కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్నగర్ ప్రాంతంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్నగర్ ప్రాంతంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో డింగి సదానందం (35) ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో డీసీఎం ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.