Vizag Steel plant
-
స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, కేసీఆర్పై సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: దక్షిణాది రాష్ట్రాల సమావేశం, స్టీట్ప్లాంట్ ఉద్యోగుల దీక్షపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదంటూ ఆరోపించారు.విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ అంటూ డీఎంకే రాజకీయం చేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని, పెరిగాయని డ్రాఫ్ట్ ఏదైనా రిలీజ్ అయిందా?. మా ముందు చాలామంది ఎన్నో కలలు కన్నారు.. అన్నీ కరిగిపోయాయి. మా ముందు ఎగిరే మీ రాష్ట్రాలు కూడా ఉండవు.. మీరూ ఉండరు. డీఎంకే ఎక్కువకాలం ఉండదు. లక్కీగా అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్క్వేర్ ఫీట్కు ఇంత అని లెక్కల్లో ఉన్నారు. మాదే స్టాండర్డ్ ఉన్న పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఉక్కు ఉద్యమంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా?. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం. కార్మిక నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు?. కార్మికులు కష్టపడుతుంటే కార్మిక నాయకుల కళ్ళు మండుతున్నాయి. జపాన్లో అయితే ఈ కార్మిక నాయకులను ఏం చేసేవారు. తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారా అని ఉద్యమ నాయకులని అడగాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదు. వాళ్ళు చైనా బాగుండాలని కోరుకుంటారు.. వాళ్లని నమ్మవద్దు. ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చాం ఇంకేం కావాలి అని ప్రశ్నించారు.అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారం అంటే అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పని చేశారు. కల్లల్లో ఒత్తులు వేసుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కామెంట్స్ చేశారు. -
‘స్టీల్ప్లాంట్లో కార్మికులను తొలగిస్తుంటే పల్లా చేస్తున్నారు?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్ప్లాంట్ కార్మికులు నేడు పాదయాత్రకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన చేపట్టనున్నారు.కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు స్పందించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ..‘కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగం. కార్మికులు లేకుండా ప్లాంట్ను ఎలా నడుపుతారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతాం. స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయింది. ఇంత మందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు?. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
విశాఖ స్టీల్ప్లాంట్: కేంద్రం ట్విస్ట్.. చంద్రబాటు నాటకాలు బట్టబయలు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం ఉత్తమాటేనని తేల్చేసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాటకాలు.. మోసాలు బట్టబయలు అయ్యాయివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఇప్పటిదాకా లభించలేదు. కానీ, అది జరగనివ్వబోమంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే మరోవైపు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడం చూస్తున్నదే. ఈ తరుణంలో.. పబ్లిక్ గ్రీవెన్స్కు కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బదులిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్పొరేట్ సంస్థ అయిన RINL ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.కేంద్రం తాజా ప్రకటనపై పోరాట సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలన్నదే మా మొదటి, ప్రధాన డిమాండ్. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ను కాపాడాలి.:::అయోధ్య రామ్, పోరాట కమిటీ కన్వీనర్ -
స్టీల్ప్లాంట్ ఉద్యోగుల నిరసన.. గాజువాకలో నో పర్మిషన్
సాక్షి, విశాఖ: వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికుల నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించనున్నారు అఖిలపక్ష కార్మిక సంఘాలు. అయితే, గాజువాకలో నిరసన చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు.. నిరసనలకు ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కుర్మన్నపాలెం దీక్ష శిభిరంలోనే నిరసన చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం లాంటి పరిణామాలతో కార్మికులు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంతో.. నిరవధిక సమ్మెలో పాల్గొంటామని కాంట్రాక్ట్ కార్మికులు చెబుతున్నాయి. -
టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది అంటూ ఆవేదన వ్యకం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మహాకవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ, నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది.కేంద్రంలో 12 మంది నితీష్ కుమార్ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీల సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బడ్జెట్తో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. ఏపీకి ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైంది. 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిధులు కేటాయించడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది.మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారు. నేడు అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు. కూటమి పాలనలో కంటే వైఎస్ జగన్ పాలనలో జీడీపీ, వృద్ధిరేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత డబ్బు సంపాదించడం ఎలాగో నా చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పడం ధర్మమా.?స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోయారు. ప్లాంట్పై బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు. రైతుభరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపాము. వైఎస్ జగన్ వలనే ప్రైవేటీకరణ అగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా చెప్పారు అని గుర్తు చేశారు. -
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కుమారస్వామికి నిరసన సెగ
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు. ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కాసేపట్లో కేంద్ర మంత్రులు సమీక్ష జరపనున్నారు. అయితే ఆ మీటింగ్కు కార్మిక సంఘాలను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని సంఘాల నేతలు చెబుతున్నారు. కాన్వాయ్లో ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలు సందర్శిస్తున్నారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రుల కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం షీలా నగర్ వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానితో మరోకటి ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు దెబ్బ తిన్నాయి. ధ్వంసమైన కారులో ఒకటి మాజీ ఎంపీ జీవీఎల్కు చెందిన కారు ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: గోరంట్ల
-
స్టీల్స్టాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
-
విశాఖ ఉక్కుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం: కార్మిక సంఘాలు
-
వైఎస్ జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగింది - కేంద్రమంత్రి కుమార స్వామి
-
అప్పటిదాకా బాబు, పవన్లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్ను మరోసారి ప్రస్తావించాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది... శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. -
పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్
-
భోగి మంటలతో .. కూటమి సర్కార్పై వినూత్న నిరసన
విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?. .. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
మరో కుట్రకు తెరతీసిన విశాఖ ఉక్కు యాజమాన్యం
విశాఖ,సాక్షి: విశాఖ ఉక్కుపై (vizag steel) నీలినీడలు కమ్ముకున్నాయి. కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ (vrs) పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.కాగా,వీఆర్ఎస్ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ తీవ్రంగా మండిపడుతుంది. వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకోవద్దని పోరాట కమిటీ పిలుపు నిచ్చింది. అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.👉ఇదీ చదవండి : బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
జగన్ డిమాండ్లు వినిపించే దమ్ము బాబు, పవన్కు ఉందా ?
-
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ (Visakha Steel Plant)పై చంద్రబాబు (Chandrababu) మోసం మరోసారి బయటపడింది. విశాఖ మోదీ (PM Modi) సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.1400 రోజులకుపైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రధానికి అపాయిమెంట్ ఇప్పించాలని కార్మికుల కోరిన కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మాత్రం ఐరన్ఓర్ సప్లై చేసేందుకు పైప్లైన్ వేసేందుకు అనుమతించాలని మోదీని చంద్రబాబు కోరారు.స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ అడగకుండా.. మిట్టల్ స్టీల్ప్లాంట్కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్ను చంద్రబాబు అడిగారు. రైల్వే జోన్పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ చంద్రబాబు డాంబికాలు పలికారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తించారు. అటు ఇంగ్లీషు, ఇటు హిందీలోనూ ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. -
‘బాబూ.. ఏపీ అంటే అమరావతి ఒక్కటేనా?’
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది.. రాష్ట్రం పట్ల వివక్షత చూపిస్తోందన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు. ఇదే సమయంలో ప్రధాని మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇచ్చే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, చంద్రబాబు సర్కార్కు రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటేనా అని ప్రశ్నించారు.విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్. నరసింగరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇచ్చే ప్రకటన ప్రధాని చేయాలి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇంకా పుట్టక ముందే గనులు ఇవ్వాలని చూస్తున్నారు. కేంద్రం.. ఏపీ పట్ల వివక్షతో వ్యవహరిస్తుంది. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోంది. లేని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడగటం కాదు.. ఉన్న స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వండి. ప్రధాని వస్తున్న సందర్బంగా కానుకగా స్టీల్ ప్లాంట్లో 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే కుట్ర జరుగుతోంది. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఇచ్చిన ప్రాధాన్యత వైజాగ్ స్టీల్కు ఎందుకు ఇవ్వరు?. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 115 శాతం ఉత్పత్తి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అమ్ముడుపోయింది. రాష్ట్రం అంటే ఈ ప్రభుత్వానికి అమరావతి ఒక్కటేనా?. అమరావతి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే. షీలానగర్లో కడుతున్న ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ కాలేజీ కూడా అమరావతికి తీసుకుపోయారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరగబోతుంది. ఉత్తరాంధ్రకు హైకోర్టు బెంచ్ ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.ప్రధాని పర్యటన సందర్బంగా మూడు రోజులపాటు నిరసనలు కొనసాగుతాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారు. ఈనెల 6వ తేదీ కుర్మాన్నపాలెం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. 7వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగుతుంది. అడుగడుగునా నల్ల జెండాలతో నిరసన తెలుపుతాం అని కామెంట్స్ చేశారు. -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుందని ఆరోపించారు సీఐటీయూ నేత నరసింగరావు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రమేష్, భరత్కు ఎంపీలుగా కొనసాగే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీఐటీయూ నేత సీహెచ్ నరసింగరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టడం చంద్రబాబు ప్రైవేట్ పిచ్చికి నిదర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్ను దెబ్బ తీయడం కోసం ఆర్సిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకువస్తున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు గనులు కావాలని అడుగుతున్న చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు ఎందుకు అడగడం లేదు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలి.చంద్రబాబు ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా 8వ తేదీన నిరసన కార్యక్రమం ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కూటమి ఎంపీలు సీఎం రమేష్, భరత్ తీరని ద్రోహం చేస్తున్నారు. ఎంపీలు ఇద్దరూ వెంటనే రాజీనామాలు చేయాలి. వారికి ఎంపీలుగా కొనసాగే అర్హత లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్ప్లాంట్పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
స్టీల్ ప్లాంట్ రచ్చ.. మండలిలో గందరగోళం
-
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన
-
స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఉక్కుపాదం నోరు మెదపని కూటమి ప్రభుత్వం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం
-
వైజాగ్ స్టీల్కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్కీ నిర్మాణం చేపడతారు. ఖతార్లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు శీతకన్ను.. మళ్లీ పాతపాటే!
సాక్షి, విశాఖ: ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మరోసారి నిరాశే మిగిల్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా సేయిల్కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు రావడం లేదని కార్మికులను ఎదురు ప్రశ్నించడం గమనార్హం.నేడు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏదైనా స్పష్టత వస్తుందని భావించిన కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు పాత పాటే పాడారు. సేయిల్ లాభాల బాటలో నడుస్తోంది. సేయిల్కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు రావడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపించాలి. దానిపై ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాం. మంచి మేనేజ్మెంట్ను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు.మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పోరాట కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వరకు అపాయింట్మెంట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. సీఎం చంద్రబాబు పిలుపు కోసం పోరాట కమిటీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. -
చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారా?: బొత్స
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు...పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది. -
బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను. ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు
ఉక్కు ఉద్యమాన్ని సడలించి ప్రైవేట్ పరం చేసేలా కేంద్రానికి సహకరించడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై రోజుకో కుట్ర పన్నుతోంది. ఆర్థి క పరిస్థితుల సాకుతో ప్రతి నెలా వేతనాన్ని రెండు విడతల్లో అందిస్తున్న యాజమాన్యం ఈసారి దీపావళికి వెలుగులు లేకుండా చేసింది. ఈ నెల రెండో విడత జీతాలు చెల్లించకుండా ముఖం చాటేసింది. స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థి క మూలాలపై ప్రభుత్వాలు దెబ్బ కొడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఉక్కు ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామంటూ అధికారంలోకి రాకముందు వరకూ హామీలిచి్చన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఆకలి కేకల్ని పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. బలవంతపు పదవీ విరమణకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పుడు ఏకంగా జీతాలు ఇవ్వకుండా వేధించడంపై రగిలిపోతున్నారు. నష్టాల పేరుతో గత పది నెలలుగా విశాఖ ఉద్యోగులకు యాజమాన్యం ప్రతి నెలా రెండు విడతలుగా జీతాలను చెల్లిస్తోంది. మొదటి విడత 10వ తేదీలోపు ఇస్తుండగా రెండో విడత నెలలో చివరి వారంలో ఖాతాల్లో జమ అయ్యేది. ఈ నెలలో తొలి విడత జీతాలను ఆలస్యం చేసి దసరా తర్వాత చెల్లించారు. నెల ముగిసిపోతున్నా రెండో విడత ఇంతవరకు జమ కాకపోవడంతో ఉక్కు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంనీరుగారిన హామీ..ఉక్కు ఉద్యోగులు తమ వేతన సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి గతంలో పలుమార్లు తెచ్చారు. సకాలంలో చెల్లించేలా చూస్తామంటూ వారు పొడిపొడిగా హామీ ఇచ్చారు. అయితే అది అమలైందా? లేదా? అనే విషయంపై ఒక్కసారి కూడా ఆరా తీయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. దీనిపై తదుపరి కార్యాచరణ సిద్ధం చేసి ఆందోళన కొనసాగిస్తామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.ఢిల్లీ వెళ్లిపోయిన సీఎండీదీపావళి నేపథ్యంలో రెండో విడత జీతాలు వెంటనే చెల్లించాలంటూ కార్మిక సంఘాల నాయకులు సోమవారం ఉదయం యాజమాన్యం వద్ద మొరపెట్టుకున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సీఎండీని కలిసేందుకు ప్రయతి్నంచగా కేంద్ర ఉక్కు కార్యదర్శితో సమావేశంలో ఉన్నందున సాయంత్రం 4.30కి రావాలని అపాయింట్మెంట్ ఇచ్చారు.చెప్పిన సమయానికి సంఘాల నాయకులు అడ్మిన్ బిల్డింగ్ వద్దకు వెళ్లగా సీఎండీ అంతకుముందే హిల్టాప్ గెస్ట్హౌస్కు వెళ్లిపోయారని తెలియడంతో అక్కడకు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. అయితే సీఎండీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారనీ ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించడంతో హతాశులయ్యారు. ఉదయం.. సాయంత్రం అంటూ తిప్పుకుని తీరా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన కార్మికులు డైరెక్టర్ (పర్సనల్), హెచ్ఆర్ అధికారులను కలసి తక్షణం జీతాలు చెల్లించాలని కోరారు. దీనిపై డైరెక్టర్లతో చర్చిస్తామంటూ వారు కూడా అక్కడి నుంచి జారుకున్నారు. కాసేపటి తర్వాత వచి్చన డైరెక్టర్.. రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు నడపటానికి ముడి పదార్థాల కోసం ప్రయతి్నస్తున్నామని, ఇప్పట్లో జీతాలు జమ చేసే పరిస్థితులు కనిపించడం లేదని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో పండగ సమయానికి వేతనాలు జమ అవుతాయని ఆశపడ్డ ఉద్యోగులు, కార్మికులు నిర్ఘాంతపోయారు.వీఆర్ఎస్కు 2,478 మంది అనుకూలంఉక్కు నగరం: విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) సర్వేకు 2,478 మంది అనుకూలంగా స్పందిచారు. తొలి రోజు 500 మంది అనుకూలంగా స్పందించగా.. రెండో రోజు 1,200 మంది మద్దతు తెలిపారు. సర్వే గడువు ముగిసే మంగళవారం నాటికి 2,478 మంది అనుకూలంగా స్పందించారు. వీరిలో 1,083 మంది అధికారులు కాగా, 1,395 మంది కార్మికులు ఉన్నారు. స్టీల్ప్లాంట్లో రోజురోజుకు దిగజారిపోతున్న పరిస్థితులు ఈ సర్వేకు అద్దం పడుతున్నాయి. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్టీఎ నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులకు 10 శాతం పెర్క్స్ తొలగించగా, కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేత, ఉక్కు క్వార్టర్ల నివాసులకు విద్యుత్ చార్జీల పెంపు ద్వారా తీవ్రమైన ఆర్థిక భారం పెంచారు. కనీసం జీతమైనా సరిగా ఇస్తున్నారంటే అది కూడా లేదు. ఏడాది కాలంగా ప్రతినెలా రెండు విడతలుగా సగం జీతం ఇస్తుండటంతో ఉద్యోగులు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు డిఫాల్టర్లుగా మారుతున్నారు. దీనికి తోడు పీఎఫ్ ట్రస్ట్, ఎస్ఎబీఎఫ్ ట్రస్ట్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సుమారు రూ.700 కోట్లు బకాయి పడటంతో ఉద్యోగులకు మరింత నష్టం కలిగిస్తోంది. ఈ ఏడాదిమే నెల నుంచి రిటైరైన ఉద్యోగులకు లీవ్ ఎన్క్యా‹Ùమెంట్ చెల్లించటం లేదు. దీంతో ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎంత వేగంగా ప్లాంట్ నుంచి బయటపడదామా అని ఉద్యోగులు భావిస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కార్మికుల నిరసన
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పక్కదోవ.. రుషికొండ ప్యాలెస్ పై నీచ రాజకీయం
-
కేంద్రాన్ని ఒప్పించడంలో బాబు విఫలం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దస్పల్లా, ఎన్సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు.డయేరియా బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. డయేరియాతో 14 మంది మరణించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరిగింది అని కామెంట్స్ చేశారు. -
అగ్గిపెట్టెలకు 23 కోట్లా..! లక్షకోట్ల స్టీలాప్లాంట్ స్కాం..
-
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమం అణిచివేతలో కూటమి ప్రభుత్వం
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీడియాతో మాట్లాడొద్దంటూ షరతులు విధించారు. ఇందులో భాగంగా షరతులతో కూడిన సర్క్యులర్ మెమోను స్టీల్ప్లాంట్ యాజమాన్యం జారీ చేసింది.తాజా,స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విశాఖ స్టీల్ప్లాంట్పై తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యాజమాన్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తున్నారు. కాగా,ఆదివారం స్టీల్ప్లాంట్ కార్మికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అనంతరం యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం విశేషం. -
ఉక్కు కార్మికుల భారీ మానవహారం
సాక్షి,విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కార్మికులు భారీ ఎత్తున మానవ హారం నిర్వహించనున్నారు.ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారరం అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కొనసాగిన ఉక్కు కార్మికుల నిరసన.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నేడు నేషనల్ హైవేపై అగనంపూడి నుంచి గాజువాక వరకు భారీ మానవ హారం చేపట్టనున్నారు. -
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమరం
-
స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?: ఎమ్మెల్సీ బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించడమేంటని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా? అని అడిగారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా?. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారు. స్టీల్ప్లాంట్లో కార్మికులను తొలగించడం కరెక్ట్ కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?. నాలుగు వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్, బీజేపీ నిలబెట్టుకోవాలి.నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా?. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు అయినా లేదు. రూ.99కే మద్యం అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఉన్న 15000 మందిని రోడ్డున పడేశారు. మందు మీద రేటు తగ్గిస్తున్నారు.. నిత్యవసర వస్తువుల ధరల సంగతి ఏంటి?. ధరల స్థిరీకరణ కోసం గత ప్రభుత్వం 2000 కోట్లు ఏర్పాటు చేసి ధరలను అదుపులో పెట్టింది. పండగకు పప్పన్నం కాదు చారు అన్నం కూడా తినే పరిస్థితి లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూరగాయలను తెప్పించేది. ధరలను అదుపులో పెట్టింది. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.లులూ కంపెనీ.. ప్రభుత్వం నుంచి రూ.1300 కోట్ల స్థలం తీసుకొని 600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటు కంటే పది రెట్లు పెట్టుబడి పెడితే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటులో సగం కూడా పెట్టుబడులు లేకపోతే ఎలా?. అందుకే గతంలో లులూ కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పాము అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాదుడుపై బాబు ఫోకస్.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్సీపీ -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు బలగాల మోహరింపు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.విశాఖ స్టీల్ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఈడీ వర్క్స్ బిల్డింగ్ను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్బంగా అక్కడకి భారీ సంఖ్యలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కాగా, 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆదివారం ఉదయం కూడా స్టీల్ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. స్టీల్ప్లాంట్ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
రోడ్డెక్కిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బాబుకు ఏ భావోద్వేగాలు ఉండవు: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేడేల్లి: కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిసతూ.. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను గందరగోళంలోకి నెడ్తున్నారని మండిపడ్డారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చూస్తే చంద్రబాబు కల్లబొల్లి మాయోపాయాలు అర్థమవుతాయని అన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నడవదని, దాన్నో సాకుగా చూపి అమ్మకానికి పెట్టాలన్నది చంద్రబాబు క్షుద్ర ప్రణాళికగా పేర్కొన్నారు.కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవు. ఉమ్మడి ఆంధ్ర సిఎంగా 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 28, 2024 -
దేవరకు స్టీల్ ప్లాంట్ సెగ
విశాఖపట్నం, సాక్షి: దేవర సినిమాకు స్టీల్ ప్లాంట్ సెగ తగిలింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలంటూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు నగరంలోని రామా టాకీస్ వద్ద పోస్టర్లకు.. ‘‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’’ అంటూ ప్లాంట్ పోస్టర్లను తగిలించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే కుట్ర జరుగుతుందంటూ రెండ్రోజుల కిందట ఇదే జన జాగరణ సమితి పోస్టర్లు వేయించింది. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్.. మోసగాళ్లని, లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టే కార్యక్రమం జరుగుతోందంటూ ఆరోపించింది. సింహాద్రి అప్పన్న వీళ్లను శిక్షించాలని అందులో రాసింది. ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ ఫీవర్ను సైతం తమ ఉద్యమానికి వేదికగా చేసుకుంది. అయితే మద్దతు ఇవ్వకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటుందా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చూడాలి దీనికి తారక్ ఏమైనా స్పందిస్తాడో.ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ దేవర సినిమా టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు థ్యాంక్స్ చెప్పాడు. తాజాగా టికెట్ల పెంపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని.. పదిరోజుల పాటే టికెట్ల పెంపు కొనసాగాలని నిర్మాతలకు ఝలక్ ఇచ్చింది. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవీ కపూర్ తదితరులు నటించిన దేవర శుక్రవారం విడుదల కానుంది.ఇదీ చదవండి: అమరావతి మాత్రమే సెంటిమెంటా?.. స్టీల్ ప్లాంట్ కాదా? -
A1 బాబు, A2 పురందేశ్వరి, A3 పవన్!!
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్ పరిరక్షణ కమిటీలతో పాటు వైఎస్సార్సీపీ సైతం రాజకీయంగానూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. ఈ క్రమంలో..నగరంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని ఏ2గా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఏ3గా పేర్కొంటూ గురుద్వార జంక్షన్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది జనజాగరణ సమితి. ప్లాంట్ను అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాసి ఉం. దారిపోయే కొందరు బాటసారులు వాటిని ఫొటోలు తీస్తూ కపించారు. ఇక ఫ్లెక్సీపై సమాచారం అందుకున్న పోలీసులు.. వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముగ్గురు మోసగాళ్లు ‘‘కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% శాతం మూతపడేలా కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కార్మికులను పొమ్మనలేక బలవంతంగా పొగ పెడుతున్నారు. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే.. .. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజలకు సెంటిమెంట్ లేదు. అని అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టవద్దని తిరుగులేని మెజార్టీ వల్ల వచ్చిన అహంకారంతో మాట్లాడారు. దీనితో కార్మికులు 1320 రోజుల నుండి చేస్తున్న పోరాటం గంగలో పోసినట్లయింది. 32 మంది ప్రాణ త్యాగాలు వృధా అయిపోయాయి. తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామి నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు, రాష్ట్ర ప్రజలు వేడుకోవాలి. పవన్ హీరోగా చంద్రబాబు, పురందేశ్వరి సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్లు అనే కొత్త సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది’’ అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదీ చదవండి: విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి? -
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
సాక్షి,విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉద్యోగులు షాకిచ్చారు. 500 మంది ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్కు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను పంపుతున్నట్లు సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల ఇంటర్వ్యూలు కోసం 4 బృందాలు ఏర్పాటు చేసింది.కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్కు వెళ్లేందుకు ముందుకు రాలేదు. యాజమాన్యం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. అయితే, ప్లాంట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పి ప్రైవేట్ హోటల్స్లో విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించడం కొసమెరుపుచదవండి : మీకో దణ్ణం చంద్రబాబు : ఆర్కే రోజా -
స్టీల్ ప్లాంట్ పై కూటమి సర్కారు కుట్ర
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు.. రాజశేఖర్ అదిరిపోయే కౌంటర్
-
అమరావతి మీద ఉన్న శ్రద్ధ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద లేదు
-
అందర్నీ ముంచడమే బాబుకు తెలుసు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ అమర్నాథ్ కామెంట్స్ చేశారు.కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు కామెంట్స్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అమర్నాథ్..‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి, కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు స్టీల్ప్లాంట్ విషయంలోనూ అంతే. బాబు వచ్చాడు.. అందర్నీ ముంచుతున్నాడు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేలా @ncbn గారు మాట్లాడ్డం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబుగారు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబుగారు ఇలాగే మాట్లాడి,… pic.twitter.com/Zq0ctJ9xDR— Gudivada Amarnath (@gudivadaamar) September 18, 2024 ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’
సాక్షి, విశాఖ: విశాఖలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో సెంటిమెంట్ పనిచేస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా పనిచేస్తుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, గతంలో స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘అమరావతి విషయంలో సెంటిమెంట్ పని చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా సెంటిమెంట్ పనిచేయాలి కదా?. అమరావతి సెంటిమెంట్తో ముడిపడిందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సెంటిమెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వారి సెంటిమెంట్. అమరావతికి 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే.. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల వారు భూములు త్యాగం చేశారు. చంద్రబాబు ఆలోచించి మాట్లాడాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నాయని సీఎం చంద్రబాబు మాట్లాడటంపై ప్రజా సంఘాల జేఏసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవు. సొంత గనులు కేటాయించేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. లేదా స్టీల్ ప్లాంట్ను సేయిల్(SAIL)లో విలీనం చేయించాలి. స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ మాటపై నిలబడాలి. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాణ త్యాగం, పోరాటాలు చేశారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్తో కూడుకున్నది అని దేశం మొత్తం గుర్తించింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళక ముందే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైంది’ అని చెప్పుకొచ్చారు. ఇక, బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్ ప్లాంట్ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం.. విద్యార్థుల ఆవేదన -
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
సీతమ్మధార: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేన పార్టీలను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్లో ప్రశ్నించగా.. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి బదులిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్ప్లాంట్ కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వారి వైఖరిని స్పష్టం చేయాలి.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే.. టీడీపీ, జనసేన పారీ్టలు మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయే నుంచి తప్పుకుంటారో? ప్రజలను మోసం చేస్తారో? చెప్పాలి. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. లేకపోతే లక్షలాది మంది ఉద్యోగులు, కారి్మకులు రోడ్డున పడతారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది’ అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్.. ఆధారాలు బయటపెట్టిన గొల్లబాబు రావు
-
కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలి: ఎంపీ గొల్లబాబురావు
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు. ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు -
కూటమి ప్రభుత్వం ఫెయిల్!
-
చరిత్ర మిమ్మల్ని క్షమించదు.. బాబు, పవన్లకు బహిరంగ లేఖ
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తారనే నమ్మకంతోనే ఇక్కడి కూటమి అభ్యర్థులను గెలిపించారని.. అలాంటిది ఆ చిత్తశుద్ధిని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకోలేకపోతోందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక(FDNA) ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లకు ఎఫ్డీఎన్ఏ జనరల్ సెక్రటరీ ఆజశర్మ పేరిట బహిరంగ లేఖ రాసింది.‘‘గత ఎన్నికల్లో గెలిస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మీ హామీని నమ్మి మీకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారు. మీ మాటలను నమ్మి గాజువాక ఎమ్మెల్యే, విశాఖ ఎంపీను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు... మీరు ప్రధాని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం కనీసం ప్రస్తావించలేదు. అమరావతిలో స్టీల్ ప్లాంట్ నాయకులను గంటలకొద్దీ నిరీక్షించేలా చేశారు. పైగా స్టీల్ ప్లాంట్ కు లాభాలు తీసుకురండి.. ఆ తరువాత సంగతి చూద్దామని చెప్పారు. ఓపక్క కేంద్రం ఉద్దేశపూర్వకంగా ముడిసరుకు సరఫరా లేకుండా పీక నులిమేస్తోంది. అలాంటప్పుడు లాభాలు ఎలా వస్తాయి?. మీ తీరు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది.మీరు ఇచ్చిన హామీకి మీరే తిలోదకాలు ఇస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే చరిత్ర క్షమించదు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీ నిజాయితీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని లేఖ ద్వారా పవన్, చంద్రబాబులను కోరింది ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక.ఇదీ చదవండి: అగమ్యగోచరం.. స్టీల్ప్లాంట్ భవితవ్యం -
కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: విశాఖలో 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు టీడీపీ మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి ఎంపీలు, మంత్రులు గాడిదలు కాస్తున్నారా?.. అని ప్రజలు నిలదీసే రోజులు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలి దానాలతో సాధించుకున్నాం. కానీ, ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్లలో ఉత్పత్తి నిలిపివేశారు. స్టీల్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మన తెలుగు వ్యక్తే. ఆయన కేంద్రమంత్రిగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడటం సిగ్గుచేటు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి నేతలు ఏం చేస్తున్నారు. తెలుగు ప్రజలను ఆషామాషీగా, తేలిగ్గా తీసుకోవద్దు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ పార్టీ అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తారా?. ప్రజలు దీన్ని సహించరు.స్టీల్ మినిస్టర్ కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. కర్నాటకలో మూతబడిన హెచ్ఎంటీ వాచ్ కంపెనీని కేంద్రమంత్రి తిరిగి తెరిపించుకున్నాడు. తెలుగు వాళ్లు చేసుకున్న పాపం ఏంటని మోదీని మన నేతలు నిలదీయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈనెల 16న గుజరాత్ వెళుతున్న చంద్రబాబు.. ప్రధాని మోదీతో మాట్లాడాలి. మోదీని నిర్మోహమాటంగా చంద్రబాబు నిలదీయాలి. ఇలాంటి సమయంలో చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను సాధించుకోలేకపోతే ప్రజలు క్షమించరు. కేంద్రంలో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి ఇదే నా సూచన. విమానాశ్రయాల గురించి కాదు.. పోరాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సాధించండి అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ఆధారాలతో సహా చర్చకు సిద్ధం.. స్పందించు పవన్: పోతిన మహేష్ -
చంద్రబాబు.. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం: విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 ఆపివేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఇది టీడీపీ నాయకత్వ అసమర్థతకు నిదర్శనమంటూ కామెంట్స్ చేశారు.👉స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘భయపడినట్టే జరిగింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపివేయడం అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు.👉‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సాగిన 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్. ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్లో ఎగిసిపడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు.👉టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏ మాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలి. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు ఎలుగెత్తి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గాని, ఎన్ఎండీసీలో గాని విలీనం చేసి, ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహం లేదు.👉వైజాగ్ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాంతీయ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు. తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరూ పెదవి విప్పడం లేదంటే కేంద్రంతో స్వార్థ ప్రయోజనాలకోసం లాలూచీ పడ్డారని తెలిసిపోతోంది. ఉత్తరాంధ్ర తలను తీసివేయడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి వారికి బుద్ధి చెప్పాలి👉చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి వైజాగ్ స్టీల్ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. మనం కళ్లు మూసుకుంటే ఇది వైజాగ్ స్టీల్తోనే ఆగదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు, విద్యాసంస్థలు, విద్యుత్ కేంద్రాలను, మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెడుతాడు చంద్రబాబు.👉టీడీపీ మొదటి నుంచి వైజాగ్ సంపదను వ్యక్తిగతంగా కొల్లగొట్టుకునే బంగారు గనిలా భావిస్తోంది. అక్కడి ప్రజల పట్ల ఎటువంటి నిబద్ధత, అనుబంధం ఆ పార్టీకి లేవు. తన ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు లక్ష్యం. ఇది ఒక్క వైజాగ్కు జరిగే నష్టం కాదు. మిగతా అన్ని నగరాలు, పట్టణాలకు ఇదే గతి పడుతుంది. ప్రజలు మేల్కొని తమ చరిత్రను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. (1/7) భయపడినంతా అయింది. చంద్రబాబు@ncbn గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2024 👉వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. చంద్రబాబు భావజాలం ప్రకారం అయినంత వరకు అమ్ముకుంటూ పోతే చివరకు ఏవీ మిగలవు. అప్పట్లో 32 మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. ఇప్పుడు దొంగ చాటుగా అమ్మకానికి పెడితే అమరులు త్యాగాలు వృథాగా పోయినట్టే. కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు పోరాడితే తప్ప వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగై పోతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ -
మూసివేత దిశగా స్టీల్ ప్లాంట్.
-
అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్ప్లాంట్!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.వైజాగ్ స్టీల్ప్లాంట్కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్ప్లాంట్కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్ప్లాంట్ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అవమానం
-
బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం
-
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.‘చంద్రబాబు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు. తనకు అధికారం రాదని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుంది. ల్యాండ్ టైపింగ్ యాక్ట్ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ. రైల్వే జోన్కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు’ అని పేర్కొన్నారు.చంద్రబాబు ఫ్రస్టేషన్లో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. బాబు, పవన్ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు భూములు ఇచ్చేవాడే కాని లాక్కునే వాడు కాదని, అందుకే 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్ ప్రశంసించింది. చంద్రబాబు, పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ మోీదీ చదివారు.పోలవరంను ఏటీఏంలా వాడుకున్నారని నాడు మోదీ అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని బీజేపీ ఎందుకు చెప్పలేకపోతుంది.? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ప్రధాని మాట్లాడలేదు సరే.. బాబు అయినా తన స్టాండ్ చెప్పాలి’ అని అన్నారు. -
CM Jagan: ‘స్టీల్ ప్లాంట్ అంశంపై మాది రాజీలేని ధోరణి’
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు ఆయన స్పష్టం చేశారాయన. సీఎం జగన్ను కలిసిన సందర్భంలో.. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశాం. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. .. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పార్టీది రాజీలేని ధోరణి. ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి.. .. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత YSRCPకే ఉంది. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పై మా వైఖరిలో ఏ మార్పు లేదు. మేము కన్సెంటు ఇవ్వలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్సార్సీపీ అండగా ఉంది. ఇకపై కూడా ప్రభుత్వ సహకారంతోనే ఉద్యమం జరుగుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకూడదని మేం కోరుకుంటున్నాం. -
రాళ్లు వేయించకునే అలవాటు బాబుకు ఉండోచ్చు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. లోపాయికారీ ఒప్పందాలు చేస్తున్నది టీడీపీనే అని మండిపడ్డారు. ‘స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఏరోజైనా మాట్లాడిందా?. స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో ఉన్నది వైఎస్సార్సీపీ. చంద్రబాబు గాజువాకలో ఏం మాట్లాడారో ఆయనకే తెలీదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు... ప్రజలకు అంతా తెలుసు. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. సీఎం జగన్పై దాడి జరిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డ్రామాలు, నటించడం చంద్రబాబుకు బాగా తెలుసు. సీఎం వైఎస్ జగన్ యాక్టర్ కాదు.. జగన్ రియల్ హీరో. రాళ్లు వేయించకునే అలవాటు చంద్రబాబుకు ఉండోచ్చు. మేం ఎవరికీ ఏదీ ఆపాదించం.. కానీ జగన్పై కుట్ర ప్రకారమే దాడి జరిగింది. పవన్ కల్యాణ్క ఏం తెలుసు?. పవన్ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలి. జగన్పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారు. చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారు. చంద్రబాబు సైకిల్ బాగుందా? ఎప్పుడో తుప్పు పట్టిపోయింది. పవన్ డొల్లతనం ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. చంద్రాబాబు 14 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు. ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? వాలంటీర్లపై చంద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడారు. ఇప్పడు తానొస్తే వాలంటీర్లకు జీతం 10వేలు చేస్తానంటున్నాడు’ అని మంత్రి బొత్స మండిపడ్డారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
-
వైజాగ్ స్టీల్కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్ను జేఎస్పీఎల్కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
అసెట్ మానిటైజేషన్తో రూ. 4 వేల కోట్లు
కోల్కతా: రుణ భారం తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవడం, టర్న్అరౌండ్ సాధించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వైజాగ్ స్టీల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్) సీఎండీ అతుల్ భట్ తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లోని ఫోర్జ్డ్ వీల్ ప్లాంటు, విశాఖలోని స్థలాల మానిటైజేషన్తో పాటు వ్యయ నియంత్రణ చర్యలతో దాదాపు రూ. 3,000– 4,000 కోట్లు సమీకరించుకోగలిగితే ఇందుకు సహాయకరంగా ఉండగలదని ఆయన చెప్పారు. ఉక్కు, మెటలర్జీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ అతుల్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మానిటైజేషన్ (విక్రయం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో అసెట్లపై ఆదాయం ఆర్జించడం) చేపట్టగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2022–23లో ఆర్ఐఎన్ఎల్ సుమారు రూ. 3,000 కోట్లు నష్టం నమోదు చేసింది. అంతర్జాతీయంగా మందగమనంతో నిల్వలు పేరుకుపోవడం, ఉక్కుపై ఎగుమతి సుంకాలు, ముడి వనరుల లభ్యతకు భద్రత లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని భట్ వివరించారు. ఓపెన్ మార్కెట్ నుంచి ముడి ఇనుము కొనాల్సి రావడం వల్ల ప్రతి టన్నుకు రూ. 6,000 మేర ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీనికి తోడు రూ. 23,000 కోట్ల భారీ రుణ భారం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మానిటైజేషన్ ప్రణాళికతో రుణభారం తగ్గి, నిర్వహణ మూలధన పరిస్థితి మెరుగుపడగలదన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీలో ఉన్న ఫోర్జ్డ్ వీల్ ప్లాంటుపై ఆర్ఐఎన్ఎల్ రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
ప్రజల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్..!
-
గద్దర్ ప్రధాన పాత్రలో వస్తోన్న 'ఉక్కు సత్యాగ్రహం'
సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జనం ఎంటర్టైన్మెంట్పై రూపొందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. (ఇది చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ..'విశాఖ స్టీల్ప్లాంట్ సాధన కోసం గతంలో జరిగిన పోరాటం, ప్రస్తుతం పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించాం. వాస్తవానికి దగ్గరగా యువతరాన్ని ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. త్వరలో వైజాగ్ ఆర్కే బీచ్లో ఉక్కు సత్యాగ్రహం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం.' అని అన్నారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి శ్రీ కోటి సంగీతమందించారు. (ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!) -
విశాఖ స్టీల్ప్లాంట్ కొంటా: కె ఏ పాల్
అనకాపల్లి: విశాఖ స్టీల్ప్లాంట్ కమిటీ ముందుకు వస్తే ఉక్కు కర్మాగారాన్ని కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కె.ఎ.పాల్ పేర్కొన్నారు. తన తండ్రి బర్న్బాస్ను కలుసుకునేందుకు పాల్ శనివారం నర్సీపట్నం వచ్చారు. విశాఖపట్నం వెళ్తూ మార్గంమధ్యలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే తనతో కలుస్తారని పాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కాపాడలేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ స్టీల్ప్లాంట్ కొనేందుకు బిడ్ వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తానని అధోగతి పాలు చేశారన్నారు. తాను నర్సీపట్నంలో ఇంటరీ్మడియట్ చదువుతున్న రోజుల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం అప్పుడు ఎలావుందో ఇప్పుడు అలానే ఉందన్నారు. ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశాడన్నారు. -
వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం
సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహణకు అవసరమైన మూలధనం సమీకరణ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. గురువారంతో ఈఓఐ ప్రక్రియ గడువు ముగిసిపోగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థ గానీ మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖ/సంస్థ గానీ బిడ్ దాఖలు చేయలేదు. ఈఓఐలో అవకాశం చేజిక్కించుకుంటే సంస్థ పెట్టాల్సిన పెట్టుబడులు, ఇతర అంశాలను సింగరేణి డైరెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నిర్వహణ మూలధనంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏడాదికి రూ.3,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అందించాల్సి ఉంటుందని తేల్చినట్టు సమాచారం. అయితే సింగరేణి సంస్థ వద్ద బాండ్లు, డిపాజిట్ల రూపంలో నిధులున్నా, నగదు రూపం (లిక్విడ్ రిజర్వ్స్)లో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉండటంతో సర్కారు వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండడం, ఈఓఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతోనూ బిడ్డింగ్కి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. కాగా బిడ్డింగ్లో పాల్గొనకపోవడానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం/సింగరేణి యాజమాన్యం వెల్లడించలేదు. స్టీల్ప్లాంట్ ఈఓఐకు 29 బిడ్లు ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం ప్రతిపాదించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ప్రక్రియ గడువు గురువారం ముగిసింది. మొత్తం 29 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. మార్చి 27న బిడ్లు ఆహ్వానించగా తొలి గడువు ఏప్రిల్ 15 నాటికి 22 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మరికొన్ని సంస్థల విజ్ఞప్తి మేరకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. -
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు హాస్యాస్పదం
-
కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీరియస్ అయ్యారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఆంధ్ర ద్రోహి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ప్లాంట్ కొనుగోలుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏపీని కేసీఆర్ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. స్టీల్ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమే. ఈ అంశంపై కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కేసీఆరే. ఆయన రాజకీయ అవసరాల కోసం ఏపీ ఉద్ధరిస్తాననడం సిగ్గుచేటు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే తగిన బుద్ధి చెబుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఒడిశా ఐరన్ ఓర్,వైజాగ్ స్టీల్స్తో తెలంగాణకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని ఐరన్ ఓర్కు, ఏపీలోని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి తెలంగాణకు ఏం సంబంధమని కేటీఆర్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఆ రెండు లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యం బయటపడటంతో కేటీఆర్కు మైండ్ దొబ్బిందని, ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్థం కావడం లేదని ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలోని నిజాం షుగర్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతగాదు కానీ, వైజాగ్ స్టీల్లో వాటా అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తే.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయ త్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఒడిశాలోని మైనింగ్లో ఎవరు బిడ్డింగ్ వేశారు? అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? నవీన్కు తెల్వని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం కేటీఆర్కు ఎట్లా తెలిసింది? ఆయనే సమాధానం చెప్పాలి’అని అరుణ డిమాండ్ చేశారు. -
వైజాగ్ స్టీల్పై తెలంగాణ ‘ఆసక్తి’!
సాక్షి, హైదరాబాద్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం ఇచ్చిన ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ) ప్రక్రియలో పాల్గొనేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంస్థకు మూలధన పెట్టుబడితో పాటు, ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి.. తమ ఉత్పత్తులను తీసుకునేందుకు ఆసక్తి కలిగిన వారికి ఆహ్వానం పలుకుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మార్చి 27వ తేదీన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రకటించింది. అయితే ఇది బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ప్లాంట్ను అప్ప జెప్పే, అంతిమంగా ప్రైవేట్ పరం చేసే ప్రక్రియలో తొలి అడుగని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లోకి ప్రైవేట్ కంపెనీలను చొప్పించే కుట్రకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. ‘వైజాగ్ ఉక్కు..తెలుగు ప్రజల హక్కు’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. చదవండి: చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు సింగరేణి సంస్థ ద్వారా.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్ను వైజాగ్ స్టీల్ప్లాంట్ నుంచే నేరుగా కొనుగోలు చేయాలని, దీని కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనాలని పలువురు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. కాగా బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న సింగరేణి ఇందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో అధికారుల బృందాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పంపించనున్నారు. ఈ బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా సేకరించాలనుకుంటున్న నిధులు, ఆ నిధులు అందిస్తే తిరిగి ఇచ్చే ఉత్పత్తులు, లేదా తిరిగి చెల్లించే విధానాలు, ఇందుకోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విధించే నిబంధనలు, షరతులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయనుంది. కాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా.. ఇప్పటికే కొంతకాలంగా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తీసుకున్న వ్యతిరేక వైఖరిని మరింత బలంగా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను సంరక్షించేందుకు ఒక ప్రభుత్వంగా వ్యవహరించాల్సిన తీరుపై ఒక బలమైన సందేశం ప్రజల్లోకి వెళుతుందన్న భావన ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అంతిమంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయకుండా, గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మూలధన నిధులను అందించిన తీరుగానే వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. -
కేంద్రానికి కేటీఆర్ లేఖ.. అది తెలుగువారి బాధ్యత అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తాజాగా మంత్రి కేటీఆర్.. కేంద్రానికి బహరంగ లేఖ రాశారు. లేఖలో మోదీ సర్కార్ నిర్ణయాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేటీఆర్ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కేటీఆర్ లేఖలో..‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు ఆపాలంటూ హితవు పలికారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్లే పన్నాగాలు మానండి. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధులు సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్ర కేంద్రం చేస్తోంది. తన కార్పొరేట్ మిత్రులకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్రమే ఈ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థిక సాయం అందించాలి. వైజాగ్ ఉక్కు తెలుగువారి హక్కు.. దీన్ని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని స్పష్టం చేశారు. -
కేంద్ర ప్రభుత్వ అనుచిత నిర్ణయాలు వల్లే ప్రమాదాలు
-
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్ పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై విచారణ జరిపి మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులు కోరారు. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్మెంట్ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
గన్ షాట్: ఎల్లో మీడియా విష ప్రచారానికి అడ్డు అదుపు లేదా ..?
-
"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల
తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు. మొన్నామధ్య గద్దర్ రాసిన పాటను రిలీజ్ చేయగా తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను విడుదల చేశారు. గద్దర్ మాట్లాడుతూ.. 'ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నాను. అందరూ కలిసి ఈ ప్రయివేటీకరణ ఆపగలరు' అని కోరాడు. చదవండి: శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చూస్తున్న హమీదా నా కోడలు బంగారం.. నయన్ అత్త -
ఆ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, విశాఖపట్నం: 'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశం అవసరం' అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆదివారం స్టీల్ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, సినీ నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి కోరారు. ఆ కమిటీ నివేదికను అమలు చేయాలి స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం చెబుతున్న కారణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలన్నారు. ఉక్కు అమ్మకం ప్రజల మనోభావలతో కూడిన అంశం అని తెలిపారు. దస్తూరి కమిటీ నివేదికను కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం అంటే కుట్రలో చిక్కుకున్నట్లే అని అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రల హక్కు నినాదం తన ఐడెంటిటీని కోల్పోతుందన్నారు. ప్రజాఉదయమం ద్వారానే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమన్నారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం
స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం.. గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్ సేనలపై వీరోచితంగా పోరాడారు. ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్ 2న మద్రాసు సెక్రటేరియెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత 1952 అక్టోబర్లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉద్యమంలో కీలకంగా.. 1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు. ► అనంతరం 1978–83 వరకు తాడికొండ నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు. ► అప్పట్లో జిల్లా కలెక్టర్ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్ 27న ఆయన నెల్లూరులో కన్నుమూశారు. విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్ అమృతరావు సేవలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్ వెల్ఫేర్ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం. – తమనంపల్లి మోహన్ గాంధీ గాంధీ మిషన్ అధ్యక్షులు (అమృతరావు మనవడు) గొప్ప నేతతో నా సాంగత్యం అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. – వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్ న్యాయవాది -
స్మగ్లింగ్లో ‘పుష్ప’ను మించిపోయాడు..
ఉక్కునగరం(విశాఖపట్నం): స్టీల్ప్లాంట్లో పుష్ప సినిమా తరహా దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీఐఎస్ఎఫ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి.. స్టీల్ప్లాంట్ స్ట్రక్చరల్ మిల్లో 56 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన రౌండ్ బార్లు తయారు చేస్తుంటారు. అలా తయారైన వాటిలో పగుళ్లు, సరైన సైజు లేని వాటిని స్క్రాప్ కింద పక్కన పెడతారు. వాటిని ఎస్ఎస్డీ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ ద్వారా స్టీల్ మెల్ట్షాప్కు తరలించి రీ మెల్టింగ్ చేస్తారు. చదవండి: అదే బావి.. నాడు భర్త, నేడు భార్య గురువారం ఉదయం షిఫ్ట్లో సుమారు 6.30 ప్రాంతంలో ఒక మినీ వ్యాను మెయిన్ గేటు అవుట్ గేటు ద్వారా బయటకు వెళ్లడానికి వచ్చింది. అక్కడ తనిఖీ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక భాగం అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా షీట్ల కింద సుమారు 40 రౌండ్ బార్ ముక్కలు బయటపడ్డాయి. అవాక్కైన సిబ్బంది వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుట్టుగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వాహనం నంబర్ను చూస్తే అది కూడా ఒరిజినల్ కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఠా బయటపడితేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని, చోరీ సొత్తును స్టీల్ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. -
గాజువాక: స్టీల్ప్లాంట్ నిరసనల్లో ఉద్రిక్తత.. టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, కార్మిక సంఘాలు రెండు రోజుల నిరసనలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టీల్ప్లాంట్ నిరసనల్లో భాగంగా గాజువాక జంక్షన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. రసాభాస సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ నినాదాలు చేశారు. దీనిపై నిలదీసిన రోజా అనే వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తపై తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారం నేపథ్యంలో.. గాజువాక జంక్షన్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు నచ్చ చెప్పడంతో కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో టీడీపీ నేతల తీరు పై గాజువాక ప్రజలు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాల్సిన కార్యకర్తలు ఆ పని చేయకపోగా.. పైగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఘోరంగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. -
కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మెసేజ్లు
-
చెప్పింది ఒకటి... చేసేదొకటి!
ఎన్నికలు రాగానే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్లో లక్షలు సొమ్ము వేస్తామని చెబితే పేదప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గద్దె నెక్కించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఏ ఖాతాకు జమ కాలేదు. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పైకి తీసుకొని వస్తానన్నారు. ఏమయింది? చివరకు నల్ల ధనం, నకిలీధనం కూడా ఆర్బీఐలోకి వెళ్లాయి. ఎంత ధనం ఆర్బీఐకి వచ్చిందో లెక్క తేల్చలేని పరిస్థితి. బ్యాంకులలో ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)లు ఎక్కువ య్యాయని చిన్నాచితకా బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మొత్తం బ్యాంకులను అమ్మివేసే పరిస్థితి! ఫలితంగా ఎన్పీఏలు తగ్గకపోగా సుమారు 15 శాతానికి పెరగటం గమనార్హం. రిజర్వు బ్యాంకులో ఉన్న అధిక ధనాన్ని డివిడెండుగా ప్రభుత్వం వాడుకొని స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వు బ్యాంకుని నిర్వీరం చేస్తోంది. బ్యాంకులను జాతీయీ కరణ చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకే దక్కుతుంది. లేకపోతే సామాన్యుడు బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయేది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తానని చెప్పి ఆ పని చేయలేక పోయారు. పీఎం ఫసల్ బీమాని ప్రయివేట్ సంస్థల కిచ్చి రైతులకు పంట నష్టం జరిగినపుడు న్యాయ బద్ధంగా ఇవ్వవలసిన క్లయిమ్ను ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించినా... పంటలను కొనకుండా రైతులను నిండా ముంచుతున్నది కేంద్రం. నిత్యం పాలిచ్చే ఆవులాగ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని కార్పొరేట్లకు అమ్మాలన్న ఆలోచన చూస్తుంటే దేశాన్ని ఈ పాలకులు ఏ దారికి తీసుకెలుతున్నారనే అనుమానం కలుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం? సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని గాలిలో కలిపేస్తారా? కాంగ్రెసు పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే... దానికి పార్లమెంటులో వత్తాసు పలికి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? విభజన చట్టంలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇస్తామని చెప్పిన మాట మార్చి రకరకాల మాటలు చెప్పడం దేనికి సంకేతం? విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తాననడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్నా... మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర పాలన ఎవరికి లాభం చేకూర్చుతున్నదో అర్థం కాని ప్రశ్న. ఒక దేశం ఒకే పన్ను విధానాన్ని (జీఎస్టీ) తీసుకొచ్చి చిన్న వ్యాపారస్థుల నడ్డి విరిచారు. ప్రతి నెలా రిటర్ను దాఖలు చేయడంతోనే సమయం డబ్బు వృథా అవుతుండడం వలన చిన్న వ్యాపార స్తుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి మనిషికి అవసరమైన బట్టలను, చెప్పులను కూడా వదలకుండా పన్ను విధించటం గమనార్హం. బట్టలపై 5% పన్ను విధించి, అంతటితో ఆగకుండా మరలా 7% పన్నుని విధించటం వలన వ్యాపార వర్గంలోను, ప్రజలలోనూ వ్యతిరేకత పెరిగింది.. దీంతో సదరు పన్నును కేంద్రం ఉపసంహరించుకొంది. కొత్త వ్యవసాయ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించడంతో రైతులు ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. - కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం -
విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్లో ప్రమాదం
-
విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్ట్ ఫర్నేస్లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ద్రవరూప స్టీల్ నేల పాలయ్యింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్టీలు ప్లాంట్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. నష్టం తీవ్రత అంచనా వేయాల్సి ఉంది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
సీఎం జగన్ ఎవరితో పోరాడాలి పవన్?: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానిది తప్పు లేదని, సీఎం జగన్ ఏం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని అజ్ఞాన వాసి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. పవన్ మాట్లాడేది కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని, రాష్ట్రానికి చెందినది కాదని పవన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దు అంటూ సీఎం జగన్ ఈ సంవత్సరం (2021) ఫిబ్రవరి 6 , మార్చి 10 న ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారన్నారు. మే 20న అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలియజేశారు. సీఎం జగన్, కేంద్రంలో భాగస్వామి కాకపోయినా ఎక్కడా తగ్గకుండా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా తెలుసునన్నారు. ఢిల్లీలో రాజ్యసభ, పార్లమెంటుల్లో రోజూ హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ పీపీ నేత వి.విజయ సాయిరెడ్డి నాయకత్వాన వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాడుతున్న విష యం అందరం చూస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఏబీఎన్ సైతం ప్రసారం చేసిందని, వామపక్ష పత్రిక అయినా ప్రజాశక్తి సైతం వార్తను ప్రచురించిందని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే పవన్ కల్యాణ్ ఏమి ఎరుగనట్లు సినీ డ్రామాను ప్లే చేస్తూ ఆందోళన చేయటం సబబుగా లేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, తొమ్మిది ఏళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంటుకు ఒడిశా లో సొంత ఇనుప గనులు చంద్రబాబు కేటాయింపచేసి ఉంటే నష్టాలూ తగ్గి, లాభాల బాట పట్టేదన్నారు.ఇది అందరూ అంగీకరించే వాస్తవమని తెలిపారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని పట్టుపట్టి కేంద్ర మంత్రిని చేయడంలో చూపిన శ్రద్ధ ఉక్కు గనుల కేటాయింపులో చంద్రబాబు చూపలేదన్నారు. అయినా తన పార్టనర్ బాబుని అనడానికి పవన్కు మనసొప్పదని తెలిపారు. బాబు కాలిలో ముళ్ళు గుచ్చుకొంటే పవన్ కంటిలో కన్నీరు వస్తుందన్నారు. బీజేపీ మీద ఉద్యమం చేయకుండా వైఎస్సార్ సీపీ మీద ఉద్యమం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఎప్పుడూ వైఎస్ జగన్ మీద, వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు. సినిమాల్లో డైరెక్టర్ ఏం చెబితే అది చెప్పడం, కమర్షియల్గా హిట్ రావాలంటే ఏ డైలాగ్స్ చెబితే బాగుంటుందంటే వాటిని వాడటం, స్క్రిప్ట్ ఏది ఉంటే అది చెప్పడం పవన్కు బాగా అలవాటుగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం అని ప్రజలు అంటున్నారని దుయ్యబట్టారు. చదవండి: కడుగు.. కడుగు!! బాగా కడుగు.. ఈ దెబ్బతో కారు తళ తళ మెరిసిపోవాలి! -
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 150 అప్రెంటిస్లు
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్లు–50, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు–100. ► డిప్లొమా అప్రెంటిస్లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.3542 చెల్లిస్తారు. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.4984 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ► ఎంపిక విధానం: డిప్లొమా/ఇంజనీరింగ్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చే స్తారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021 ► వెబ్సైట్: www.vizagsteel.com -
వైజాగ్ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం(గాజువాక): వైజాగ్ స్టీల్ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందుకున్న నూతన సీఎండీ అతుల్ భట్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
విశాఖలో స్టీల్ప్లాంట్ కార్మికుల కొవొత్తుల ర్యాలీ
-
200వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేటితో(సోమవారం) 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. సాయంత్రం క్యాండిల్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఇక ఉద్యమంలో భాగంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న 10వేల మందితో మానవహారం చేపట్టారు. కాగా ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచి అండగా ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయొద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్ప్లాంట్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది. చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ -
విశాఖలో భారీ మానవహారం
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మానవహారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలేదీక్షలు నేటీతో 200వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 వేల మందితో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితులు 10కిలో మీటర్ల వరకు మానవహారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులు, నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి మానవహారంలో పాల్గొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చదవండి: ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు -
నేడు విశాఖకు సింధు.. స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం
సాక్షి, ఉక్కునగరం (గాజువాక): విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఆదివారం మధ్యాహ్నం నగరానికి రానున్నారు. సాయంత్రం స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ఉక్కు స్టేడియంలో పిల్లలతో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ను ప్రారంభిస్తారు. తర్వాత ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం వెళ్లి పిల్లలతో ముచ్చటించనున్నారు. అక్కడ నుంచి ఉక్కుక్లబ్లోని ఎంపి హాలులో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. అక్కడ పి.వి.సింధును సత్కరించనున్నారు. కార్యక్రమంలో భాగంగా అరుణోదయ ప్రత్యేక పాఠశాల సందర్శించనున్నారు. అనంతరం సీఐఎస్ఎఫ్ కాలనీలో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ప్రారంభిస్తారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
నీతి ఆయోగ్ సీఈఓకు నిరసన సెగ
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ బస చేసిన హిల్టాప్ గెస్ట్హౌస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్ వైజాగ్ స్టీల్’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్ సీఈఓ గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్టెక్ జోన్లో పర్యటించనున్నారు. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు సాధించింది. జులై నెలలో 540.8 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిపింది. ఏప్రిల్-జులై మధ్య 1,538 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపినట్లు ఆర్ఐఎన్ఎల్ ట్విటర్లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఆ 4 నెలల్లో 48 శాతం అదనంగా విక్రయించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కార్మికులు గత రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. Stellar performance by #RINL Vizag Steel in the month July'21&till July in FY'22. #RINLmktng Registered highest ever Since inception:July monthly Sales of Saleable Steel of 540.8 thousand tons also with a growth of 38%more than 390.5 thousand tons CPLY.@SteelMinIndia @RCP_Singh pic.twitter.com/EewF9sY5NG — RINL (@RINL_VSP) August 3, 2021 -
జంతర్మంతర్ వద్ద భారీ వర్షం.. ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కోసం 23 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. స్టీల్ ప్లాంట్లో 1991లో ఉత్పాదన ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం తగదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. దురుద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంది.. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దం పాటు పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను స్టీల్ప్లాంట్ కాపాడింది. రూ.22 వేల కోట్ల అప్పులను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలి.’’ అని అన్నారు. ఇక స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, విశాఖ స్టీల్ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని, లేఖ ద్వారా సీఎం జగన్ ప్రత్యామ్నాయాలు సూచించారని గుర్తుచేశారు. స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించాఢలని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. పార్లమెంట్లో కూడా విశాఖ స్టీల్ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ప్లాంట్ అంశాలపై సభను అడ్డుకున్నామని.. సీఎం జగన్ దిశానిర్దేశంతో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ పట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవెటీకరణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం అఫిడివిట్ దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. స్టీల్ప్లాంట్లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్ప్లాంట్ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. కాగా, విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్ప్లాంట్లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్ప్లాంట్ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.కేంద్రం చర్యలపై స్టీల్ప్లాంట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్ప్లాంట్లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్ప్లాంట్ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
-
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
సాక్షి,ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్కి మణిహారంలాంటి విశాఖ స్టీల్ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువైన విశాఖ స్టీల్ను చౌకగా అమ్మేస్తున్నారని, స్టీల్ప్లాంట్ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యకు మద్దతు పలికారని వెల్లడించారు. -
మీకిదే చివరి అవకాశం.. కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మరికొంత గడువునిచ్చింది. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలులో జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో జాప్యం తగదన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దాన్ని రద్దు చేయాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (జేడీ లక్ష్మీనారాయణ) పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు మరో వారం గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 29న బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోందన్నారు. అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. -
నిర్మలా సీతారామన్ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
నిర్మలా సీతారామన్ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... విశాఖ స్టీల్ప్లాంట్ను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోంది’’ అని విజయసాయిరెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. అదే విధంగా... ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పతి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది’’ అని అన్నారు. ‘‘కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్ఐఎన్ఎల్ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్ఐఎన్ఎల్కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుంది’’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజయసాయిరెడ్డి సమర్పించిన వినతి పత్రంలో వివరించారు. -
ఎంపీ విజయసాయిరెడ్డితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీ
-
విశాఖ ఉక్కు: 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ విడుదల చేసింది. ఇక నుంచి ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 2, 3 తేదీల్లో 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమాన్ని చేపడతమని పేర్కొంది. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
-
విశాఖ స్టీల్ ప్లాంట్: కొనసాగుతున్న భారీ నిరసన ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరాయి. వేలాదిమంది కార్మికులు నిరసన ర్యాలీలో భాగంగా కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరాయి. కార్మికుల దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పలువురి అభిప్రాయాలు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి: సీపీఎం నర్సింగరావు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సొంతంగా గనులు కేటాయించాలని , సీపీఎం నర్సింగరావు డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన కోరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు: గఫూర్ స్టీల్ప్లాంట్ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీఐటీయూ నేత గఫూర్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ మూర్ఖంగా పాలిస్తున్నారని, ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షలాదిమందికి స్టీల్ప్లాంట్ ఉపాధి కల్పిస్తోంది: అయోధ్యరామ్ స్టీల్ప్లాంట్ రూ.వేలకోట్ల పన్నులు కడుతుంటే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటని స్టీల్ప్లాంట్ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. సీఎం జగన్ లేఖలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని, అసలు హోదా లేదు, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి స్టీల్ప్లాంట్ ఉపాధి కల్పిస్తోందన్నారు. ►ప్రజల ఆకంక్ష మేరకు ప్రధాని మోదీ నడుచుకోవాలని, స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప కోరారు -
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 319 ► విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫిట్టర్–75, టర్నర్–10, మెషినిస్ట్–20, వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)–40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్–20, ఎలక్ట్రీషియన్–60, కార్పెంటర్–20, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్కండిషనింగ్–14, మెకానిక్ డీజిల్–30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్–30. ► అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ► వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021 ► వెబ్సైట్: www.vizagsteel.com మరిన్ని నోటిఫికేషన్లు: తెలంగాణ గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు ఎన్పీసీఐఎల్లో అప్రెంటిస్ ఖాళీలు -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈనెల 29న సమ్మె
-
‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోండి’
సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోవాలని ఐఎన్టీయూసీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజ్ఙప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, పలువురు ఐఎన్టీయూసీ నేతలు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా.. విశాఖ ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్పై సీఎం జగన్ సమీక్ష -
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక మిస్టరీ ఇదేనా..!
సాక్షి, విశాఖపట్టణం: మూడు రోజుల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్లో అదృశ్యమైన ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా లభించలేదు. బ్లాస్ట్ ఫర్నేస్లో ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అతడు లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం కోసం ఆత్మహుతి అవుతున్నట్టు లేక రాసి కనిపించకపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అదృశ్యం వెనుక మిస్టరీ దాగి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీనివాసరావు కాల్ డేటా బట్టి పలువురిని విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అతడి గురించి పలు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. ఉద్యోగాల పేరిట పలువురు వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్టు శ్రీనివాస్పై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొందరు బాధితులు బయటకు వస్తున్నారు. శ్రీనివాసరావు పని చేసిన స్టీల్ వైర్ రాడ్ మిల్ ఈ విభాగంలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. జాగిలాలు అతను కూర్చున్న ప్రదేశం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్కు అక్కడి నుంచి వాహనం పార్కింగ్ చేసిన ప్రదేశం వరకు వెళ్లాయి. ఈ దశలో బ్లాస్ట్ ఫర్నేస్లోకి వెళ్లే అవకాశాలు తక్కువ కావడంతో శ్రీనివాసరావు మరో చోట ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాజువాక సింహగిరి కాలనీలో ఉంటున్న శ్రీనివాస రావు భార్య సుమ ఆధ్యాత్మక చింతనతో పలువురితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ పరిచయాలతో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శ్రీనివాస రావు పలువురు వద్ద లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఆ డబ్బుతోనే గాజువాక మురళీనగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భవంతులు నిర్మించుకున్నాడని బాధితులు చెబుతున్నారు. శ్రీనివాస రావు అదృశ్యమైన రోజే తమకు ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుతాయని చెప్పినట్లు బాధితులు వాపోయారు. తమను నమ్మించి మోసగించాడని ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సాకుగా చూపించి మోసం నుంచి బయట పడాలని శ్రీనివాసరావు ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఆచూకీ కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. చదవండి: ఏం తెలివబ్బా.. మాస్క్తో హైటెక్ కాపీయింగ్ -
స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి
-
స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్న ఆయన, వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేశారు. ‘‘ప్రైవేట్ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయి. కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇక స్టీల్ప్లాంట్కు కోకింగ్ కోల్ కొరత ఉందన్న విజయసాయిరెడ్డి, సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వైజాగ్ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గంటే గతంలో విశాఖలో భూగంట మోగించలేదా? ఇక విశాఖ స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణ గురించి పలువురు రాజకీయాలు చేయడంపై ట్విటర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా?’’ అని ప్రశ్నించారు. చదవండి: విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి -
కేటీఆర్తో గంటా భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో కొద్ది నిమిషాల పాటు ఇద్దరి భేటీ సాగింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు పరిరక్షణ ఉద్యమానికి కేటీఆర్ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినట్లు గంటా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందంతో కలసి విశాఖపట్నం వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపైనా వారు చర్చించారు. -
‘పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు’
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం: చిరంజీవి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకుందామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకణకు వ్యతిరేకంగా పరీరక్షణ కమీటి చేస్తున్న పోరాటనికి తన మద్దతు ప్రకటిస్తునట్లు పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామని చిరంజీవి గుర్తుచేశారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిని విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలకు కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని సూచించారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయమైన హక్కు అని.. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions. With a Steely resolve, Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim — Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021 చదవండి: ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆచార్య -
సొంత గనులు లేకనే స్టీల్ ప్లాంట్కు నష్టాలు
ఢిల్లీ: సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణాలలో ఒకటని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ.. సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్ ధరలకు బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం కొనుగోలు చేయవలసి వస్తోందని, స్టీల్ ప్లాంట్కు వాటిల్లితున్న నష్టాలకు కారణాలలో ఇది ఒకటని తెలిపారు. ఇనుప ఖనిజం గనులను రిజర్వ్ చేయవలసిందిగా కేంద్రంలోని గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవలసిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒడిషా, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇనుప ఖనిజం గనిని రిజర్వ్ చేయవలసిందిగా గనుల మంత్రిత్వ శాఖ ఒడిషా ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. గడచిన అయిదేళ్ళ కాలంలో పర్బత్పూర్, సితనాలాలోని బొగ్గు, ఇనుప ఖనిజం గనులను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు కేటాయించడం జరిగింది.అయితే ఈ గనులను సెయిల్ తిరిగి స్వాధీనం చేయడంతో ఆ కేటాయింపులను రద్దు చేయడం జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఒడిషాలోని థాకురాని బ్లాక్ ఏ, రమణదుర్గ ఫారెస్ట్ రేంజ్లోని బ్లాక్ 31లోని ఇనుప ఖనిజం గనులను 2004, 20019లో సెయిల్ పేరిట రిజర్వ్ చేసినందున ఒడిషా ప్రభుత్వం మూడేళ్ళ పాటు ఆయా బ్లాకుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బొగ్గు మంత్రిత్వ శాఖ 2020 మార్చిలో జార్ఘండ్లోని రబోధి కోల్ గనిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సూత్రప్రాయంగా కేటాయించిందని మంత్రి తెలిపారు. చదవండి: స్టీల్ప్లాంట్ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు -
ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ఉన్నారని గుర్తుచేశారు: కన్నబాబు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దం: విజయసాయిరెడ్డి
-
మోదీ పేరు ఎత్తితే బాబుకు వణుకు పుడుతోంది
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు. తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యేవరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సబ్బంహరికి సిగ్గుంటే టీడీపీకి రాజీనామా చేయాలని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్ప్లాంట్ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు తెలిపారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలన్నారు. స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోదీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ చదవండి: భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నదని, గతంలో జరిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే 20 వేల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ అత్యుత్తమంగా నడిచిందని, చంద్రబాబు హయాం (2014-15) నుంచే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు. -
నిర్మలా సీతారామన్ ప్రకటనను రాజకీయం చేస్తున్నారు
-
చంద్రబాబు, ఎల్లో మీడియాది వక్రబుద్ధి: సజ్జల
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ అంశంపై ప్రధానికి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారని, స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరినట్లు వెల్లడించారు. అఖిలపక్షాన్ని, కార్మిక సంఘం నేతలను తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ కేంద్ర పరిధిలోని అంశమని తెలిపారు. వంద శాతం కేంద్రం ఆధీనంలోని పరిశ్రమ అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై సీఎం జగన్ పలు సూచనలు కూడా చేశారని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రా సెంటిమెంట్లో ఒక భాగమని చెప్పారు. విశాఖ ఉక్కుపై పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వక్రబుద్ధితో చంద్రబాబు, ఎల్లో మీడియా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేసేలా కథనాలు ప్రచురించాయని తెలిపారు. వాళ్ల తల నిండా విషమే కాబట్టి విషపూరిత వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: సభ్యత మరిచి బాబు వ్యాఖ్యలు -
ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్
-
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: వైజాగ్ స్టీల్ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్ప్లాంట్పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు. చదవండి: ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతా సీఎం జగన్పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త -
ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదు..
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాని ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన హామీనిచ్చారు. సోమవారం పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో కేంద్రమంత్రులను కూడా కలిశామని వివరించారు. స్టీల్ ప్లాంట్పై సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. స్టీల్ ప్లాంట్పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత చంద్రబాబుదేదని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తుందని, రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రమే స్పష్టం చేసినా వారి దుశ్ప్రచారం ఆగడం లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పాలనలో స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరగదని హామినిచ్చారు.స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. నీతి, న్యాయానికి కట్టుబడ్డ సీఎం జగన్ వెనుకే రాష్ట్ర ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అవాక్కులు, చవాక్కులు పేలినా ప్రజల మద్దతు సీఎం జగన్కే ఉందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూర్మన్నపాలెం మెయిన్గేట్ వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపించాయి. -
సీఎం జగన్కు విశాఖ అంటే ఎంతో ఇష్టం..
సాక్షి, విశాఖ: సీఎం జగన్మోహన్రెడ్డికి విశాఖ నగరంపై ప్రత్యేక మమకారం ఉందని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా వెనక్కు తగ్గేది లేదని, విశాఖ రాజధాని కావడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు, అతని తనయుడు లోకేశ్ బాబుకు విశాఖలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో బంద్ విజయవంతమయ్యిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీని ఆల్ బెవర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ(ఏబీసీ పార్టీ) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో తప్పుడు డాక్యుమెంట్లతో అనుయాయులకు విలువైన భూములు కట్టబెట్టడాన్ని ఆయన ప్రస్థావించారు. త్వరలో విశాఖలో లక్షా 90 వేల మందికి సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో బంద్ విజయవంతం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు ప్రభుత్వ సహకారం తోడవడంతో బంద్ విజయవంతమైందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసేందుకు కూడా చంద్రబాబుకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్సీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పొస్కో ఏపీకి రావడం నిజమే కానీ.. ప్రభుత్వం కృష్ణ పట్నం, భావనపాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు గల్లి గల్లి తిరుగుతున్నారని, మా నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఆ అవసరం లేదని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలేవైనా రిజల్ట్ ఎప్పుడూ వైఎస్సార్సీపీ అనుకూలంగానే వస్తుందన్నారు. -
ఏపీ బంద్కు అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం
సాక్షి, కర్నూలు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్మికులు చేపడుతున్న బంద్కు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని పట్టణానికి బయలుదేరిని ఆయన.. మార్గమధ్యంలో కోడుమూరు పట్టణంలో ఆగి అక్కడ శాంతియుతంగా బంద్ను పాటిస్తున్న కార్మికులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్థావించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని హామీనిచ్చారు. ఇదిలా ఉండగా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు రంగంలో నిలిచారు. వీరికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఆదోనికి వెళ్లారు. కాగా, పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం పార్టీ ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బంద్కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం
-
బంద్కు ప్రభుత్వ మద్దతు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్పరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్కు తమ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జనవాణిని కేంద్రానికి వినిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదట్నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. నేలకొరిగిన తెలుగువారి త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు అన్న నిజాన్ని కేంద్రం ముందు నిక్కచ్చిగా చెబుతామన్నారు. కోట్లాది మంది ప్రజల మనోభీష్టానికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని చెప్పారు. కదం తొక్కుతున్న ప్రజాస్ఫూర్తిని నాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే... ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బంద్ చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తర్వాత తిరిగేలా ఏర్పాట్లు చేశాం. ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విశాఖ ఉక్కును లాభాల్లోకి తేవచ్చని, నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలను సీఎం సూచించారు. ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన సీఎం జగన్ కృషి అందరికీ ఆదర్శం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేస్తుంటే విపక్షం గగ్గోలు పెట్టడం అర్థరహితం. ప్రజలపై పన్నుల భారం మోపే ఆలోచన సీఎంకు లేదు. చదవండి: 'ఉక్కు' పిడికిలి బిగిసింది -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపి ఎంవివి సత్యనారాయణ ప్రసంగం
-
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ బహిరంగ సభ
సాక్షి, విశాఖపట్నం: ‘ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్ప్లాంట్. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా.. ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. అనంతరం ప్లాంట్ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిస్తే.. విశాఖలో తప్ప మరోచోట ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పారు. స్టీల్ప్లాంట్ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్ప్లాంట్కున్న రుణభారం రూ.25వేల కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తి స్థిరీకరణ చాలా అవసరం.. ఉత్పత్తి ఆగితే నష్టాలు మరింత పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదు. స్టీల్ప్లాంట్లో ఉన్న పైఅధికారులు మన రాష్ట్రం వారు కాదు. వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తుశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలి. ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదు. కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటాం .. స్టీల్ప్లాంట్కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... ‘‘విశాఖ స్టీల్ప్లాంట్ ప్రభుత్వరంగంలో కొనసాగేలా ఉద్యమం కొనసాగిస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. రాయలసీమ నుంచి కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తాం. స్టీల్ప్లాంట్ కోసం ఉక్కుదీక్షతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కానివ్వం’’ అని పేర్కొన్నారు. ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో కూడా చెప్పాం. ఇప్పటికే ప్రధానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు’’ అని తెలిపారు. ‘‘విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం’’ అని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పోరాటం కొనసాగిస్తాం: ఎంపీ సత్యవతి మా అందరికీ ఎప్పటికప్పుడు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం ఉధృతం చేస్తాం. కాపాడుకుని తీరతాం: గుడివాడ అమర్నాథ్ 32 మంది ప్రాణాల త్యాగఫలమే విశాఖ స్టీల్ప్లాంట్. దానిని కచ్చితంగా కాపాడుకుని తీరుతాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అనగానే మొదటిగా స్పందించిన వ్యక్తి సీఎం జగన్.. ఇప్పటికే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. చదవండి: విజయసాయిరెడ్డి పాదయాత్ర విజయవంతం -
‘ప్రైవేటీకరణను అడ్డుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది’
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని, వైజాగ్లో జింక్, షిప్ యార్డులను కాపాడిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డిదేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణకు అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. విశాఖ స్టీల్స్ను కాపాడుకునేందుకు కార్మికులంతా ఏకమై ఉక్కు సంకల్పంతో ఉద్యమం చేస్తుంటే నారా లోకేష్ అసందర్భ ప్రేలాపన చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. టీడీపీ శిబిరానికి వెళ్ళిన లోకేష్కు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న కార్మికుల దీక్షలు కనిపించ లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బీజం పడిందని, ఈ విషయాన్ని 2014 జూలై 14వ తేదీన పత్రికలు రాశాయని సాక్షాధారాలతో బహిర్గతం చేశారు. పరిశ్రమ రాష్ట్రంలో ఉన్నందున పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా అదే ప్రతినిధులు ఆయన్ను ఎందుకు కలిసారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలోనే వున్నా దానిపై సర్వ హక్కులు కేంద్రానికే ఉంటాయన్న కనీస అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఏపీలోనే అత్యధికంగా 54 సంస్థలు ప్రైవేట్ పరం అయ్యాయని గుర్తు చేశారు. జింక్ కంపెనీ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్ పరం అయ్యిందన్న విషయాన్ని మరిచి, టీడీపీ నేతలు ఇప్పుడు జింక్ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు కేంద్ర కేబినెట్లో టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వున్న విషయాన్ని మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏపీ ప్రజలకు శాపంగా మారాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని, అందులో భాగంగా ప్రధానికి లేఖ కూడా రాశారని గర్తు చేశారు. ఇటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. లోకేష్ బరువు తగ్గించు కోవడానికని వెళ్లి బ్రెయిన్ తగ్గించు కున్నాడని ఎద్దేవా చేశారు. 420 యూనివర్సిటీ పెడితే చంద్రబాబు వైస్ ఛాన్సలర్ అవుతారని విమర్శించారు. లోకేష్ విశాఖలో అడుగుపెట్టే ముందు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్పై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..
సాక్షి, తాడేపల్లి: వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండటం చాలా బాధాకరమని, ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఇది ఆవిర్భావం కాలేదని, దీని వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాటం జరిగిందని గర్తు చేశారు. విశాఖ ఉక్కు కేవలం విశాఖకే కాదు యావత్ రాష్ట్రానికే తలమానికమన్నారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ అంశంపై పోరాటం చేయాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అసలు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు తొలి అడుగు చంద్రబాబు హయాంలోనే పడిందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన నిలదీశారు. బీజేపీతో జతకట్టిన జనసేనానికి కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్లేది విశాఖ ఉక్కు కోసమా.. లేక తిరుపతి సీటు కోసమా అంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉండవని తెలిసి కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం అమ్మే అవకాశం ఉంటే చంద్రబాబు ఏ రోజో ఆ పని చేసే వాడని విమర్శించారు. అప్పటి వరకు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్ళిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. ఈ అంశంపై సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకొని కలిసికట్టుగా విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరారు. పట్టుమని 10 పంచాయతీలు కూడా గెలవలేని తెలుగుదేశం పార్టీ.. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని ఢంకా కొట్టడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్సీపీ 90 శాతం పంచాయతీలను గెలుచుకుందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన ప్రతి ఇంటికి వెళ్ళింది కాబట్టే ఎన్నికలు ఏవైనా, ఎప్పుడు జరిగినా 90 శాతం ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తామని, పెట్టుబడుల ఉపసంహరణను ఆపడానికి ఏమి చేయాలో అన్ని చేస్తామని ఆయన వివరించారు. -
బాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడు: విజయసాయి రెడ్డి
అమరావతి: వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాం లోనే ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు తనకేమి పట్టనట్లు ఉన్న చంద్రబాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడని ట్విటర్ వేదికగా విమర్శించారు. పొస్కొకంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్లో ప్రస్తావించిన సంగతిని గుర్తు చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఇప్పటికైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చదవండి: అబద్దాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్.. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు.. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు. -
'చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు'
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని, ఆయనకు విశాఖ స్టీల్స్ తెలీదు కానీ సుజనా స్టీల్స్ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనాచౌదరి అని తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వద్దని నిర్మలాసీతారామన్ను కలిశామని,నష్టాలుంటే గట్టెక్కించాలని సూచించామని తెలిపారు.