నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది | Over Rs 1 crore collected for soldiers families in who lost their lives in Surat | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 30 2016 7:42 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి గుజరాత్లోని సూరత్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై కళాకారులు వీర జవాన్ల సేవలను కీర్తిస్తూ దేశ భక్తి గీతాలు పాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. భారీ మొత్తంలో డబ్బును కళాకారులకు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా డబ్బు పోగైంది. ఈ డబ్బును కళాకారులు, నిర్వాహకులు తీసుకోకుండా ఉదారత చాటుకున్నారు. ఉడీ దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. త్వరలో వారి కుటుంబాలను కలసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. సూరత్ ప్రజలు, కళాకారులు, నిర్వాహకుల ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement