అందర్నీ ముంచడమే బాబుకు తెలుసు: గుడివాడ అమర్నాథ్‌ | Gudivada Amarnath Serious On Chandrababu Over Vizag Steel Plant | Sakshi
Sakshi News home page

నాడు ప్రత్యేక హోదా.. నేడు స్టీల్‌ ప్లాంట్‌.. చంద్రబాబు కుట్రే: అమర్నాథ్‌

Published Wed, Sep 18 2024 11:29 AM | Last Updated on Wed, Sep 18 2024 11:50 AM

Gudivada Amarnath Serious On Chandrababu Over Vizag Steel Plant

సాక్షి, తాడేపల్లి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ అమర్నాథ్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు కామెంట్స్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా అమర్నాథ్‌..‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి, కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ విషయంలోనూ అంతే. బాబు వచ్చాడు.. అందర్నీ ముంచుతున్నాడు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 


 ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్‌ ప్లాంట్‌ కాదా?’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement