మసీదులో పేలుడు: 11 మందికి గాయాలు | 11 injured in Kashmir mosque explosion | Sakshi
Sakshi News home page

మసీదులో పేలుడు: 11 మందికి గాయాలు

Published Thu, Aug 13 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

11 injured in Kashmir mosque explosion

శ్రీనగర్ : కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని జమియా ట్రెంజ్ మసీదులో గురువారం గ్రేనెడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉదయం మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. మసీదు ప్రాంగణంలో లోహ పదార్థంతో తయారు చేసిన వస్తువును స్థానికులు గుర్తించారు. దీంతో దానిని వెలికి తీసే క్రమంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు.

ఇదిలా ఉండగా ఇదే ప్రాంతంలో బుధవారం గస్తీ తిరుగుతున్న భద్రత దళాలపైకి ఆగంతకులు గ్రేనెడ్ విసిరారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లుతో పాటు ఓ పౌరుడు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement