సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ | Slbc Tunnel Accident: PM Modi Call TO Telangana CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

Published Sat, Feb 22 2025 7:20 PM | Last Updated on Sat, Feb 22 2025 7:42 PM

Slbc Tunnel Accident: PM Modi Call TO Telangana CM Revanth

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోదీకి రేవంత్‌ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం రేవంత్‌ వివరించారు.

సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గంటల ప్రాంతంలో బోరింగ్‌ మెషిన్‌ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్‌ సెగ్మెంట్స్‌ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యలను మంత్రులు , జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement