విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ | Central Govt Give Affidavit AP High Over Visaka Steel Plant Privatization | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

Jul 28 2021 1:19 PM | Updated on Jul 28 2021 1:53 PM

Central Govt Give Affidavit AP High Over Visaka Steel Plant Privatization - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేంద్రం తన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement