళ్లనుంచి పారిపోయారు. వీరి విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, ప్రేమికుల జంట సూరత్లోని ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నట్లు సమాచారం. ( వరుడి తండ్రితో వెళ్లిపోయిన వధువు తల్లి..! ) -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
కరోనా ఎఫెక్ట్ : రూ 8000 కోట్ల నష్టం
అహ్మదాబాద్ : చైనాలో కరోనా వైరస్ కలకలంతో సూరత్ డైమండ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సూరత్ నుంచి వజ్రాలు ఎగుమతయ్యే హాంకాంగ్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో రానున్న రెండు నెలల్లో ఇక్కడి డైమండ్ పరిశ్రమకు దాదాపు రూ 8000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తితో హాంకాంగ్లో మార్చి తొలివారం వరకూ స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. మరోవైపు వైరస్ భయంతో వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. సూరత్ నుంచి హాంకాంగ్కు ఏటా రూ 50,000 కోట్ల విలువైన పాలిష్డ్ వజ్రాలు ఎగుమతవుతాయని, ఇక్కడి నుంచి డైమండ్ ఎగుమతుల్లో ఇవి 37 శాతమని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ చైర్మన్ దినేష్ నవదియా పేర్కొన్నారు. హాంకాంగ్లో నెలరోజుల పాటు సెలవులు ప్రకటించడంతో అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తున్న గుజరాతీ వ్యాపారులు భారత్కు తిరిగి వస్తున్నారని చెప్పారు. హాంకాంగ్లో పరిస్థితి మెరుగుపడకుంటే సూరత్ డైమండ్ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరోనా వైరస్ కలకలంతో వచ్చే నెలలో హాంకాంగ్లో జరగనున్న అంతర్జాతీయ జ్యూవెలరీ ఎగ్జిబిషన్ రద్దయ్యే అవకాశం ఉందని, ఇదే జరిగితే సూరత్లో జ్యూవెలరీ వ్యాపారానికి భారీ షాక్ తప్పదని డైమండ్ వ్యాపారి ప్రవీణ్ నానావతి చెప్పుకొచ్చారు. చైనాకు ముఖద్వారంగా భావించే హాంకాంగ్లో ఇప్పటికే 18 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించగా ఓ వ్యక్తి మరణించారని అధికారులు తెలిపారు. చదవండి : తిరగడానికి దెయ్యాలు కూడా భయపడతాయి.. -
వరుడి తండ్రితో వెళ్లిపోయిన వధువు తల్లి..!
అహ్మదాబాద్ : ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు... కటార్గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా వివాహితకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. దీంతో సదరు వ్యక్తి కొడుకుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు వర్గాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే.. జనవరి 10 నుంచి వరుడి తండ్రి, వధువు తల్లి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులని.. గతంలో ఒకరినొకరు ఇష్టపడ్డారని అందుకే ఇప్పుడు పారిపోయి ఉంటారని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇందుకు సంబంధించిన వార్తలు, వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
సూరత్లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సూరత్ : రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను రాజస్తాన్ నుంచి గుజరాత్లోని సూరత్కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం సూరత్లో అరెస్టు చేశారు. కాగా నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో రూ. 2000,రూ. 500,రూ. 200,రూ.100 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
హిందూ సమాజ్ నేత దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లో అంతగా గుర్తింపు లేని రాజకీయ పార్టీ హిందూ సమాజ్ అధ్యక్షుడు కమలేష్ తివారీ (45) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలో అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శవమై కనిపించారు. లక్నో పశ్చిమ ఏఎస్పీ వికాస్ త్రిపాఠీ అందించిన వివరాల ప్రకారం కమలేష్ తివారీని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనను కలవడానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్న తివారీ పాన్ల కోసం తన అనుచరుడ్ని బయటకి పంపించారు. మార్కెట్ నుంచి అతను తిరిగి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో తివారీ శవమై కనిపించారు. తివారీని కలవడానికి వచ్చినవారు ఆ ఇంట్లో అరగంట కంటే ఎక్కువ సేపు గడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. హంతకుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. హిందూ మహాసభతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన తివారీ హిందూ సమాజ్ పార్టీని స్థాపించారు. తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్-ఉల్ -హక్ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్ ముఫ్తీ నదీమ్ కాజ్మి, ఇమామ్ మౌలానా అన్వర్-ఉల్-హక్ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు. కమలేష్ తివారీ హత్యకు సూరత్లో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని సూరత్లో శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరత్ నుంచి అహ్మదాబాద్కు తీసుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి నివాళి అర్పించే వరకు తివారీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. తివారీ హత్య నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను యూపీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. -
‘చంద్రయాన్’ పై ప్రేమతో ఓ యువతి..
సూరత్ : దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలతో సందడి వాతావరణం మొదలైంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. పిండి వంటలు, భజనలు, పూజలుతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్ యువతులు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. దేశ భక్తి పరిమళించేలా శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటూలు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూ ఫోటోలు వైరల్గా మారాయి. -
గణేషుడి ముందు..మందు..చిందూ..
-
సంక్షోభంలో డైమండ్ బిజినెస్
సాక్షి, గుజరాత్ : ఓ పక్క బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోపక్క డైమండ్ పరిశ్రమ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోసారి మాంద్యం పరిస్థితులు, అటు పరిశ్రమను, ఇటు కార్మికులను చుట్టుముడుతోంది. ప్రధానంగా సూరత్లోని వజ్రాల పరిశ్రమ మాంద్యం కారణంగా అత్యంత ఘోరమైన దశలను ఎదుర్కొంటోంది. ఆభరణ పరిశ్రమ రంగంలో సూరత్ భారత దేశానికి మార్గదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యానికి తోడు డైమండ్ వ్యాపారుల స్కాంలు బ్యాంకులను భయపెడుతున్నాయి. డైమండ్ కింగ్, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతాల కుంభకోణాల తరువాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ పరిశ్రమపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దీంతో డిమాండ్ తగ్గి భారీగా నష్టపోతున్న డైమండ్ వ్యాపారం దాదాపు మరణశయ్యపై కునారిల్లుతోంది. ఇప్పటికే ఉద్యోగాన్నికోల్పోయిన సూరత్ వజ్రాల కార్మికుడు సుభాష్ మన్సూరియా స్పందిస్తూ తాను ఉద్యోగం వదిలి రెండు నెలలయిందని తన కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్న తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కనీసం తాను చేసిన పనికి సరైన వేతనం కూడా చెల్లించలేదని యూనియన్ల సహకారంతో తాను వేతనం పొందానని అన్నారు. ఇదంతా తమ దురదృష్టమని వాపోయారు. తేజస్ పటేల్ అనే మరో వజ్ర ఉద్యోగి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్నానని అన్నారు. ప్రస్తుతం 18,000తో తన కుటుంబాన్ని పోషిస్తున్నానన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని ఏ రంగంలో నైపుణ్యం లేదని భవిష్యత్ గురించి తలచుకుంటేనే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు సంఘటితం కాకపోవడం బాధాకరమని తమ హక్కుల గురించి పోరాడే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది ఉపాది కోల్పోగా కేవలం సూరత్ నుంచే13వేల మంది ఉండడం గమనార్హం. గత జనవరినుంచి చాలా కంపెనీల యజమానులు ఉద్యోగులను, పని గంటలను తగ్గించుకుంటున్నాయని చెప్పారు. కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నాం నీరవ్ మోడీ, చోక్సీ, జతిన్ మెహతాల అవినీతి ఆరోపణల కారణంగానే బ్యాంకులు వజ్ర పరిశ్రమకు రుణాలు ఇవ్వట్లేదని శ్రేయాన్ బిజినెస్ పేర్కొంది. అందుకే వజ్ర వ్యాపారాన్ని వృద్థిలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల ఎగ్జిబిషన్ను నిర్వహించామని సూరత్ డైమండ్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రన్మల్ జిలారియా తెలిపారు. ఇప్పటికే 900 మందికి పైగా ఉద్యోగాలు కోల్పాయన్నారు. కంపెనీలు కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నాయన్నారు. ఉపాధి కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ప్రభుత్వమే తమ ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా సూరత్లో భారీ, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు వజ్రాల వ్యాపారంలో ప్రముఖంగా ఉండగా దాదాపు 6 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గత పదేళ్ళ కాలంలో రెండవసారి మాంద్యం ముప్పు ముంచుకొస్తుండడం ఆందోళన పుట్టిస్తోంది. 2017 దీపావళి తరువాత, అనేక వజ్రాల పరిశ్రమలు పనిచేయడం మానేశాయి. వాటిలో 40 శాతం మూతపడ్డాయి. 2018లో సుమారు 750 మంది ఉద్యోగులను తొలగించారు. గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ లెక్కల ప్రకారం, 2018లో 10 మందికి పైగా డైమండ్ ఆభరణాల చేతివృత్తులవారు ఉద్యోగం కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నారు. -
సూరత్ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్ఐఆర్
గాంధీనగర్ : సూరత్లోని కోచింగ్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమానితో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, బిల్డరు ఇలా మొత్తం ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తమ విచారణలో తేలిందన్నారు అధికారులు. శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్న నాలుగో అంతస్తుకి చేరుకోవడానికి కేవలం ఒకవైపు నుంచే మెట్లు ఉన్నాయని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అలాగే మెట్లు కూడా చెక్కవి కావడంతో భారీ మంటల వలన అవి కాలి బూడిదయ్యాయన్నారు. దాంతో విద్యార్థులకు తప్పించుకోవడానికి వేరే మార్గం లేకుండా పోయిందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పై నుంచి దూకాల్సి వచ్చిందన్నారు. దాంతో వారికి తీవ్ర గాయాలై కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారన్నారు అధికారులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్రమేపి బిల్డింగ్ అంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కోచింగ్ సెంటర్లో దాదాపు 70 మంది విద్యార్థులున్నుట్లు వెల్లడించారు. ప్రమాదం దృష్ట్యా కొద్ది రోజుల పాటు పట్టణంలో అన్ని రకాల ట్యూషన్స్ను, కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఆపేయాలని పోలీసులు ఆదేశించారు. అగ్ని మాపక భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని పోలీసులు తెలిపారు. Satish Sharma, Commissioner of Police Surat: 20 people have died & more than 20 have been injured in the fire that broke out in Surat yesterday. An FIR has been registered against three people. #Gujarat pic.twitter.com/psDRwi7v0P — ANI (@ANI) May 25, 2019 ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారు వెంటనే స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే అగ్ని మాపక కేంద్రం ఉందని.. కానీ ఫైరింజన్ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాల సమయం తీసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు కాపాడి సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాడు. ప్రమాదం జరిగిన అనంతరం సంఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘భయపడలేదు.. క్షేమంగా బయటపడ్డా’
గాంధీనగర్ : సూరత్ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు భవనం పై నుంచి దూకడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఉర్మి హర్సుఖ్భాయ్ వెకారి అనే విద్యార్థిని సురక్షితంగా బయటడటమే కాక మరో స్టూడెంట్ని కూడా కాపాడింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన తీరు.. తాను బయటపడిన వివరాలు చెప్పుకొచ్చింది ఉర్మి. ‘పది రోజుల క్రితమే డ్రాయింగ్ క్లాసెస్ కోసమని నేను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ దాదాపు 20 - 30 మంది దాక విద్యార్థులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చేవారు. భార్గవ్ సార్ మాకు పాఠాలు చెప్పేవారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు మా క్లాస్ రూంలో ఉన్నట్టుండి పొగ వ్యాపించింది. ఎవరైన పేపర్లు కాలుస్తున్నారేమో.. అనుకున్నాం. కానీ తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని తెలియడంతో.. విద్యార్థులు భయంతో పరుగులు తీస్తూ.. కిందకు దూకడం ప్రాంరంభించారు’ అని తెలిపింది. అయితే ‘విద్యార్థులంతా పరిగెత్తుతుంటే.. నేను, నా స్నేహితురాలు మాత్రం భయపడకుండా అలానే ప్రశాంతంగా కూర్చున్నాం. క్షేమంగా బయటపడేందుకు మార్గం ఉందేమోనని చుట్టూ గమనించడం ప్రారంభించాము. ఇంతలో మా సార్ కిటికి పక్కన ఉన్న రెయిలింగ్ పట్టుకుని కిందకు దిగడం ప్రారంభించాడు. మేం కూడా ఆయన లానే రెయిలింగ్ పట్టుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాం’ అని తెలిపింది. కోచింగ్ సెంటర్లో ఫైన్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఉర్మి తెలిపింది. నాటా లాంటి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడం కోసం విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారన్నది. అంతేకాక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకిన చిన్నారి.. అదే కోచింగ్ సెంటర్లో పని చేసే ఓ టీచర్ బిడ్డగా గుర్తించింది ఉర్మి. ‘టీచర్ తన పిల్లలను ఎప్పుడు కోచింగ్ సెంటర్కు తీసుకు వచ్చేవారు కాదు. కానీ దురదృష్టవశాత్తు నిన్న తీసుకు వచ్చారు. పాపం అగ్ని ప్రమాదం అని వినగానే ఆ చిన్నారి వెనక ముందు ఆలోచించకుండా కిందకు దూకేసింద’ని తెలిపింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సర్థనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామన్నారు. అయితే దీనిలో ఎవరి పేరు చేర్చలేదన్నారు. లోతుగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంఘటనపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. (చదవండి : ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!) Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected. — Narendra Modi (@narendramodi) May 24, 2019 -
సూరత్: కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
-
సూరత్లో ఘోర అగ్నిప్రమాదం
-
సూరత్లో ఘోర అగ్నిప్రమాదం; 15 మంది మృతి
-
ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!
అహ్మదాబాద్ : గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్లోని ఓ బిల్డింగ్లోని కోచింగ్ సెంటర్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
మనమైతే ఇలా చేయగలిగే వాళ్లమా..?!
గాంధీనగర్ : రోడ్డు మీద ఓ పది రూపాయలు కనిపిస్తేనే.. ఎవరి కంటా పడకుండా చటక్కున తీసుకుంటాము. అలాంటిది రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరూ గమనించకముందే ఆ నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయిస్తాము. కానీ గుజరాత్ సూరత్కు చెందిన ఈ సేల్స్మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. వివరాలు.. సూరత్లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నట్లు తెలిపారు. -
మాకు ఆ చీర కావాలి..!
గాంధీనగర్ : గత వారం జరిగిన పుల్వామా ఉగ్ర దాడి నుంచి భారతావని ఇంకా కోలుకోలేదు. దేశమంతా ఓ వైపు తమ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళుర్పిస్తూనే.. మరో పక్క దాయాది దేశం పట్ల తీసుకోబోయే ప్రతీకార చర్యల గురించి చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు నివాళులర్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు గుజరాత్ వస్త్ర వ్యాపారులు. భారతీయ సంప్రదాయానికి చిహ్నమైన చీర మీద.. సరిహద్దుల్లో పహరా కాస్తూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించే సైనికుల ఫోటోలను చిత్రించారు. ప్రస్తుతం ఈ చీరకు విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకోవడమే కాక మాకు కూడా కావాలంటూ క్యూ కడుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటున్నారు చీరను తయారు చేసిన వ్యాపారి. సూరత్కు చెందిన అన్నపూర్ణ బట్టల మిల్లు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయం గురించి మిల్లు యజమాని మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మనం కోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాలకు చిహ్నంగా జవాన్ల ఫోటోలతో ఈ చీరలను రూపొందించాము. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందిస్తాము. ఈ చీరల మీద మన సైన్యం శక్తిని, యుద్ధ ట్యాంకులను, తేజోస్ విమానాల బొమ్మలను ముద్రించామ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ చీరలకు ఫుల్ డిమాండ్ ఉందని.. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మిల్లు యజమాని. ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
ప్రేమికుల రోజున.. వెరైటీ పెళ్లి ప్రమాణం
గాంధీనగర్ : గురువారం ప్రేమికుల రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ పక్క.. జంటగా కనిపిస్తే చాలు పెళ్లి చేస్తామని బెదిరించే గుంపులు మరోపక్క. ప్రేమికుల రోజున సర్వసాధరణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ వీటన్నింటికి భిన్నమైన ప్రదర్శన ఒకటి సూరత్లో జరగనుంది. దాదాపు 10 వేల మంది విద్యార్థుల చేత ‘పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోము’ అని ప్రమాణం చేయించే కార్యక్రమం ఒకటి జరగనుంది. హస్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సంస్థ సభ్యుడొకరు దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదు. కానీ కొందరు పెళ్లైన ఆర్నెల్లలోపే విడాకుల తీసుకుంటున్నారు. లేదంటే ఎదిరించి చేసుకున్నందుకు పెద్దలే వారి మీద దాడి చేయడం వంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల చేత ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమ’ని ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. 12 పాఠశాలల నుంచి దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు’ అని తెలిపారు. -
‘బదిలీ అడిగితే కోరిక తీర్చమన్నారు’
సూరత్ : కోరుకున్న చోటుకి బదిలీ చేయమంటే ఉన్నతాధికారులు కోరికలు తీర్చమంటున్నారని గుజరాత్ మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 మంది మహిళా హోం గార్డులు శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులపై సూరత్ పోలీస్ కమిషనర్ సతీష్ శర్మకు ఫిర్యాదు చేశారు. కొద్దీ రోజులుగా పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని నాలుగు పేజీలతో కూడిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అధికారులు బదిలీ చేయాలంటే డబ్బులివ్వాలని, లేకపోతే వారి కోరిక తీర్చాలంటున్నారని ఆరోపించారు. ఓ అధికారైతే యూనిఫామ్ సరిచేసుకోవాలని తాకరని చోట చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును డీసీపీకి పంపించామని, జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించిందని నగర కమిషనర్ సతీష్ శర్మ మీడియాకు తెలిపారు. హోమ్గార్డులు పోలీస్ శాఖలోకి రారని, దీంతో పోలీసులు అంతర్గత కమిటీ కాకుండా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతుందన్నారు. అలాగే ఈ ఫిర్యాదును హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా పంపించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే ఆ శాఖ మహిళా ఉద్యోగులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
గిన్నిస్ బుక్ రికార్డులో ఉంగరం
-
6,690 వజ్రాల ‘గిన్నిస్’ ఉంగరం
సూరత్ : గుజరాత్లోని సూరత్ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్ చేశారు. ఈ లోటస్ డైమండ్ రింగ్ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్ను రూపొందిచమన్నారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక ఈ రింగ్పై నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్ బుక్ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘వావ్ అమెజింగ్ వర్క్’ అని ప్రశంసలు కురిపించాడు. -
బ్యూటీ విత్ బ్రెయిన్ లేడీ డాన్
-
సూరత్ లేడిడాన్ అస్మిత అరెస్ట్
-
ఈ అందమైన అమ్మాయి పెద్ద ఆటం బాంబు
సూరత్ : చూడటానికి చూడముచ్చటగా.. తాకితే కందిపోయే శరీర సౌదర్యంతో, కళ్లు తిప్పుకోనివ్వని అందాన్ని కలిగి ఉంటుంది ఈ అమ్మాయి. ఆమె ముఖంలో అయితే ఇట్టే అమాయకత్వం ఉట్టిపడుతుంది. కానీ ఈ అమ్మాయి గురించి వింటే మీరు మాత్రం షాకవ్వాల్సిందే. సూరత్లో క్రైమ్ల మీద క్రైమ్లు చేసి ‘లేడీ డాన్’ నగరాన్నే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. 20ఏళ్లకే ఈమె నగర పోలీసులకు చుక్కలు చూపించింది. ఈమె పేరు అస్మితా. ఇటీవలే ఈ అమ్మాయిను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దుకాణంలో నగదును అపహరించుకుని పోతున్న అస్మితను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని, జైలు ఊసలు లెక్క పెట్టేలా చేశారు. పాన్ సెల్లర్ వద్దకు వచ్చి, బెదిరించిన ఈ అమ్మాయి అతని షాపులో నగదును తీసుకుని ఉడాయించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ మే 21న ఉదయం ఆ సంఘటన చోటు చేసుకుంది. చూడటానికి ఇంత బాగున్నా ఈ అమ్మాయి ఈ పనులు చేయడం ఏమిటా..? ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పోలీసులకే ఈ లేడీ పెద్ద తలనొప్పిగా మారిందంటే అర్థం చేసుకోండి ఈ లేడీ డాన్ హవా ఎలా సాగుతుందో. ఈమెకు వ్యతిరేకంగా స్థానికులైతే కనీసం నోరు కూడా మెదపరట. ఎట్టకేలకు ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చాలా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
మదర్సాలో 70 శాతం విద్యార్థులు హిందువులే
-
మదర్సాలో 70శాతం హిందూ విద్యార్థులు
సూరత్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో గల మదర్సా ఇస్లామియా హైస్కూల్లో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు హిందువులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ మదర్సాలో ఎల్కేజీ నుంచి ఫ్లస్టూ వరకు తరగతులు ఉన్నాయి. మిగతా ముప్ఫై శాతం విద్యార్థులు ముస్లింలు. సూరత్లోని మోతవరచ్చలో గల ఈ హైస్కూల్లో మత భేదాలు ఉండవు. దాదాపు వందేళ్ల నుంచి ఇదే పద్దతి కొనసాగుతుందని పాఠశాల ప్రిన్స్పల్ గులామ్ హుస్సేన్ తెలిపారు. ఇక్కడ వివిధ కుల, మతాల పిల్లలు చదువుకోవడానికి వస్తారని స్థానికులే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వారు కూడా ఇక్కడ చదువుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులతో సమానంగా మానవత్వం గురించి విద్యార్థులకు బోధిస్తామని తెలిపారు. -
సూరత్ అత్యాచార కేసులో కీలక మలుపు
-
‘సూరత్’ కేసులో సాయం చేయండి
అహ్మదాబాద్ : మైనర్ బాలికపై పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పటిదాకా చిన్న సాక్ష్యాన్ని కూడా సూరత్ పోలీసులు చేధించలేకపోయారు. అసలు బాధిత బాలిక వివరాలు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు తీరుపై విమర్శలు వినిపిస్తుండగా.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామనే సంకేతాలను సూరత్ పోలీసులు అందించారు. బాధిత బాలిక మృతదేహం ఫోటోలను సూరత్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బ్లూ టీషర్ట్ ధరించి ఉన్న ఆ బాలిక వయసు సుమారు 9-11 ఏళ్ల లోపు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ బాలిక గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని.. తగిన పారితోషకం కూడా అందిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా ఈ కేసును చేధించేందుకు కృషి చేస్తున్నాం. ఘటనాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రతీ ఇంటిలో వాకబు చేశాం. ఈ కేసులో మిగతా రాష్ట్రాల సాయం కూడా తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే పిల్లల అదృశ్యాలకు సంబంధించిన 8 వేల కేసులను పరిశీలించాం’ అని సూరత్ నగర కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఏప్రిల్ 6వ తేదీన భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో అతి కిరాతకంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హింసించి చంపినట్లు తేలింది. బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నాయని సూరత్ సివిల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. -
సూరత్ హత్యాచారం.. ఫేక్ న్యూస్పై అరెస్టులు
అహ్మదాబాద్ : కథువా ఘటనపై చర్చ కొనసాగుతున్న వేళ గుజరాత్లో తొమ్మిదేళ్ల బాలికపై దాష్టీకానికి పాల్పడి .. ఆపై కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉంటే కేసుపై కొందరు నకిలీ వార్తలను వ్యాపింపజేయగా.. పోలీసులు ఇద్దరినీ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఓ బాలిక మృత దేహాన్ని చూపిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి చెందిన వ్యక్తి ఈ పైశాచిక ఘటనకు కారణమంటూ ఫేస్ బుక్, వాట్సాప్లలో కొందరు కథనాలను విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ‘ఈ హత్యాచార ఘటనలో విచారణ కొనసాగుతోంది. బాధిత బాలికను ఇంకా గుర్తించే పనిలో ఉన్నాం. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా నకిలీ వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తప్పవు’ సూరత్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. సుమారు 9 నుంచి 11 ఏళ్ల వయసున్న బాలిక మృత దేహాన్ని భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం వద్ద ఏప్రిల్ 6న పోలీసులు గుర్తించారు. ఐదు గంటల పోస్ట్ మార్టంలో అతి కిరాతకంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హింసించి చంపినట్లు నివేదికలో తేలింది. బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నాయని.. పూర్తి నివేదిక కోసం ఫోరెన్సిక్ నివేదికను ఆశ్రయించామని సూరత్ సివిల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాలిక తరపు బంధువులెవరూ ఇంత వరకు తమను ఆశ్రయించలేదని సూరత్ పోలీసులు చెబుతున్నారు. (నా రక్తం మరిగిపోతోంది) -
నా రక్తం మరిగిపోతోంది
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు చర్చనీయాంశమైన వేళ.. నేడు సూరత్లో వెలుగు చూసిన మరో దాష్టీకం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. 9 ఏళ్ల చిన్నారి ఒంటిపై 86 గాయాలు.. చెప్పుకోలేని రీతిలో హింసించి.. ఆ పసికందును చెరిచి మృగవాంఛ తీర్చుకుని కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘శిక్షించటం అనేది మంచి పద్ధతి కాదన్నది నా ఉద్దేశం. కానీ, ఇలాంటి ఘోరాలు వినప్పుడు.. చిన్న చిన్న పిల్లలపై అకృత్యాలు జరిగాయని తెలిసినప్పుడు.. సందేహం వద్దు.. ఆ దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలనే నేను కోరుకుటా. ఘటన(సూరత్ హత్యాచార ఘటన) గురించి తెలిసిన తర్వాత మౌనంగా ఉండటానికి ఎంతో ప్రయత్నించా. కానీ, నా దేశంలో జరుగుతున్న వరుస ఘటనలు నా రక్తం మరిగిపోయేలా చేస్తున్నాయి’ అంటూ ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. సాధారణంగా సౌమ్యుడన్న పేరున్న 62 ఏళ్ల ఈ పెద్దాయన.. భావోద్వేగంతో చేసిన ఈ ట్వీట్కు మద్ధతుగా పలువురు రీ-ట్వీట్లు చేస్తున్నారు. The job of executioner is not an aspirational job. But for the execution of brutal rapists & murderers of young girls I would volunteer unhesitatingly. I work hard to stay calm, but my blood boils over to see this happen in our country.. https://t.co/1VXD5QfYKA — anand mahindra (@anandmahindra) 15 April 2018 -
యువతి రౌడీయిజం
సూరత్ : ఆ అమ్మాయి వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి పెట్టే ఫోటోలు గనుక చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. అంత కోమలంగా ఉంటుంది. కానీ, కొడవలి పట్టి రౌడీయిజం చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. సూరత్కు చెందిన అస్మితా గోహిల్ స్థానికంగా ఓ కాలేజీలో చదువుతోంది. ఆమె స్నేహితుడు సంజయ్ అలియాస్ భూరో ఓ పెద్ద రౌడీ షీటర్. అతనితో స్నేహం మానుకోవాలని ఇంట్లోవాళ్లు వారించగా.. వాళ్లను కాదనుకుని బాయ్ ఫ్రెండ్తో వచ్చి సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే హోలీ పండగ రోజు భూరో ఓ వ్యక్తితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అతను పారిపోతుండగా.. భూరోతోపాటు అస్మితా కూడా అతని వెంటపడ్డారు. ఎట్టకేలకు వరచ్ఛా ప్రాంతంలో అతన్ని పట్టుకుని కత్తితో ఖతం చేస్తామంటూ బెదిరింపులు దిగారు. భూరో ఓ చిన్న కత్తితో అతనికి వార్నింగ్ ఇస్తుంటే.. అస్మితా ఏకంగా కొడవలి పట్టుకుని గిరగిరా తిప్పుతూ సదరు వ్యక్తిపైకి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు తాగి ఉన్నట్లు తెలుస్తోంది. ధైర్యం చేసి కొందరు వారిని అడ్డుకోవాలని చూస్తే.. ఆమె వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. విషయం తమ దాకా చేరటంతో పోలీసులు ఇప్పుడు భూరో, అస్మితల కోసం గాలింపు చేపట్టారు. -
పారిపోయి పరువు పోగొట్టుకోలేక...
సూరత్ : పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యాపారవేత్త... ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి తాముంటున్న అపార్ట్మెంట్ 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మీడియాలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్యా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సర్థనా ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారవేత్త విజయ్ వాఘాసియా(35).. భార్య రేఖ(30), కొడుకు వీర్(4)లతో యోగి చౌక్లోని మేజిస్టిక్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. గత కొంత కాలంగా ఆయన వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పులు చేశారు. అయినప్పటికీ కోలుకోకపోవటంతో వాటిని తీర్చే దారి తెలీక దారుణానికి తెగబడ్డారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన విజయ్ అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న గౌరవ్ అనే స్నేహితుడితో కాసేపు మాట్లాడారు. ఆపై మంచి నీళ్లు మరిచిపోయానంటూ మళ్లీ పైకి వెళ్లిన కాసేపటికే భార్య, పిల్లలతో దూకినట్లు తెలుస్తోంది. గౌరవ్ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్ జేబులో ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా కుటుంబ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. అప్పులు తీర్చేందుకు నా ముందు దారులు లేవు. ఆర్థిక సమస్యలతోనే ఇలా చేస్తున్నాం. నా తదనంతరం వ్యాపార బాధ్యతలు నా సోదరుడివే’ అని విజయ్ ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పారిపోలేక.. పరువు పోగొట్టుకోలేక... ప్రాణాలే విడిచారంటూ స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
ఆ దేవుడు నా మాట విన్నాడు : నమిత
తూర్పు పడమరలు ఆపోజిట్. ఈ తూర్పూ పడమరలు అఫెక్షనేట్! సూరత్ అమ్మాయి నమిత.. శ్రీకాకుళం అబ్బాయి వీర.. ఇరు దిక్కుల తమ బాంధవ్యానికినలుదిక్కుల నుంచి ఆశీర్వచనాలు కోరుకుంటున్నారు. ‘నేను సినిమా హీరోయిన్ని.. పెళ్లవుతుందా?’ అని ఆలోచించిన రోజులేమైనా? చాలా ఆలోచించేదాన్ని. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉండేది. మంచి లైఫ్ పార్టనర్ రావాలని కోరుకునేదాన్ని. మాకు బోలెడంత మంది పిల్లలు ఉండాలనుకునే దాన్ని. ఓ అమ్మాయికి ఉండే ‘జెన్యూన్’ ఫీలింగ్స్ ఇవి. నా ఆలోచనల్లో నిజాయితీ ఉంది కాబట్టే ‘వీర’ లాంటి జెన్యూన్ పర్సన్ని భర్తగా పొందే అర్హత నాకు ఉందనిపించింది. బోలెడంత మంది పిల్లలు కావాలనే కోరిక ఉందన్నారు. మరి మమ్మీగా ఎప్పుడు ప్రమోషన్? ఆల్రెడీ నా అన్న కూతురికి నేను అమ్మనే. ఇంట్లో ఉన్న పెట్స్కి మమ్మీనే. అయితే ఫిజికల్గా బర్త్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకని కొంచెం టైమ్ తీసుకోవాలనుకుంటున్నాను. ‘మిస్’ నమిత నుంచి ‘మిసెస్’ నమిత అయ్యాక జీవితం ఎలా ఉంది? చాలా కలర్ఫుల్గా, పీస్ఫుల్గా ఉంది. ఒక మంచి స్పేస్లో ఉన్నాననే భరోసా ఏర్పడింది. వీర మీకు మంచి జీవిత భాగస్వామి అవుతారని మీకు ఎప్పుడు అనిపించింది? ఒక అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు ‘ఇతను మంచి భర్త మాత్రమే కాదు.. మంచి తండ్రి కూడా అవుతాడు’ అనే ఫీలింగ్ కలిగిందంటే.. అతను మంచి జీవిత భాగస్వామి అవుతాడని నా నమ్మకం. వీరతో పరిచయం నాకా ఫీలింగ్ని కలిగించింది. ఏదైనా స్ట్రయిట్ ఫ్రమ్ హార్ట్ మాట్లాడతాడు. డ్రామా యాడ్ చేయడు. చాలా జెన్యూన్ పర్సన్. తన సమక్షంలో ఉన్నప్పుడు ఓ ‘ప్రొటెక్టివ్’ ఫీల్ కలుగుతుంది. ఏ భయమూ లేకుండా మిగతా జీవితాన్ని గడిపేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మా ఇద్దరిదీ ‘సోల్ కనెక్షన్’ అనిపించింది. అందుకే తను ప్రపోజ్ చేయగానే పెళ్లికి ఒప్పుకున్నాను. శ్రీకాకుళం అబ్బాయితో సూరత్ అమ్మాయి పెళ్లి! ఇంట్లోవాళ్లు ఏమీ అనలేదా? జనరల్గా కొంతమంది పేరెంట్స్ సినిమాల్లోకి వెళతానంటే ఒప్పుకోరు. కానీ నా పేరెంట్స్ నేనేం చేసినా కాదనలేదు. సినిమాల్లోకి వెళ్తానంటే సపోర్ట్ చేశారు. పెళ్లి గురించి చెప్పినప్పుడూ సపోర్ట్ చేశారు. తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఏడాదికి రెండుసార్లయినా నేను తిరుపతి వెళతాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు బలమైన నమ్మకం. ఆ దేవుడు నా మాటలు వింటాడని నమ్ముతాను. నాకు బెటర్ లైఫ్ ఇస్తాడని నమ్మాను. నిజంగానే అదే జరిగింది. అందుకే ఆ దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వీర కూడా ఓకే అన్నాడు. హీరోయిన్స్ని ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. సమాజం ఇలా ఉన్నప్పుడు వీర మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం ఎలా అనిపించింది? మీరన్నది కరెక్టే. అయితే అందరూ అలా ఉండరు. వీరలాంటి వాళ్లు కూడా ఉంటారనడానికి మా పెళ్లి ఓ ఎగ్జాంపుల్. అయినా చేసే ప్రొఫెషన్ని బట్టి ఎవరినీ జడ్జ్ చేయకూడదు. వీర, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్పుడు చాలా ఆలోచించాం. ఎందుకంటే జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్లం. ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని తను ప్రపోజ్ చేసినప్పుడు నా కల నిజమైంది అనిపించింది. ‘నో’ చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఎందుకంటే పరిచయమైన ఏడాదికి తను నాకు ప్రపోజ్ చేశాడు. అంటే.. నన్ను అర్థం చేసుకున్నాడనే కదా. ప్రేమ అంటే మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించడమే. మీరు బొద్దుగా ఉంటారు కాబట్టి బరువు తగ్గమని వీర సజెస్ట్ చేశారా? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నదానికన్నా ఓ పది కిలోలు తక్కువగా ఉండేదాన్ని. నాకు నోస్ అలర్జీ ఉండేది. ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. పెళ్లికి రెండు నెలల ముందు సీరియస్ అయింది. దాంతో నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. వర్కవుట్స్ చేయడానికి కుదిరేది కాదు. వెయిట్ చాలా పెరిగాను. ‘ఇలా అయిపోతున్నాను’ అంటే ‘ఏం ఫర్వాలేదు. పెళ్లి తర్వాత వర్కవుట్స్ చేసి, తగ్గుదువుగాని. లేకపోయినా ఓకే’ అని వీర అన్నాడు. మ్యారేజ్ అయ్యాక వర్కవుట్స్ మొదలుపెట్టాను. నాలుగు కిలోలు తగ్గాను. హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి కాబట్టి నా అంతట నేనే తగ్గడం మొదలుపెట్టాను. మీకు గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది. ఇకముందు కూడా ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తారా? అసలు సినిమాలు కంటిన్యూ చేస్తారా? సినిమాలు మానేయడం ఎందుకండి? పెళ్లయితే జాబ్ మానేయాలని రూలేం లేదు కదా. అలాగే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా ఏ మార్పూ ఉండదు. వీర నన్ను సినిమాలు మానేయమని చెప్పలేదు. క్యారెక్టర్ గ్లామరస్గా కనిపించాలని డిమాండ్ చేస్తే నో ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీ ‘సూసైడ్ స్క్వాడ్’లో మార్గెట్ రాబీ చేసిన క్యారెక్టర్ని తీసుకుంటే చాలా గ్లామరస్గా ఉంటుంది. సేమ్ టైమ్ పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. మీ అత్తమామల్ని ఏమని పిలుస్తున్నారు.. వీరాగారికి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఉన్నారా? అత్తయ్యగారూ, మామయ్యగారూ అని పిలుస్తున్నాను. వీరాకి ఒక చెల్లెలు ఉంది. తను నాకు ‘ఆడొపచు’.. ఏంటో సరిగ్గా నోరు తిరగడంలేదు. చిన్నమ్మాయి. పాతికేళ్లు కూడా లేవు. వదినా అంటూ నాతో బాగుంటుంది. ‘ఎఐఎడిఎంకె’ పార్టీలో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ, తమిళనాడు రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. మీరేమైనా పార్టీ మారాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఎఐఎడిఎంకేలో ఉన్నాను. భవిష్యత్తులో వేరే పార్టీకి మారతానా.. అనేది ఇప్పుడు చెప్పలేను. తమిళనాడులో రాజకీయాల పరిస్థితి అయోమయంగా ఉంది. చూడాలి. మంచి మార్పు రావాలి. ప్రజలకు మేలు జరగాలి. రజనీకాంత్గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సీఎం అయితే న్యాయం చేస్తారనుకుంటున్నారా? రజనీకాంత్గారు సూపర్ స్టార్. ప్రజల గుండెల్లో బోలెడంత స్థానం సంపాదించుకున్నారు. కానీ, ఆయన రాజకీయాల్లోకి వస్తే న్యాయం చేస్తారా? ఏం చేస్తారు? అనేది ఇప్పుడే చెప్పలేను. జడ్జ్ చేయలేం. ఆడొపచు కాదు.. ఆడపడుచు అంటారు. ఓహ్.. ఆడపడుచు.. ప్రాక్టీస్ చేస్తా. (నవ్వుతూ) మాది ఆత్మబంధం : వీర బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి, నమితకు లవ్ ప్రపోజ్ చేశారట.. ఐడియా బాగుంది! థ్యాంక్స్ అండీ.. 2016 సెప్టెంబర్ 6న మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా నమితకు, నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు నమిత ఆలోచనలు, అభిరుచులు తెలిశాయి. ఇలా ప్రపోజ్ చేస్తే తనకు నచ్చుతుందని గ్రహించాను. బేసిక్గా నేను రైటర్ని. పొయెటిక్గా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా. కోవలమ్ బీచ్ బెస్ట్ అనిపించింది. ఫస్ట్ టైమ్ లవ్ ప్రపోజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత విపరీతమైన గాలి! దాంతో కుదరలేదు. సెకండ్ టైమ్ వర్షం వచ్చింది. ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. థర్డ్ టైమ్ ప్రకృతి సహకరించింది (నవ్వుతూ). పైగా ఆ రోజు ఫుల్ మూన్ డే. పండు వెన్నెల సాక్షిగా నమితకు ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. 2017 నవంబర్లో పెళ్లి చేసుకున్నాం. నమితగారిలో మీకు నచ్చిన విషయాలేంటి? నేనేదైనా ఓపెన్గా మాట్లాడతాను. తనూ అంతే. ఇద్దరి ఆలోచనలూ చాలా క్లియర్గా ఉంటాయి. కొన్ని థాట్స్ కలిశాయి. కలిసి జీవించడానికి ఇది చాలనిపించింది. బేసిక్గా తను చాలా మంచి అమ్మాయి. మీ ఇద్దరూ లవ్లో పడక ముందు వేరేవాళ్లతో లవ్, బ్రేకప్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఓపెన్గా మాట్లాడుకున్నారా? ఓ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆ బ్రేకప్ మీకు నేర్పించిందా? యస్. నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను. విడిపోయాను. నమిత లైఫ్లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ ఉంది. వాటి గురించి మేం మాట్లాడుకున్నాం. గతం గతః అనుకున్నాం. భవిష్యత్తులో కలిసి నడవాలనుకున్నాం. ఓ బ్రేకప్ మంచి లెసన్ అవుతుంది. ఆ లెసన్ ఇప్పటి బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే క్లారిటీ ఇచ్చింది. జనరల్గా గ్లామరస్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలను ఆరాధిస్తారు కానీ ‘మంచి’గా ఆలోచించే మనసు చాలామందికి ఉండదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కూడా... మా ఇంట్లో నా ఇష్టాలను కాదనరు. క్లారిటీతో ఉంటాననే నమ్మకం వాళ్లకు ఉంది. మీరన్నట్లు హీరోయిన్లను అందరూ ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోమంటే ఆ ఆరాధించేవాళ్లే ముందుకు రారు. ‘వాళ్లు అలా అట.. ఇలా అట’ అని ఊహించుకుంటారు. అబ్బాయిల గురించి కూడా అలాగే అనుకుంటారు. కానీ నేనేంటో నమితకు తెలుసు. తనేంటో నాకు తెలుసు. మాది ‘ఆత్మబంధం’. మీరు శ్రీకాకుళం (ఈస్ట్) అబ్బాయి. నమిత వెస్ట్ (సూరత్) అమ్మాయి. ఉంటున్నదేమో చెన్నైలో. మరి.. ఒకరి సంప్రదాయాలకు ఒకరు అలవాటయ్యారా? నమిత ఇప్పుడు సౌత్ అమ్మాయి. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది కాబట్టి, ఇక్కడి సంప్రదాయాలు బాగా తెలుసు. నాకు వాళ్ల ట్రెడిషన్స్ తెలియదు. వాళ్ల సంప్రదాయాలు ఎలా ఉంటాయో పెళ్లప్పుడు కొంచెం తెలిసింది. ఈస్ట్, వెస్ట్.. అండర్ వన్ రూఫ్. మనసులు కలిస్తే చాలండి. భాష, ప్రాంతం అడ్డుకావు. కొత్త అల్లుణ్ణి ఇంటికి పిలుస్తుంటారు అత్తింటివాళ్లు. మిమ్మల్ని పిలిచారా? సూరత్ రమ్మని మా అత్తయ్య, మావయ్య పిలిచారు. కానీ మేం వెళ్లలేదు. బేసిక్గా నేనలా ఫార్మాలిటీస్ ఎక్స్పెక్ట్ చేసే అల్లుణ్ణి కాదు (నవ్వుతూ). చెన్నైలో చాలా పనులు ఉండటంవల్ల ఇంకోసారి వెళ్దామనుకున్నాం. మీ అయిష్టాన్ని నమితగారి కోసం ఇష్టంగా మార్చుకున్నది ఏదైనా? నమితకు పిజా, చాక్లెట్స్ ఇష్టం. నాకు అవంటే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఇష్టంగా మార్చుకున్నాను. చాక్లెట్స్ తింటున్నాను. మీ బ్యాగ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు, అంకుల్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండేవారు. నేను ఆర్టిస్ట్ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని. ఇప్పుడు నేను, నమిత కలిసి ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. మంచి కథలతో వచ్చే కొత్త డైరెక్టర్స్కి చాన్స్ ఇవ్వాలనుకుం టున్నాం. అలాగే, డబ్బుండి కూడా సినిమాలు ఎలా తీయాలో తెలియని ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. వాళ్లు ఏ మాత్రం నష్టపోని విధంగా ఓ కాన్సెప్ట్ డిజైన్ చేశాం. సో.. నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేద్దామనుకుం టున్నాం. నమిత అండ్ వీరని ట్రస్ట్ చేస్తే చాలు. టాలెంట్ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎలా కలవాలో తెలియకపోతే veera.official∙అనేది నా ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్. దాని ద్వారా సంప్రదించవచ్చు. నమితగారితో కలిసి మీరు యాక్ట్ చేశారా? మేమిద్దరం కలిసి ‘మియా’ అనే మలయాళ సినిమాలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశాం. నేను విడిగా తమిళ్, మలయాళ సినిమాల్లో నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు, నమితగారు కలిసి నటిస్తారా? తప్పకుండా చేయాలని ఉంది. ఓ కాన్సెప్ట్ తయారు చేయించాం. (భర్త వీరతో నమిత ) ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
కాంగ్రెస్కు పంగ నామాలు పెట్టారు..
సాక్షి, న్యూఢిల్లీ : వస్త్ర ప్రపంచానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన గుజరాత్లోని సూరత్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు, జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసిన సూరత్లో 16 సీట్లకు 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఎస్టీలకు కేటాయించడం వల్ల మాండ్వీ ఒక్క సీటును మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకో కలిగింది. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దాదాపు రెండు నెలలపాటు వస్త్రాల మిల్లులు, షాపులు మూతపడ్డాయి. లక్షలాది మంది యువకులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ బిల్లుతో తాము నష్టపోతున్నామంటూ సూరత్లో 65 వేల మంది వస్త్రవ్యాపారులు రోడ్డెక్కారు. వారిలో 90 శాతం మంది పాటిదార్లే ఉన్నారు. గతంలో తమకూ రిజర్వేషన్లు కావాలంటే భారీ ఉద్యమాన్ని నడిపిన ఈ పాటిదార్లు ఇప్పుడు హార్దిక్ పటేల్ నాయకత్వాన ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హార్దిక్ పటేల్ పిలుపుకు కాంగ్రెస్కు ఓటేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి అడుగడుగున పాటిదార్లు అడ్డంకులు సృష్టించారు. డిసెంబర్ 3వ తేదీన హార్దిక్ పటేల్ నిర్వహించిన బైక్ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే చాలు, వారిని అవహేళన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్టీ స్థానంతో పాటు వరచ్చా, కటార్గామ్, కామ్రెజ్, సూరత్ నార్త్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ పార్టీలే కాకుండా రాజకీయ విశ్లేషకులు భావించాయి. కొన్ని పోల్ సర్వేలు కూడా అలాగే అంచనా వేశాయి. మరి ఎందుకు కాంగ్రెస్ను కాదని ఓటర్లు, అంటే పాటిదార్లు బీజేపీకి పట్టంకట్టారు. ‘మేం చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు’ అని పాటిదార్ల అనామత్ ఆందోళన్ సమితి సూరత్ కన్వీనర్ అల్పేష్ కత్రియా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పట్ల ఇక్కడి ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని, అయినప్పటికీ బీజేపీ విజయానికి కారణాలేమిటో తమకు అంతుచిక్కడం లేదని ఆయన చెప్పారు. ‘సూరత్లో ఎన్నికల ఫలితాలు అనూహ్యం. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను ప్రచారానికి కూడా అనుమతించలేదు. మరి చివరి నిమిషంలో వారినే ఎందుకు గెలిపించారో అర్థం కావడం లేదు’ అని సూరత్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్లనే బీజేపీ విజయం సాధించిందని పాటిదార్ల యువ నాయకుడు హార్దిక్ పటేల్ ఇంతకుముందే ఆరోపించిన విషయం తెల్సిందే. సూరత్ ఫలితాలను చూసి తాను కూడా ఆశ్చర్యపడ్డానని అహ్మదాబాద్కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగైదు సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుందని భావించానని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. పాటిదార్లు తమ నరనరాన పేరుకుపోయిన హిందూత్వ ఏజెండాను వదులుకోలేక పోయారని, అందుకనే వారు ఎంత కోపం, వ్యతిరేకత ఉన్నా బీజేపీకే ఓటేసి ఉంటారని ఆయన అన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను పాటిదార్లే దెబ్బతీశారన్న మాట. -
సూరత్ మోడల్
వర్షం కురిస్తే నగరం వెన్నులో వణుకు పుడుతుంది. ముంపుతో జనజీవనం అల్లాడుతుంది. వరదతో కనీసం పది రోజుల పాటు నివాసాలకు జల దిగ్భందం తప్పని పరిస్థితి. ఇలాంటి కాలనీ సిటీలో భండారీ లే అవుట్ ఒక్కటే ఉండేది. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన వర్షాలకు గ్రేటర్ నలుదిక్కులా ముంపు ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. నాచారం, ఉప్పల్ దీప్తిశ్రీనగర్, రామంతాపూర్ రవీంద్రకాలనీ, కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీలు నీట మునిగి చెరువులను తలపించాయి. ఇలాంటి ముంపు ముప్పును తప్పించేందుకు సిటీకి సూరత్ తరహా మాస్టర్ ప్లాన్ అవసరమంటున్నారు నిపుణులు. ఎన్నోసార్లు వరద దెబ్బలు తిన్న సూరత్.. పాఠాలు నేర్చుకుని తీరైన ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ అమలు చేసిన విధానాలు మనకూ అమలు చేయాలంటున్నారు. సాక్షి,సిటీబ్యూరో: భారీ వర్షం కురిసిన ప్రతిసారీ గ్రేటర్ పరిధిలోని నదీంకాలనీ.. భండారీ లేఅవుట్.. నాచారం.. ఉప్పల్ దీప్తిశ్రీనగర్.. రామంతాపూర్ రవీంద్రకాలనీ.. హబ్సీగూడ తదితర ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలు నీట మునిగుతున్నాయి. ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ సమస్యలకు సూరత్ నగరంలో అమలు చేస్తోన్న మాస్టర్ప్లాన్ చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. గత వందేళ్లుగా సూరత్ 25 సార్లు వరదల తాకికిడి గురైంది. కానీ ఇప్పుడు తీరైన పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులతో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనేపథ్యంలో సూరత్లో అమలవుతోన్న పట్టన ప్రణాళిక, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న నష్ట నివారణ చర్యలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ నగరాన్ని లండన్లోని ప్రతిష్టాత్మక రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సైతం ఆదర్శ నగరంగా కొనియాడడం విశేషం. ఈ నేపథ్యంలో సూరత్లో అమలవుతోన్న తీరైన పట్టణ ప్రణాళిక, ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ అంశాల్లో సూరత్ ఆదర్శం.. ⇒ తరచూ వరద తాకిడికి గురవుతోన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను తొలుత గుర్తించి ప్రత్యేకంగా మ్యాపింగ్ చేశారు. ⇒ ప్రధానంగా నగరాన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న సెస్మిక్జోన్, ముంపు ప్రాంతాలు, వరద తాకిడి ఉండే ప్రాంతాలుగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి వేర్వేరుగా అనుమతులు జారీ చేస్తున్నారు. ఏ ప్రాంత పరిస్థితిని బట్టి ఆ ప్రాంతానికే వర్తించేలా నిబంధనలు రూపొందించారు. ⇒ ఈ ప్రణాళిక అమలుకు వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఓ ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించారు. ⇒ ముంపు ప్రాంతాలు, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో నూతనంగా భవన నిర్మాణ అనుమతుల జారీని నిలిపివేశారు. ⇒ భవన నిర్మాణ అనుమతులను కట్టుదిట్టం చేశారు. సెల్లార్లను ఖాళీగా ఉంచడం, పార్కింగ్కు మాత్రమే కేటాయించేలా చూస్తున్నారు. ⇒ ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో ఉన్న భవనాలను ఎలివేటెడ్ నిర్మాణాలుగా మార్చారు. అంటే కింది అంతస్తును పార్కింగ్కు వదిలివేసి.. మొదటి అంతస్తు.. ఆపైన మాత్రమే నివాసాలుండేలా చర్యలు తీసుకున్నారు. ⇒ భారీ మురుగునీటి పైపులైన్లు, నాలాలు, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇలా సుమారు 50 వేల భవనాలను తొలగించినట్లు అంచనా. ⇒ ముంపు ప్రాంతాల్లో స్థానికులకు ఆపదవచ్చిన ప్రతీసారీ ఆదుకునేందుకు, తలదాచుకునేందుకు ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. ⇒ భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో ప్రస్తుత దుస్థితి ఇదీ.. ⇒ మహానగరంలో 1500 కి.మీ. మార్గంలో విస్తరించిన నాలాలపై సుమారు పదివేల అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయి. ⇒ నాలాల ప్రక్షాళన, నిడివి పెంచడం, వరద నీటి కాల్వల నిర్మాణాలకు సంబంధించి కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల అమలుకు రూ.12 వేల కోట్ల నిధులు అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న కారణంగా బల్దియా ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. ⇒ వరద, ముంపు సమస్యలను ఎదుర్కోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టే విషయంలో ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. ⇒ ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని నివాసాలు చాలావరకు చెరువుల ఎఫ్టీఎల్ ప్రాంతాల్లోనే విస్తరించాయి. ⇒ గ్రేటర్లో ప్రస్తుతం ముంపు, లోతట్టు, వదర ప్రభావిత ప్రాంతాల్లోనూ 30 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా నిబంధనలు లేవు. ⇒ భవన నిర్మాణ అనుమతులను తక్షణం జారీచేసే విషయంలో అవినీతి, బంధుప్రీతి, రాజకీయ ఒత్తిడులు అధికంగా పనిచేస్తున్నాయి. ⇒ వరద ప్రభావిత ప్రాంతాల్లో భవనాలను నిర్మించే సమయంలో వాటిని తనిఖీ చేసేందుకు జీహెచ్ఎంసీ వద్ద నిపుణులు, ఆయా నిర్మాణాలను అడ్డుకునే సిబ్బంది కరువయ్యారు. ⇒ నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో రాజకీయ ఒత్తిడులు, కోర్టు కేసులు ప్రతిబంధకంగా మారాయి. -
సూరత్లో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు
-
అప్పులు తీర్చేందుకు సొంతంగా నోట్ల ముద్రణ!
గుజరాత్లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు సూరత్: రవీగాంధీ నిన్నమొన్నటి వరకు విదేశీ విద్యాసేవల కన్సల్టెన్సీని నడిపేవాడు. ఈ కన్సల్టెన్సీని బాగా నడిపేందుకు రూ. 70 లక్షల వరకు అప్పులు తెచ్చాడు. అయితే, కన్సల్టెన్సీలో భారీగా నష్టాలు రావడంతో అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు మీద పడటంతో వాటిని చెల్లించేందుకు ఓ పథకం వేశాడు. అదే సొంతంగా నోట్లు ముద్రించడం. నకిలీ నోట్లను తానే ముద్రించి.. వాటిని మార్కెట్లో చెలామణి చేయడం ద్వారా అప్పులు తీర్చాలనుకున్నాడు. లక్ష రూపాయల అసలు కరెన్సీ నోట్లకు రూ. 3లక్షల నకిలీ నోట్లు ఇచ్చే పథకంతో అతను తన అనుచరులతో మార్కెట్లోకి దిగాడు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో అతని బండారం బట్టబయలు అయింది. గుజరాత్లోని సూరత్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. వారి వద్ద నుంచి రూ. 40.73 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సుత్రధారి అయిన రవీగాంధీ (30)తోపాటు అతని అనుచరులు అజయ్ పటేల్, బాబులాల్ అలియాస్ బాబ్లూ మహాదేవ్ వాంఖడే, వాసులను అరెస్టు చేశారు. విదేశాల్లో చదువుకునేవారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన రవీగాంధీ.. నష్టాలు వచ్చి పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో..వాటిని తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముఠాకు తెరతీశాడని పోలీసులు తెలిపారు. -
కదులుతున్న రైలులో మహిళా ఎన్ఆర్ఐ..
సూరత్: గుజరాత్లో కదులుతున్న రైలులో ఓ ఎన్ఆర్ఐ మహిళ నిలువు దోపిడీకి గురైంది. ఆనంద్, నడియాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహళ సూరత్ నుంచి సురేందర్నగర్ వస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమెను అటకాయించి రూ 13.17 లక్షల విలువైన నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ పెనుగులాటలో స్వల్పంగా గాయపడ్డ మహిళను సూరత్లోని న్యూ సివిల్ ఆస్పత్రికి తరలించారు. లండన్లో నివసిస్తున్న వీణా దినేష్ దీపాలా ఓ వివాహానికి హాజరయ్యేందుకు జులై 17న భారత్ వచ్చారు. నగరంలోని సోదరి వద్ద ఉంటూ సురేందర్నగర్లో వివాహ కార్యక్రమానికి సోదరితో కలిసి వెళ్లారు. జామ్నగర్ -తిరునల్వేలి ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు నడియాద్ స్టేషన్ చేరుకున్న కొద్దిసేపటికి ఇద్దరు దుండగులు కోచ్లో ప్రవేశించి దీపాలాను కత్తులతో బెదిరించి ఆమె పర్సును బలవంతంగా లాక్కున్నారు. తర్వాతి స్టేషన్కు రైలు చేరుకునే సమయంలో దుండగులు పరారయ్యారు. పర్సులో ఇండియన్ కరెన్సీతో పాటు పౌండ్లు, ఆభరణాలు ఉన్నాయని బాధితురాలు పేర్కొన్నారు.చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత వారు సరిగ్గా స్పందించలేదని ఆమె చెప్పారు. -
బైక్లో పెట్రోల్ పోస్తుండగా చెలరేగిన మంటలు
-
సూరత్లో కరెన్సీ నోట్ల వర్షం
-
సూరత్లో మరో నల్లకుబేరుడి బాగోతం
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది. ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
కోట్లకు కోట్లు పట్టుబడుతున్న కొత్త కరెన్సీ
కొత్త నోట్ల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద రాత్రింబవళ్లు వేచిచూస్తున్న సాధారణ ప్రజానీకానికేమో నగదు దొరకడం లేదు గానీ.. కొంతమంది దగ్గరైతే ఏకంగా కోట్లకు కోట్లు కొత్త కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. పాత నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలతో కొత్త కరెన్సీ నోట్ల జారీలో పలు అక్రమాలు జరిగినట్టు సీబీఐ విచారణ, ఐటీ తనిఖీల్లో వెల్లడవుతోంది. శుక్రవారం చెన్నైలో జరిగిన ఐటీ రైడ్స్లో పాత కరెన్సీ నోట్లు రూ.96.89 కోట్లు పట్టుబడగా.. కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు రూ.9.63 కోట్లు బయటపడ్డాయి. ఈ నోట్లను ఆర్థికమంత్రిత్వ శాఖ రికవరీ చేసుకుంది. చెన్నైలోనే నిన్న జరిగిన ఐటీ దాడుల్లో రూ.36.29 కోట్ల విలువైన సుమారు 127 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బంగారంతో పాటు రూ.70 కోట్ల కొత్త రూ.2వేల నోట్లను ఆర్థికమంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకుంది. చెన్నై నగరంలో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో నిన్న ఐటీ దాడులు నిర్వహించింది. వీటిలో ఇంకా నాలుగు ప్రాంతాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు సూరత్లో రూ.76 లక్షల కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. మహారాష్ట్ర రిజిస్ట్రర్డ్ హోండా సిటీ కారులో కొత్త రూ.2000నోట్లు 3,800 నోట్లను పట్టుకెళ్తుండగా పోలీసులు అడ్డగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఇటు కర్ణాటకలోనూ ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. హుబ్లీలో ఉన్న హ్యాండ్లూమ్ సెంటర్ అండ్ జువెల్లరీ స్టోర్లో ఐటీ దాడి చేసింది. -
ప్రాథమిక సదుపాయాలే మహాభాగ్యం
అవలోకనం గుజరాతీలు బుల్లెట్ ట్రైన్ కావాలని కోరడం లేదు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండే, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు కావాలి. ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసుగెత్తించే నాయకత్వమే వారికి అవసరం. అంతేగానీ బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. నేనీ కాలమ్ను నా కుటుంబ స్వస్థలమైన సూరత్ నుంచి రాస్తున్నాను. దేశంలోని అతి పురాతనమైన, పెద్ద నగరాలలో సూరత్ ఒకటి. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీల లాగా ఇది బ్రిటిష్ వాళ్లు నిర్మించినది కాదు. భారతీయులే నిర్మించిన ఈ నగరానికి అనేక శతాబ్దాల లిఖిత చరిత్ర ఉంది. ఢిల్లీ సుల్తానుల కాలానికే ఉన్న ఈ నగరం మొగల్ చక్రవర్తులకు ఉప ఖండంలోనే అత్యధిక రాబడి.నిచ్చిన నగరం. జహంగీర్ కాలంలో ప్రముఖ ఓడ రేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా సూరత్ విలసిల్లుతుండగా... 1608లో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఇక్కడ దిగారు. మూడు శతాబ్దాల తర్వాత ఓడ రేవును ముంబైకి తరలించినా ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటంత పెద్దది గానే ఉండేది. లియో టాల్స్టాయ్ ‘సూరత్ కాఫీ హౌస్’ అనే ఓ చిన్న కథను కూడా రాశారు. నేటి సూరత్ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల నగిషీ కేంద్రం. (ప్రపంచ వ్యాప్తంగా లభించే మొత్తం వజ్రాలలో ముడింట రెండు వంతులు సూరత్కు వచ్చి వెళ్లాల్సిందే). ఇంచుమించుగా లండన్ నగరం అంత జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోని అతి పెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. భారత్లోని మరే ఇతర నగరం కన్నా తలసరి ఆదాయం ఇక్కడే ఎక్కువ. అయినా నా స్వస్థలమైన ఈ నగరానికి చేరుకోవడం నాకు దాదాపుగా అసాధ్యమైంది కాబట్టే ఇదంతా చెబుతున్నాను. నేనిప్పుడు నివాసం ఉంటున్న బెంగళూరు నుంచి ఇక్కడికి నేరుగా వచ్చే విమాన సర్వీసు లేదు. ఎందుకంటే సూరత్లో ఉన్న ఒక్క విమానాశ్రాయం పనిచేయడం లేదు. ప్రైవేటు విమాన సంస్థలేవీ సూరత్కు విమాన సర్వీసులను నడపవు. మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే ఒక గేదె సూరత్ విమానాశ్రయంలోకి దూసుకురాగా ఒక విమానం దాన్ని ఢీకొంది. ఆ విమానం జెట్ ఇంజన్ దెబ్బతింది. దీంతో సూరత్-ముంబై-బెంగళూరులను కలుపుతూ ఉన్న ఈ ఒక్క ప్రైవేటు విమాన సర్వీసునూ రద్దు చేశారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచెలో ఉన్న సందుగుండా గేదె లోపలికి చొరబడిందని, గోడను నిర్మించడానికి ఆదేశించామని నరేంద్ర మోదీ కేబినెట్లోని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఏ మాత్రం నమ్మకాన్నీ కలిగించకపోవడంతో ఆ విమాన సంస్థ గత రెండేళ్లుగా సూరత్ సర్వీసు ఊసెత్తడం లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా నేను విమానంలో ముంబై చేరి, అక్కడి నుంచి ఐదు గంటలు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ 300 కిలోమీటర్ల దూరం ముంబై, ఢిల్లీలను కలిపే రహదారి. అది మన దేశంలోనే అత్యుత్తమ రహదారి వ్యవస్థయైన గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో (చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతుంది) భాగం. అయినా ఈ ప్రయా ణానికి ఐదు గంటలు ఎందుకు పట్టినట్టు? ముంబైకు వెలుపల ఫౌంటెన్ హోటల్ అనే ప్రాంతానికి సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ పగలడమో లేదా బీట్లు పడటమో జరిగింది. దీంతో ఆ వంతెనపై నుంచి ఒకేసారి ఇరు వైపులకూ వాహనాలను అనుమతించడం ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఒక వైపు నుంచి వాహనాలను వదిలినప్పడు రెండో వైపున ఉన్నవి తరచుగా గంట సేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది బాగా రద్దీగా ఉండే రహదారి, బహుశా దేశంలోనే అతి రద్దీగా ఉండే మార్గం. కాబట్టి అలా ఆగిపోయే కార్లు, ట్రక్కుల బారు చాలా కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం నుంచి ఉన్నదని డ్రైవర్ను అడిగితే కనీసం నాలుగు నెలలవుతుందని తెలిసింది. అయినా దాన్ని బాగు చేసే పనులు ఇంకా మొదలు కాలేదు. సూరత్ చేరేసరికి క్రితం సారి నేనక్కడికి వచ్చేటప్పటికి... కూలి పోయి 11 మంది ప్రాణాలను బలిగొన్న ఫ్లై ఓవర్ను ఇంకా పునర్నిర్మించలేదు. అది సరికొత్త ఫ్లైఓవర్, దానిలో ఒక భాగం కింద దన్నుగా నిలిపిన పరంజాను తొలగించడంతోనే కుప్పుకూలిపోయింది. రెండేళ్ల నుంచి ఆ చిన్న భాగాన్ని బాగు చేయలేకపోవడంతో సూరత్లోని అతి ముఖ్యమైన రహదారి అత్వాలైన్స్పై ఉన్న ఆ ఫ్లై ఓవర్ నిరుపయోగంగా మారింది. నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఇదైనా మీకు స్ఫురింపజేస్తుంది. భారత దేశపు బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయబోయే మార్గం ఇదే. ఆ అతి వేగపు రైలు వ్యవస్థ అహ్మదాబాద్లో మొదలై సూరత్కు చేరుతుంది. అంటే ఇంచుమించుగా అహ్మదాబాద్-ముంబైలకు మధ్యన ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ కావాలని గుజ రాతీలు కోరడం లేదు. వారికి కావాల్సింది జంతువులు తిరగకుండా ఉండే, సక్రమంగా పనిచేసే విమానాశ్రయాలు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండి, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు వారికి కావాలి. వారికి అవసరమైనది ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసు గెత్తించే నాయకత్వమే తప్ప, బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. లండన్ నగరం అంత ఉండే ఈ చారిత్రక నగరం అభివృద్ధిపట్ల చూపుతున్న ఈ యథాలాప ధోరణి ఆశ్చర్యకరం. అది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (2008లో కుటుంబానికి సగటున రూ. 4.5 లక్షలకుపైగా). బెంగళూరు నుంచి అలాంటి సుప్రసిద్ధ నగరాన్ని చేరుకోవడం అంటే నాకు లండన్కు వెళ్లడం కంటే కూడా కష్టం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
రూ. 500తో పెళ్లి చేసుకున్న జంట
-
నోట్ల రద్దు: రూ. 500తో పెళ్లి చేసుకున్న జంట
సూరత్: పాత పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మరికొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర సొంత రాష్ట్రం గుజరాత్ లో ఓ జంట మాత్రం అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సూరత్ కు చెందిన భరత్ పర్మార్, దక్ష కేవలం 500 రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు. అయితే పాత పెద్ద నోట్లను మోదీ సర్కారు రద్దు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. నోట్ల కష్టాలు మొదలవడంతో వధూవరులు పెద్దలను ఒప్పించి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అతిథులకు ఛాయ్, మంచినీళ్లు మాత్రమే ఇచ్చి ఖర్చు తగ్గించుకున్నారు. ‘నోట్ల కష్టాలు మొదలవ్వడానికి ముందే మా పెళ్లి నిశ్చయమైంది. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో మొదట కంగారు పడ్డాం. ఘనంగా పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. పెళ్లికి వచ్చిన వారికి ఛాయ్, మంచి నీళ్లు మాత్రమే ఇచ్చామ’ని వధూవరులు తెలిపారు. -
సైకిళ్లపై 258 మంది పెళ్లి కొడుకుల సవారీ
సూరత్: దేశ రాజధాని ఢిల్లీ, సూరత్ సహా దేశంలోని పలు ఉత్తర, మధ్య భారత నగరాలను తీవ్ర వాయు కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికిగాను సూరత్లో సోమవారం 258 మంది పెళ్లి కొడుకులు బంధు, మిత్రుల సపరివారం తోడురాగా సైకిళ్లు తొక్కుకుంటూ పెళ్లి మంటపానికి చేరుకున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకులు గుర్రాలపై, కార్లలో ఓ బరాత్లాగా పెళ్లి మంటపానికి చేరుకుంటారు. అందుకు భిన్నంగా ఈకో ఫ్రెండ్లీగా సైకిళ్లపై స్వారీ చేస్తూ వచ్చారు. ఇంతమంది పెళ్లి కుమారులు ఒకరోజు ఒకేచోట కలవడానికి కారణం ‘సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్’ సామూహిక వివాహాలను ఏర్పాటు చేయడమే. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సౌరాష్ట్ర భవన్ నుంచి ప్రారంభమైన పెళ్లి కుమారుల సైకిళ్ల యాత్ర లోక్సమర్పన్ రక్తదాన్ కేంద్ర వద్ద ముగిసింది. దేశంలోని అన్ని స్మార్ట్ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగానే తమ సంస్థ ఈ యాత్రను ఏర్పాటు చేసిందని సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అధ్యక్షులు కంజి బలాల మీడియాతో వ్యాఖ్యానించారు. -
సూరత్లో నటి అనిత హల్ చల్
-
ఆ బీచ్లో ఆత్మలు ఉన్నాయా..?
అనగనగా ఓ బీచ్.. చుట్టూ చిమ్మచీకట్లు.. హోరున శబ్దం చేసే అలలు.. చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక.. చిత్రవిచిత్రంగా వీచే పిల్లగాలులు.. చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినీవినిపించని మాటలు.. అంతలోనే ఒళ్లు గగుర్పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు.. దూరంగా ఎవరితోనో కొట్లాటకు దిగినట్టుగా కుక్కల అరుపులు.. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం.. ఇవి చాలవూ ఓ మనిషి బిక్కచచ్చిపోవడానికి..? గుజరాత్లోని సూరత్కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్ బీచ్ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు పర్యాటకులు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, అవి రాత్రి పూట బీచ్ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయనేది ప్రధానంగా వినిపించే మాట. సాయంత్రం అయితే చాలు. స్థానికులు ఈ బీచ్ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్ వైపు వెళ్తామనగానే అడ్డుపడతారు. అటువైపు వెళ్లొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్లో అంతగా భయపెట్టే అంశమేంటి..? నల్లని ఇసుక.. నిజానికి డ్యూమస్ బీచ్ ఒకటి కాదు.. నాలుగు బీచ్లను కలిపి డ్యూమస్ బీచ్గా పిలుస్తారు. వీటిలో రెండు పర్యాటకులకు బాగా తెలిసినవే. మూడో బీచ్ను కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక, నాలుగో బీచ్లో జనసంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్లోనూ కనిపించని విధంగా ఈ బీచ్లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. దీనికి స్థానికులు చెప్పే వివరణ.. స్మశానం! అవును, ఒకప్పుడు డ్యూమస్ బీచ్లో ఓ హిందూ స్మశానం ఉండేది. వేలాది హిందువులను అక్కడే ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద.. సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందని చెబుతారు స్థానికులు. ఆత్మల సంచారం.. హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించినవారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్ ఒడ్డున తిరిగేవారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందని, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్టుగా చిత్రవిచిత్రంగా అరుస్తాయని గ్రామస్థులు చెబుతారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్ బీచ్.. చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకర రూపాన్ని సంతరించుకుంటుంది. పర్యాటకులు, స్థానికులు భయపడేందుకు ఇదీ ఓ కారణం కావొచ్చు. విచిత్ర ప్రవర్తన.. డ్యూమస్ బీచ్ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి విచిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్కు రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టు, వారితో గొడవ పడుతున్నట్టు కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలదీ ఇదే పరిస్థితి. ఈ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలూ పడతారట ఈ బీచ్లో. ఇవి కాకుండా.. పర్యాటకుల శరీరాలను ఏవో గాలులు తాకుతున్నట్టూ, వారిని ముందుకు వెళ్లవద్దనట్టుగా అడ్డుకుంటున్నట్టూ అనుభూతి కలుగుతుందట. మిస్సింగ్...? స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి, రాత్రి పూట బీచ్ను సందర్శించిన కొందరు పర్యాటకులు ఇప్పటికీ కనిపించకుండా పోయారనే ఓ పుకారు సమీప గ్రామాల్లో వినిపిస్తూ ఉంటుంది. గతంలో కొందరు స్థానికులు కూడా బీచ్కు వెళ్లి తిరిగిరాలేదట. భయపెట్టే హవేలి.. ఈ బీచ్లో మరింత భయపెట్టే కథలు హవేలి విషయంలో వినిపిస్తాయి. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక, పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచే అనుమతించడం లేదు. అంతా భూటకం.. ఈ మొత్తం కథనాన్ని భూటకమని కొట్టి పారేసేవారూ ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్లో రాత్రిపూట బస చేశారు. కానీ, వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా.. తమకు ఎలాంటి అసహజ అనుభవాలూ ఎదురుకాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టారని, నిజానికి డ్యూమస్లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో అవి ఫ్లాష్ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా.. లేదా అన్నది పక్కన బెడితే, ప్రస్తుతం దేశంలోని డిమాండ్ ఉన్న బీచ్ల్లో ఇదీ ఒకటిగా మారిపోయింది. ఆత్మలా మజాకానా..! - (సాక్షి స్కూల్ ఎడిషన్) -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
ఉడీ ఉగ్రదాడి దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేశాన్ని కలిగించింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ.. దాయాదికి తగిన గుణపాఠం చెప్పాలంటూ యావత్ భారతీయులు రగిలిపోయారు. సామాన్యుల నుంచి రాష్ట్రపతి, ప్రధాని వరకు మన జవాన్లకు అండగా నిలిచారు. ఉడీ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ ప్రజలు నివాళులు అర్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలిచారు. వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి గుజరాత్లోని సూరత్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై కళాకారులు వీర జవాన్ల సేవలను కీర్తిస్తూ దేశ భక్తి గీతాలు పాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. భారీ మొత్తంలో డబ్బును కళాకారులకు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా డబ్బు పోగైంది. ఈ డబ్బును కళాకారులు, నిర్వాహకులు తీసుకోకుండా ఉదారత చాటుకున్నారు. ఉడీ దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. త్వరలో వారి కుటుంబాలను కలసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. సూరత్ ప్రజలు, కళాకారులు, నిర్వాహకుల ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం. -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
-
భర్త నైట్ షిఫ్ట్కు వెళ్లగానే భార్యపై గ్యాంగ్ రేప్..
సూరత్: గుజరాత్ లో కామాంధులు రెచ్చిపోయారు. భర్త లేని సమయాన్ని అదునుగా చూసుకొని ముగ్గురు దుర్మార్గులు పందోమ్మిదేళ్ల వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పూనా ముంబయి రోడ్డులోని మార్కెట్ సమీపంలోగల రెసిడెన్షియల్ సొసైటీలో చోటుచేసుకుంది. దీంతో బాధితులు వడోదర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం టెక్స్ టైల్స్ కంపెనీలో బాధితురాలి భర్త నైట్ షిప్టులో పనికి వెళ్లాడు. అదే సమయంలో ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఇంటిపక్కనే ఉన్న వ్యక్తి తలుపుకొట్టాడు. ఇంటి ముందు రూమ్ లో ఆమె సోదరుడు నిద్రస్తుండటంతో అతడు లేచి డోర్ తీశాడు. వెంటనే ఓ వ్యక్తి అతడిని రూమ్ పడేసి తాళం వేశాడు. అనంతరం లోపలికి వెళ్లి నిద్రిస్తున్న వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బయటకు చెబితే తన సోదరుడిని చంపేస్తామని బెదిరించి వరుసగా ముగ్గురు లైంగిక దాడి చేశారు. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'56 అంగుళాల ఛాతి అవసరం లేదు'
సూరత్: తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిందేనని పటేల్ వర్గం రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ పునరుద్ఘాటించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... 'మాకు రిజర్వేషన్లు కావాలి. 56 అంగుళాల ఛాతి అవసరం లేదు. రిజర్వేషన్ల సాధన కోసం మా సామాజిక వర్గంతో కలిసి పనిచేస్తాను. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా'నని హార్థిక్ పటేల్ అన్నారు. లజ్పోర్ జైలు నుంచి విడుదలైన హార్థిక్ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం సూరత్ లో రోడ్ షో నిర్వహించారు. పటేల్ సామాజిక వర్గం ఎక్కువగా నివసించే ప్రాంతాల మీదుగా రోడ్ షో సాగింది. అతడి రోడ్ షో కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించారు. -
'స్వామి'కి వైట్ షర్ట్.. ఖాకీ నిక్కర్!
దేవుడి విగ్రహానికి ఆరెస్సెస్ డ్రెస్ తొడగడంపై వివాదం తలెత్తింది. సూరత్ లోని ఓ దేవాలయంలో స్మామి నారాయణ్ విగ్రహానికి ఆలయ అధికారులు ఖాకీ కలర్ నిక్కర్, వైట్ షర్ట్ తొడిగించారు. ఆరెస్సెస్ డ్రెస్ ఆ విగ్రహానికి అలంకరించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్వామి నారాయణ్ విగ్రహాన్ని గమనించినట్లయితే.. ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ తో పాటు తలపై నలుపు రంగు టోపీ, కాళ్లకు షూస్, చేతిలో జాతీయ పతాకంతో అలంకరించారు. నేడు ఆరెస్సెస్ డ్రెస్స్ తొడిగారు.. రేపు బీజేపీ యూనిఫాం తొడుగుతారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సూరత్ లోని లస్కానాలో స్వామి విశ్వప్రకాశ్జి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఈ దుస్తులు కానుకగా సమర్పించాడు. సాధారణంగా దేవుడి విగ్రహాన్ని పలు రకాల డ్రెస్సులతో అలంకిరిస్తుంటాం.. అందులో భాగంగానే కానుకగా వచ్చిన ఆరెస్సెస్ యూనిఫాంను ఉపయోగించామని చెప్పారు. ఈ విషయం ఇంత వివాదానికి దారి తీస్తుందని తాము భావించలేదని ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. దేవుడు కూడా రైటిస్ట్ అనే భావనలు వ్యక్తం చేయడానికి ఇలా చేశారని, డ్రెస్సును వెంటనే తీసేసి రెగ్యూలర్ పద్ధతిలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సిన్హ్ వాగేలా డిమాండ్ చేశారు. దేవుడికి ఖాకీ కలర్ షార్ట్ తొడిగి ఏం నిరూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రుపానీని సంప్రదించగా.. తనకు ఈ విషయం తెలియదని, నిజంగానే ఆరెస్సెస్ డ్రెస్ వాడినట్లయితే ఆశ్చర్యానికి లోనవుతానని, ఇలాంటివి తాను నమ్మనని పేర్కొన్నారు -
సూరత్ లో ముగ్గురి దారుణ హత్య
సూరత్: గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా దాడి చేయగా ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిపపక్ష నాయకుడు ప్రఫుల్ తొగాడియా సోదరుడు భరత్ తోగాడాయాను, బాలు హిరాణి, అశోక్ పటేల్ అనే వ్యక్తులను దాడి చేసి నరికి చంపారు. గాయపడిన మరో వ్యక్తి దినేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అశ్వినీ కుమార్ రోడ్ లో ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని సూరత్ డీసీపీ జగదీష్ పటేల్ తెలిపారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. మృతి చెందిన భరత్ తొగాడియా విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా బందువు. -
విద్యార్థులు రంగులు పూయించారు
అది... ఇప్పటిదాకా ఓ మారుమూల పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల. ఇప్పుడు మాత్రం గోడలపై వివిధ సందేశాలతో, పెయింటింగ్స్ తో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది ఆ మున్సిపల్ స్కూల్. ఓ సేవా సంస్థ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థుల్లోని ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యాలయం. ర్యాంకులు, మార్కులే కాదు పిల్లల్లోని ఇతర కళలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమ ఫలితం ఇది. సూరత్ లోని పాఠశాల విద్యార్థులకు గత ఆదివారం ఫన్ స్టెయిన్ సేవాసంస్థ ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. స్థానిక పేద విద్యార్థులకు కళలు, నృత్యం, సంగీతం,ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వంటి అనేక అంశాల్లో తర్ఫీదునిచ్చింది. సుమారు 300 పాఠశాలల్లోని విద్యార్థులు సహా కళాకారులతో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. సూరత్ లోని గిజూభాయ్ బధేకా మున్సిపల్ స్కూల్ సహాయంతో ఫన్ స్టెయిన్ సేవాసంస్థ 'ర్యాంగ్ నెస్ బ్రింగింగ్ కలర్స్ ఎలైవ్' పేరున నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసింది. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ముందుగా పాఠశాల గోడలకు పెయింటింగ్ వేయడాన్నే విద్యార్థులకు పనిగా ఇచ్చారు. ఇంకేముందీ వాల్ ఆర్ట్ వేయాలన్న సంస్థ సలహా మేరకు పిల్లలంతా తమలోని సృజనను జోడించి, స్కూలు గోడలను కళాత్మకంగా తీర్చిదిద్ది పరిసర ప్రాంతాలనూ ప్రకాశింపజేశారు. ముందుగా కార్యక్రమాన్నిస్థానిక మేయర్ అస్మితాబెన్ షిరోయా, గుజరాత్ కళా ప్రతిష్టాన్ సెక్రెటరీ రమణిక్ భాయ్ జపాడియాన ప్రారంభించగా... విద్యార్థులకు సేవా సంస్థ బ్రష్ లు, పెయింట్ లు అందజేసింది. దీంతో సేవ్ గల్స్, సేవ్ వాటర్, ప్రిజర్వ్ ఫారెస్ట్స్, స్లాప్ పొల్యూషన్, క్విట్ స్మోకింగ్ వంటి ఎన్నో సామాజిక సందేశాలను విద్యార్థులు గోడలపై ఆకట్టుకునేలా చిత్రించారు. పాఠశాల నగరానికి ప్రధాన మార్గంలో ఉండటంతో చూసినవారంతా అభినందనలు తెలపడంతోపాటు... తాము కూడ అటువంటి కార్యక్రమాల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముందుగా స్కూలు ముందువైపు గోడలకు మాత్రమే పెయింటింగ్ వేద్దామనుకున్నామని, మొదలు పెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఉత్సాహం చూసి మొత్తం స్కూలు కాంపౌండ్ ను రంగులతో నింపాలని నిశ్చయించుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ఓ చిన్న గ్రూప్ లా ఏర్పడిన విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి సుమారు మధ్యాహ్నానికల్లా రంగులు, పెయింట్ వేయడం పూర్తి చేసేశారని ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
సూరత్: గుజరాత్ రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ తప్పతాగి వీరంగం సృష్టించాడు. సూరత్లో తర్వాడి పోలీస్ చౌకీ వద్ద మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తన సర్వీసు గన్తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. సూరత్ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర సిన్హ్ (32) అనే కానిస్టేబుల్ ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసు అధికారులు చెప్పారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. రాఘవేంద్ర సిన్హ్ తన సహాయకుడితో గొడవపడి గాల్లోకి కాల్పులు జరిపినట్టు చెప్పారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అతన్ని బంధించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారి చెప్పారు. -
మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు
సూరత్: గుజరాత్ లోని సూరత్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధం మరో 24 గంటలు పొడిగించారు. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ ను సూరత్ లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూరత్ లో 'ఏక్తా ర్యాలీ' నిర్వహించ తలపెట్టిన హార్దిక్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వదంతులను నిలువరించడానికి ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. -
హార్దిక్ పటేల్ సహా 78మంది అరెస్ట్
సూరత్ : తమకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని... ఇటు గుజరాత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ను శుక్రవారం సూరత్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వారచ్చా పోలీస్ స్టేషన్కి తరలించారు. పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న పటేల్ వర్గీయులు శనివారం ఏక్తాయాత్రకు సిద్ధమయ్యారు. సూరత్లో ఈ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా హార్దిక్ పటేల్ సహా కొంతమంది పటేల్ వర్గీయులు సూరత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత యాత్రకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏక్తాయాత్రకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు హార్దిక్ పటేల్తో పాటు 78మందిని అదుపులోకి తీసుకున్నారు. -
నన్నే టార్గెట్ చేస్తున్నారు
విజయాలుంటేనే ఫామ్లో ఉండే హీరోయిన్లు కొందరు, అసలు అవకాశాలు లేకపోయినా క్రేజ్లో ఉంటారు అతి కొద్దిమంది నాయికలు. ఈ రెండో కోవకు చెందిన నటి నమిత. ఇంతకుముం దు ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన ఈ బ్యూ టీ ఆ మధ్య తెలుగు చిత్రం సింహాతో కూడా అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో స్టెప్స్వేసి యువత గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రస్తుతం అవకాశాలు అంతగా లేకపోయినా ఏ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. ఆమెకంత క్రేజ్ మరి. అలాంటి నమితను మీడియా టార్గెట్ చేస్తోందని ఆమె వాదన. ఇటీవల అవకాశాలు తగ్గితే వివాహానికి సిద్ధమని నమిత అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే సమాజ సేవకు పాటు పడాలనుకుంటున్నానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సూరత్లో జరగనున్న ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి నమిత అంగీకరించినట్లు అందుకు ఆమె డాన్స్ రిహార్సిల్స్ కూడా చేసుకున్నట్లు, సూరత్కు పయనమయ్యే సమయంలో పారితోషికం తీసుకు రావలసిన మేనేజర్ ఆ డబ్బుతో పరారై నట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ అంశాన్ని నమిత ఖండించింది. తానెలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించలేదని తనపై ప్రచారంలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ఇలా తననే టార్గెట్ చేసి ఇలా అసత్య ప్రచారం ఎవరు? ఎందుకు? చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్లామర్ క్వీన్ నమిత వాపోతున్నారు. -
స్వరాష్ట్రానికి వస్తాం
రాష్ట్ర ప్రభుత్వ బృందంతో సూరత్లోని తెలంగాణ కార్మికులు సాక్షి, హైదరాబాద్ : వరంగల్లో టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని సూరత్లో అధ్యయనానికి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ బృందం నిర్ధారించింది. ఎంపీ కడియం శ్రీహరి సారథ్యంలోని ఉన్నతస్థాయి బృందం గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 2 లక్షల మంది సూరత్లో వస్త్ర పరిశ్రమలో జీవనోపాధి పొందుతున్నారని ఈ బృందం గుర్తించింది. అక్కడి తెలంగాణ కార్మికులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్లో టెక్స్టైల్ పార్కు నెలకొల్పితే స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు కార్మికులు తెలిపారు. -
'భారతీయులు మా గురువులు'
సూరత్: భారతీయులను తాము గురువులుగా పరిగణిస్తామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా చెప్పారు. తొలిసారిగా ఆయన ఈరోజు గుజరాత్లో పర్యటించారు. సంతోక్బా అవార్డు అందుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదుతోపాటు వజ్రం పొదిగి బంగారు పూతతో రూపొందించిన ఒక జ్ఞాపినకు అందజేస్తారు. సూరత్ విమానాశ్రయంలో దలైలామా విలేకరులతో మామాట్లాడారు. ప్రాచీన కాలంలోనే ఇక్కడి నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిందన్నారు. తన మనసు నలంద( ప్రాచీన బౌద్ధారామం) ఆలోచనలతో నిండి ఉంటుందని చెప్పారు. అందుకే భారతీయులు తమకు గురువులని ఆయన అన్నారు. -
పెళ్లి పుత్రికలు
శ్రమదానం, అవయవదానం, అన్నదానం ఇలా వివిధ రకాలుగా సమాజసేవలందిస్తున్న వారి గురించి మనం విని ఉంటాం. కానీ కన్యాదానం చేసేవారిని మనం చాలా తక్కువమందిని చూసి ఉంటాం. అలాంటి వారిలో సూరత్లో మహేష్భాయి సవాని పేరును ముందుగా చెప్పుకోవాలి. పేదరికంతో మగ్గుతూ తండ్రిని కోల్పోయిన యువతులకు తండ్రిస్థానంలో నిలిచి కన్యాదానం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వ్యాపారవేత్త. ఆయనతో ‘ఫ్యామిలీ’ సంభాషణ. ఇంతటి ఉదాత్తమమైన కార్యక్రమాన్ని ఎప్పటినుంచి ప్రారంభించారు? 2008 నుంచి. ఆ ఏడాది మా సోదరుని (కజిన్) ఇద్దరి కూతుళ్లకు వివాహం జరిపించాను. తాజాగా 2014 నవంబర్ 30న జరిపించిన 111 పెళ్లిళ్లతో ఇప్పటి వరకు మొత్తం 251 వివాహాలయ్యాయి. తండ్రిని కోల్పోయిన యువతులకు వివాహాలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ముందుగా చెప్పినట్టు మా కజిన్బ్రదర్ కూతుళ్ల పెళ్లి 2008లో నిశ్చయమైంది. అనంతరం పెళ్లికి నాలుగు రోజుల ముందు ఆయన మరణించారు. ఈ వార్త ఆయన కూతుళ్లతోపాటు మా వదిననూ తీవ్రమైన దుఃఖంలోకి నెట్టేసింది. ఒక విధంగా వారు షాక్లోకి వెళ్లిపోయారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలిసింది. వారికి తండ్రిలేని లోటు తెలియకుండా పెళ్లి చేశాను. అత్తారింటికి సాగనంపాను. ఆ సమయంలో వారిలో చూసిన ఆనందం నేను ఇంకా మరిచిపోలేదు. ఆ క్షణంలోనే నాకో ఆలోచన వచ్చింది. తండ్రిని కోల్పోయిన పేద యువతులకు అండగా నిలిచి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఒక తండ్రి తన కూతురికి ఇచ్చి అత్తారింటికి సాగనంపినట్టుగానే ప్రతి ఒక్కరికి బంగారం, వెండి నగలతోపాటు ఇతర వస్తువులను కూడా మా సంస్థ పి.పి.సవాని గ్రూపు తరఫున కానుకలుగా అందజేస్తున్నాం. ఏటా నవంబరు డిసెంబర్ నెలల్లోనే వివాహలు జరిపిస్తున్నారు! నిజమే. నవంబరు చివరి వారం లేదా డిసెంబరు మొదటివారంలో ఈ వివాహాల వేడుకను జరుపుతున్నాం. మా పెదనాన్న పోపట్బాయి ప్రేమ్జీబాయి సవాని (పి పి సవాని) పేరుతో మేము పలు సేవా సంస్థలు ఏర్పాటు చేశాం. ఆయన వర్ధంతి డిసెంబరు ఆరవ తేదీ. ఆయన ఙ్ఞాపకార్థంగా డిసెంబరు ఆరవ తేదీకి ముందు లేదా తర్వాత మంచి ముహూర్తం చూసి తేదీలను ఖరారు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ముహూర్తపు తేదీలు కూడా నిర్ణయమయ్యాయి. 2015 డిసెంబరు ఆరవ తేదీన కన్యదానాలు చేస్తున్నాము. భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పేదలలో సంతోషాన్ని నింపేందుకు ప్రయత్నించడమే మా ప్రణాళిక. వితంతువులుగా మారిన చెల్లెళ్లను కూడా చేరదీస్తున్నాం. ఇంతటితో ఆగకుండా పి పి సవాని ఆసుపత్రిలో వీరందరికి ఉచితంగా జీవితాంతం ఉచిత వైద్యసేవలందిస్తున్నాం. మీకు ఎంతమంది సంతానం..? ఇద్దరు అబ్బాయిలు, 251 మంది కుమార్తెలు. కన్యాదానం చేసినవారందరు నా కూతుళ్లే. అందుకే వివాహం చేసిన అనంతరం కూడా వారందరిని సంవత్సరానికి ఒకసారి ఏదో ఓ యాత్రద్వారా అందరిని ఒకచోటికి చేరుస్తున్నాం. వితంతువులందరు కూడా రాఖీపౌర్ణమీ రోజున నాకు రాఖీ కట్టేందుకు వస్తారు. ఇది నాకెంతో సంతోషాన్నిస్తుంది. - గుండారపు శ్రీనివాస్, ‘సాక్షి’, ముంబై