తటస్థంగా ఉండాలని టీడీపీ విప్ | TDP issue Whip to Telangana Legislative Council MLCs | Sakshi
Sakshi News home page

తటస్థంగా ఉండాలని టీడీపీ విప్

Published Tue, Jul 1 2014 11:54 PM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

TDP issue Whip to Telangana Legislative Council MLCs

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్ సమయంలో తటస్థ వైఖరిని అవలంభించాలని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికను బహిష్కరించాలని, హాజరైనా ఎవరికి ఓటు వేయకూడదని విప్ జారీ చేసింది. మండలిలో తెలుగుదేశానికి ఏడుగురు సభ్యులుండగా.. ఎన్నికలకు ముందే పట్నం నరేందర్ రెడ్డి(రంగారెడ్డి) టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇటీవలే మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ బి. వెంకటేశ్వర్లు, మరో సభ్యుడు సలీం కూడా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్‌కే మద్దతివ్వనున్న నేపథ్యంలో టీడీపీ తాజా నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యులందరికీ విప్ జారీ చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement