-
తమిళనాడులో భారీ పేలుడు
చెన్నై: తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలైనట్లు సమాచారం. విరుదునగర్ జిల్లా కారియాపట్టీలోని ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.Tamil Nadu | At least three people died in an explosion that occurred in a stone quarry near the Kariapatti area of Virudhunagar district, this morning. Rescue operation is underway: Virudhunagar Fire and Rescue Department,— ANI (@ANI) May 1, 2024 -
ప్రమాదం ఎలా జరిగింది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్బీ ఆర్గానిక్స్లో పదిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్పోటన మని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ పరిశ్రమలో పేలుడుకు పదార్థాల (ఎక్స్ ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యక లాపాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి.. ఇక్కడ ఏ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఉన్న ఈ పరిశ్రమలో ఈనెల 3న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం విదితమే. సుమారు 17 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాక్టర్ పేలిన ఘటనలో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్స్ప్లోసివ్ (పేలుడు పదార్థాల)కు సంబంధించిన కార్యకలాపాలు ఈ ఫ్యాక్టరీలో జరిగాయనే దానిపై నిర్ధారణకు వచ్చారు. డీఆర్డీవో సహకారం కోరిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు రక్షణశాఖకు సంబంధించిన డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) సహకారాన్ని కోరారు. ఈ మేరకు పోలీసుశాఖ డీఆర్డీఓకు లేఖ రాసింది. అలాగే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని పోలీసులు ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థకు కూడా లేఖ రాశారు. 40 శాంపిల్స్ సేకరణ.. ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా చెల్లాచెదురైన శిథిలాల నుంచి కెమికల్స్కు సంబంధించిన శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సేకరించారు. మొత్తం 40 చోట్ల ఈ శ్యాంపిల్స్ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్.రూపేష్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. -
‘రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్’ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్ సురక్షితమా అని బీజేపీ నేతలను ఆమె ప్రశ్నించారు. కూచ్బెహార్లో శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. ‘బీజేపీకి ఒక ప్రొపగాండా స్పెషలిస్ట్ ఉన్నాడు. రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగింది బెంగళూరులో. నిందితులు కర్ణాటకకు చెందిన వారు. బెంగాల్ వాసులు కాదు. వారు పారిపోయి వచ్చి బెంగాల్లో దాక్కున్నారంతే. అయినా మేం వారిద్దరినీ కేవలం రెండు గంటల్లోనే పట్టుకున్నాం’అని మమత తెలిపారు. కాగా, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను ఎన్ఐఏ బెంగాల్లో శుక్రవారం అరెస్టు చేసింది. దీంతో బెంగాల్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని బీజేపీ బెంగాల్ కో ఇంఛార్జ్ అమిత్ మాలవీయ, బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పోస్టు చేశారు. ఈ పోస్టులపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి.. రామేశ్వరం పేలుడు.. ఇద్దరు నిందితుల అరెస్టు -
Volcano: ఐస్లాండ్లో బద్దలైన మరో అగ్నిపర్వతం
రెగ్జావిక్: ఐస్లాండ్లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి. రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్ను పేల్చేసిన అమెరికా -
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు..
పాట్నా: బిహార్లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’ -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
చైనాలో భారీ పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW — Mario Nawfal (@MarioNawfal) March 13, 2024 భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది. #BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China. No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30 — Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024 ఇదీ చదవండి.. అట్లాంటా గ్యాస్ స్టేషన్లో దోపిడీ -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. లోపలే 9 నిమిషాలున్న అనుమానితుడు
గతవారం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పేలుడు సంభవించడానికి కారణమైన ఓ వ్యక్తి సుమారు 9 నిమిషాల పాటు కేఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడు సన్ గ్లాసెస్, మాస్క్, బేస్ బాల్ టోపీతో బస్టాండ్ నుంచి రామేశ్వరం కేఫ్ వైపు నడుస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. శుక్రవారం ఉదయం 11.34 గంటలకు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లోని కేఫ్లోకి ప్రవేశించిన అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. మరో ఫుటేజిలో అతడు ఉదయం 11.43 గంటలకు కేఫ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడు వచ్చినంత హడావుడిగానే వెళ్లిపోయినట్లు ఫుటేజిలో కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్లో అనుమానితుడు తొమ్మిది నిమిషాలు మాత్రమే గడిపినట్లు సీసీటీవీ ఆధారాలు సూచిస్తున్నాయి. పేలుడుకు కారణమైనట్లు అనుమానిస్తున్న వ్యక్తి కేఫ్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED) ఉన్న బ్యాగ్ని వదిలిపెట్టాడు. ఈ పేలుడులో కొంతమంది కేఫ్ సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు. ఈ కేసును ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) టేకోవర్ చేసింది. VIDEO | Another CCTV visual of Bengaluru cafe blast suspect emerged showing him entering and leaving the cafe At least 10 people were injured in the low intensity blast at the popular Rameshwaram Cafe in Bengaluru's Whitefield locality on Friday. (Source: Third Party) pic.twitter.com/9jpUfxcJt1 — Press Trust of India (@PTI_News) March 4, 2024 -
బెంగళూరు ‘రామేశ్వరం కేఫ్’ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం(మార్చి 1) మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐకు బదిలీ చేయనుంది. కాగా, అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి.. బెంగాల్ బీజేపీ చీఫ్కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు -
Rameshwaram Cafe Bomb Blast: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్ కాల్
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం(మార్చ్ 1)మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు జరిగిన సమయంలో బిహార్కు చెందిన టెకీ కుమార్ అలంకృత్ రామేశ్వరం కేఫ్లో లంచ్ చేస్తున్నాడు. పేలుడు జరడానికి కొద్ది క్షణాల ముందు అలంకృత్కు అతడి తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడటం కోసం అలంకృత్ కేఫ్ బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్ లోపల పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత అలంకృత్ మాట్లాడుతూ‘నేను లంచ్ కోసం కేఫ్కు వచ్చాను. ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ తినడం స్టార్ట్ చేద్దామనుకునే లోపు మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లాను. ఇంతలో పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలిందేమో అని మొదట అనుకున్నాను. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు’అని అలంకృత్ చెప్పాడు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్లో కీలకంగా ఏఐ -
‘రామేశ్వరం కేఫ్’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!
బెంగళూరులోని రాజాజీనగర్లోని రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రామేశ్వరం కేఫ్లో గుర్తు తెలియని బ్యాగ్ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. #WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN — ANI (@ANI) March 2, 2024 -
TN: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డవారిని శివకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ఆదేశించారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ -
గాజా యూనివర్సిటీలో పేలుడు.. వివరణ కోరిన అమెరికా
గాజా: నాలుగు నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7న తమపై హమాస్ చేసిన మెరుపు దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాజాలోని అల్ ఇసారా యూనివర్సిటీ భవనాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ పేల్చివేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ ఇసారా యూనివర్సిటీ ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్మీ ఆధీనంలోనే ఉంది. అయితే బయటి నుంచి వేసిన బాంబుల వల్ల కాకుండా ఆ భవనంలో దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే పేలుడు జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది. దీంతో ఈ విషయమై ఇజ్రాయెల్ను అమెరికా వివరణ కోరింది. యూనివర్సిటీ భవనం పేలుడుకు సంబంధించి అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. తమకు ఈ పేలుడుపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేనందున కామెంట్ చేయలేమని అమెరికా తెలిపింది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ ప్రాంతంలో హమాస్ లీడర్లున్నారనే సమాచారంతోనే ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. Birzeit University condemns the brutal assault and bombing of @Al-Israa University campus by the Israeli occupation south of #Gaza city, this occurred after seventy days of the occupation occupying the campus; turning it into their base, and military barracks for their forces pic.twitter.com/vot9s1z3tz — Birzeit University (@BirzeitU) January 18, 2024 ఇదీచదవండి.. హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు -
China: బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 10 మంది కార్మికులు మరణించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సీసీ టీవీ వెల్లడించింది. పేలుడు జరిగినపుడు బొగ్గుగనిలో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు.పేలుడు తర్వాత బొగ్గుగనిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గనుల భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటీవలి కాలంలో చైనాలోని బొగ్గుగనుల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గనులపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరంలో చైనా గనుల్లో 168 ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో మొత్తం 245 మంది మృతి చెందారు. ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్ అమెరికా దాడులు -
ఇరాన్ జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి
ఢిల్లీ: ఇరాన్లో జరిగిన జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన బాంబు దాడుల పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. ఈ క్లిష్ట సమయంలో మేము ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నాం" అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 95 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్పై దాడి చేసింది ఎవరనేది ఇప్పటికి తెలియదు. ఇదీ చదవండి: Iran explosions: రక్తమోడిన ర్యాలీ -
ఆయిల్ ట్యాంకర్ పేలి.. 40 మంది మృతి
మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
శివకాశీలో భారీ పేలుళ్లు.. 10 మంది మృతి
సాక్షి, తమిళనాడు: విరుదునగర్ జిల్లా శివకాశీలోని రెండు బాణా సంచా తయారీ కేంద్రాల్లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటలో 10 మంది కార్మికులు మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషయంగా ఉంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణా సంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివకాశీ సమీపంలోని రెంగపాలయంలో ఒక బాణా సంచా తయారీ కేంద్రం నడుస్తోంది. ఆ కేంద్రానికి ముందు వైపు ఉన్న షాపులో బాణాసంచా అమ్మకాలు జరుపుతారు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో భారీగా బాణా సంచాను నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చడంతో ఒక క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. దీంతో మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించాయి. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
ఆ పేలుడు కథ ఏమిటి?
‘‘సైన్స్... పది కొత్త సమస్యలను సృష్టించిగానీ.. ఒకదానికి పరిష్కారం కనుక్కోదు’’ ప్రఖ్యాత ఇంగ్లీష్ కవి జార్జ్ బెర్నాడ్ షా మాటలివి. సైన్స్ ముందుకు పురోగమిస్తున్న కొద్దీ కొత్త కొత్త సవాళ్లు, సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతూంటాయని చెప్పడం ఆయన ఉద్దేశం. జ్ఞానాన్ని పెంచుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటుందని, ఒక సమస్యకు దొరికే పరిష్కారం మరిన్ని కొత్త ప్రశ్నలు, సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కూడా బెర్నార్డ్ షా అనుకుని ఉంటాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. విశాల విశ్వంలో ఓ మూలన ఓ పే...ద్ధ పేలుడు సంభవించిందట. సుదూర గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలపై కన్నేసేందుకు అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన టెలిస్కోపు ‘హబుల్’ ఈ పేలుడును గుర్తించింది. ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోవచ్చు కానీ.. ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో ఏ రకమైన ఖగోళ వస్తువూ లేకపోవడమే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే.. ఏమీ లేని చోట బాంబు పేలుడు జరిగిందన్నమాట. పేలుడు ఎలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్న? అంచనాలు తారుమారు... కొన్నేళ్ల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిగే ఓ కొత్త రకం పేలుడు గురించి ప్రకటించారు. లూమినస్ ఫాస్ట్ బ్లూ ఆప్టికల్ ట్రాన్సియట్... క్లుప్తంగా ఎల్ఎఫ్బోట్ అని పిలుస్తారు దీన్ని. పొడవాటి, సంక్లిష్టమైన పేరును కాసేపు మరచిపోండి. ఈ పేలుడులో భాగంగా కొన్ని రోజుల పాటు ప్రకాశవంతమైన నీలి రంగు కనిపిస్తుందని మాత్రమే గుర్తుపెట్టుకుందాం. 2016లో ఇలాంటి పేలుడు ఒకదాన్ని తొలిసారి గుర్తించగా.. ఆ తరువాత దాదాపుగా చూడలేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమచారంతోనే ఈ పేలుళ్లు ఎలా పుట్టిఉంటాయో అంచనా కట్టేందుకు ప్రయత్నం చేశారు. రకరకాల అంచనాల్లో కోర్-కొలాప్స్ సూపర్ నోవాకు మద్దతు పెరిగింది. ఎక్కువయ్యారు. ఇంధనమంతా ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోతే సూపర్నోవా అంటారని మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే పెరిగిపోయే గురుత్వ శక్తి కారణంగా ఈ నక్షత్రం తాలకూ కోర్ కూడా తనలో తాను కుప్పకూలిపోతే దాన్ని కోర్-కొలాప్స్ సూపర్నోవా అని పిలుస్తారు. కానీ... ఈ ఏడాది ఏప్రిల్ పదిన ఈ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. జ్వికీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ (జెడ్టీఎఫ్) ఎల్ఎఫ్బోట్ పేలుడును గుర్తించింది. ‘ఏటీ2023ఎఫ్హెచ్ఎన్’ అని నామకరణం చేశారు. ‘ఫించ్’ అని ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ప్రకాశవంతమైన నీలి రంగులో కాంతి కనిపించింది. కొన్ని రోజుల తరువాత క్రమేపీ మాయమైంది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా 20000 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నట్లు తెలిసింది. అన్నీ సాధారణమే అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ... హబుల్ టెలిస్కోపును ఈ పేలుడు సంభవించిన వైపు తిప్పినప్పుడు అసలు విషయం తెలిసింది. ఇది సాధారణ ఎల్ఎఫ్బోట్ కాదని అర్థమైంది. అప్పటివరూ గుర్తించి అన్ని ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లోపల సంభవించాయి. అది కూడా ఓ నక్షత్రం తయారవుతున్న సమయంలో జరిగాయి ఈ పేలుళ్లు. ఫించ్ మాత్రం పాలపుంతలో లేదు సరికదా.. ఒంటరిగా అలా తేలియాడుతూ ఉందంతే. పైగా దీనికి దగ్గరలో కూడా ఏ పాలపుంత లేదు. సుమారు 15000 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే పాలపుంతలున్నాయి. సూపర్నోవాల్లో నక్షత్రం చాలా వేగంగా అంతరించిపోతుంది. ఏమీ లేని ప్రాంతంలో దీర్ఘకాలం అలా తేలియాడుతూ ఉండేందుకు అవకాశం లేదు. ఏమై ఉండవచ్చబ్బా...? ఏప్రిల్ పదిన గుర్తించి ఎల్ఎఫ్బోట్ కచ్చితంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందంటారు ఆష్లే క్రైమ్స్. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఈయనే. ఫించ్ ఘటన తరువాత ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లో మాత్రమే కాకుండా... సూదూరంగానూ సంభవించగలవని స్పష్టమైంది. బహుశా ఓ భారీ కృష్ణ బిలం నక్షత్రం ఒకదాన్ని ముక్కలుగా చీల్చేయడం వల్ల ఈ ఎల్ఎఫ్బోట్ పుట్టి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేస్తున్నారు. లేదా రెండు న్యూట్రాన్ స్టార్లు ఢీకొనడం కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండు న్యూట్రాన్ స్టార్లలో ఒకటి భారీగా అయస్కాంతీకృతమైనందైతే (మాగ్నెటార్ అంటారు) సాధారణ సూపర్నోవా కంటే వంద రెట్లు ఎక్కువ కాంతి వెలువడుతుందని క్రైమ్స్ చెప్పారు. ఈ విషయంపై కచ్చితమైన అంచనా వేయాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా, యూరప్, కెనడాలు కలిసికట్టుగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు మరికొన్ని క్లూలు దొరికాయి. దగ్గరలోని పాలపుంత ఔటర్ హాలో (ప్రకాశవంతమైన కాంతి ఉండే ప్రాంతం)లోని నక్షత్రాల గుంపు నుంచి వచ్చి ఉండవచ్చునని తెలుస్తోంది. ఇదే నిజమైతే కృష్ణబిలం ఓ నక్షత్రాన్ని చీల్చేయడం వల్ల ఎల్ఎఫ్బోట్ ఏర్పడిందన్న సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. పరిశోధన వివరాలు రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. హైలైట్స్.... ఏమిటి?.... శూన్యంలో వినూత్నమైన పేలుడు! ఎప్పుడు?... ఈ ఏడాది ఏప్రిల్ పదవ తేదీ తొలిసారి గుర్తించారు! ఎలా?.... నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోపు ద్వారా... ఎందుకు జరిగిందీ పేలుడు?.... స్పష్టంగా తెలియదు! తెలుసుకునే ప్రయత్నంలోనే శాస్త్రవేత్తలున్నారు.! -
ఒక తార పేలిన వేళ...
సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది. ► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. ► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు. ► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి. ► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి. ► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి. ► కానీ ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు. ► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు. ► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం
బరాసత్: పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 8 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. దుత్తపుకుర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నీల్గుంజ్లోని కర్మాగారంలో ఘటన జరిగిన సమయంలో పలువురు సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కలున్న 50 నివాసాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వివరించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కర్మాగారం యజమాని కొడుకు కూడా పేలుడులో చనిపోయాడన్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా నడుపుతున్న ఈ కర్మాగారంలో బాణాసంచా పేరుతో బాంబులు తయారు చేస్తున్నారా అన్న అనుమానాలకు దర్యాప్తులోనే సమాధానం దొరుకుతుందని చెప్పారు. పేలుడు అనంతరం స్థానికులు కర్మాగారం యజమాని ఇంటిని ధ్వంసం చేశారు. గత మేలో పూర్వ మేదినీపూర్ జిల్లాలోని ఈగ్రాలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 12 మంది చనిపోయారు. -
స్టీల్ ప్లాంట్లో పేలుడు.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. కాస్మారాలో ఉన్న రాయ్పూర్ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనాసమయంలో దాదాపు 100 మంది కార్మికులు ప్లాంట్లో పనిచేస్తున్నారు. కాగా మంటల్లో కాలి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. కాగా.. మంటల్లో కాలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. పేలుడుకు సంబంధించిన కారణాలు ఉంకా తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
వైరల్ వీడియో: దక్షిణాఫ్రికా పేలుడును చూస్తే మన దర్శకులు బిత్తెరపోతారు
-
విషాదం: బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు.. 8 మంది మృతి..
చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణగిరి వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చిధ్రమై పడి ఉన్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. ఘటనాస్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్లు కూడా కూలిపోయాయి. పలు భవంతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియదు. వారిని బయటికి తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేలు ఇస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. Deeply saddened by the tragic mishap at a cracker factory in Krishnagiri, Tamil Nadu, resulting in the loss of precious lives. My thoughts and prayers are with the families of the victims during this extremely difficult time. May the injured recover soon. An ex-gratia of Rs. 2… — PMO India (@PMOIndia) July 29, 2023 పజాయపెట్టైలో జరిగిన ప్రమాదం భాదకలిగించిందని సీఎం స్టాలిన్ అన్నారు. బోగనపల్లిలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ బాణాసంచాను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం.. రూ.3లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్షఇవ్వనున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్ని కేటాయించారు. Deeply saddened by the loss of valuable lives in the mishap at the firecracker godown in Boganapalli, Krishnagiri District. My prayers and thoughts are with the bereaved families. Wishing a speedy recovery to those injured.- Governor Ravi — RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) July 29, 2023 ఇదీ చదవండి: కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక భారత్లో ఆగిన తల్లి గుండె.. -
బెంగళూరులో ఉగ్ర కలకలం.. ఐదుగురి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహైల్, ముదాసిర్, ఉమర్, జాహిద్గా గుర్తించారు. వీరి నుంచి సెల్ ఫోన్లతోపాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మరో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం జల్లెడపడుతున్నారు. కాగా అరెస్ట్ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలం బెంగుళూరు సెంట్రల్ జైలులో శిక్షననుభవించారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి పేలుడు పదార్థాలను నిర్వహించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. చదవండి: ఐఏఎస్ ఆకాశ్పై భార్య వందన ఫిర్యాదు -
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
మిమిక్రీ చేసే పక్షులు!
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
భారత హెడ్కోచ్ సెలక్షన్.. అతడిని ఒప్పించే బాధ్యత ధోనీదే!
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement