
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలను ఇవ్వనున్నట్లు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి శనివారం తెలిపింది. దుకాణాలు, వాణిజ్య, మోటర్ రవాణా, సహకార, ధార్మిక సంస్థలు, ట్రస్టులు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. సంబంధిత కార్మిక సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు పొందాలని, పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15లోగా సమర్పించాలని సూచించింది.
2016–17 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదో తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.2000 చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు వివరించింది. విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment