Tunnel
-
SLBC టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు
-
SLBC టన్నెల్ నుంచి కొనసాగుతున్న మృతదేహాల వెలికితీత
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక.. నాగర్ కర్నూల్ నుంచి ఎనిమిది ఆంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
హెలికాప్టర్ నుంచి చూస్తే టన్నెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా?
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. హరీష్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ(గురువారం) ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) జరగడం దురదృష్టకరం. కానీ, ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని.. అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారాయన. ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొంతన లేదు. హెలికాప్టర్లో వెళ్తున్న మంత్రులు పోటాపోటీగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించడం లేదు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది. రేవంత్కు కౌంటర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎనిమిది మంది ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. అబద్ధాలు మాట్లాడుతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి. ఎక్కడా SLBC సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. మొత్తం పది ఏజెన్సీలకు డైరెక్షన్ కరువైంది. సహాయక చర్యల్లో విఫలమై.. బీఆర్ఎస్పై బుదరల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను చూడటానికి, మా అనుభవంతో సూచనలు చేయడానికి వెళ్తున్నాం. మూర్ఖులు మమ్మల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాంబీఆర్ఎస్ హయాంలోనే పనులుకరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో SLBC పనులు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే BRS ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం. కాంగ్రెస్ హయంలో పనులు మూలకు పడితే.. రూ.100 కోట్ల రూపాయల మొబలైజేషవ్ నిధులిచ్చాం. మా హయాంలో 13 కిలోమీటర్లు పని జరిగింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి BRS పై బుదర జల్లుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది SLBC సహాయక చర్యలపై. తన పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీష్ రావు అన్నారు. సోయిలేకుండా మాట్లాడుతున్నారుఎస్సెల్బీసీలో జరిగిన ప్రమాదం.. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ తరఫున ఈ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. ఇవాళ హరీశ్ రావు నేతృత్వంలో ఎస్సెల్బీసీ వెళ్తున్నాం. ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేస్తాం. తెలంగాణ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వాటర్, నీళ్లు కలిశాయి అని మాట్లాడటం బాధాకరం. మంత్రుల తీరు జాతీయ స్థాయిలో పరువు తీసేలా ఉంది. అందుకే ఆ పదవుల్లో ఉండాలో లేదో వాళ్లే తేల్చుకోవాలి. ::నల్లగొండలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ చేస్తున్నాం : ఉత్తమ్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం మెషీన్ భాగాలను తొలగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాటర్ను బయటకు పంపే క్రమంలో నిన్న(మంగళవారం) రెస్క్యూ కాస్త ఆలస్యమైందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్క్లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని ఉత్తమ్ వివరించారు.‘‘మరో రెండురోజుల్లో ఆచూకీ తెలుసుకుంటాం. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాం. టన్నెల్లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఒక మానవీయ కోణంపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీములను రప్పించాం’’ అని ఉత్తమ్ తెలిపారు.కాగా, గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్న కూడా(మంగళవారం) సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. -
ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎల్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరో ప్రయత్నంలో భాగంగా మంగళవారం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అయితే కార్మికుల క్షేమంపై మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి వరకు వెళ్లిన తొలి బృందం ఇదే..: మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరో రెస్క్యూ బృందం సొరంగంలో ప్రవేశించింది. ర్యాట్ హోల్ మైనింగ్ టీం ప్రత్యేకంగా తమకు కావాల్సిన వస్తువులను సేకరించి, వెల్డింగ్ చేయించుకుని టన్నెల్లోకి తీసుకెళ్లింది. టన్నెల్లో బురద దాటేందుకు వీలుగా, టన్నెల్ సైడ్ గోడలకు రాడ్లు కొడుతూ ప్రత్యేక దారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని వెంటబెట్టుకుని వెళ్లింది. గంటన్నర ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సొరంగం చివరి అంచువరకు వెళ్లిన ఆరో బృందం గాలింపులు నిర్వహించింది. సొరంగం చివరన ప్రమాద స్థలానికి చేరుకున్న తొలి రెస్క్యూ బృందం ఇదే కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు, స్నైఫర్ డాగ్స్, డ్రోన్ ఆపరేటర్లు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణులతో సహా మొత్తం 35 మంది బృందంలో ఉండగా, సొరంగం చివరికి 11 మంది ర్యాట్ హోల్ మైనర్లతో పాటు నలుగురు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో 15–18 మీటర్ల ఎత్తులో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ‘కూలిపోయే ప్రమాదం ఉంది..’ : అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. నేడు ఏడో ప్రయత్నం.. : ఏడో ప్రయత్నంలో భాగంగా బుధవారం ఉదయం మళ్లీ ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన బృందం సొరంగంలోకి వెళ్లనుంది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన తుక్కును గ్యాస్ కట్టర్లతో కట్ చేయడంతో పాటు కంకర, బండ రాళ్లు, మట్టిని తొలగించే ఆపరేషన్ను ప్రారంభించనుంది. సహాయక బృందాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి జేసీబీ యంత్రాలు వినియోగించకుండా ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ల బృందాలతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఎన్నిరోజుల సమయం పడుతుందో చెప్పలేమని ర్యాట్ హోల్ మైనర్ ఫిరోజ్ ఖురేషీ ‘సాక్షి’తో అన్నారు. కన్పించిన టీబీఎం ఉపరితల భాగం: మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ఉపరితల భాగం కనిపించింది. బండ రాళ్లు, కాంక్రీట్ పడడంతో ఈ భాగం ఊర్తిగా ధ్వంసమై కనిపించగా, మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి, మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కిందనుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్పై పడిన మట్టి, బురదను తొలగించేందుకు మెష్ ప్రేమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరుచేసి డీ వాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.ప్రస్తుతం నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల వరక నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు ఐదు మోటార్లతో డీ వాటరింగ్ చేపడుతున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం నీటిని డీవాటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో, ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వారిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం» రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి»డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో టన్నెల్ ఇన్లెట్ పరిశీలన» మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డితో కలిసి సహాయక చర్యల పర్యవేక్షణ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: శ్రీశైల ఎడమ కా ల్వ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, ఇందు కోసం అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకుంటామని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగం, జేపీ కార్యాలయంలో రెండుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సహా ఆయా శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, సహాయ చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. బురదను తొలగించడమే సమస్య‘ఎస్ఎల్బీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఊటతో 40 నుంచి 50 మీటర్ల మేర బురద పేరుకుంది. టన్నెల్లో 11 కి.మీ తర్వాత ప్రాంతం నీటితో నిండి ఉంది. 13.50 కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ఉంది. ఎయిర్ సప్లయ్ పైప్లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం టన్నెల్లో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశాం. దీనిని తొలగించడమే ప్రధాన సమస్య’ అని మంత్రి ఉత్తమ్ చెప్పా రు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఇ.శ్రీధర్, కలెక్టర్ బదావత్ సంతోష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.గ్రౌటింగ్ విఫలం కావడంతోనేనా..? సొరంగం కూలిన ప్రాంతంలో కొన్నిరోజుల కింద నిర్మాణ సంస్థ పీయూ గ్రౌటింగ్ చేసింది. జీఎస్ఐ నుంచి జియాలజిస్టు వచ్చి పరిశీలించి, పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్ పనులు పునః ప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పీయూ గ్రౌటింగ్ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌటింగ్ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫాల్ట్ లైన్ గుర్తించేందుకు జీఎస్ఐ అధ్యయనం సొరంగం కూలడానికి కారణమైన ఫాల్ట్ లైన్ను గుర్తించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సొరంగం ఉపరితలం నుంచి వారు సర్వే చేసి ఏ ప్రాంతంలో మట్టి వదులుగా, బలహీనంగా ఉందో గుర్తించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. బుధవారం మరో జీఎస్ఐ బృందం రాబోతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నిపుణుల బృందం సైతం బుధవారం సొరంగం వద్దకు రానున్నారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే నివేదిక ఇవ్వండి : ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తక్షణమే నివేదిక సమరి్పంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) దక్షిణాది విభాగం.. రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. శ్రీశైలం జలాశయంతో సొరంగం అనుసంధానం కానుండడంతో ఈ ప్రమాదంతో జలాశయంపై ఉండనున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మా వాళ్లను క్షేమంగా అప్పగించండిజార్ఖండ్ కార్మికుల కుటుంబ సభ్యుల ఆవేదనఅచ్చంపేట: బతుకుదెరువు కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చారు.. వారు క్షేమంగా బయటికి తిరిగి వస్తారు కదా.. అంటూ దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమా దంలో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొరంగంలో వాళ్లు ఎలా ఉన్నారో తలుచుకుంటేనే భయమేస్తోంది. మా పిల్లలను మాకు క్షేమంగా అప్పగిస్తే చాలు..’ అని వేడుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులు మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చారు. స్థానిక అధికారులు వారితో మాట్లాడి భరోసా కల్పించారు. తమవారు క్షేమంగా బయటికి రావాలని సొరంగంలో చిక్కుకున్న జగ్దాక్షేస్ అన్న జల్లామ్క్షేస్ చెప్పాడు. ‘నా పెద్ద కొడుకైన సందీప్ సాహు ఆరేళ్ల క్రితం కంపెనీలో పనిచేసేందుకు వచ్చి ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. నా కొడుకు క్షేమంగా వస్తే మా ఊరికి తీసుకెళ్లిపోతా..’ అని సందీప్ తండ్రి జీత్రామ్ సాహు అన్నాడు. -
72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
-
టన్నెల్ లోనే చిక్కుకుపోయిన మరో 8 మంది
-
కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. -
సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోదీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్, మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం రేవంత్ వివరించారు.సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గంటల ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు , జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. -
టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్ 8 మందికి ఆక్సిజన్ అందని పరిస్థితి
-
SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్
-
SLBC టన్నెల్ ప్రమాదం: ఆర్మీని సంప్రదించాం-మంత్రి ఉత్తమ్
నల్లగొండ/నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగ పనుల సన్నాహకాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన వెంటనే టన్నెల్ పైభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోపల చిక్కుకుపోయిన సుమారు 40 మంది కార్మికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరిని బయటకు తీసుచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.👉సీఎం రేవంత్కు ప్రధాని మోదీఫోన్👉ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా👉అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఆర్మీని సంప్రదించాం: మంత్రి ఉత్తమ్ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరంబోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ప్రకంపనలు వచ్చాయిటన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్లు కనిపిస్తోందిటన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారుఆ ఎనిమిది మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాంఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయిఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నాంఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడాం.. రాత్రికల్లా ఆర్మీ బృందాలు చేరుకుంటాయిటన్నెల్లో ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు రంగంలోకి దిగే రెస్క్యూ టీంలతో సంప్రదింపులు జరిపాంఉత్తరాఖండ్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న బృందాన్ని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాంలోపల చిక్కుకున్నవారిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారుటన్నెల్ ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజినీర్లు, ఆరుగురు జయప్రకాశ్ అసోషియేట్స్ఉద్యోగులు చిక్కుకుపోయారు. 👉సుధీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గం. ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.👉నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి SLBC సొరంగ ప్రమాద స్థలానికి బయలుదేరిన ఆరు 108 అంబులెన్సులు. 👉ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ వద్దకు చేరుకున్న సింగరేణి రిస్క్యూ టీం చేరుకోగా.. ప్రత్యేక ఆక్సిజన్ ద్వారా టన్నెల్ లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు.. 👉అధికారులతో మంత్రులు ఘటనపై సమీక్ష జరిపారు. ప్రమాదం జరిగిన దృశ్యం భయంకరంగా ఉందని అధికారులు వాళ్లకు వివరించారు. ఇదీ చదవండి: భూకంపం వచ్చిందన్నట్టుగా ఊగిపోయిన టన్నెల్ప్రమాదంపై కేటీఆర్ స్పందనటన్నెల్ ప్రమాదానికి రేవంత్దే పూర్తి బాధ్యత. సుంకిశాల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలి.గుత్తా దిగ్భ్రాంతి ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతిక్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సూచనతుమ్మల ఆరాSLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సంఘటనపై ఆరాతీసిన మంత్రి తుమ్మలక్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి తుమ్మలటన్నెల్లోకి నీరు టన్నెల్లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచి పోగా అధికారులు దానిని పునరుద్ధరించారు. అయితే.. ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సింగరేణి నుంచి రెస్క్యూ టీంను రప్పించే పనిలో అధికారులు ఉన్నారు. బయటకు 42 మంది: మంత్రి జూపల్లిటన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సాక్షితో చెప్పారు. ఇప్పటిదాకా 42 మంది బయటకు వచ్చారని, ఇంకా ఏడుగురు టన్నెల్లో ఉన్నారని, వాళ్లనూ బయటకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారాయన. టన్నెల్ చిక్కుకున్న వాళ్లుపంజాబ్-గురువీర్ సింగ్జమ్ము కశ్మీర్- సన్నీసింగ్జార్ఖండ్- సందీప్, సంతోష్, జట్కా ఇరాన్ఇద్దరు ఏఈలు.. శ్రీనివాసులు, మనోజ్ రూపేణామరొకరి వివరాలు తెలియాల్సి ఉందిమంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..అంతకు ముందు మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. నా దగ్గర ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. ఒక్కసారిగా టన్నెల్లో మట్టి, నీరు వచ్చాయి. లోపల ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు. మెజారిటీ కార్మికులను మాత్రం బయటకు తీసుకొచ్చాం అని అన్నారు.ప్రమాద సమయంలో టన్నెల్లో ఎంత మంది కార్మికులు ఉన్నారనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారులు, మంత్రులు ఒక్కో లెక్క చెబుతున్నారు. అయితే ఆ కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే!. తొలుత ముగ్గురు కార్మికులను బయటకు తీసుకొచ్చారు. మిలిగిన వాళ్లను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.ఉదయం షిఫ్ట్ కోసం కార్మికులు టన్నెల్లోకి వెళ్లారు. ఉదయం 8.20గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కార్మికులను బయటకు తీసుకొచ్చి జెన్కో ఆస్పత్రికి తరలించాం. మిగతావాళ్లనూ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. :::మీడియాతో ఎస్పీ వైభవ్సీఎం రేవంత్ ఆరాఎస్ఎల్బీసీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులకు సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ హెలికాఫ్టర్లో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి పర్యటన రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ లక్ష్యంతోనే..నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్ ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మూలన పడ్డ పనులుఅయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం.. నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్ నుంచి మూలపడ్డాయి. అయితే నల్లగొండ మంత్రుల చొరవతో ఈ మధ్యే పనులు మళ్లీ మొదలయ్యాయి. అయితే సుదీర్ఘ విరామానంతరం పనులు జరపడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆరుసార్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనుల గడువును పొడిగించాయి. తాజా గడువు కూడా జూన్ 2026 వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచగా.. ఈ మధ్యే మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2,646కోట్లు ఖర్చు చేశారు. -
Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!
సోనామార్గ్: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్–మోర్హ్ టన్నెల్గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం ‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్లోని లాల్చౌక్లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్క్రీమ్ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్చౌక్కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఆరోజు మారథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. నూతన శకమిది ‘‘ఇది జమ్మూకశ్మీర్కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్ భారత్కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్ను ప్రారంభించాక మోదీ ఓపెన్టాప్ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్గిర్, గుండ్, కంగన్ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం. దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్ పొగడ్తలు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్ ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్ టన్నెల్ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్ అన్నారు. రూ.2,716 కోట్ల వ్యయంతో.. రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బల్ జిల్లాలో శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై గగన్గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను నిర్మించారు. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం పాల్గొన్నారు. #WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today. CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1— ANI (@ANI) January 13, 2025 #WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel. CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm— ANI (@ANI) January 13, 2025 -
పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!
ఇది ప్రపంచంలోనే పొడవాటి రోడ్డు సొరంగం. ఆస్ట్రేలియాలోన సిడ్నీ నగరంలో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 26 కిలోమీటర్లు. ఈ సొరంగ రహదారి పేరు ‘వెస్ట్ కనెక్స్’ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ సొరంగ నిర్మాణం చేపట్టి, గత ఏడాది నవంబరు 26 నాటికి దీనిని పూర్తి చేశాయి. ఉభయ ప్రభుత్వాలూ హోమ్బుష్–కింగ్స్గ్రోవ్ల మధ్య చేపట్టిన 33 కిలోమీటర్ల మోటారు రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించాయి. ఈ రహదారి నిర్మాణం పనులు 2016 డిసెంబర్ 20న ప్రారంభించగా, సొరంగం సహా మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. దీని నిర్మాణానికి 4500 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల ఖర్చు (రూ.2.60 లక్షల కోట్లు) జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవాటి సొరంగ రహదారిగా రికార్డులకెక్కింది.(చదవండి: మనం ధరించే డ్రెస్కి ఇంత పవర్ ఉంటుందా..?) -
హెజ్బొల్లా టన్నెల్ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
లెబనాన్లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్బొల్లా టన్నెల్కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్ రూమ్లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో హెజ్బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC— Israel Defense Forces (@IDF) October 15, 2024 ‘‘దక్షిణ లెబనాన్లోని గ్రామాల్లో హెజ్బొల్లా గ్రూప్ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 హమాస్ తరహా దాడికి హెజ్బొల్లా టన్నెల్ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. -
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ -
‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న బృందం బౌఖ్నాగ్ దేవతను వేడుకున్నారట.గత ఏడాది నవంబర్లో సిల్క్యారా టన్నెల్లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!
ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. మృతుడిని పితోర్గఢ్ జిల్లా గోవింద్ కుమార్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్తో వీరిని బయటకు తీసుకువచ్చారు. -
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
'అరుంధతి' సినిమాని తలపించే కథ..!
సినిమాని తలపించే కథ ఈ సొరంగం స్టోరీ. వాస్తవమో కాదో తెలియదు కానీ. ప్రజలు మాత్రం అందులోకి అడుగుపెట్టాలంటే హడలిపోతారు. చూసేందుకు లోపలకి వెళ్తే బాగుండును అనేంత అందంగా ఉంటుంది. తీరా వెళ్తే మాత్రం అంతే సంగతులు. బయటి నుంచి చూడటానికి రంగురంగులుగా బాగానే కనిపిస్తుంది గాని, ఈ సొరంగంలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు వణికిపోతారు. ఇందులో దయ్యాలు సంచరిస్తుంటాయని, ఇందులోకి వెళ్లే వారిని అవి ముప్పుతిప్పలు పెడతాయని స్థానికులు చెబుతారు. అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్పోర్ట్ సమీపంలో ఉంది. దాదాపు వందేళ్ల కిందట దీనిని సెన్సాబాగ్ అనే ఇంజినీర్ నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఇది సెన్సాబాగ్ టన్నెల్గా పేరుపొందింది. ఒక దుండగుడు తనను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని సురక్షితంగా పారిపోవడానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి, ఈ సొరంగంలోనే దాక్కున్నాడు. పసిపిల్లకు అపకారం జరగకూడదని పోలీసులు అప్పటికి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ దుండగుడు ఇక పసిపిల్లతో తనకు పనిలేదని భావించి ఆమెను చంపేసి, అక్కడే పడేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు. అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్, ఆయన మనవరాలి ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికుల కథనం. ఈ సొరంగంలోంచి ప్రయాణిస్తుంటే ఒక్కోసారి కారు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోతుందని, సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని, పసిపిల్ల ఏడుపు వినిపిస్తుందని కూడా చెబుతారు. (చదవండి: గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!) -
గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!
ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే.. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు. దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది. బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి. These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them. In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5 — Fascinating (@fasc1nate) March 18, 2024 (చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!) -
PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ ప్రారంభించిన మోదీ
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులను తాను పదేళ్లలో చేసిచూపించినట్టు మోదీ కామెంట్స్ చేశారు. కాగా, టన్నెల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఘన విజయం సాధించనుందని అర్థం అవుతోంది. ఎన్నికల్లో విజయం కోసం నేను పనిచేయను. ప్రజల కోసమే పనిచేస్తాను. యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi inaugurates the Sela Tunnel. pic.twitter.com/hSeI30lhqk — ANI (@ANI) March 9, 2024 70 ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని నేను పదేళ్లలోనే చేసి చూపించాను. అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, "Our vision is that of 'Ashta Lakshmi' for the development of the Northeast. Our Northeast is becoming a strong link for trade and tourism with South Asia and East Asia." pic.twitter.com/c1PyO37H7M — ANI (@ANI) March 9, 2024 కాగా, అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్ పార్క్లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, You must have heard of 'Modi Ki Guarantee'. You will realize its meaning once you reach Arunachal. The entire Northeast is a witness to this. I laid the foundation of the Sela Tunnel here in 2019, and today… pic.twitter.com/tqjnNd2fh6 — ANI (@ANI) March 9, 2024 ఈ టన్నెల్ విశేషాలు ఇవే.. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది. -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్తంగ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
ఇలా ‘వెలిగొండ’గా మరో కల సాకారం
నాడొక కల.. నేడొక నిజం.. అదే వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన ఆయన.. రెండో టన్నెల్ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, అమరావతి వరదాయినికి మహానేత వైఎస్ శ్రీకారం.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. వెలిగొండ.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. నల్లమల పర్వతశ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. అతితక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలి‘కొండంత’ చిత్తశుద్ధి.. ఇక వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. సీఎం రమేష్కు కట్టబెట్టిన రెండో సొరంగం మిగిలిన పనులను రద్దుచేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ఇక తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ఇలా ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.1,046.46 కోట్లను సీఎం జగన్ ఖర్చుచేశారు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. బాబు దోపిడీ కొండంత.. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయంచేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. అలాగే, 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వచ్చే సీజన్లో నీరు విడుదల ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. మాది చెప్పింది చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు హామీలు చెప్పటం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసే ప్రభుత్వం మాది. మాటిస్తే మడమ తిప్పని నైజం మా సీఎం జగనన్నది. గతంలో సంక్రాంతి, దసరా, ఉగాదికి పూర్తిచేస్తాం అని టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి నిధుల మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలతో ఈ ప్రాంత వాసుల కోసం పాటుపడి ఈరోజు ప్రాజెక్టు పూర్తి కావటానికి దోహదపడిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటారు. త్వరలోనే సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి రికార్డు సమయంలో పూర్తి.. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడంలో సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనం. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13 నాటికి.. రెండో సొరంగాన్ని రికార్డు సమయంలో మంగళవారం నాటికి పూర్తిచేశాం. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తిచేయడానికి సీఎం జగన్ దిశానిర్దేశం ఎంతో దోహదం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి, ఆయకట్టుకు నీళ్లందిస్తాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండను ఆయన తనయుడు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తుండటం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. – మురళీనాథ్రెడ్డి, చీఫ్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టు -
రావికమతం మండలం కొమిర వద్ద బయట పడిన సొరంగం
-
ఆ చెక్కులు వెనక్కిచ్చేస్తాం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని సిల్కియారా వద్ద సొరంగంలో గత నెలలో 17 రోజుల పాటు చిక్కుబడిపోయిన 41 మంది కార్మికు లను రక్షించడంలో కీలకమైన 12 మంది ర్యాట్–హోల్’ గని కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ‘‘అన్ని రకాల యంత్రాలు విఫలమైన వేళ.. మేం ఎలాంటి షరతులు పెట్టకుండా ప్రాణాలనొడ్డి మార్గం తయారు చేశాం. సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలుపలికి తెచ్చాం. ఇందుకుగాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేవలం రూ.50 వేల చొప్పున చెక్కులిచ్చింది. మాకీ ప్రతిఫలం సరిపోదని చెప్పాం. అధికారుల నుంచి, ఇప్పటికీ జవాబులేదు. ఈ చెక్కులు మాకొద్దు. మేమందరం వాపసు చేస్తాం’’ అని మైనర్లలో ఒకరైన వకీల్ హసన్ పీటీఐకి తెలిపాడు. ప్రభుత్వం తమకు శాశ్వత ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశాడు. -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు. అయితే ర్యాట్ హోల్ మైనర్స్.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం. ఆపరేషన్లో సహకరించిన మైనర్స్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్ 12వ తేదీన 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. -
IDF: హమాస్ మాస్టర్ ప్లాన్ భగ్నం?
ఇజ్రాయెల్ ఆసక్తికర వీడియో ఫుటేజీ ఒకటి విడుదల చేసింది. గాజా స్ట్రిప్ కింద హమాస్కు చెందిన భారీ సొరంగం కనుగొన్నట్లు ఆదివారం ప్రకటించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ టన్నెల్.. కీలకమైన ఎరెజ్ ప్రాంత సరిహద్దు ప్రాంతానికి అనుసంధానమై ఉందని తెలిపింది. అంతేకాదు.. ఇజ్రాయెల్పై దాడుల కోసం హమాస్ దాచుకున్న భారీ ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర గాజా ఎరెజ్ సరిహద్దు వద్ద 400 మీటర్ల దూరం నుంచి మొదలైన ఈ టన్నెల్.. మొత్తం నాలుగు కిలోమీటర్ల దూరం గాజాకు కలిపి ఉంది. చిన్నసైజు వాహనాలు సైతం ఆ టన్నెల్ గుండా ప్రయానించగలవని, మందమైన గోడలతో ఏర్పాటు చేసిన ఈ సొరంగంలో కొంత భాగం కాంక్రీట్తో ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) తన ప్రకటనలో తెలిపింది. EXPOSED: The biggest Hamas terrorist tunnel discovered. This massive tunnel system branches out and spans well over four kilometers (2.5 miles). Its entrance is located only 400 meters (1,310 feet) from the Erez Crossing—used by Gazans on a daily basis to enter Israel for work… pic.twitter.com/RcjK5LbvGL — Israel Defense Forces (@IDF) December 17, 2023 టన్నెల్ గుండా రవాణా సదుపాయంతో పాటు విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆర్మీ ఒక వీడియోను సైతం విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో హమాస్ జరిపిన దాడుల ప్రధాన సూత్రధారి మహమద్ యహ్యా నేతృత్వంలోనే ఈ టన్నెల్ ఏర్పాటు అయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ టన్నెల్ కోసం భారీ సంఖ్యలో ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తోంది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ సోదరుడే ఈ మహమద్ యహ్యా. ఇదిలా ఉంటే.. డిసెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 800 వద్ద సొరంగాల్ని కనిపెట్టినట్లు, అందులో 500 టన్నెల్స్ని నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించుకుంది. -
అవుకు టన్నెల్ 2 అంటే?
మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుకు టన్నెల్ 2 ను ప్రారంభించారు మనం వార్తల్లో చదువుకున్నాం.. అసలు ఇదేంటి? ఇది ఎక్కడుంది? దీని వల్ల ఉపయోగం ఏంటి?కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఉండిపోతుంది.. ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండదు.. అది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది...శ్రీశైలం డ్యాం కెపాసిటీ మించి వరదలు వచ్చినప్పుడు అవి సముద్రం పాలు కాకోకుండా దానిని మనము కరువు జిల్లాలైన రాయలసీమకు మళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది???? అనేదానికి రూపకల్పనే హంద్రీనీవా సుజల స్రవంతి మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు..శ్రీశైలం బ్యాక్ వాటర్ కుడికెనాలు నుంచి ఈ ప్రాజెక్టులు మొదలవుతాయి. భానకచర్ల రెగులేటర్ ద్వారా వెలుగోడు, బ్రహ్మ సాగరం, సోమశిల,కండలేరు ఆ విధంగా చెన్నైకి వాటర్ వెళ్ళిపోతుంది.. దానిని తెలుగు గంగ ప్రాజెక్టు అని అంటారుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కొంత తెలుగుగంగ కు, కేసీ కెనాల్ కు కొంత గోరుకల్లు రిజర్వాయర్కు వెళుతుంది.. అక్కడ నుంచి అవుకు రిజర్వాయర్కు వచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయరు అక్కడినుంచి గండికోట రిజర్వాయర్ కు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ధర్మవరం, నాగసముద్రం అలా అనంతపురం వైపుకు వెళ్తుంది.. గండికోట నుంచి కడప చిత్తూరు కు ఈ వాటర్ వామి కొండ, సర్వారాజసాగర్ అలా 9 రిజర్వాయర్ల ద్వారా ఈ నీరు వెళ్ళిపోతుంది...హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ గా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వెళ్తే ఈ గాలేరు నగరి ప్రాజెక్టు నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది... 265,000 ఎకరాలకు (1,070 కిమీ2) సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గాలేరు నగరి ప్రాజెక్టును నిర్మించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువలో ఈ అవుకు సొరంగం కీలకమైనదని, శ్రీశైలంలో వరదలు వచ్చిన 15 రోజుల్లో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ను నింపేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. శ్రీశైలం వరదల సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను మళ్లించాలన్నది లక్ష్యం.దీని వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 640 గ్రామాల్లోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో రెండు సొరంగాలు ఎందుకు??? మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో మూడవ సొరంగం కూడా నిర్మాణం అవుతుంది!!! ముఖ్యమంత్రి జగన్ గారు రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఈ విధంగా కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని సముద్రంలో కలవనీయకుండా ఒడిసి పట్టి మనం గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా అవుకు టన్నెల్స్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని మల్లించి అక్కడ నుంచి మనం గండికోట రిజర్వాయర్కు మళ్ళీ ఇస్తాం.. ఇక్కడ నుండి గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాలకు తాగునీరు సాగునీరు లభ్యమవుతుంది... ఒకటే టన్నెల్ సొరంగం ఉంటే కేవలం 5000 క్యూసెక్కుల నీరు మాత్రమే మళ్ళించగలరు అదే మనము రెండు మూడు సొరంగాలు ద్వారా దాదాపు 20వేల క్యూసెక్కుల నీటిని మరలిస్తూ 30 దినాలలో 38 టీఎంసీల నీటిని మనం గండికోట రిజర్వాయర్ వైపు మళ్ళించవచ్చు.. అందుకనే రెండు టన్నెల్ లు కట్టారు.. మూడవ టన్నెలు కూడా రాబోతుంది... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు -
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుఫాను)కారణంగా ఇక్కడి వాతావరణంలో వేడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అదే సమయంలో వాయు కాలుష్య స్థాయిలో కూడా ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. ఇక్కడి ఆనంద్ విహార్లో ఏక్యూఐ 388, అశోక్ విహార్లో 386, లోధి రోడ్లో 349, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏక్యూఐ 366గా నమోదయ్యింది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎండీ)లో శనివారం ఉదయం ఒక మోస్తరు పొగమంచు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 28 అనంతరం గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. నవంబర్ 2 నుంచి కాలుష్య నివారణ చర్యలు చేపట్టిన దరిమిలా గాలి నాణ్యతలో మెరుగదల చోటుచేసుకుంది. అనవసరమైన నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు నిషేధించడం, కాలుష్య కారక వాహనాలు రోడ్లపైకి రావడాన్ని నిషేధించడంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం -
ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం
ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్ఎల్) తెలిపింది. ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్గావ్లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే.. -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టన్నెల్ టైంపాస్ పై వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నప్పుడు వారు ఎలా టైమ్ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్కు చెందిన అంకిత్ టన్నెల్లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. ‘టన్నెల్లో గడిపిన 17 రోజులు టైమ్ పాస్ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్, సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్లం. టన్నెల్లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్టైల్స్ వాడాం’అని అంకిత్ చెప్పాడు. ‘అయితే, టన్నెల్లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్ వివరించాడు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్దామ్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్కు బాంబు బెదిరింపులు -
ఉత్తర కాశీ టన్నెల్ వర్కర్స్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్
రిషికేష్ : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్లోని ఎయిమ్స్కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు టచ్లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
నంద్యాల జిల్లా: అవుకు రెండో టన్నెల్ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సీమ ప్రజలకు వరం అవుకు రెండో టన్నెల్ రెడీ
-
నెరవేరిన రాయలసీమ-నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం
-
ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఎయిమ్స్కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్లు, వీల్చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది. ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు -
అవుకు రెండో టన్నెల్ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. -
జలసిరుల సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. సీమ చరిత్రలో మేలిమలుపు ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా పూర్తి సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె ఏటా రెండు పంటలు.. గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు కల నెరవేరింది రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు. -
రిషికేశ్లోని ఎయిమ్స్కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్లోని ఎయిమ్స్కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ
ఢిల్లీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్ వాక్తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు. సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు. మోదీ భావోద్వేగం.. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
ఉత్తరాఖండ్ టన్నెల్ నేర్పిన పాఠం! 'పేదల జీవితాలతో ఆడుకోవద్దు'!
దీపావళి రోజున ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో 41 మంది చిక్కుకుపోయిన ఘటన యావత్త్ దేశాన్ని కలవరిపరిచింది. వారంతా బయటకు రావాలని కులమతాలకు అతీతంగా అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయో లేక ఆ కూలీలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్న రెస్క్యూ బృందాల కృషికి అబ్బురపడి ప్రకృతి అవకాశం ఇచ్చిందో గానీ వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు కూడా ప్రకటించడం అందర్నీ సంతోషంలో ముచ్చెత్తింది. దాదాపు 17 రోజుల నరాల తెగే ఉత్కంఠకు తెరపడి జయించాం అనే ఆనందాన్ని ఇచ్చింది. సరే గానీ ఈ ఉత్తర కాశీ టన్నెల్ ఘటన మన భారత ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఓ గొప్ప పాఠాన్ని నేర్పాయి. అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది. అలాగే పర్యావరణం కూడా ఎలా మసులుకోవాలో మానవుడిని పరోక్షంగా హెచ్చరించింది. ఆ ఉత్తర కాశీ ఘటన నేర్పిన గుణపాఠం ఏంటంటే.. నిజానికి ఆ ఉత్తరకాశీ సిల్క్యారా సోరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వం చార్థామ్ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన నిర్మాణం. ఇది హిందూ ప్రముఖ క్షేత్రాలను కలుపుతుంది. ఇది పూర్తి అయితే యమునోత్రికి వెళ్లే యాత్ర మార్గం 20 కిలోమీటర్లు తగ్గుతుంది. భక్తుల చార్ధామ్ యాత్ర సులభతరం చేసేందుకు నిర్మించిన భూగర్భ మార్గం అని చెప్పాలి. కానీ ఇలా అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టుల్లో పేద ప్రజల జీవితాలు ఎలా అగాధంలో పడతాయనేది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ ఘటన. ఇప్పటి వరకు మనం నిర్మించిన చాలా ప్రాజెక్టులో చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా ఇలానే పోయాయా అనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఘటనలు జరిగిన మీడియా మాధ్యమాలు, వార్త పత్రికల పుణ్యమాని ఒకటి రెండు రోజులే హాటాపిక్గా ఆ విషయంగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అబ్బా! భారత్ ఎంతో ముందకు పోతుంది. ఎన్నో ఫైఓవర్లు, భూగర్భ రైలు మార్గాలు ఏర్పాటు చేసేశాం, టెక్నాలజీని అందుకుంటున్నాం అని స్టేమెంట్లు నాయకులు ఇచ్చేస్తుంటే..అదే నిజం అని గర్వంగా ఫీలైపోతాం. నిజానికి ఆయా పెద్ద పెద్ద రహాదారుల లేదా రైల్వే నిర్మాణాలకు వెనక ఉన్న కార్మికుల శ్రమ ఎవ్వరికి తెలియదు. ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో పేదల జీవితాలు ఎలా చిధ్రమయ్యాయి అన్నది కూడా పట్టదు. నాయకులు, అధికారులు ఇలాంటి పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడూ ఇవన్నీ కామన్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్తరకాశీ లాంటి కొన్ని ఘటనలు తెరమీదకు రాకుండానే కనుమరుగయ్యాయి. అందువల్లే సాధారణ ప్రజలకు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయం కూడా తెలియదు. ఈ టన్నెల్ కూలిన ఘటన ప్రభుత్వాలకు, పరిశ్రమలకు పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని నొక్కి చెప్పింది. కూలే అవకాశం ఉందని ముందే తెలుసా..! ఈ టన్నెల్ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది. ఇదే కంపెనీ కాంట్రాక్టర్లు గతంలో మహారాష్ట్ర థానే జిల్లాలో నాగ్పూర్-ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వేని నిర్మించిన ఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మంది కార్మికులు, ఇంజనీర్లు మరణించారు. దీంతో ఆయ కంపెనీ కాట్రాక్టర్లపై ఎఫైర్ కూడా నమోదైంది. మరీ మళ్లీ అదే కంపెనీకి ఈ ఉత్తరకాశీ టన్నెల్ ప్రాజెక్ట్ అప్పగించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక జర్మన్-ఆస్ట్రియన్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ బెర్నార్డ్ గ్రుప్పీ మన భారత కంపెనీ నవయగ ఇంజనీరింగ్ లిమిటెడ్కి టన్నెల్ నిర్మాణ ప్రారంభానికి ముందు నుంచి కూడా టెండర్ డాక్యుమెంట్లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాల సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి ప్రమాదాల సంభవిస్తే బయటపడేలా ఎస్కేప్ పాసేజ్ని నిర్మించమని 2018లోనే ఆదేశించింది. మరీ ఇక్కడ సొరంగం కూలిపోయేంత వరకు కూడా దాన్ని ఎందుకు నిర్మిచలేదనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం బయట పడ్డ ఆ కూలీలంతా ఈ ఎస్కేప్ పాసేజ్ నుంచే సురక్షితంగా బటయకొచ్చిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ పర్యావరణాన్ని ప్రమదంలో పడేస్తుందా? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలకు నిలయం హిమాలయ పర్వతాలు. దాదాపు 45 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినవి. నిజానికి ఈ ప్రాంతం ఎక్కువుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కూడా. పైగా ఇక్కడ శిలలు అవక్షేపణ శిలలుగా ఉంటాయి. పైగా ఇక్కడ పర్యావరణం అస్థిరంగ ఉంటుంది. నిర్మాణ పద్ధతులకు అస్సలు అనూకులమైనది కూడా కాదు. అలాంటి ప్రదేశంలో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పనులు ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే. ఈ విషయమై ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్కె పట్నాయక్ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మన జీవన శైలి సౌలభ్యానికి అవసరమైన మార్పలు ఎంత అవసమో పర్యావరణాన్ని విఘాత కలగించకుండా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం. లేదంటే ప్రకృతి ప్రకోపానికి బలవ్వక తప్పదు. కానీ ఇలాంటి విపత్తులో బలయ్యేది కూడా పేద కార్మికులే అనే విషయం గుర్తించుకోవాలి అధికారులు. (చదవండి: ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన) -
ఉత్తరకాశీలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించటంపై సీఎం వైఎస్ జగన్ హర్షం
-
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్లు, టూత్పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. ఉత్తరాఖండ్లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా ఈ రెస్క్యూ మిషన్లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. जीवन और मृत्यु के मैराथन संघर्ष के बीच यह करोड़ों देशवासियों के ‘उम्मीद’ की जीत है। 17 दिन तक एक सुरंग से बिना हिम्मत हारे वापिस लौटने वाले सभी 41 श्रमिकों के आत्मबल को मेरा प्रणाम। NDRF और SDRF की टीमों समेत इस रेस्क्यू मिशन को सफल बनाने वाले हर एक सदस्य को साधुवाद। हम देश की… — Gautam Adani (@gautam_adani) November 28, 2023 మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. And after all the sophisticated drilling equipment, it’s the humble ‘rathole miners’ who make the vital breakthrough! It’s a heartwarming reminder that at the end of the day, heroism is most often a case of individual effort & sacrifice. 🙏🏽👏🏽👏🏽👏🏽🇮🇳 #UttarakhandTunnelRescue pic.twitter.com/qPBmqc2EiL — anand mahindra (@anandmahindra) November 28, 2023 ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. #Maxwell digs a hole against India #INDvsAUS But hey, an Aussie led a different kind of dig saving 41 lives! 💪 My gratitude to NDRF , SDRF, Army, our rat miners and all those involved in this incredible rescue mission. 🇮🇳🇮🇳 #UttarakhandTunnelRescue — Harsh Goenka (@hvgoenka) November 28, 2023 బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు. Uttarkashi Tunnel Rescue Operation Live Updates: All Workers Rescued Safely - Heroic and outstanding sense of duty displayed by rescuers. Enduring resilience displayed by those rescued. Makes our nation proud🙏🙏👏👏👏 https://t.co/q2vqmUTRsG — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 28, 2023 -
సొరంగం నుంచి బయటపడ్డ కొడుకును చూడకుండానే తండ్రి మృతి
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా దుమారియా బ్లాక్కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు. భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ‘మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని’ తెలిపారు. బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. ‘భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడని, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని’ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ -
‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ నేపధ్యంలో తొమ్మిదేళ్ల క్రితం హర్యానాలో జరిగిన ప్రిన్స్ రెస్క్యూ ఆపరేషన్ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోగల హల్దేహరి గ్రామంలో తొమ్మిది ఏళ్ల క్రితం బోరుబావి ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ 60 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో పడిపోయాడు. మూడు రోజులపాటు అదే బావిలో మగ్గిపోయాడు. అయితే సైన్యం బోరుబావి దగ్గర సొరంగం నిర్మించి ఆ బాలుడిని రక్షించింది. అది జూలై 21, 2006.. హల్దేహరి గ్రామానికి చెందిన ప్రిన్స్ తన స్నేహితులతో ఆడుకుంటూ, తెరిచివున్న బోరుబావిలో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని ప్రిన్స్ కుటుంబసభ్యులకు తెలిపారు. కొడుకు బోరు బావిలో పడిపోయాడని తెలియగానే వారంతా నిస్తేజంగా మారిపోయారు. కొద్దిసేపటికే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ప్రిన్స్ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు సైన్యం సహాయాన్ని కోరారు. వెంటనే భారత సైన్యం ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు మొదలుపెట్టింది. చీకట్లో ప్రిన్స్ భయపడకుండా ఉందేందుకు సైన్యం మొదట బోర్వెల్లో లైట్లు ఏర్పాటు చేసింది. అనంతరం అతనికి తాడు సహాయంతో బిస్కెట్లు, నీళ్లు, జ్యూస్ అందించారు. దాదాపు 50 గంటల పాటు శ్రమించిన అనంతరం సైన్యం ప్రిన్స్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ప్రిన్స్ను బోర్వెల్లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఆ బోర్వెల్ దగ్గర సొరంగం నిర్మించింది. ఈ మార్గం గుండా సైన్యం ప్రిన్స్ దగ్గరకు చేరుకుంది. ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఆ సమయంలో దేశ ప్రజలంతా ప్రిన్స్ క్షేమం కోరుతూ ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రస్తుతం ప్రిన్స్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం ప్రిన్స్ ఉంటున్న గ్రామాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రిన్స్ పేరుతో వచ్చిన పరిహారంతో ఆ బాలుని కుటుంబం ఇల్లు నిర్మించుకుంది. ఇది కూడా చదవండి: కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు -
ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు. ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్లో సంభాషించారు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనిలో హైదరాబాద్కు చెందిన బోరోలెక్స్ ఇండ్రస్ట్రీస్ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్లోని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు. టన్నెల్లో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్ చేసే విషయమై సలహా అందించాలని వారు డాక్టర్ సతీష్ రెడ్డిని కోరారు. ఈ నేపధ్యంలో ఆయన ఇందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. ఈ తరుణంలో బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్ను సూచించారు. తరువాత 800 ఎం.ఎం. పైపులైన్ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించాడు. ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ యంత్రాలను, ఇద్దరు కట్టింగ్ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సంఘటనా స్థలానికి తరలించింది. వారు నవంబరు 25న బేగంపేట విమానాశ్రయం నుండి డెహ్రాడూన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి వెళ్లారు. కొద్ది గంటల సమయంలోనే టన్నెల్లో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్లను కట్ చేసే పని మొదలు పెట్టారు. తద్వారా ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్కు అనువైన పరిస్థితులు కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భాస్కర్ కుల్బే తదితరులు టన్నెల్ సహాయక చర్యల్లో చేయూతనందించిన బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది సురక్షితం -
వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘టన్నెల్ ఆపరేషన్లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. My appreciation for the tireless commitment and unwavering efforts of the rescue team in the Uttarkashi Tunnel Operation! Their determination and bravery is an inspiration to all of us! I am relieved that all 41 of the trapped workers have safely been evacuated from the… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2023 ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఇదీ చదవండి: వాళ్లు సొరంగాన్ని జయించారు! -
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
-
వాళ్లు సొరంగాన్ని జయించారు!.. ఎప్పుడేం జరిగింది?
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్నిరోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్లో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతమయ్యేది కాదని పుష్కర్సింగ్ ధామీ అన్నారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం సొరంగం ముఖద్వారం వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కార్మికులకు కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం నెలకొంది. హర హర మహాదేవ, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి. సొరంగం బయట ఉన్నవారంతా పరస్పరం ఆలింగనాలతో ఆనందం పంచుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం అభినందనలు తెలుపుకున్నారు. సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు తమ మొర ఆలకించాడని చెమర్చే కళ్లతో వారు చెప్పారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో కార్మికుల కోసం ఇంతకుముందే 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీన కార్మికులు సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చదవండి: ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో కీలక పాత్ర వీరిదే.. ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. బొగ్గు గనుల్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తయిన సొరంగాలను అడ్డంగా తవ్వడానికి ర్యాట్–హోల్ మైనింగ్ టెక్నాలజీ వాడుతుంటారు. కేవలం ఒక్క మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగాలు ఉంటాయి. మేఘాలయ బొగ్గు గనుల్లో ఈ సాంకేతికతను వాడడాన్ని 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ర్యాట్–హోల్ మైనింగ్పై నిషేధం అమలవుతోంది. కానీ, ఇతర నిర్మాణ పనుల్లో అనధికారికంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. సిల్క్యారా సొరంగంలో మట్టి శిథిలాలను తవ్వడానికి 12 మంది ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. -
ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో కీలక పాత్ర వీరిదే..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్ 12న టన్నెల్ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్-హోల్ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్ను నియమించారు. మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. -
ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగమైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిరంతరం తనతో టచ్లో ఉంటూ, రెస్క్యూ ఆప్కు సంబంధించిన అప్డేట్లు తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) (అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ) #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, " I want to thank all the members who were part of this rescue operation...PM Modi was constantly in touch with me and was taking updates of the rescue op. He gave me the duty to rescue everyone safely… pic.twitter.com/TldZLK6QEB — ANI (@ANI) November 28, 2023 -
నిషేధించిన పద్ధతే.. 41 మంది కార్మికులను కాపాడింది!
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి చివరికి నిషేధించిన పద్దతే దిక్కైంది. భారతీయ సాంకేతికతతో పాటు అమెరికా నుంచి తీసుకొచ్చిన భారీ యంత్రాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరికి గతంలో నిషేధించిన ర్యాట్ హోల్ పద్దతినే ఉపయోగించారు. ఆరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నప్పటికీ చివరికి అత్యంత ప్రమాదకర విధానంలోనే రెస్క్యూ బృందాలు చేరుకోగలిగారు. అసలు ఏంటి ఈ ర్యాట్ హోల్ మైనింగ్? ఎందుకు నిషేధించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. పర్యావరణ ఆందోళనలతో నిషేధం.. ర్యాట్ హోల్ మైనింగ్పై అనేక విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ పద్దతిలో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి భద్రత ఉండదు. లోపలికి వెళ్లిన కార్మికులకు వెలుతురు ఉండదు. గనులు కూలిపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి అతి ప్రమాదకర పరిస్థితులు ఈ పద్దతిలో కార్మికులకు ఎదురవుతాయి. గతంలో ఈ రకమైన మైనింగ్ పద్దతుల్లో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్దతిలో లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పద్దతిని నిషేధించింది. ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేసినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అయితే... ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున మేఘాలయా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది సురక్షితం -
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం ఆపరేషన్ విజయవంతం అయ్యింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సురక్షితంగా బయటకు తెచ్చింది రెస్క్యూ టీం. పాక్షికంగా కూలిపోయిన టన్నెల్లో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉండగా.. వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 17 రోజులపాటు నిర్మిరామంగా కృషి చేసి బయటకు తెచ్చిన బలగాలపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వీడియో సందేశం ఎక్స్లో ఉంచారు. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారులు.. చివరకు రాట్హోల్ మైనింగ్ టెక్నిక్తో విజయం సాధించారు. మంగళవారం సాయంత్రం ఐదుగురు సభ్యుల బృందం ప్రత్యేక పైప్ ద్వారా లోపలికి వెళ్లి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చింది. గంటపాటు కొనసాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్ వీకే సింగ్లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 నవంబర్ 12వ తేదీన పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. అదృష్టవశాత్తూ టన్నెల్లో రెండు కిలోమీటర్ల ప్రాంతం తిరగడానికి ఉండడం, బయట నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు అందించడంతో వాళ్లంతా క్షేమంగా ఉండగలిగారు. మరోవైపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుకల్పించి మానసికంగానూ ధైర్యం అదించారు అధికారులు. This is called rat mining. A person is filling this small bucket with hand tools to create further space and a push cushion machine advances this pipe inside the rubble. Process was repeated numerous times to dig down and reach trapped workers. #UttarakhandTunnelRescue pic.twitter.com/HGZMLnMWNe — Dutchess of Saffronation (@Kaalbhairavee) November 28, 2023 అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఫలించిన ప్రార్థనలు కుటుంబ సభ్యుల ఆందోళనలు ఒకవైపు.. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటకు రావాలని కోట్ల మంది ప్రార్థించారు. అధికారులు సైతం ఆశలు వదిలేసుకోకుండా నిరంతరంగా శ్రమించారు. కార్మికులు బయటకు వస్తున్న సమయంలో మిఠాయిలు పంచుకుంటూ స్థానికులు కనిపించారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: Locals distribute sweets outside Silkyara tunnel as trapped workers are being rescued from the tunnel pic.twitter.com/oASZAy8unf — ANI (@ANI) November 28, 2023 #WATCH| Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel pic.twitter.com/vuDEG8n6RT — ANI (@ANI) November 28, 2023 Uttarkarshi tunnel collapse UPDATE: Photos of the first worker rescued from the tunnel. pic.twitter.com/Iq0iVHOarv — Press Trust of India (@PTI_News) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ఎవరీ డిక్స్.. ఈయన ప్రత్యేకత ఏంటి? మన ఊరు కాదు, మన భాషకాదు అయినా అందరితోనూ మమేకమవుతూ రక్షణ చర్యల్లో భాగంగా దేశం కాని దేశం వచ్చి ఇక్కడి కార్మికుల కోసం 24/7 ఎందుకంత కష్టపడ్డారు? ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ .ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. అంతర్జాతీయ టన్నెలింగ్ సంఘం అధ్యక్షుడు కూడా. ఉత్తరకాశీ వద్ద సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు సవాల్గా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్క్యూ ఆపరేషన్లో దిగిపోయారు. అప్పటినుంచీ సొరంగంలో చిక్కుకు పోయిన 41 మంది కార్మికులను తన సొంత కొడుకుల కంటే మిన్నగా భావిస్తూ, నిరంతరం వారి క్షేమం కోసం పరితపించిన వ్యక్తి. అటు కార్మికులతో మాట్లాడుతూ, వారికి భరోసా ఇస్తూనే రక్షణ చర్యల్ని కొనసాగించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ పై ‘17 రోజుల విరామం లేని శ్రమ, 400పైగా గంటలు, 41 మంది కార్మికులు’ ఎట్టకేలకు వారంతా మృత్యుంజయులుగా బైటపడ్డారు అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. వినయంగా ఉండాలనే విషయం పర్వతం మాకు చెప్పింది: డిక్స్ భూగర్భ టన్నెలింగ్లో ప్రపంచంలోని ప్రముఖ నిపుణుడిగా పేరొందిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ భూగర్భ మరియు రవాణా రంగంలో ప్రత్యేకత ఆయన సొంతం. నిర్మాణ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, వాస్తవ భద్రతా పనితీరు మొదలు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం వరకూ ఆయనకు ఆయనే సాటి. ఉత్తరకాశీ వద్ద సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, డిక్స్ సిల్క్యారా టన్నెల్ సైట్లో తనిఖీ నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజెన్సీలతో చర్చించిన తరువాత కార్మికులను రక్షించడంపై భరోసా ఇచ్చారు. కార్మికులకు ఆహారం, నీళ్లు లాంటి అత్యవసర సాయాన్ని అందించారు. వాళ్లతో ఫోన్లతో మాట్లాడటం, వీడియోలతో కుటుంబ సభ్యులకు కూడా కాస్త ఊరట కలిగింది. అయితే క్రిస్మస్ నాటికి వారంతా బైటికి వచ్చే అవకాశం ఉందని తొలుత ప్రకటించారు. కానీ ఆయన అంచనా కంటే ముందుగానే వారిని రక్షించడం విశేషం. అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ ఆపరేషన్ పగుళ్లతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆగర్ ఆపరేషన్ను పాజ్ చేశారు. అగర్ డ్రిల్లింగ్ మెషిన్ చివరి భాగం విరిగిపోవడంతో చివరికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులను రక్షించే ప్రక్రియ విజయంతంగా పూర్తి అయింది. రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా చెప్పలేదు.మంచిగా అనిపిస్తోంది. పర్వతం పైభాగంలో డ్రిల్లింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని మాన్యువల్ డ్రిల్లింగ్పై సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రా మంగళవారం డిక్స్ పై ప్రశంసలు The art of communication is essentially the art of storytelling. Our ancient culture has its roots in storytelling. But we need to revive & refine those skills. In the meantime, here’s an Australian giving us a master class…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/QP4huuS78u — anand mahindra (@anandmahindra) November 28, 2023 మరిన్ని సంగతులు, అవార్డులు ♦2011లో, టన్నెలింగ్లో ప్రత్యేకించి టన్నెల్ ఫైర్ సేఫ్టీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అలాన్ నేలాండ్ ఆస్ట్రలేసియన్ టన్నెలింగ్ సొసైటీ ద్వి-వార్షిక అవార్డును అందుకున్నారు. ♦ డిక్స్ న్యాయవాది కూడా బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్లో సభ్యుడు. స్పెషలిస్ట్ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఛాంబర్స్ సభ్యుడు, విక్టోరియన్ బార్ సభ్యుడు , టోక్యో సిటీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ (టన్నెల్స్) విజిటింగ్ ప్రొఫెసర్. ♦ ఇంజనీరింగ్, జియాలజీ, లా రిస్క్ మేనేజ్మెంట్ విషయాల్లో మూడు దశాబ్దాలుగా బలమైన కరియర్ ♦ రిస్క్ అసెస్మెంట్ లేదా అంశానికి సంబంధించి చట్టపరమైన , సాంకేతిక పరిమాణాలను అంచనా వేయడంలో దిట్ట. ♦ లాయర్ కూడా కావడంతో లీగల్ అంశాలతోపాటు, పరిశోధకుడిగా, నిపుణుడుగా క్లిష్ట పరిస్థితి అంచనా వేయడంలో సమర్ధుడు. ♦ ముఖ్యంగా సొరంగాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో డిక్స్ సంచలనాత్మక విజయాలు సాధించారు. ♦ 2022లో అమెరికా నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కమిటీ సర్వీస్ అవార్డు -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..?
ఉత్తరకాశీ: ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి 17 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతం అయింది. 41 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 800 మిల్లీమీటర్ల పైపు గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా రెస్క్యూ అపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే..? సొరంగం కూలింది ఇక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో సొరంగం లోపలి వైపుగా 41 మంది కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడల్పుమేర శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. చిక్కుకున్న కార్మికులకు ఆహారం ఇలా.. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. దీంతో చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందించారు. దీంతో సొరంగంలో కార్మికులు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలను కూడా చూశారు. లోపలికి ల్యాండ్లైన్.. ఆహారం నీరు అందడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్లైన్’ను పంపారు. ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడారు. అనుకోని అవాంతరాలు.. సొరంగంలో మొదట సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. కానీ ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకునేలోపే అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా డ్రిల్లింగ్ను ఆపేశారు. Uttarakhand Tunnel Rescue:ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు వాతావరణం కూడా అడ్డంకిగా మారి.. ఉత్తరాఖండ్లో అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్కు కొత్త సమస్యలను సృష్టిచింది. వర్షాలు, వడగళ్ల వాన కురిసి రెస్క్యూ ఆపరేషన్పై ప్రభావం పడింది. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధులు రెస్క్యూ సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్కు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కూడా తన బృందంతో ఆపరేషన్లో పాల్గొన్నారు. కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్.. సమాంతరంగా అవాంతరాలు ఎదురవడంతో సొరంగంలో కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి అధునాతన ఆగర్ మెషీన్ను ఉపయోగించారు. 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. కానీ శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడ్డాయి. దీంతో డ్రిల్లింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మ్యాన్యువల్ పద్దతిని ఎంచుకున్నారు. చివరికి మాన్యువల్గానే డ్రిల్లింగ్.. డ్రిల్లింగ్ మిషన్ ధ్వంసం కావడంతో సాధారణంగా మనుషులతోనే తవ్వాల్సి వచ్చింది. మాన్యువల్ డ్రిల్లింగ్లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గింది. దాదాపు 57 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్తో డ్రిల్లింగ్ చేశారు. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో మెషీన్ను వెనక్కి లాగారు. కానీ మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్చేసి బయటకు తీశారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్గా రంధ్రం చేశారు. భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్గా తవ్వడంలో సహాయం చేసింది. ఇందుకు ర్యాట్-హోల్ పద్దతిని ఉపయోగించారు. Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదిలారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel: నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
పైప్లైన్ అమరిక పూర్తి.. ఏ క్షణంలోనైనా కార్మికులు బయటకు!
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు మరికొద్ది క్షణాల్లో విముక్తి కలగనుంది. దాదాపు 17 రోజుల నుంచి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే పైపులైన్ను పూర్తిగా దించేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్లో రెస్క్యూ బృందాలు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు డ్రిల్లింగ్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. పైప్లైన్ గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్స్ కూడా పూర్తి చేశారు. కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు. #WATCH | Uttarkashi tunnel rescue | Operation intensifies to rescue the 41 workers trapped inside the Silkyara tunnel. CM Pushkar Singh Dhami tweeted that the work of inserting the pipe inside the tunnel is complete and all the workers will be rescued soon. pic.twitter.com/a7iE6R9yEs — ANI (@ANI) November 28, 2023 అంబులెన్స్లు సిద్ధం.. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారాన్ని అందించారు. కార్మికులను కలుసుకోవడానికి కుటుంబ సభ్యులు దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండాలని కోరారు. టన్నెల్ నుంచి బయటకు తీసుకురాగనే కార్మికులకు ప్రాథమిక చికిత్స అందించడానికి టన్నెల్లో బెడ్స్ను ఏర్పాటు చేశారు. కార్మికులను బయటకు తీసుకురాగానే ఉత్తరకాశీలో ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి 41 అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఆస్పత్రిలో 41 బెడ్స్తో ప్రత్యేక వార్డ్ను కూడా ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాడనికి బాధిత బంధువులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. PHOTO | Beds, chairs kept ready inside #SilkyaraTunnel, Uttarkashi as 41 workers, trapped since last 16 days, are expected to come out anytime soon.#UttarakhandTunnelRescue pic.twitter.com/UF57yncByE — Press Trust of India (@PTI_News) November 28, 2023 ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించారు. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్నారు. VIDEO | Uttarkarshi tunnel collapse UPDATE: "It is a matter of happiness for us. I want to thank PM Modi, the Uttarakhand administration and those involved in the rescue operation on behalf of the UP government," says Arun Mishra, coordinator of UP government for rescue… pic.twitter.com/WRW2EPD3Np — Press Trust of India (@PTI_News) November 28, 2023 'ఇది మనందరికి సంతోషకరమైన వార్త. రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఉత్తరఖండ్ పాలనా యంత్రాంగానికి, యూపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.' అని రెస్క్యూ ఆపరేషన్ యూపీ ప్రభుత్వం కోఆర్డినేటర్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Rescue Operation: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు! -
ఉత్తరాఖండ్ టన్నెల్ వద్ద శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్
-
Uttarakhand: రెస్క్యూ బృందాలకు 5 మీటర్ల దూరంలో కార్మికులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగంలోని బండరాళ్లను తవ్వే క్రమంలో అవంతరాలు ఎదురవ్వడంతో రెస్క్యూ ప్లాన్లను మార్చి మార్చి అమలు చేస్తున్నారు. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనపెట్టి.. కొండపై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను సోమవారం మొదలు పెట్టారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. First visuals of manual drilling ongoing inside the rescue tunnel. Auger machine is being used for pushing the pipe. So far about 2 meters of… pic.twitter.com/kXNbItQSQR— ANI (@ANI) November 28, 2023 ఇక ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తయింది. చదవండి: ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. So far about 2 meters of manual… pic.twitter.com/oIMNAxvre2— ANI (@ANI) November 28, 2023 మరోవైపు టన్నెల్ పైభాగం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర మైక్రో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాల నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారు. ఈ పద్దతి ద్వారా గురువారం నాటికి కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Micro tunnelling expert Chris Cooper says, "...It went very well last night. We have crossed 50 metres. It's now about 5-6 metres to go...We didn't have any obstacles last night. It is looking very positive..." pic.twitter.com/HQssam4YUs— ANI (@ANI) November 28, 2023 కాగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టన్నెల్ వద్దకు నేడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి వెళ్లారు. సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఇక ఛార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు! -
Uttarakhand : 41 మంది కార్మికుల కోసం శరవేగంగా కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ (ఫొటోలు)
-
ఉత్తరకాశీ: కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్, స్టేట్ డిజాస్టర్ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!. మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు. ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు. అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. (చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో సైన్యం ఎంట్రీ
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్కు విముక్తి? -
సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్?
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం లోపల నుంచి డ్రిల్లింగ్ పనులు సాగుతున్నా, ఆటంకాలు తలెత్తుతుండటంతో సొరంగం పైనుంచి కూడా డ్రిల్లింగ్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని జియోఫిజికల్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నిపుణులు నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్డీసీఎల్)కి సమర్పించారు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల నుండి బాధిత కార్మికులను చేరేందుకు మార్గం ఏర్పడని పక్షంలో సొరంగం పైనుండి కూడా డ్రిల్ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కసరత్తు ప్రారంభించారు. డ్రిల్లింగ్ చేయాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిని జియోఫిజికల్ నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్సన్ కంపెనీకి చెందిన జియోఫిజికల్ నిపుణుడు బి భాస్కర్ మాట్లాడుతూ. ఆ స్థలాన్ని పరిశీలించామని, డ్రిల్కు ఆ ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు అడ్డురావని తేలిందన్నారు. కాగా డ్రిల్లింగ్ సమయంలో ఏదైనా నీటి వనరు అడ్డుపడితే మొత్తం ఆపరేషన్తో పాటు 41 మంది కూలీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇతర ఎంపికలలో భాగంగా సొరంగం పై నుండి డ్రిల్ చేయడానికి అతిపెద్ద డ్రిల్ యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాగాలుగా తీసుకువచ్చారు. తరువాత దానిని అనుసంధానించారు. ఇతర డ్రిల్ యంత్రాలను కూడా ఇక్కడకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు -
సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా...
ఉత్తరాఖండ్లో టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తర్కాశీలో సిల్క్యారా టన్నెల్ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం టన్నెల కూలిన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్లో ఉండిపోయిన కార్మికులను రాళ్ల శిథిలాల నుంచి బయకు తీసుకొచ్చే పద్దతి గురించి అధికారులు వెల్లడించారు. పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు తాజాగా తెలిపారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్ చేసిన పైపులో స్ట్రెచర్ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు లాగనున్నారు. చదవండి: నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట #WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk — ANI (@ANI) November 24, 2023 కాగా నవంబర్ 12 టన్నెల్లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కులడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారుతోంది. ప్రస్తుతం చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఇటీవల స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించిన సంగతి విదితమే. -
‘ఉత్తర కాశీ’ ఆపరేషన్లో స్వల్ప ఆటంకం!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
ప్రస్తుత ప్లాన్ పనిచేయకపోతే, మరో ఐదు ప్లాన్లు సిద్ధం, కానీ..!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను వెలుపలికి తీసు కొచ్చేందుకు పనులు జరుగు తున్నప్పటకీ ఈ ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. శుక్రవారం అంతరాయం తరువాత అమెరికాఅగర్ డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో డ్రిల్లింగ్ కార్యక్రమం తిరిగి కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో వారంతా క్షేమంగా బయటకు రావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రక్రియలో సవాళ్లను బట్టి 15 రోజుల వరకు పట్టవచ్చని కేంద్రం తెలిపింది. ప్రస్తుత ప్లాన్ వర్క్ అవుట్ కాపోతే మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరో 15 రోజులు అయినా కూడా సాగుతుందన్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి సహాయక చర్యలను పరిశీలించారు. మరో 12 -15 రోజులు రోడ్డు రవాణా మరియు హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ మాట్లాడుతూ డ్రిల్లింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇదే సరియైన పద్ధతి. దీనికితోడు తాము మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంగా ఉంచామని, అయితే వాటికి 12-15 రోజులు పట్టవచ్చని జైన్ చెప్పారు. ఒక ఆప్షన్కోసమే వెయిట్ చేయకుండా, ఏకకాలంలో అన్ని ప్లాన్లపైనా పని చేస్తున్నామని వెల్లడించారు. సొరంగానికి సమాంతరంగా అగర్, క్షితిజ సమాంతర బోరింగ్ సాయంతో ప్రస్తుతం మైక్రో టన్నెల్ నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే దీనికి 12-15 రోజులు పట్టవచ్చని కూడా తెలిపారు. వెజ్ పులావ్, మటర్ పనీర్ వారికి గత రాత్రి వెన్నతో వెజ్ పులావ్, మటర్ పనీర్, చపాతీలతో కూడిన భోజనం అందించామన్నారు. ఆహారం 6-అంగుళాల పైప్లైన్ ద్వారా పంపిణీ చేశామని, అలాగే పండ్లు, ఇతర అత్యవసరవస్తువులను అందించామని కూడా చెప్పారు. ఈనేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఘనమైన ఆహారం, నీటిని పంపడానికి అధికారులు 57 మీటర్ల పొడవు, 6 అంగుళాల వెడల్పు గల పైపును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్మికులకు వేడి ఆహారాన్ని అందిస్తున్నామని జైన్ వెల్లడించారు. అలాగే సైట్కు చేరుకున్న వైద్యులు, యోగా చేయాలని, వాకింగ్ లాంటి చిన్నపాటి వ్యాయామం చేయాలని, ఒకరితో ఒకరు మాట్లాడు కుంటూ ఉండాలని చిక్కుకున్న కార్మికులకు సూచించారు. కార్మికులతో సంభాషించిన 30 సెకన్ల వీడియోను అధికారులు విడుదల చేశారు. కాగా ఈ నెల (నవంబర్) 12 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4.5 కిలోమీటర్ల సొరంగంలో కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. -
బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్ను లోపలికి పంపించాలని కోరాడు. సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్లైన్’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్లైన్తో మెరుగైన కమ్యూనికేషన్ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు VIDEO | "He said -'I am good. You people go home. I will come.' Fruits and other food items were sent through the pipe. He has asked for a mobile charger," says Vikram Singh Yeri, brother of Pushkar Singh Yeri, one of the workers who is stuck inside the collapsed Silkyara… pic.twitter.com/LKS66h5FCy — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్హెచ్డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. ఆరు అంగుళాల పైప్లైన్ ద్వారా కూలీలకు ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులకు లోపల రెండు కిలోమీటర్ల మేర సురక్షిత ప్రాంతం ఉంది. మరో రెండు రోజుల్లో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రెస్క్యూ నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. బార్కోట్ ఎండ్ నుండి రెస్క్యూ టన్నెల్ నిర్మాణాన్ని టీహెచ్డీసీ ప్రారంభించిందని, ఇందులో ఇప్పటికే రెండు పేలుళ్లు జరిగాయని, ఫలితంగా 6.4 మీటర్ల డ్రిఫ్ట్ ఏర్పడిందని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఎండీ మహమూద్ అహ్మద్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో సంప్రదింపులు జరిపామని, వీడియో ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు. అన్ని ఏజెన్సీలు 24 గంటలు సంఘటనా స్థలంలో పని చేస్తున్నాయన్నారు. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని సంస్థలు/ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. పది కిలోల కిలోల యాపిల్స్, ఆరెంజ్, సీజనల్ పండ్లు, ఐదు డజన్ల అరటిపండ్లను సొరంగం లోపలికి పంపించామన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది? -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్లైన్ కార్మికుల పాలిటి లైఫ్లైన్గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు. రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది. ఈ కెమెరా పైన ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్లైన్లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం? -
టన్నెల్లో ప్రాణాలు
-
హిమాచల్లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కూలీలు చిక్కుకున్నారు. కార్మికులంతా క్షేమంగా ఉండడం, 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో కార్మికులందరి ఫొటోలు బయటకు రావడం కాస్త ఊరట కలిగించింది. కాగా హిమాచల్ప్రదేశ్లో తొమ్మది ఏళ్ల క్రితం కూడా ఇటాంటి సొరంగ ప్రమాదమే చోటు చేసుకుంది. నాటి ప్రమాదంలో ఇద్దరు కూలీలు సజీవంగా బయటపడ్డారు. ఒక కూలీ మృతి చెందాడు. సొరంగంలో చిక్కుకున్న ఈ కూలీలు పది రోజుల పాటు ఆహారపానీయలు లేకుండా దయనీయ స్థితిలో కాలం గడిపారు. హిమాచల్ ప్రదేశ్లోని కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో 2015, సెప్టెంబరు 15న ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో మాదిరిగానే నాడు ఈ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొదట ఎంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నారో తెలియరాలేదు. నాడు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్పటి డీసీ మాన్సీ సహాయ్ నేతృత్వంలో జరిగింది. ఆయన ప్రస్తుతం హిమాచల్లో లేబర్ కమిషనర్గా ఉన్నారు. నాడు కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 211 గంటల 47 నిమిషాల సమయం పట్టింది. 42 మీటర్ల మేర సొరంగంలో డ్రిల్లింగ్ చేసిన అనంతరం రెస్క్యూ టీం ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A — ANI (@ANI) November 21, 2023 -
సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిపోవడంతో 41 మంది కూలీలు గత 9 రోజులుగా దానిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం (నవంబర్ 20) ఆరు అంగుళాల కొత్త పైప్లైన్ ద్వారా మొదటిసారిగా బాధితులకు ఘన ఆహారాన్ని అధికారులు అందించగలిగారు. రెస్క్యూ టీమ్ ఈ పైపు ద్వారా వారికి బాటిళ్లలో వేడి కిచిడీని పంపింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం అందకపోవడంతో వారు నీరసించిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ అనే కుక్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం కిచిడీని తయారు చేశారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్ తెలిపారు. తాము కిచిడీ మాత్రమే పంపుతున్నామని, తమకు అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నామని హేమంత్ పేర్కొన్నారు. బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్ధామ్ ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. 41 మంది కూలీలు లోపల చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం పంపిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల సహకారంతో చార్ట్ను సిద్ధం చేశామన్నారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne — ANI (@ANI) November 20, 2023