Accident In Visakha Steel Plant Workers Injured - Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. 9 మంది కార్మికులకు గాయాలు..

Published Sat, Feb 11 2023 2:29 PM | Last Updated on Sat, Feb 11 2023 2:56 PM

Accident In Visakha Steel Plant Workers Injured - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.

మరో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్ పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు గాయపడ్డారు. వీరిలో  నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై విచారణ జరిపి మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్‌ కార్మిక సంఘ నాయకులు కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement