
తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు వైఎస్ఆర్ సీపీ వెల్లడించింది.
ఈ కమిటీలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎడ్మ క్రిష్ణారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్, కె శివకుమార్, గట్టు రాంచంద్రరావు, గట్టు శ్రీకాంత్రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, జనక్ ప్రసాద్ లను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది.