మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలో జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మహిళ చెట్టుకు ఉరేసుకుంది.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలో జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మహిళ చెట్టుకు ఉరేసుకుంది. కర్నూలు- రాయచూరు ప్రధాన రహదారిపై మిట్టదొడ్డి గ్రామం సమీపంలో బుధవారం ఉదయం ఈ విషయం వెలుగు చూసింది. అది హత్యా, ఆత్మహత్యా తేలాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు గట్టు మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
(గట్టు)
.