Accident
-
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం.. రంగంలోకి రోబోలు! : సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మీకులను బయటకు తీసేందుకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మరో రెండు, మూడురోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. రోబోలను సైతం వినియోగించి కార్మీకులను వెలికితీసే ప్రయత్నాలను చేస్తామని వెల్లడించారు. మళ్లీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలను చేపడుతున్నామని వివరించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్తో కలిసి నిపుణులతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ‘ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పదేళ్లలో కనీసం 3 కి.మీ కూడా పూర్తిచేయలేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టు కంపెనీని ఇబ్బంది పెట్టారు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ను కట్ చేయడంతో మోటార్లు నడవని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని జాగ్రత్తలు తీసుకుని పనులు ప్రారంభించింది. టన్నెల్ బోరింగ్ మిషిన్ మరమ్మతు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని అమెరికా పంపి స్పేర్పార్ట్స్ను తెప్పించాం. ప్రాజెక్టు పూర్తయితే రూపాయి ఖర్చు లేకుండానే 30 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు అందుతుంది. మేము శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. ఇది మనందరి సమస్య..విపత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ అండగా ఉండాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి.. ‘దేశ భద్రత కోసం కష్టపడే ఆర్మీ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తోంది. టన్నెల్ నిపుణులు, ప్రైవేటు ఏజెన్సీలతో పాటు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి, వారందరినీ అభినందిస్తున్నా. ప్రమాద స్థలంలో మట్టి, నీరు ఎక్కువగా ఉండటం, కన్వేయర్ బెల్టు రిపేరులో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి బెల్టు అందుబాటులోకి వస్తుంది. జీపీఆర్ గుర్తించిన చోట కార్మీకుల ఆనవాళ్లు దొరకలేదు. ప్రభుత్వం ఇంకా పట్టుదల, చిత్తశుద్ధితో సహాయక చర్యలను చేపడుతోంది. ప్రమాదం జరిగిన గంటలోనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావులను సంఘటన స్థలానికి పంపా. ప్రధాని మోదీతోనూ మాట్లాడా.. దేశంలోని వ్యవస్థలతో పాటు మంత్రులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడా. కేంద్రం సహకారంతోనూ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచి్చన వారిపై సానుభూతి, మానవత్వంతో వ్యవహరిస్తున్నాం. సహయక చర్యలను చూసేందుకు వస్తున్న ప్రతిపక్షాలతో పాటు ఎవరినీ నియంత్రించ లేదు, నిర్భంధించ లేదు. పూర్తి పారదర్శకంగా ఉన్న మమ్మల్ని తప్పుబడుతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. రెండు ఉదంతాలకు మధ్య తేడా ఉంది.. ‘గతంలో బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనుల్లో 9 మంది చనిపోతే ఐదేళ్ల తర్వాత వాళ్ల మృతదేహాలు దొరికిన విషయం మర్చిపోయారా? శ్రీశైలం పవర్హౌస్ ఘటనలో చనిపోయిన వారిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి ఘటనకు, ఇప్పటి ప్రమాదానికి తేడా ఉంది. అక్కడ నిర్లక్ష్యం ఉంది. తాగి నడిపి మనిషిని గుద్దితే జరిగిన ప్రమాదం లాంటిది కాళేశ్వరం ఉదంతం.. తాగి వస్తున్న వాడిని బతికించేందుకు చెట్టును గుద్దిన ఘటన లాంటిది ఈ ప్రమాదం. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. కేసీఆర్ ఎక్కడా కని్పంచడం లేదు. ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత ఆయనకు లేదా? నేను ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నానని కిషన్రెడ్డి అంటున్నాడు. మా వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. టీం లీడర్గా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. హరీశ్ నీ పాస్పోర్టు బయటపెట్టు.. ‘ప్రమాదం జరిగితే నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని హరీశ్ అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ దుబాయ్లో దావత్ చేసుకున్నది నిజం కాదా? అబుదాబిలో రెండురోజులు దావత్లో మునిగి తేలారు. మత్తు దిగినాక వచ్చి ఇష్టం వచి్చనట్టు మాట్లాడుతున్నారు. హరీశ్.. మీ పాస్పోర్టును బయట పెట్టండి. ఎయిర్పోర్టులో వివరాలు చూడండి. నేను వస్తే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే రాలేదు. ఇట్ల సోయి లేకుండా మాట్లాడవచ్చా?..’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపుసాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్జీఆర్ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది. -
SLBC లోపలి దృశ్యాలు: సౌండ్లు చేస్తూ ముందుకు..
నాగర్ కర్నూల్, సాక్షి: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన.. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ‘‘ఎవరైనా ఉన్నారా?’’ అంటూ శబ్ధాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఐదు రోజులు గడిచినా.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి. ఈ క్రమంలో..మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు(Rescue Teams) చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీమ్లతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్కు చేరుకోగలిగారు. అయితే కార్మికుల ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రసుత్తం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. -
SLBC టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ప్రత్యేక కెమెరాలు
సాక్షి,నాగర్కర్నూల్:శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి మంగళవారం(ఫిబ్రవరి 25) బయలుదేరారు. కాసేపట్లో ఆయన టన్నెల్ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా టన్నెల్ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం అత్యాధునిక ఎండోమోడ్ కెమెరాలను లోపలికి పంపారు. 9 వేర్వేరు బృందాలుగా 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 72 గంటలు గడిచినా ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా కూలిపడటంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. నేడు మరో ప్రత్యేక బృందం ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్ నో ఎల్ఎస్బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్లెట్ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్లెట్ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు. దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్ డాగ్స్)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు. రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నాగర్కర్నూల్ జిల్లా మాజీ కలెక్టర్ ఇ.శ్రీధర్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. సొరంగంలోకి ‘ర్యాట్ హోల్ మైనర్స్’ సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్ హోల్ మైనర్స్’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్ హోల్ మైనర్స్’ను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్ హోల్’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ బృందం టన్నెల్ వద్దకు చేరుకోంది. -
సొరంగంలో ఆశలు గల్లంతు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్/ సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. ఎస్ఎల్బీసీ సొరంగం–1 ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైసన్ డివిజన్కు చెందిన ఇంజనీర్ టాస్్కఫోర్స్ (ఈటీఎఫ్) ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.శిథిలాలు, బురద తొలగించేదెలా?సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్ సెగ్మెంట్ లేదు! సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మెషీన్ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్ బోల్టింగ్ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. – కలేందర్, సింగరేణి మైనింగ్ సేఫ్టీ సూపర్వైజర్ వారి జాడ కనిపించలేదు.. టన్నెల్లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. – రాందేవ్, సుబేదార్, ఆర్మీ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది టన్నెల్ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్ బోరింగ్ మెషీన్ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. – రవినాయక్, ఎన్డీఆర్ఎఫ్ టీం, విజయవాడ పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. మేం పనుల కోసం టన్నెల్ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. – చమేల్ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్మెన్ ఏం జరుగుతోందో అర్థం కాలేదు శనివారం ఉదయం టన్నెల్లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. – ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్ బెల్ట్ ఫోర్మెన్ మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. – జగదీశ్ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్ ఫోర్మెన్ -
కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. -
సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోదీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్, మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం రేవంత్ వివరించారు.సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గంటల ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు , జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. -
భూకంపం వచ్చిందన్నట్లుగా SLBC టన్నెల్ ప్రమాదం!
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. టన్నెల్ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ భేటీలో Tunnel Collapse ప్రమాదం జరిగిన తీరును అధికారులు వారికి వివరించారు.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట(Domalapenta) సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒరిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన దృశ్యం.. భూకంపం వచ్చినట్లుగా ఉందని అధికారులు మంత్రులతో అన్నారు. భారీ శబ్ధంతో ప్రమాదం జరిగిందని, ఆ తీవ్రత వల్ల వెయ్యి క్యూబిక్ మీటర్లు రాళ్లు, మట్టి పేరుకుపోయాయి. దీంతో ఆందోళన చెందిన కార్మికులు, ఇంజినీర్లు మిషనరీ వదిలేసి బయటకు పరుగులు తీశారు. 150 మీటర్ల వరకు ప్రమాద తీవ్రత కనిపించింది అని అధికారులు తెలిపారు. ఇక సహాయక చర్యలపై మంత్రులు ఆరా తీశారు. ఉదయం నుంచి 40 మందిని టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని, గాయపడినవాళ్లను ఆస్పత్రికి తరలించామని వివరించారు. మరికొందరిని బయటకు తేవాల్సి ఉందని చెప్పారు. టన్నెల్లో భారీగా నీరు చేరిపోవడంతో.. సింగరేణి నుంచి సహాయక బృందాన్ని రప్పించినట్లు వివరించారు. అయితే ఇంకా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయినట్లు నిర్ధారణ అయ్యింది . అందులో నలుగురు కూలీలు కాగా, మిగతా వారు అధికార సిబ్బంది అని సమాచారం. ఐదేళ్ల కిందట.. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యే తిరిగి ఈ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించింది. నిలిచిన పనులను మళ్లీ కొనసాగించేందుకు సన్నాహాక పనులు జరుగుతుండగా.. ఈలోపు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.ఎస్సెల్బీసీ సొరంగ మార్గం వివరాలునల్లగొండ, పాలమూరు జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రారంభం అయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులుదివంగత నేత వైఎస్సార్ హయాంలో 2004 లో రూ. 2,200 కోట్లతో సొరంగం ప్రారంభంప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగం పనులకు వైఎస్సార్ శంకుస్థాపనఅరవై నెలల్లో పనులు పూర్తి కావాల్సిన సొరంగంవివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న పనులుమధ్యలో వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో సొరంగం ఆలస్యంశ్రీశైలం ఎడమగట్టు కాల్వపై 44 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉందిమిగతా పనుల పూర్తి కోసం ఇటీవలే నిధుల కేటాయింపు2010 నుంచి ఇప్పటి వరకు సొరంగం పూర్తి కోసం ఆరుసార్లు డెడ్ లైన్2026 జూన్ నాటికి సొరంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం2017 లో సొరంగం అంచనా వ్యయం రూ. 3,152.72 కోట్లు పెంపుఈమధ్యే మరోసారి రూ.4,637 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం ఇదీ చదవండి: ఎల్ఎల్బీసీ టన్నెల్లో ఉదయం 8.20కి అసలేం జరిగిందంటే.. -
ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం. -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.గత నెల జనవరి 25న విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
హైదరాబాద్ లో BMW కారు బీభత్సం
-
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
HYD: సెల్లార్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో విషాదకర ఘటన నెలకొంది. ఓ సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ భవనానికి సంబంధించి సెల్లార్ తవ్వుతున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుతున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అనంతరం, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మృతులను బీహార్కు చెందిన వారికిగా గుర్తించారు. -
కారులో షార్ట్ సర్క్యూట్: Uppal
-
డివైడర్ను ఢీకొట్టిన కారు : Punjagutta Circle
-
‘హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదం.. రిపోర్ట్ ఎందుకివ్వలేదు?’
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నెక్లెస్ రోడ్డులో జరిగిన మహా హారతి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్లోని బోటులో క్రాకర్స్ ఎవరి అనుమతితో కాల్చారంటూ ప్రశ్నించిన మంత్రి.. ప్రమాదంపై తనకు ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు.తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. టూరిజం బోటులో బాణాసంచా ఎలా అనుమతి ఇస్తారంటూ మండిపడ్డ మంత్రి.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు జూపల్లి కృష్ణారావు ప్రయత్నించగా, జూపల్లి ఫోన్కు కిషన్రెడ్డి స్పందించలేదు. బోటు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయాన్ని జూపల్లికి తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు.కాగా, సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ హుస్సేన్సాగర్లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: బోటు ప్రమాదం.. కన్నతల్లి కన్నీటి వ్యథ -
Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన గురించి బాగ్పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025బాగ్పత్లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం
సాక్షి,అనకాపల్లిజిల్లా: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం(జనవరి25) జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: మంటల్లో దగ్ధమైన నివాసాలు.. పలువురికి గాయాలు -
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
-
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
-
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఫార్మాసిటీలో మరో ప్రమాదం..
సాక్షి, అనకాపల్లి: ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇరువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
-
షూటింగ్ సెట్లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు!
బాలీవుడ్ మూవీ షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్కి బీవీ మూవీ షూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్ను నిలిపివేశామని తెలిపారు.బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
పారాసెటమాల్..వాడకం.. జర భద్రం...!
ఏపీ సెంట్రల్ డెస్క్: పారాసెటమాల్.. ఈ ట్యాబ్లెట్ గురించి తెలియని వారుండరు. కరోనా తరువాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ల ఇది. అదీ కాకుండా నొప్పులకు కూడా పనిచేస్తుందని తెలిసిన తరువాత దీని వినియోగం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. చిన్న, చిన్న నొప్పులకు కూడా ఈ ట్యాబ్లెట్ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలేయానికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పారాసెటమాల్ విషపూరితంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటున్నారు.కాలేయానికి హాని: పారాసెటమాల్ను అధిక మోతాదులో వినియోగిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్ధంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొన్ని పరిస్థితుల్లో కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.కిడ్నీ సమస్యలు: దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్రవిసర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు:ఎక్కువమంది పారాసెటమాల్ ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు/రక్తప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.అతి వినియోగం.. అనర్ధదాయకంపారాసెటమాల్ టాబ్లెట్ను డోస్కు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పేగుపూత, కాలేయం దెబ్బతినడం, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకూ దారి తీయవచ్చు. – డాక్టర్ జె. నాగరాజు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఏరియా ఆస్పత్రి, నరసరావుపేట. -
విహార యాత్రలో విషాదం
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది. గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటేకేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం -
అజిత్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్కాంత్ పీఎస్కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు. -
వాట్సాప్లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
Jubilee Hills: మద్యం మత్తులో కారు నడిపి..
బంజారాహిల్స్: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్ మారేడ్పల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27) రైల్వే ఆఫీసర్స్ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్ హాల్ నుంచి బెంజ్ కారు బయలుదేరాడు. సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్కు యతి్నంచగా వీరు సహకరించలేదు. 3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్ చేశారు. మద్యం మత్తులో స్టేషన్లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్ విధించి ఆదివారం రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్లోని జైపుర్లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆగని ప్రమాదాలు
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి బొగ్గు గనులు, వివిధ విభాగాల్లో ప్రస్తుతం రక్షణ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ‘రక్షణే ప్రథమం.. రక్షణే ఎల్లప్పుడు’అని ప్రతీ గని, డిపార్ట్మెంట్పై కార్మికులతో అధికారులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే, రక్షణ పక్షోత్సవాలు వేడుకల కోసమేనని, క్షేత్రస్థాయిలో కార్మికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలేవీ లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. సింగరేణిలో ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.నిమ్, యూఎంటీఐ, వీటీసీ, అత్యాధునిక సిమ్టార్స్.. ఇలా ఎన్ని శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసినా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేదు. తట్టాచెమ్మాస్, సెమీ మెకనైజ్డ్, పూర్తిస్థాయి యాంత్రీకరణ జరిగినా రక్షణలో వైఫల్యాలతో బొగ్గు గనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటా కార్మికులు చనిపోతున్నా, ప్రమాదాలపై సమీక్షించ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొగ్గు ఉత్ప త్తి విషయంలో సింగరేణి చూపుతున్న శ్రద్ధ ప్ర మాదాల నియంత్రణకు తీసుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. 17ఓసీపీలు.. 22 భూగర్భ గనులు ఏటా మాదిరిగానే ప్రమాద రహిత సింగరేణిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా యాజమాన్యం ఈనెల 9 నుంచి 21వ తేదీ వరకు రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. సింగరేణిలోని 11 ఏరియాల్లో 17 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు, 22 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో దాదాపు 42 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అదనం. వీరు సుమారు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా 12 బృందాలు వివిధ గనులు, సీఎస్పీలు తదితర విభాగాల్లో తనిఖీలు చేసి అత్యుత్తమ రక్షణ చర్యలు పాటించే గనులకు బహుమతులు అందిస్తాయి.అయితే కార్మికులకు రక్షణ సూత్రాల గురించి వివరిస్తున్న అధికారులు.. వాటిని అమలు చేయాలని అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు.. కార్మికులతోపాటు అధికారులు యూనిఫాం, టోపీలు ధరించకుండానే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకే.. రక్షణ పక్షోత్సవాల్లో చేయించిన ప్రతిజ్ఞ, సూచనలు ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం స్థాయి అధికారుల బృందం తనిఖీలు చేసి నివేదికలు తయారు చేసి వెళ్లిపోతుంది. అప్పటివరకు ఏరియా అధికారులు గనులు, డిపార్టుమెంట్లలో సూచిక బోర్డులు, రక్షణకు సంబంధించిన కొటేషన్లు రాసి, జెండాలు కట్టి హంగూ ఆర్భాటాలతోనే సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నోటీస్ బోర్డులపై కానరాని సమాచారం ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్ని సందర్భాల్లో క్షతగాత్రులవుతున్నారు. గనులపై ప్రమాదాల సమాచారం వెల్లడించాల్సి ఉన్నా.. ఎక్కడ కూడా నోటీసు బోర్డులపై కానరావడం లేదు. ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా రక్షణ చర్యలు తీసుకునే అంశాలను మరుగున పడేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సింగరేణి స్టేపీ అధికారులను సంప్రదించగా.. సింగరేణివ్యాప్తంగా సేఫ్టీ మేనేజ్మెంట్ పద్ధతు లు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు వాటిపై అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. గతంతో పొల్చితే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని, అయినా, జీరో హార్మ్ సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. -
సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!
కారు డ్రైవిం చేసే సమయంలో సీట్బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు. (చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! ) -
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
బంగారు బాల్యం..బాధ్యతతో పదిలం
సాక్షి రాయచోటి : భావి భారత పౌరులు.. అలాంటి చిన్నారులు చేస్తున్న వికృత చేష్టలు సమాజం ఎటుపోతుందోనన్న సందేహాలకు సమాధానం దొరకని పరిస్థితి. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే కాదు..సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. చిన్నారులు ఏం చేస్తున్నారో..ఎటు పోతున్నారో.. ఎలా వ్యవహారిస్తున్నారో చూసుకో కపోతే అనేక తప్పులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకటి, రెండు దశాబ్దాల కిందట నాగరిక పోకడలు అంతగా లేని కాలంలో...చిన్న పిల్లలు, బాలలు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని చెప్పిందే వేదంగా నడిచే పరిస్థితి ఉండేది.కాలం మారింది, కంప్యూటర్ పోకడలు పెరిగిన ప్రస్తుత కాలంలో చిన్నారులు అడిగిందే తడవుగా ఏదీ కాదనలేదన్నది ఇప్పటి పరిస్థితి. భావి భారత బాలలకు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పకపోతే భవిష్యత్లో ఎలాంటి తప్పుడు పనులు చేసినా అది అందరిమీద పడుతుంది. ఒకనాడు ఇంటి పని మొదలుకొని పాఠశాల ముగియగానే ఇంటికి చేరుకుని కుటుంబీకులతో తిరుగుతుండడంతో వారి ప్రవర్తన, నియమావళి తెలిసేది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ముందుకు వెళుతూ టెక్నాలజీ యుగంలో విలాసవంతానికి పోతుండడంతో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి. సెల్ఫోన్లు చూస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి చిన్నారులు, బాలలు (18 ఏళ్లలోపు) సెల్ఫోన్లు చూస్తున్నారంటే కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే అనేక రకాల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి. పైగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అవతలి వారు పంపిన లింక్ౖò³ ఒక చిన్న క్లిక్ చేస్తేనే ఖజానా ఖాళీ అవుతుంది.అదొక్కటే కాదు...అనేక రకాల అశ్లీల బొమ్మలు, లైక్లు, సబ్స్రై్కబ్ల కోసం రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్న తరుణంలో చిన్నారులకు తెలియకుండా జరిగే ఒక క్లిక్తో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవమే. అన్నింటి కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇన్స్ర్ట్రాగామ్, వాట్సాప్లను క్రియేట్ చేసుకుని పెద్దలకు తెలియకుండా చూసిన తర్వాత డెలీట్ చేసి ఏమి తెలియనట్లు యదావిధిగా ఫోన్ను అందిస్తున్నారు. సెల్ఫోన్ను తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు పుస్తకాలు అలవాటు చేయడం, ఆటల ద్వారా వారిలో వినోదం పంచడం లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. కేసులతో జీవితాలు ఛిద్రం అన్నమయ్య జిల్లాలో అవనసరంగా చెడు మార్గంలో పయనిస్తూ పోలీసు కేసులతో తమ జీవితాలను వారే చిధ్రం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట మదనపల్లె, రాజంపేట పరిధిలో మైనర్లు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. నెలన్నర కిందట పీలేరులో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే రాయచోటిలో మందలించిన టీచర్పై ముగ్గురు విద్యార్థులు చితకబాదడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటనను తలుచుకుంటేనే గగుర్పాటు కనిపిస్తోంది.పెరిగిన వింత పోకడలు సమాజంలో చదువుకునే బాలల్లో వింత పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సెల్ఫోన్లలో క్రైం స్టోరీలు చూడడం మొదలు ఇతర అనేక రకాల కారణాలతో విద్యార్థులు కూడా వేరే వ్యవహారాలకు బానిసలవుతున్నారు. ఒకరిని కొట్టినా, తిట్టినా శిక్ష కఠినంగా ఉంటుందన్న విషయం తెలియకనో, లేక ఏమౌతుందిలే అన్న ధీమాతో ఏదంటే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులకు తెలియకుండా రహస్య ప్రాంతాలను ఎంచుకుని సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం ఇలా చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికితోడు చెడు సావాసంతో అనవసరంగా వెళ్లి వివాదాల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. -
లంగర్ హౌస్ కారు ఘటనలో ప్రాణాలు విడిచిన నవ దంపతుల తల్లిదండ్రుల ఆవేదన
-
HYD: లంగర్హౌజ్లో ‘హిట్ అండ్ రన్’.. దంపతులు మృతి
సాక్షి,హైదరాబాద్:లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్కారు నడుపుతూ టూ వీలర్తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.టూవీలర్పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్హౌస్ నుంచి బంజారాహిల్స్కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..
గచ్చిబౌలి: పిల్లల్లేని జంటకు సరోగసీ (అద్దెగర్భం) ద్వారా బిడ్డను కని ఇచ్చే ఒప్పందంపై హైదరాబాద్ వచ్చిన ఓ యువతి ప్రమాదవశాత్తూ ఓ బహుళ అంతస్తుల భవనంలోని 9వ అంతస్తు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజ ఈ–బ్లాక్లోని 9వ అంతస్తు ఫ్లాట్ నంబర్ 901లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేష్ బాబు (54), జయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి సంతానం లేకపోవడంతో అద్దె గర్భం (సరోగసీ) ద్వారా సంతానం పొందాలనుకున్నారు. ఇందుకోసం రాజేష్ బాబు తన స్నేహితుడి ద్వారా శ్రీకాకుళానికి చెందిన సందీప్ అనే మధ్యవర్తిని సంప్రదించగా అతను ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్ను సంప్రదించాడు. అందుకు సంజయ్ తన భార్య ఆశ్రిత సింగ్ (25)ను ఒప్పించాడు. దీంతో సరోగసీ ద్వారా సంతానం కలిగితే రూ. 10 లక్షలు అశ్రితకు ఇచ్చేందుకు రాజేష్బాబు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో సరోగసీ ప్రక్రియ.. ఆశ్రిత తన భర్త సంజయ్తోపాటు నాలుగేళ్ల కొడుకుతో కలిసి అక్టోబర్ 24న మై హోం భూజకు వచ్చింది. అప్పటి నుంచి వాచ్మన్ గదిలో సంజయ్, అతని కుమారుడు ఉంటుండగా ఒక బెడ్రూమ్లో అశ్రిత ఉంటోంది. ఈలోగా సరోగసీకి చట్టపరమైన అనుమతి కోసం రాజేష్ బాబు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల ఆశ్రితసింగ్ను కోర్టులో హాజరుపరిచారు. డిసెంబర్ మొదటి వారంలో కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచి్చన అనంతరం సరోగసీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బాల్కనీ నుంచి దిగేందుకు చీరలను వేలాడదీసి అయితే కొన్ని రోజులుగా ఆశ్రిత తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెబుతోంది. కానీ భర్త మాత్రం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేసిన ఆశ్రిత.. వేధింపులు తాను భరించలేనని.. చనిపోతానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అన్నీ సర్దుకుంటాయని భర్త సర్దిజెప్పగా ఆశ్రిత ఫోన్ కట్ చేసింది. గంట తర్వాత ఆశ్రిత మూడు చీరలను ముడేసి బాల్కనీ నుంచి కిందకు వేలాడదీసింది. చీరలను పట్టుకొని కిందకు దిగి పారిపోవాలని భావించి దిగే ప్రయత్నంలో జారి కింద పడటంతో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో రాజేష్ దంపతులు ఓ బెడ్రూమ్లో ఉండగా మరో బెడ్రూంలో తల్లి, కేర్టేకర్గా పనిచేసే శ్రీనివాస్ కిచెన్లో నిద్రిస్తున్నాడు. సరోగసీకి అంగీకరించిన ఆశ్రిత మనసు మార్చుకుందా లేక రాజేష్ బాబు నుంచి వేధింపులు ఎదురయ్యాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పరవాడ ప్రమాదం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
గుంటూరు, సాక్షి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువుల లీకేజీ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారాయన.ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కఠిన చర్యలుంటాయని ఆదేశాలిచ్చినా.. కంపెనీలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. Also Read in English: YS Jagan Demands AP Government's Support for Victims of Paravada Pharma Company Incident -
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయిన చింతా స్నిగ్ధ
-
యుద్ధప్రాతిపదికన ట్రాక్ల పునరుద్ధరణ
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: ధ్వంసమైన మూడు ట్రాక్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ఐరన్ కాయల్స్ లోడ్తో వెళుతున్న 44 వ్యాగన్లు ఉన్న గూడ్సు రైలు మంగళవారం రాత్రి రామగుండం–రాఘవాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య కన్నాల గేట్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు ఒక ట్రాక్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. వందలాదిమంది కూలీలు, భారీయంత్రాలను వినియోగించి పట్టాలపై పడిపోయిన వ్యాగన్లను తొలగించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 39 రైళ్లు రద్దు.. 61 రైళ్లు దారిమళ్లింపు కాజీపేట–బల్హార్షా మీదుగా నడిచే 39 రైళ్లను పూర్తిగా, 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు.. 61 రైళ్లను దారిమళ్లించారు. మరో 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ స్టేషన్లలోని ప్రయాణికులు సమీప ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకోవడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. రామగుండం మీదుగా దేశవ్యాప్తంగా నిత్యం ప్ర యాణించేవారు వేల సంఖ్యలో ఉంటారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారు రైళ్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రయాణికులకు సేవలు అందించడం, సమాచారం తెలియజేయడానికి రామగుండం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు.ప్రమాదాన్ని గుర్తించలేదా? ఇటీవల ట్రాక్ల సామర్థ్యం పెంచారు. దీంతో గూడ్సు రైలు ప్రమాదానికి వేగం కారణం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కు వ ఉంటే పట్టాలు సంకోచ, వ్యాకోచాలకు లోనవుతాయని, ప్రమాద సమయంలో ఉష్ణో గ్రతలు ఆ స్థాయిలో లేవని వారు అంచనా వేస్తున్నారు. రైలు ఇంజిన్ నుంచి తొమ్మిదో నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టని లోకోపైలెట్ వేగం తగ్గించకుండా ముందుకు వెళ్లడంతో పట్టాలు తప్పిన 11 వ్యాగన్లు సుమారు కిలోమీటరు పొడవున అలాగే వెళ్లిపోయాయా? దీంతోనే భారీ నష్టం వాటిల్లిందా? లేదా మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో డివిజినల్ సేఫ్టీ కమిటీతో పాటు రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.దిక్కుతోచడం లేదు మా సొంతూరు వెళ్లేందుకు సంతోషంగా రైలెక్కిన. పెద్దపల్లి నుంచి కరీంనగర్, నిజామాబాద్, నాగపూర్ మీదుగా తెలంగాణ ఎక్స్ప్రెస్ను నడిపిస్తే గమ్యస్థానం చేరుకునేవాడిని. రైళ్ల గురించి అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. – ప్రధాన్, ప్రయాణికుడు, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ 12 గంటల ప్రయాణమైంది దాణాపూర్ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ వెళ్లాలి. స్టేషన్కు వచ్చాక రైళ్ల రద్దు విషయం తెలిసింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రైల్వేశాఖ సెల్నంబర్లు ఇస్తే బాగుంటుంది. బస్సులో నాగ్పూర్ వెళ్తున్న. రూ.500 ఖర్చుతో ఆరు గంటల్లో మా ఊరు చేరుకునేవాడిని. రైళ్ల రద్దుతో రూ.2వేల ఖర్చు, 12 గంటల సమయం పడుతుంది. – సత్యం, ప్రయాణికుడు, నాగ్పూర్, మహారాష్ట్ర -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు మంగళవారం పట్టాలు తప్పటంతో ఢిల్లీ–చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు లైన్లు ధ్వంసం కన్నాల గేట్ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్–బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. -
చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ.. రోడ్డు ప్రమాదాల్లో పదేళ్లలో 15 లక్షల మంది మృతి
మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.50 లక్షల మంది క్షతగాత్రులు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.రెండింతలైన వాహనాలుజనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.యాక్సిడెంట్ కేసులపై శీతకన్నుఅయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతిహత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు. -
Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం
కాస్గంజ్: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్లోని కస్బా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! -
పెద్దపల్లిలో ఘోరం.. మహిళలపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
పెద్దపల్లి, సాక్షి: పెద్దపల్లి పట్టణ శివారులోని రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను స్థానికులు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయ నగర్కు చెందిన కుక్క అమృత, కుక్క భాగ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి ఇంట విషాదం
జగిత్యాల: ఆర్టీసీ బస్సు కారు ను ఢీకొన్న సంఘటనలో నవవధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన వలిపిరెడ్డి రాజమల్లు, లక్ష్మి కూతురు సంఘవి పెళ్లి ఈనెల 8న జనగామకు చెందిన ఓ యువకుడితో హన్మకొండలో జరిగింది.శనివారం రాత్రి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న సంఘవి సోదరుడు సంకీర్తన్ (30), హైదరా బాద్లో సంఘవితో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన సాధు మునిరాజీ (25)తోపాటు తల్లి లక్ష్మి, తండ్రి రాజమల్లు కారులో జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్ సమీపంలోకి రాగానే జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వీరి కారును ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సంకీర్తన్తోపాటు మునిరాజీ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మి, రాజమల్లు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంకీర్తన్ మేనమామ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పెళ్లైన రెండురోజులకే సోదరుడితో పాటు స్నేహితురాలు మృతి చెందడంతో సంఘవి తీవ్రంగా రోదించింది. గాయాలతోనే ఉన్న తండ్రి రాజమల్లు సంకీర్తన్ చితికి నిప్పంటించడం స్థానికులను కలచివేసింది. -
గుల్బర్గాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
గుల్బర్గా: కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కమలాపురం వద్ద శనివారం(నవంబర్ 9) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా వెళుతున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్గూడ వాసులుగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పంజాగుట్టలో కారు బీభత్సం -
లండన్లో ఘోర ప్రమాదం, చావు బతుకుల మధ్య హైదరాబాద్ యువతి
ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది. హైదరాబాద్కు చెందిన బాధిత యువతి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.హైదరాబాద్ దిల్ సుఖ్నగర్ సమీపంలోని మారుతి నగర్కు చెందిన హిమ బిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమ బిందును డీకొట్టింది దీంతో ఆమెకు తీవ్ర గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిండెట్ గురించి అధికారులు బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
శిల్పారామంలో ప్రమాదం.. మహిళ అడికక్కడే మృతి
సాక్షి, తిరుపతి: తిరుచానూరు శిల్పరామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫన్ రైడ్లో భాగంగా క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెండగా.. మరో మహిళ గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుచానూరు శిల్పారామం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్పారామం క్యాంటీన్ వద్దగల ఫన్ రైడ్లో ప్రమాదం జరిగింది. క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ఇరవై అడుగులు ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరి చెరువులో పడ్డ కారు
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లోని బల్రామ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు మలుపు వద్ద అదుపుతప్పింది. దీంతో ఎగిరి పక్కనున్న చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు ఆదివారం(నవంబర్ 3) వెల్లడించారు. కారు లరిమా నుంచి సూరజ్పుర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు వారి పొరుగువారు కూడా ఉన్నారు. ఆరుగురు ప్రమాదం జరిగిన స్థలంలోనే మృతిచెందగా మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయారు. కారు అతివేగంలో వెళుతుండగా మలుపు తిప్పేటపుడు అదుపుతప్పడంతో చెరువులోకి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. నలుగురు అక్కడికక్కడే మృతి -
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి -
ఢిల్లీలో దారుణం..కొడుకు ముందే తండ్రిపై కాల్పులు
-
సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
-
రోడ్డు ప్రమాదాల పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు
-
రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 474 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని, ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కాగా, గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తెలంగాణలో బాగా పెరిగిపోయింది.ఇదిలా ఉండగా..2023 ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా మరణించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలు ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. రోడ్డు ప్రమాదాల కారణాలు, తీవ్రతను అర్థం చేసుకోవడానికి కేంద్రం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయి. గతేడాది క్షతగాత్రులు 4.63 లక్షలు గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4.63 లక్షల మంది గాయపడ్డారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది 2022 కంటే 4% ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.71 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు 2023కి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు. ప్రమాద మరణాల్లో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్.. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్, అస్సాం, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 23,652 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 18,347మంది, మహారాష్ట్రలో 15,366 మంది మరణించారు. క్షతగాత్రుల్లో తమిళనాడు తొలిస్థానం రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో 72,292 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్లో 55,769 మంది, కేరళలో 54,320 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా, గతేడాది మరణించిన వారిలో 44% మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే గతేడాది మరణించిన ద్విచక్ర వాహనదారుల్లో 70% మంది హెల్మెట్ ధరించని కారణంగా మృత్యువాతపడ్డారు. -
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్కుమార్ జోగ్దండ్లు హెలికాప్టర్లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ను ఉత్తరఖండ్లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి
-
లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం
పౌరీ: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా?
సాక్షి, అమరావతి: పేద ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రోడ్ యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు సంభవించిన ఆపద సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్ వ్యవస్థ పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాల్లోని పేదలకు వైద్య సేవలందించే 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)పైనా చిన్న చూపు చూస్తోంది. 2014–19 మధ్య ఈ రెండు వ్యవస్థలను అంపశయ్య ఎక్కించిన బాబు.. మరోసారి అదే పంధాను అనుసరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి నిర్వహణ సంస్థ అరబిందోకు పైసా విదల్చక పోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో 108, 104 సేవలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి . రూ.140 కోట్లపైనే బకాయి.. సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కాగా, ఏప్రిల్, మే, జూన్ నెలల బిల్లులను జూలై నెలలో చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కనీసం బిల్లులను వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయలేదని తెలిసింది. మరోవైపు జూలై, ఆగస్టు, సెపె్టంబర్ నెలల బిల్లులు వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పరిశీలించినట్లైతే ఆరు నెలల బిల్లులు బకాయి పడినట్లవుతోంది. మొత్తంగా రూ.140 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. నిలిచిపోయిన ఆగస్టు నెల వేతనాలు.. ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో నిర్వహణ సంస్థ 104, 108 వాహనాల డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈఎంటీలకు వేతనాలు సరిగా చెల్లించడం లేదు. సెప్టెంబర్ నెల ముగస్తున్నా.. ఆగస్టు నెల వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలల వేతనాలను సైతం సంస్థ ఆలస్యంగా చెల్లించిందని చెబుతున్నారు. 2019కు ముందు రాష్ట్రంలో 108 అంబులెన్స్లు 336 మాత్రమే ఉండేవి. వీటిని 768కి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెంచారు. అదే విధంగా 104 ఎంఎంయూలను 936 ప్రవేశపెట్టారు. డ్రైవర్లు, ఈఎంటీలకు వేతనాలను సైతం పెంచి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. -
మానవ తప్పిదాల వల్లే ‘ఫార్మా’ల్లో ప్రమాదాలు
సాక్షి, విశాఖపట్నం: చిన్నచిన్న మానవ తప్పిదాలవల్లే ఫార్మా కంపెనీల్లో పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయని హైలెవల్ కమిటీ చైర్పర్సన్ వసుధా మిశ్రా స్పష్టంచేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన విధానాలపై, ప్రమాదాల అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శుక్రవారం విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ తొలిభేటీలో మేథోమథన చర్చ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామికవాడలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏర్పడిన కమిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. కార్మిక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరేంధిర ప్రసాద్, విజయ్కృష్ణన్.. చెన్నై, తిరుపతి ఐఐటీల ప్రొఫెస ర్లు, ఇతర సభ్యులు సూచనలు ఇచ్చారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ‘ఎసైన్షియా’ వంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సహాయంతో ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అవలంభించాల్సి ఉందన్నారు. ప్రమాదాలు జరగకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్..ఇక ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టాలని సూచించినట్లు వసుధా మిశ్రా తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. ఇటీవల జరిగిన ఎసైన్షియా ప్రమాదంలో పూర్తిగా మానవ తప్పిదం ఉందన్నది తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు. -
Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
తుప్కాడి: జార్ఖండ్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి వల్లభ్గఢ్కు వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. తుప్కాడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే వారణాసి నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ రైలును చందర్పురా రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.ఈ ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దానిలో గూడ్స్ రైలు వ్యాగన్లు బోల్తా పడటాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఇటీవలి కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మధురలలో రైళ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్లోని సూరత్లో పంజాబ్లోని భటిండాలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. అయితే డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. Bokaro, Jharkhand: A goods train passing through Tupkadih got detached in two, with two of its wagons overturning after derailment. The incident occurred between Tupkadih and Rajabera sections. Train movement affected and the plying of trains on down line track suspended. A… pic.twitter.com/p3luQ0gppk— ANI (@ANI) September 26, 2024ఇది కూడా చదవండి: ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ -
పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే
సూరత్: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.గుజరాత్లోని సూరత్లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ట్రాక్ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.ఎన్ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ, శుభం శ్రీజైప్రకాష్ జైస్వాల్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న 71 ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్ పోద్దార్ను మెచ్చుకున్నారు. అయితే ఎన్ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్పై ఫోర్జరీ కేసు.. -
పట్టాలు తప్పిన ముజఫర్పూర్- పూణె స్పెషల్ రైలు
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్ను తిరిగి ట్రాక్పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాశ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. సూరత్గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పైలట్కు 19 నెలల తర్వాత విముక్తి -
F2 రేసులో ఘోర ప్రమాదం: భారత డ్రైవర్కు తప్పిన ముప్పు
ఫార్మాలా 2 రేసు సందర్భంగా భారత డ్రైవర్ కుశ్ మైనీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ పెనాల్టీ నుంచి తప్పించుకోలేకపోయాడు. కాగా ఫార్ములావన్ అజర్బైజాన్ గ్రాండ్ప్రి ప్రధాన రేస్కు ముందు ఫార్ములా2 ఫీచర్ రేస్ను నిర్వహిస్తారు. ఇందులో.. 23 ఏళ్ల కుశ్ ‘ఇన్విక్టా రేసింగ్’ టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, రేస్ మొదలయ్యే సమయానికి అనూహ్య ఘటన చోటు చేసుకుంది.కార్లు చిన్నాభిన్నం రేస్ ఆరంభంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పొరపాటుతో కార్లు ఢీకొని ప్రమాదం జరిగింది. రేస్ స్టార్ట్ లైన్ వద్ద ఇంజిన్లో సమస్య ఏర్పడటంతో కుశ్ కారు స్టార్ట్ కాకుండానే ఆగిపోయింది. దాంతో వెనుక నుంచి దూసుకొచ్చిన ఇతర డ్రైవర్లు జోసెఫ్ మారియా, ఒలీవర్ గోత్లను ఇది గందరగోళానికి గురి చేసింది. ఆ రెండు కార్లూ తీవ్ర వేగంతో వచ్చి కుశ్ కారును బలంగా ఢీకొట్టాయి. ఆ తాకిడికి కార్లు చిన్నాభిన్నం అయ్యాయి.ఐదు స్థానాలు పెనాల్టీగాకారులో ఉన్న కుశ్ అదృష్టవశాత్తూ బయటకు రాగలిగాడు. అనంతరం అతడికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రమాదం లేదని నిర్ధారించారు. అయితే, రేసు ముగిసిన తర్వాత ఎఫ్2 నిర్వాహకులు కుశ్పై చర్యలు తీసుకున్నారు. ప్రతీ రేసుకు ముందు జరిగే ‘స్టార్ట్ సెటప్ ప్రొసీజర్’ను సరిగా పాటించకుండా గ్రిడ్పై ప్రమాదానికి కారణమైనందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీ విధించారు. అయితే కుశ్ ఈ రేస్ను పూర్తి చేయలేదు కాబట్టి ఈ శిక్షను మారుస్తూ ‘ఐదు స్థానాలు పెనాల్టీ’గా విధించారు. కుశ్ పాల్గొనే తర్వాతి రేసులో ఈ శిక్ష అమలవుతుంది. The incident that triggered a red flag at the start of the F2 Feature Race 🚩Drivers ok #F2 #AzerbaijanGP pic.twitter.com/VFjNA8M3SQ— Formula 2 (@Formula2) September 15, 2024 -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ కి ప్రమాదం
-
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత తెలుగులో యాత్ర-2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా మెరిశారు. ప్రస్తుతం కోలీవుడ్లో సినిమాలతో బిజీగా ఆయన ఉన్నారు. (ఇది చదవండి: భార్యకు స్పెషల్గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!) #BREAKING | கார் விபத்தில் சிக்கிய நடிகர் ஜீவா!#SunNews | #Jiiva | #CarAccident | #Kallakurichi | @JiivaOfficial pic.twitter.com/yW2JWEllID— Sun News (@sunnewstamil) September 11, 2024 -
యాక్సిడెంట్ తర్వాత రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
జీవితం చాలా చిన్నది: రష్మికా మందన్నా
హీరోయిన్ రష్మికా మందన్నా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సోమవారం ఓ పోస్ట్ని షేర్ చేశారు రష్మిక. ‘‘కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం లేదు. అలాగే పబ్లిక్లో కనిపించడం లేదు. కానీ, ఇందుకు ఓ కారణం ఉంది. నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోలుకునే క్రమంలో వైద్యుల సలహాల మేరకు ఇంట్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. అయితే ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రధాన్యత కల్పించుకోండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అసలు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే ప్రతిరోజూ సంతోషంగా ఉండండి’’ అంటూ పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’, విక్కీ కౌశల్ ‘ఛావ’, ధనుష్–నాగార్జునల ‘కుబేర’, సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. అలాగే ‘ది గాళ్ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తున్నారామె. -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్లోని అగాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు