50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు | Telangana BAC Meeting | Sakshi
Sakshi News home page

50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

Published Thu, Oct 26 2017 1:23 PM | Last Updated on Thu, Oct 26 2017 1:52 PM

 Telangana BAC Meeting

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. 50 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు( శుక్రవారం) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసారి బీఏసీ సమావేశం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. ప్రతిరోజు గంటన్నర సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారలని నిర్ణయించారు. కాగా నవంబర్‌ 27న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు.

ఈ సమావేశానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అనారోగ్యం కారణంగా స్పీకర్‌ మధుసూదనాచారి హాజరుకాలేదు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ , హరీశ్‌రావు, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement