
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. లోపాయికారీ ఒప్పందాలు చేస్తున్నది టీడీపీనే అని మండిపడ్డారు. ‘స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఏరోజైనా మాట్లాడిందా?. స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో ఉన్నది వైఎస్సార్సీపీ. చంద్రబాబు గాజువాకలో ఏం మాట్లాడారో ఆయనకే తెలీదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు... ప్రజలకు అంతా తెలుసు. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు.
సీఎం జగన్పై దాడి జరిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డ్రామాలు, నటించడం చంద్రబాబుకు బాగా తెలుసు. సీఎం వైఎస్ జగన్ యాక్టర్ కాదు.. జగన్ రియల్ హీరో. రాళ్లు వేయించకునే అలవాటు చంద్రబాబుకు ఉండోచ్చు. మేం ఎవరికీ ఏదీ ఆపాదించం.. కానీ జగన్పై కుట్ర ప్రకారమే దాడి జరిగింది. పవన్ కల్యాణ్క ఏం తెలుసు?. పవన్ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలి. జగన్పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారు. చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారు.
చంద్రబాబు సైకిల్ బాగుందా? ఎప్పుడో తుప్పు పట్టిపోయింది. పవన్ డొల్లతనం ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. చంద్రాబాబు 14 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు. ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? వాలంటీర్లపై చంద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడారు. ఇప్పడు తానొస్తే వాలంటీర్లకు జీతం 10వేలు చేస్తానంటున్నాడు’ అని మంత్రి బొత్స మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment