kashmir
-
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు. -
చికాగో టూ కశ్మీర్..యువరాణిలా డ్రీమీ వెడ్డింగ్: వావ్ అంటున్న నెటిజన్లు
భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతో యువరాణులను మరపిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహిందీ, ఇలా ప్రతీదాంట్లోనూ రాయల్ లుక్స్తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలల రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచు కునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమీ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో.. తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడి చేస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా!చికాగోకు చెందిన డాక్టర్ పైజ్ రిలే(Paige Riley) తన వివాహ వేడకలతో అందర్నీ అబ్బురవపర్చింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్ దుస్తులు, అలంకరణ, మెహిందీ ఇలా ప్రతీదీ స్పెషల్గా ఉండేలా జాగ్రత్తపడి కశ్మీరీ పెళ్లి కూతురిలా మెరిసి పోయింది. రాహుల్ మిశ్రా రూపొందించిన పీకాక్, పూల డిజైన్లో ఐవరీ కలర్ లెహెంగా, షీన్ దుపట్టాతో అందర్మీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్తో అలంకరించుకుంది. పచ్చల హారం, ఝుంకాలు, గాజులు, ఉంగరంతో చోకర్ ఇలా భారతీయ ఆభరణాల్లో అమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్గా ఐషాడో, బ్లష్, మస్కారా, బిందీతో మేకప్ చేసుకుంది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) ఇక మెహెందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు-టోన్డ్ లెహంగాను లెహెంగాను ఎంచుకుంది. నక్సీ డిజైన్లో వెండి జరీ వర్క్తో పాటు గులాబీ రంగుల్లో టెంపుల్ వర్క్తో తయారు చేయబడింది. స్లీవ్లపై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో డ్యూయల్ దుపట్టాలను ధరించింది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) దీనికి సంబంధించిన వీడియో చూసినెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘‘భలే అందంగా ఉన్నారు’’ ‘ప్రిన్సెస్లా ఉన్నారు. డ్రెస్ అద్భుతంగా ఉంది’, "మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్ అచ్చం కాశ్మీరీ పండిట్లా ఉన్నారు.. లాంటి కామెంట్స్ వెల్లువెత్తాయి. -
కశ్మీర్కు వందేభారత్ .. టిక్కెట్ ఎంత? ఏ రూట్లో వెళుతుంది?
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.కశ్మీర్కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
180 రోజులు..14 రాష్ట్రాలు.. 4,900 కి.మీలు
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు. గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు. -
కశ్మీర్కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
కశ్మీర్కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్లో లోకో పైలట్ క్యాబిన్లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్లైన్ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్లోని ట్యాంక్కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? -
వీర లెవల్లో అందాలు అదరహో.. మంచుకురిసే వేళలో మైమరపిస్తున్న కశ్మీరం (చిత్రాలు)
-
మంచు ముద్దయిన కశ్మీరం!
శ్రీనగర్: కశ్మీర్లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా సాధారణ జనజీవనానికి మాత్రం అవరోధం ఏర్పడింది. కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఒక మోస్తరు నుంచి భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో, రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా కశ్మీర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం సాయంత్రం కల్లా 90 శాతం వరకు ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అననుకూల వాతావరణం కారణంగా కశ్మీర్ విశ్వవిద్యాలయం శనివారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. శ్రీనగర్–సోనామార్గ్ హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో చిక్కుకుపోయిన పర్యాటకులకు గుండ్లోని మసీదులో స్థానికులు ఆశ్రయం కల్పించారు. సోనామార్గ్ నుంచి శుక్రవారం తిరుగుపయనమైన పంజాబ్కు చెందిన సుమారు డజను మంది శుక్రవారం రాత్రి మసీదులోనే గడిపారని స్థానికులు తెలిపారు. అదేవిధంగా, గండేర్బల్ జిల్లా కంగన్లో చిక్కుకుపోయిన పర్యాటకులకు స్థానిక కుటుంబం ఆశ్రయం క ల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దక్షిణ కశ్మీర్పై ఎక్కువ ప్రభావం దక్షిణ కశ్మీర్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో రెండడుగుల మేర మంచు కురిసిందని అధికారులు వివరించారు. బారాముల్లా జిల్లాలో 4 నుంచి 9 అంగుళాల మేర మంచు నమోదవగా గుల్మార్గ్లో 15 అంగుళాల మంచు కురిసింది. పుల్వామాలో 10 నుంచి 15 అంగుళాలు, పొరుగునే ఉన్న కుల్గామ్లో 18 నుంచి 25 అంగుళాలు, షోపియాన్లో 6 నుంచి 10 అంగుళాల మంచు పేరుకుపోయింది. శ్రీనగర్లో 8 అంగుళాల మేర మంచు కురియగా, పొరుగునే ఉన్న గందేర్బల్లో 7 అంగుళాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనామార్గ్లో 8 అంగుళాల మేర మంచు నమోదైందని అధికారులు చెప్పారు. పర్యాటక పట్టణం పహల్గామ్లో శనివారం 18 అంగుళాల మేర మంచు కురిసింది. అనంత్నాగ్ జిల్లాలో అత్యధికంగా 17 అంగుళాల హిమపాతం నమోదు కాగా శ్రీనగర్–లేహ్ రహదారి వెంట ఉన్న జోజిలాలో 15 అంగుళాలు, బుద్గాం జిల్లాలో 7 నుంచి 10 అంగుళాల మేర మంచు నమోదైంది. మైనస్కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు శ్రీనగర్లో గురువారం రాత్రి మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం రాత్రికి తీవ్రత తగ్గి మైనస్ 1 డిగ్రీ సెల్సియస్కు చేరుకుంది. స్కయింగ్కు పేరున్న ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్లో మైనస్ 5 డిగ్రీలు, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపున్న పహల్గామ్లో మైనస్ 2.8 డిగ్రీలుగా ఉంది. కశ్మీర్కు ముఖద్వారం వంటి క్వాజీగుండ్లో కనీస ఉష్ణోగ్రత మైనస్ 0.6 డిగ్రీలుగా నమోదవగా, పంపోర్ ప్రాంతంలోని కుగ్రామం కొనబాల్లో మైనస్ 1.5 డిగ్రీలుగా రికార్డయింది. కశ్మీర్ లోయలో అతి తీవ్రమైన చలికాలం ‘చిల్లాయ్–కలాన్’ఈ నెల 21 నుంచి మొదలైంది. దాదాపు 40 రోజులపాటు భారీగా మంచు కురియడంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా మైనస్ స్థాయికి పడిపోతాయి. జనవరి 30వ తేదీకల్లా ఈ తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అయితే, చలి గాలులు మాత్రం మరో 40 రోజుల వరకు కొనసాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి జమ్మూ–శ్రీనగర్ 44వ నంబర్ జాతీయ రహదారిని మంచు కారణంగా అధికారులు మూసివేశారు. నవ్యుగ్ టన్నెల్ వద్ద అతి భారీగా మంచు కురుస్తుండటంతో యంత్రాలతో మంచు తొలగింపు పనులకు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. వాతావరణం మెరుగుపడి, రోడ్లు క్లియర్ అయ్యేదాకా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాహనదారులను వారు కోరారు. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు ముందు జాగ్రత్తగా బనిహాల్–బారాముల్లా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. ట్రాక్ను క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. రన్వేను క్లియర్ చేసే పనులు చేపట్టామని, వాతావరణం అనుకూలిస్తేనే విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం వైమానిక సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లోని ప్రధాన రహదారులు, ఆస్పత్రులకు దారి తీసే రోడ్లపై మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మంచు కారణంగా అంతర్గత రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. వాహనాలు జారుతున్నందున మంచులో డ్రైవ్ చేయడం కష్టసాధ్యమే కాదు, ప్రమాదకరమని హెచ్చరించారు. -
India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది?
అది 1957వ సంవత్సరం.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విమానంలో అమెరికా వెళుతూ, మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్ను సందర్శించారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. అప్పటికి భారత్- సిరియా మధ్య ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.కశ్మీర్ అంశంపై భారత్కు సిరియా మద్దతునెహ్రూ డమాస్కస్ను సందర్శించినందుకు గుర్తుగా అక్కడి ఒక వీధికి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దశాబ్దాలు గడిచాయి. అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరియా యుద్ధ కాలాన్ని చూసింది. ఇది ఇరు దేశాల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక భారత్- సిరియా మధ్య దోస్తీ ఏమికానున్నదనే ప్రశ్న తలెత్తుతోంది.తొలుత హఫీజ్ అల్ అసద్ పాలనలో, తరువాత బషర్ అల్ అసద్ పాలనలో సిరియా.. భారత్కు పలు అంశాలలో మద్దతు పలికింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్యకు మద్దతునిచ్చింది. కశ్మీర్ విషయంలో పలు ముస్లిం దేశాలు పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.ఇరు దేశాల మధ్య సారూప్యతఅసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం కట్టుబడిన సూత్రాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది పునాదిగా నిలిచింది. 2019లో కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం తొలగించినప్పుడు, సిరియా ప్రభుత్వం దానిని భారతదేశ అంతర్గత సమస్యగా పేర్కొంది. ఆ సమయంలో రియాద్ అబ్బాస్ న్యూఢిల్లీలో సిరియా రాయబారిగా ఉన్నారు. ఆయన భారత్కు మద్దతునిస్తూ ‘ప్రతీదేశ ప్రభుత్వానికి తమ దేశంలోని ప్రజల భద్రత కోసం తమ భూమిలో ఏదైనా చేసే హక్కు ఉంటుంది. మేం భారత్తోనే ఉంటాం’ అని పేర్కొన్నారు.సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పుబషర్ అల్ అసద్ పతనం తరువాత ఇప్పుడు సిరియాలో తీవ్రవాద గ్రూపులు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ఇది భారతదేశానికి సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ ప్రభావవంతంగా ఉన్నప్పుడు రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియా ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావాన్ని చాలా వరకు అరికట్టింది. అయితే ఇప్పుడు ఈ రాడికల్ గ్రూపులు మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.సిరియా తీర్మానానికి భారత్ మద్దతుఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశానికి పలు భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశంలోని సంఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు సిరియా చేసిన తీర్మానానికి భారతదేశం మద్దతు పలికింది. సిరియా అంతర్యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలోనూ డమాస్కస్లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. గోలన్ హైట్స్పై సిరియా చేస్తున్న వాదనలకు భారతదేశం మద్దతు పలికింది. అయితే దీనిని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. 2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డమాస్కస్ను సందర్శించి మనదేశ వైఖరిని పునరుద్ఘాటించారు.సిరియాను సందర్శించిన వాజ్పేయిభారత్-సిరియా మధ్య సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిపై ఆధారపడి ఉంటాయి. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్యకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. డమాస్కస్లోని బయోటెక్నాలజీ సెంటర్ కోసం భారత్ 25 మిలియన్ డాలర్ల రుణంతో పాటు ఒక మిలియన్ డాలర్ల సాయం అందజేసింది.ఎగుమతులు.. దిగుమతులు ఇలా..2008లో బషర్ అల్ అసద్ భారత్ను సందర్శించారు. నాడు సిరియాలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తామని భారతదేశం ప్రతిపాదించింది. గత ఏడాది విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి వి మురళీధరన్ బషర్ అల్ అసద్తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి దశలో కొనసాగుతున్నాయి. భారతదేశం సిరియాకు వస్త్రాలు, యంత్రాలు, మందులను ఎగుమతి చేస్తుంటుంది. కాటన్, రాక్ ఫాస్ఫేట్ వంటి ముడి పదార్థాలు సిరియా నుంచి భారత్కు దిగుమతి అవుతుంటాయి. ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
కశ్మీర్లో కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH— ANI (@ANI) December 3, 2024ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్దే విజయం అని ఎగ్జిట్పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
పాక్ ప్రియురాలి కోసం సరిహద్దులు దాటబోయి..
భుజ్: పాకిస్తాన్లోని తన ప్రియురాలిని కలుసుకునేందుకు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని కచ్ జిల్లా ఖవ్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ జమ్ముకశ్మీర్కు చెందిన 36 ఏళ్ల యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో పరిచయమైన ఓ యువతిని కలుసుకునేందుకు ఆ యువకుడు అక్రమంగా సరిహద్దులు దాటి, పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు.పోలీసులు నిందితుడిని ఇంతియాజ్ షేక్ ముల్తాన్గా గుర్తించారు. అతను బందిపోరా జిల్లా వాసి. ఓ పాకిస్తానీ యువతిని కలుకునేందుకు కచ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి పాక్ వెళ్లేందుకు స్థానికుల నుంచి సహకారం కోరాడు. ఈ ఉదంతం గురించి కచ్ (పశ్చిమ) ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఆ యువకుడు ఆన్లైన్లో పరిచయమైన యువతిని కలుసుకునేందుకు సరిహద్దు దాటి పాకిస్తాన్కు వెళ్లాలనుకున్నాడన్నారు. ఈ నేపధ్యంలోనే తాము అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులతో అతను చెప్పిన విషయాలను ధృవీకరించాక, అతనితో ఎటువంటి ముప్పులేదని నిర్ధారించాక అతనిని విడుదల చేశామన్నారు.ఆ యువకుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, పాక్లోని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు ఆకర్షితుడయ్యాడన్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి, కచ్ నుంచి పాక్ వెళదామనుకుని స్థానికుల సహకారం కోరాడన్నారు. అయితే వారు ఆ యువకునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సాగర్ బాగ్మార్ తెలిపారు.ఇది కూడా చదవండి: Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం -
జమ్మూకశ్మీర్లో ముగిసిన రెండో విడత పోలింగ్..
Elections Live Updates..👉జమ్ము కశ్మీర్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.#WATCH | Budgam, J&K: National Conference (NC) MP, Aga Syed Ruhullah Mehdi says, "...We got a good response during campaigning in both phases...We are hopeful of getting better results in this phase..." pic.twitter.com/pPjelXEFIt— ANI (@ANI) September 25, 2024 👉శ్రీనగర్లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు, వారిని అడ్డుకున్న స్థానిక ఎన్నికల సిబ్బంది, పోలీసులు. #WATCH | J&K Assembly elections | A delegation of diplomats from various countries visits polling stations across Srinagar to witness the polling process in the second phase. Visuals from a polling station at S.P. College, Chinar Bagh - the fourth polling station that they have… pic.twitter.com/7QvyEHtrp0— ANI (@ANI) September 25, 2024👉ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం పోలింగ్ నమోదైంది. 👉 ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు.J&K Assembly elections | Voters in queues at a polling station in Ganderbal Assembly constituency.JKNC vice president Omar Abdullah is contesting from here, facing a contest from PDP's Bashir Ahmad Mir.(Pics Source: ECI) pic.twitter.com/8rvH7Pl1eK— ANI (@ANI) September 25, 2024 👉పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు #WATCH | Ganderbal, J&K: People queue up at a polling station in Kangan Assembly constituency to vote in the second phase of the Assembly elections today.Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/aBe1JqvPmh— ANI (@ANI) September 25, 2024 👉ఓటు వేసేందుకు బారులు తీరిన జనం.. #WATCH | J&K Assembly elections | Long queues of voters at a polling station in Reasi constituency, as polling gets underway. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.BJP has fielded Kuldeep Raj Dubey who faces a… pic.twitter.com/mQUSpBFbkf— ANI (@ANI) September 25, 2024 #WATCH | J&K: People queue up at a polling station in Srinagar to vote in the second phase of the Assembly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/iSUrcqZEvV— ANI (@ANI) September 25, 2024 👉ఓటర్లకు మోదీ సందేశం..అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో తమ వంతు బాధ్యతగా ఓటు వేయండి. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కంగ్రాట్స్. Prime Minister Narendra Modi tweets, "Today is the second phase of voting for the assembly elections in Jammu and Kashmir. I appeal to all voters to cast their vote and play their important role in strengthening democracy. On this occasion, I congratulate all the young friends… pic.twitter.com/zdr03sCFgL— ANI (@ANI) September 25, 2024 👉వైష్టో దేవీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో నిలుచున్నారు.#WATCH | Katra, J&K | People queue up at a polling station in Shri Mata Vaishno Devi assembly constituency of Katra to vote in the second phase of Assebly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/eLzwmfmfqU— ANI (@ANI) September 25, 2024 👉పలువురు బీజేపీ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | J&K Assembly elections: People await their turn to cast vote as voting for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today.Visuals from Govt middle school in Shri Mata Vaishno Devi assembly constituency… pic.twitter.com/lFo17cfqBK— ANI (@ANI) September 25, 2024#WATCH | J&K Assembly elections: People queue up outside a polling station in Balhama, Srinagar to vote as polling for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/q5wxemTJ5B— ANI (@ANI) September 25, 2024 #WATCH | Katra, J&K | BJP candidate from Shri Mata Vaishno Devi assembly constituency, Baldev Raj Sharma casts his vote. pic.twitter.com/Zx4QDQemfA— ANI (@ANI) September 25, 2024👉బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ విజయం సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే. నేషన్ ఫస్ట్ అనే భావనతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షా కృషితో రికార్డు స్థాయిలో ఓటింగ్ చూస్తారు. #WATCH | Nowshera, J&K: When asked if he would be the CM if BJP wins, J&K BJP chief and Nowshera candidate Ravinder Raina says, "BJP should register a thumping majority in J&K and the party should form the government. Anyone could be the CM...I am an ordinary worker of the party… pic.twitter.com/UJWUzOVCne— ANI (@ANI) September 25, 2024 👉జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడతలో 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 👉26 నియోజకవర్గ 239 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు రెండో విడతలో ఓటు వేయనున్నారు. Voting for the second phase of Assembly elections in Jammu & Kashmir begins. Eligible voters across 26 constituencies in six districts of the UT are casting their vote today. 239 candidates, including National Conference vice president Omar Abdullah, are in fray in today’s… pic.twitter.com/gGGQhkdG1V— ANI (@ANI) September 25, 2024 👉సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మూడు జిల్లాల్లో, జమ్మూ డివిజన్లో మూడు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.👉పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పారు.👉ఈ దఫాలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కరా, బీజేపీ జమ్ము కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఒమర్ ఈసారి గందేర్బల్, బుద్గామ్ చోట్ల నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్ను మించినది లేదు. కంచన్జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్ను చూస్తాం. కంచన్జంగ టూర్లో జెమూ గ్లేసియర్ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డా
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్గనీ షా 1977–1990 దాకా బిజ్బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్మూకశ్మీర్లో ఎన్నికలు.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ల మధ్య కుదిరిన పొత్తు
శ్రీనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లో పొత్తు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్లుగా కేసీ వేణుగోపాల్,సల్మాన్ ఖుర్షీద్లను శ్రీనగర్కు పంపింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. Attended @INCIndia-@JKNC_ joint press conference along with AICC GS-Org Shri @kcvenugopalmp ji and NC President Jenab Farooq Abdullah sahib as formal declaration of our pre-poll alliance. Together, we will sweep the upcoming assembly election in #JammuKashmir. pic.twitter.com/TVeXkr6GS1— Bharat Solanki (@BharatSolankee) August 26, 2024 -
జమ్ము కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. *Op ASSAR* Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024 -
కాశ్మీర్లోయలో కుండపోత.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్పుట్ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. Chinar Corps, Indian Army tweets, "Based on specific input regarding presence of terrorists in general area Kowut, Kupwara, a Joint Search Operation was launched by Indian Army and J&K Police on days leading upto 23 July 24. On 24 July, suspicious movement was observed and… pic.twitter.com/nxZHyajCOv— ANI (@ANI) July 24, 2024 -
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
ఏది వాస్తవ చరిత్ర?
జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695 -
కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తిన పాక్.. ఖండించిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్పై మరోమారు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై వెంటనే స్పందించిన భారత్ జమ్ముకశ్మీర్పై పాక్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించింది. ఆ దేశంలో జరుగుతున్న పలు ఉల్లంఘనల నుండి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలా చేస్తున్నదని భారత్ తెలిపింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. దీనిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.వారి దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. -
కశ్మీర్లో మిస్టర్ బచ్చన్
కశ్మీర్లో మెలోడీ డ్యూయెట్ పాడుతున్నాడు మిస్టర్ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. విజువల్ ఫీస్ట్గా ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్తో ఈ సాంగ్ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్లోని కెటలాన్లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని లామకాన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్పై ‘భూమిని కాపాడే సూపర్హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
అరుంధతి రాయ్పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్పోస్ట్పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్పోస్ట్పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్పోస్ట్ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్పోస్ట్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 పైచిలుకు స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కశ్మీర్లో మాత్రం మూడు లోక్సభ స్థానాలకు దూరంగా ఉండటం విశ్లేషకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏవీ పోటీ చేయని స్థానాలు ఈ మూడే! ముఖ్యంగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కలి్పంచే ఆరి్టకల్ 370తో పాటు రాష్ట్ర హోదా కూడా రద్దు చేశాక జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకిలా ముఖం చాటేసినట్టన్న ప్రశ్న తలెత్తుతోంది... కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో 5 లోక్సభ స్థానాలున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్– రాజౌరి స్థానాలు శ్రీనగర్ పరిధిలోనివి. వీటిల్లో ముస్లిం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి కావాలనుకుంటే వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థులను బరిలో దింపొచ్చు. కానీ జమ్మూ పరిధిలోని జమ్మూ, ఉదంపూర్ లోక్సభ స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ బీజేపీ సిట్టింగ్ స్థానాలే. తొలి, రెండో విడతలో వీటికి ఎన్నిక ముగిసింది. జమ్మూలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జుగల్ కిషోర్ శర్మ బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేశారు. ఉదంపూర్లోనూ గత రెండు ఎన్నికల నుంచి బీజేపీ టికెట్పై గెలుస్తున్న ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పోటీ చేశారు. శ్రీనగర్లో మే 13న పోలింగ్ ముగిసింది. మే 20న బారాముల్లా, మే 25న అనంతనాగ్–రాజౌరితో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు పూర్తవుతాయి. కారణాలేమిటి? ఆర్టికల్ 370ని, రాష్ట్ర హోదాను రద్దు చేయడం కశ్మీర్లో కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్నది బీజేపీ భావన. అలాంటప్పుడు అక్కడి లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందని, పైగా తనను బూచిగా చూపి ఎన్సీ, పీడీపీ రెండూ ఓటర్లను ఏకీకృతం చేస్తాయని అంచనాకు వచ్చింది. అందుకే నేరుగా బరిలో దిగకుండా చిన్న పారీ్టలకు దన్నుగా నిలిచినట్టు చెబుతున్నారు. బారాముల్లా నుంచి ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. ఆయనకు పీడీపీ నేత ఫయాజ్ మిర్, జేకేపీసీ చైర్మన్ సజ్జాద్ గనీ ప్రత్యర్థులుగా ఉన్నారు. సజ్జాద్ను బీజేపీ ప్రతినిధేనని ఒమర్ అబ్దుల్లాతో పాటు పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఆరోపణలు చేశారు. అనంతనాగ్–రాజౌరిలో తమ ప్రత్యర్థి అయిన జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి జాఫర్ ఇక్బాల్ మన్హాస్కు బీజేపీ మద్దతిస్తోందని ముఫ్తీ ఆరోపించారు. శ్రీనగర్లో కూడా ఎన్సీ, పీడీపీలపై అప్నీ పార్టీ నుంచి మహమ్మద్ అష్రఫ్ మిర్ పోటీ చేశారు. ఈ అప్నీ పార్టీ బీజేపీ మద్దతుతోనే 2021లో పుట్టుకొచి్చందని ఎన్సీ అంటోంది. అసలు లక్ష్యం అసెంబ్లీయే!? ‘‘మా ప్రత్యర్థులు అంచనా వేసినట్టుగా మేము కశ్మీర్ను జయించబోవడం లేదు. ప్రతి కశ్మీరీ హృదయాన్నీ గెలుచుకోవడమే మా కర్తవ్యం’’ అని ఏప్రిల్ 16న జమ్మూ ర్యాలీలో అమిత్షా చేసిన ప్రకటనను కీలకంగా చూడాలి. కశ్మీర్ లోయలో కమల వికాసంపై తమకేమీ తొందర లేదన్నారాయన. ప్రధాని మోదీ కూడా ఆరి్టకల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా మార్చిలో శ్రీనగర్లో ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటికల్లా ఎన్సీ, పీడీపీలను వీలైనంతగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు భావిస్తున్నారు. కొన్నిసార్లు పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని నిర్ణయాలు తప్పవని లోయలో పోటీకి దూరంగా ఉండటంపై జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా చేసిన నర్మగర్భ ప్రకటన అంతరార్థం కూడా అదేనంటున్నారు. లోయలో దేశభక్తి కలిగిన పార్టీలకు బీజేపీ మద్దతిస్తుందని అప్పుడే ఆయన ప్రకటించారు కూడా. ఎన్సీ, పీడీపీలకు స్థానిక పారీ్టలతో చెక్ పెట్టడమే బీజేపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. లోయలోని మూడు లోక్సభ స్థానాలనూ 2019లో ఎన్సీ గెలుచుకోవడం గమనార్హం. ఈసారి తెర వెనక పాత్రకశ్మీర్లో తనకు ఏమాత్రం బలం లేని మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా అక్కడ తెర వెనక కీలకపాత్రే పోషిస్తున్నట్టు స్థానిక రాజకీయ పారీ్టలతో పాటు బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కశ్మీర్లోని మూడు స్థానాలనూ కాంగ్రెస్ కూడా పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్కు కేటాయించడం విశేషం. అలా రెండు ప్రధాన జాతీయ పారీ్టలూ కశ్మీర్లో పోటీకి దూరంగానే ఉన్నాయి. దాంతో ఈ స్థానాల్లో పోటీ ప్రధానంగా ఎన్సీ, పీడీపీ మధ్యే నెలకొంది. అయితే సజ్జాద్ లోన్కు చెందిన జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), అల్తాఫ్ బుఖారీకి చెందిన జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ, మాజీ సీఎం గులాంనబీ ఆజాద్కు చెందిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పారీ్ట (డీపీఏపీ) కూడా బరిలో ఉన్నాయి. ఇవి బీజేపీ షాడో పార్టీలని ఎన్సీ, పీడీపీ ఆరోపిస్తున్నాయి. బీజేపీ వైఖరి గమనిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలకు ఓటు వేయొద్దని గత నెల ఇక్కడ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వీల్చైర్కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్చైర్కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్తో సచిన్ ఫిదా
క్రికెట్పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్లోని సోపోర్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషినిస్తోందంటూ ట్వీట్చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx — Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 క్రికెట్ స్టార్లు మిథాలీ రాజ్,శిఖర్ ధావన్ తన ఫ్యావరెట్ అని చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ని చూసిన తర్వాత క్రికెట్పై ఆసక్తిని పెంచుకుందట. అంతేకాదు చాలా కాలంగా ఈ ప్లేగ్రౌండ్లో ఆడతానని తన కిష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని, తన తాతయ్యతో కలిసి ఆడేదాన్నని చెప్పుకొచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్ షురూ. జాసిమ్ భట్, అర్సలాన్, ఫైసల్, ఫయీజ్, ఇఖ్లాక్ , ఇతర అబ్బాయిలతో పోటీ పడి ఆడుతుంది. ‘‘సచిన్ సర్ నా వీడియోను షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ” హర్మత్. భారత జట్టులోకి ఎంపికై మిథాలీ రాజ్తో మ్యాచ్ ఆడాలని హర్మత్ కలలు కంటోంది. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది కానీ తగిన గుర్తింపు లభించడం లేదని, శిక్షణకోసం అకాడమీలు లేవంటూ స్థానికులు తౌసీఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు హర్మత్ తరహాలో క్రీడాకారులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. -
ఆర్టికల్ 370 రద్దు.. మొదటిసారి శ్రీనగర్కు ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు మోదీ కశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాని మోదీ నేడు కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. ఇక, కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. New Jammu kashmir after the abrogation of 370 and 35A. Ahead of PM Modi's arrival in the valley, BJP supporters take out a flag march while shouting, "Har Har Modi, Ghar Ghar Modi." Please retweet it pic.twitter.com/MqPQTrHM8g — Aquib Mir (@aquibmir71) March 6, 2024 అలాగే.. శ్రీనగర్లోని హజ్రత్బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు, మోదీ వస్తున్న క్రమంలో కశ్మీర్లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రియల్ హీరోకు సచిన్ బహుమతి.. ఎమోషనల్ వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. భూతల స్వర్గంలో గల్లీ క్రికెట్ ఆడుతూ, జవాన్లను పలకరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 కుటుంబంతో కలిసి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. ఇంతకీ అందులో ఏముంది?!... జమ్మూ కశ్మీర్కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అమిర్.. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్ పెట్టకుని క్రికెట్ ఆడే అమిర్.. కాళ్లతో బౌలింగ్ చేయగలడు. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 ఈ క్రమంలో అమిర్ హుసేన్ గురించి తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. తాజాగా తన పర్యటనలో భాగంగా అమిర్ హుసేన్ను కలిశాడు సచిన్. తన సంతకంతో కూడిన బ్యాట్ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. ‘‘అమిర్ నిజమైన హీరో.. నువ్విలాగే ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్ క్యాప్షన్ జతచేశాడు. ఈ నేపథ్యంలో అమిర్ హుసేన్తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! To Amir, the real hero. Keep inspiring! It was a pleasure meeting you. pic.twitter.com/oouk55lDkw — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2024 -
వాహ్! ఐస్ టీ వాహ్!
బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్ చెబుతున్నాయి. కశ్మీర్కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్స్టాలో ‘ట్రాహులర్’ అనే అకౌంట్లో తన ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు. టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల? -
లాల్చౌక్లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్లోని లాల్చౌక్లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
'కశ్మీర్కూ గాజా గతే..' ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు
శ్రీనగర్: భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు. 'పాకిస్థాన్కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్ఎస్పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. "బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గత నెలలో, శ్రీనగర్లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
2023లో కశ్మీర్ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్లను పాక్కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్గా పుషప్లు చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
‘కశ్మీర్ గాజా కాదు.. ఆ ఘనతంతా ప్రధాని మోదీదే’
కశ్మీర్ గాజా కాదని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకురాలు షీహ్లా రషిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ గతంలో కశ్మీర్లో రాళ్లు రువ్విన ఉద్యమకారులకు మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడిలా కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘అవును అది 2010లో. అప్పుడు ఉద్యమకారులకు మద్దతివ్వడం వాస్తవమే. కానీ ఈ రోజు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కశ్మీర్ గాజా కాదని స్పష్టమైంది’ అని షీహ్లా రషిద్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో వచ్చిన మార్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధానాలే కారణమని ప్రశంసించారు. రక్తపాతాలు లేకుండా అక్కడి ఉద్రిక్తతలకు వారు రాజకీయ పరిష్కారాన్ని చూపించారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని రషీద్ ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా విమర్శించిన రషీద్.. ఆ తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కృషి చేశారంటూ అభినందించారు. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి? -
కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్ప్రీత్సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్లోని మల్లాన్పూర్కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
కశ్మీర్ ట్రిప్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. వైరల్ ఫొటోలు
-
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఫుల్ డిమాండ్.. వన్డే ప్రపంచకప్కు తొలిసారి
అక్టోబర్-నవంబర్లో భారత్లో వన్డే వరల్డ్కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్ సేన కప్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్ విల్లో బ్యాట్లను వాడుతున్నారు. వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు. బ్యాట్ల తయారీతో కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్లోని జలంధర్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Heega Kashmir willow Hx 509 cricket bat (Grade 2) is manufactured using selected Kashmir willow and is hand-crafted with utmost precision. The bat is suitable for leather balls.https://t.co/Xzxz6ys3JS#englishwillowbat #kashmirwillowbat #heegasports pic.twitter.com/Vqo7kgGaEs — Heega Sports (@HeegaSports) May 20, 2023 చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్కు బిగ్ షాక్.. భారీ జరిమానా 13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు -
సెగ పుట్టిస్తున్న ఎండలు.. చిల్ అవుదాం.. పద!
సాక్షి, అమరావతి: ఎండలు సెగ పుట్టిస్తున్నాయి. ఫ్యాన్ కింద కూర్చున్నా ఉక్కపోతే. ఏసీ వేసుకుంటే కొంతసేపే చల్లదనం. పగలంతా ఇదే తీరు. సాయంత్రం సరదాగా నాలుగడుగులు బయటకు వేద్దామంటే భగ్గుమనే వేడిగాలులు... ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వేసవి సెలవుల్ని ఏం ఎంజాయ్ చేస్తామంటూ.. సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి ట్రిప్లను చూస్తే కరోనా మునుపటి స్థితిని అధిగమించేలా కనిపిస్తున్నాయని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ థామస్ కుక్ (ఇండియా), ఎస్ఓటీసీ ట్రావెల్ విడుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్–మే 2023’ వెల్లడించింది. పర్యాటకుల ప్రయాణాలు చాలాకాలంగా పెండింగ్లో ఉండటంతో ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు సులభంగా ప్రయాణ వీసాలు పొందే దేశాలకే మొగ్గు చూపుతున్నారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ వేసవి విడిది ప్రాంతంగా యూరప్ అగ్రస్థానంలో నిలుస్తోంది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలు ప్రాధాన్య గమ్యస్థానాలుగా ఎక్కువ ట్రావెల్ బుకింగ్లు చేస్తున్నారు. సుదూర ప్రయాణాలకు సమయం వెచ్చించలేని పర్యాటకులు థాయ్లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, అబుదాబి, ఒమన్తో పాటు మాల్దీవులు, మారిషస్ వంటి ద్వీపాల్లో సేద తీరేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కొత్తగా జపాన్, దక్షిణ కొరియా పర్యటనలపై కూడా ఆసక్తి పెరిగినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విచిత్రంగా అమెరికా కంటే ట్రావెల్ బుకింగ్లలో 20 శాతం అధికంగా ఆస్ట్రేలియాకు ఉంటున్నాయి. వీసాలు పొందడంలో ఇబ్బందుల ఫలితంగా అమెరికాకు ట్రావెల్ బుకింగ్లలో తగ్గుదల కనిపిస్తోంది. చల్లని కాశ్మిరానికి ఛలో! దేశీయంగా వేసవి పర్యటనలకు అనుకూలమైన గమ్యస్థానంగా కశ్మిర్కు మద్దతు లభిస్తోంది. ఆ తర్వాత హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్ధాఖ్, ఈశాన్య ప్రాంతాలు, కేరళ, అండమాన్, గోవాతో పాటు భూటాన్కు వెళ్లేందుకు లగేజీలు సర్దేస్తున్నారు. సర్వేలో మెట్రో, మినీ మెట్రో నగరాలు పుణే, చండీగఢ్, కోయంబత్తూర్, టైర్ 2, 3 సిటీలైన జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మధురై, నాగ్పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, మైసూర్, విశాఖపట్నం, గౌహతి, పాటా్నలో ఆన్లైన్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 40 శాతం మంది దేశీయంగా, 60 శాతం మంది విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడైంది. -
నామినేషన్లు ఫుల్.. అవార్డు నిల్
-
జోజిలా భారీ గేమ్ ఛేంజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కశ్మీర్ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్కాబోతోంది. కశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు నా అభినందనలు. ఎముకల కొరికే చలిలో కూడా వారు పనులను కొనసాగిస్తున్నారు. టన్నెల్లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్ వంటివి నిర్మిస్తూ.. కశ్మీర్ను మరో స్విట్జర్లాండ్లా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ సి.హెచ్.సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ఇచ్చారు. కశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. -
'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి'.. దెబ్బకు 15 రోజుల్లోనే..
ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ఆలోచనతో జస్ట్ 15 రోజుల్లోనే ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారి ఆ ఊరు ఆదర్శంగా నిలిచింది. అతను అమలు చేసిన ఆ ఆలోచన త్వరితగతిన చక్కటి ఫలితం ఇవ్వడమేగాక ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది. వివరాల్లోకెళ్తే.. కాశీర్మర్లోని సదివార పంచాయితీ పర్యావరణ పరిరక్షణ చొరవలో భాగంగా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్, వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఫరూక్ అహ్మద్ 'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి' అనే నినాదంతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పథకం కింద ఎవరైనా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ఇస్తే వారికి పంచాయితీ బంగారు నాణేలను అందజేస్తోంది. దీన్ని ఆ ఊరి గ్రామపెద్దలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా బాగా ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభించిన 15 రోజుల్లోనే ఊరంతా స్వచ్ఛంగా మారింది. అంతేగాక అధికారులు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించడం విశేషం. ఈ నినాదం ప్రజాదరణ పొందడమే గాక అందరిచే ప్రశంసలందుకుంది. ఇతర గ్రామ పంచాయితీలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సర్పంచ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. మా గ్రామంలోని వాగులు, నదులు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొచ్చాను. దీంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోగలిగారు. అలాగే రోడ్డు, వీధుల్లో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ని పడేసిన గ్రామం ఇప్పుడూ పూర్తిగా క్లీన్గా ఉంది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవడమే గాక ప్రభుత్వం కూడా దీన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ పథకం కాకపోయినా ప్రజలంతా ఆసక్తిగా ముందుకు వచ్చి మరీ ప్లాస్టిక్ సేకరించారని అనంత్నాగ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నారు. కాగా, ఈ గ్రామం దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని హిల్లర్ షహాబాద్ బ్లాక్లో ఉంది. (చదవండి: స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయ్..స్పీడ్ పెంచేయడంతో..) -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్భంజ్కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్లోని లద్దాఖ్కో, ఒడిశాలో మయూర్భంజ్కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్లో మయూర్భంజ్లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాల కోసమే..
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు మరోసారి స్పందించారు. సదరు బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతోపాటు రక్షణ కలి్పంచడానికి వీలుగా వారి వివరాలు తెలుసుకొనేందుకు ఆదివారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ప్రత్యేక కమిషనర్ సాగర్ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం ఉదయం పదింటికి తుగ్లక్ రోడ్డులోని రాహుల్ ఇంటికి వెళ్లినా ఆయన్ను కలవలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి రావడం ఇటీవల ఇది మూడోసారి. ‘లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ మిమ్మల్ని వేడుకున్న మహిళల వివరాలు తెలపండి’ అంటూ రాహుల్కు ప్రశ్నావళితో నోటీసు పంపించారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ ఇంటికి పోలీసుల వచ్చారన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్థానికంగా దర్యాప్తు జరిపామని, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు, సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్ధారణ కాలేదని ప్రత్యేక కమిషనర్ సాగర్ప్రీత్ హుడా చెప్పారు. ‘‘రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో తానే స్వయంగా ఆయనను కలిసి, వివరాలు తెలుసుకుంటా’’ అని చెప్పారు. అదానీపై ప్రశ్నిస్తున్నందుకే: రాహుల్ తన ఆరోపణపై రాహుల్ ఆదివారం సాయంత్రం 4 పేజీల్లో ప్రాథమిక ప్రతిస్పందనను పోలీసులకు పంపించారు. గౌతమ్ అదానీ అంశంలో పార్లమెంట్ లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశి్నస్తున్నందుకే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటనలపై కూడా ఇలాంటి శల్యపరీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వడానికి 8 నుంచి 10 రోజుల సమయం కోరారు. కుట్రపూరితంగానే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక రాహుల్ను వేధించి, బెదిరించే కుట్ర ఉందని పార్టీ నేతలు అశోక్ గహ్లోత్, జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చేసే ప్రకటనలపై కేసులు నమోదు చేసే దుష్ట సంస్కృతికి మోదీ సర్కారు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పారీ్టల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలపై ఇకపై ఇలాంటి కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తించారని, ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. చట్టప్రకారమే వారు నడుచుకున్నారని తెలిపారు. अडानी के साथ PM मोदी के रिश्ते पर श्री राहुल गांधी के सवालों से बौखलाई सरकार पुलिस के पीछे छिप रही है। भारत जोड़ो यात्रा के 45 दिन बाद राहुल गांधी जी को दिल्ली पुलिस ने नोटिस दिया है, जिसमें उन महिलाओं की जानकारी मांगी गई है जो उनसे मिलीं और खुद के उत्पीड़न के बारे में बात की। pic.twitter.com/fgioVK413V — Congress (@INCIndia) March 16, 2023 చదవండి: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ.. -
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్!
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్! -
భారత్పై బిలావల్ ఆక్రోశం
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు. కశ్మీర్ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు. -
భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్
కాశ్మీర్లోని పత్రికా స్వేచ్ఛ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాగూర్ ఫైర్ అయ్యారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ కావాలనే తప్పుడు అభిప్రాయాలను ప్రచురిస్తోందన్నారు. భారత్ ప్రజాస్వామ్య విలువలపై బురద జల్లే ప్రయత్నం అని మంత్రి ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు సమాచార మంత్రి అనురాగ్ ట్వీట్లో.."ఈ న్యూయర్క్ టైమ్స్ తోపాటు ఇతర కొన్ని లింక్లలో విదేశీ మీడియా భారతదేశం గురించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ గురించి అసత్య ప్రచారాలను చేస్తోంది ఇలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం కొనసాగ లేవు. భారత్పై పగ పెంచుకున్న కొన్ని విదేశీ మీడియాలు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. భారత్లో పత్రిక స్వేచ్ఛకు ఇతర ప్రాథమిక హక్కుల వలే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతదేశ ప్రజలు చాలా పరిణితి చెందినవారు. అలాంటి వాటిని అస్సలు అనుమతించరు. కాశ్మీర్లోని పత్రిక స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం పచ్చి అబద్ధం, ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. అయినా భారత గడ్డపై విదేశీ మీడియా తమ నిర్ణయాత్మక అజెండాను అమలు చేయాలని చూస్తోందని, దీన్ని భారతీయలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమతించరు. అని నొక్కి చెప్పారు (చదవండి: వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..) -
కాశ్మీర్లోని లింగేశ్వర ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు
తమిళ సినిమా: మహాశివరాత్రి పర్వదినాన నటి త్రిష మహాశివుని సేవలో తరించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా రాణిస్తున్న ఈమె ఆ మధ్య నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పంచడంతో క్రేజ్ తగ్గింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నాలుగుపదుల వయసు దగ్గర పడుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె దృష్టి దైవ దర్శనాలపై మళ్లిందని భావించవచ్చు. సమయం దొరికినప్పుడల్లా గుళ్లు, గోపురాలు తిరిగేస్తున్నారు. చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం తాజాగా విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. నటుడు అర్జున్, దర్శకుడు మిష్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, నటి ప్రియా ఆనంద్ వంటి ప్రముఖ నటినట్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కశీ్మర్లో జరుగుతోంది. అక్కడ జమ్మూ కశ్మీర్ సమీపంలోని బహల్ గామ్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో లియో చిత్రం షూటింగ్ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత.. అక్కడ చిత్ర యూత్ ప్రేమికుల రోజున దిగిన ఫొటోలను నటి త్రిష సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నటి త్రిష కాశ్మీర్లోని లింగేశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ శివలింగానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయ అర్చకులు దగ్గరుండి మరి త్రిషతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన అభిమానులు త్రిష భక్తిని చూసి పారావస్యం పొందడంతో పాటు ఓం నమశివాయ అంటూ లైకులు కొడుతున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
ఉగ్రవాదం, తీవ్రవాదం 80% తగ్గాయి: అమిత్ షా
నాగపూర్: నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్యంలో∙వామపక్ష తీవ్రవాదం 80 శాతం దాకా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఇక్కడ మరాఠా వార్తా లోక్మత్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీకి ముందు దాకా దేశం పలు అంతర్గత భద్రతా సవాళ్లతో సతమతమవుతూ ఉండేదన్నారు. అలాంటిది గతేడాది కశ్మీర్ లోయను ఏకంగా 1.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించడం గొప్ప ఘనత అని అభిప్రాయపడ్డారు. ‘‘అంతేగాక గత 70 ఏళ్లలో మొత్తం కలిపి కశ్మీర్కు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తే గత మూడేళ్లలోనే మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడులను మోదీ ప్రభుత్వం సాధించింది. పైగా కశ్మీర్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు, కరెంటు అందించాం. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది. 60 శాతం ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేశాం కూడా. రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధంగా మారుతోంది. ఉపగ్రహ ప్రయోగాల్లో మనమెంతగా దూసుకెళ్తున్నదీ ప్రపంచమంతా చూస్తోంది. మన స్టార్టప్లు దుమ్ము రేపుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్లో ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో చూడాలన్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరేందుకు ఇంకెంతో దూరం లేదు’’ అన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో పలు లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు వివరించారు. -
త్రిష కాశ్మీర్ పర్యటన అందుకేనా?
తెలుగు, తమిళం భాషలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి త్రిష. ఒక దశలో లేడీ ఓరియంటెడ్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ ఆ తరహా చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అలా వరుస అపజయాలతో సతమతమవుతున్న త్రిష పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చారు. దీంతో కొత్తగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇది విజయ్కి 67వ చిత్రం. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. అదే విధంగా మాస్టర్ వంటి హిట్ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం. జనవరి 2వ తేదీ నుంచి చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ డాన్గా నటించనున్నట్లు, ఏడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీనికి అనిరుద్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా ఇందులో త్రిష కథానాయకగా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా చిత్రం షూటింగ్ తదుపరి కాశ్మీర్లో జరగనున్నట్లు, ఇందులో పాల్గొనడానికి త్రిష మంగళవారం ఉదయం కాశ్మీర్కు బయలుదేరినట్లు సమాచారం. చెన్నై విమానాశ్రయం నుంచి ఈమె వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్..
శ్రీనగర్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనగర్లో సోమవారం ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. భారీ సభకు ఏర్పాట్లు చేసింది. అయితే కశ్మీర్లో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు వర్షం కురుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు పెల్లలు విసురుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. शीन मुबारक! 😊pic.twitter.com/V9Y8jCf0MS — Congress (@INCIndia) January 30, 2023 చదవండి: త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్! -
లద్దాఖ్లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
రాహుల్ యాత్రకు యూపీ నేతలు ముఖం చాటిన..కాశ్మీర్ నేతలంతా కదిలి వస్తారు!
న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు తొమ్మిది రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 3న ఢ్లిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు యూపీ నేతలు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జమ్ము కాశ్మీర్ నాయకులంతా హాజరయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ యాత్రలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటామని ట్వీట్టర్ ద్వారా తమ పూర్తి మద్దతును తెలిపారు. అంతేగాదు సీపీఐకి చెందిన ఎంవై తరిగామి గూప్కార్ కూటమికి చెందిన మరో సభ్యుడు కూడా హాజరవుతారని అంటున్నారు. కాగా, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా.."భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరాల్సిందిగా నన్ను అధికారికంగా ఆహ్వానించారు. అతని అలు పెరగని ధైర్యానికి వందనం. ఫాసిస్ట్ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తితో నిలబడటం తన కర్తవ్యమని నమ్ముతున్నాను. మెరుగైన భారతదేశం కోసం అతనితో కలిసి పాల్గొంటాను." అని ట్వీట్ చేశారు. ఈ మేరకు భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం జమ్ము చేరుకున్న కాంగ్రెస్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్టాడుతూ..యాత్ర ఇక్కడకు చేరుకోగానే కాశ్మీర్లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. యాత్రలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఇదిలా ఉండగా, యూపీ నుంచి జయంత్ చౌదరి ఇప్పటికే రానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన అఖిలేష్ యాదవ్ కూడా హజరయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన వస్తారా లేక ప్రతినిధిని పంపుతారా అనేదానిపై స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్తో విభేదిస్తున్న మాయావతి కూడా అధికారికంగా స్పందించ లేదు. ఐతే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేసినప్పటికీ పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యాత్రను అడ్డుకునేందుకు ఆప్ కోవిడ్ ప్రోటోకాల్లను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కూడా రాసింది. దీంతో కాంగ్రెస్ నేత ఈ యాత్రను ఆపేందుకు ఇదోక సాకుగా చెబుతున్నారంటూ మండిపడ్డారు కూడా. (చదవండి: భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై) -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్పై నిప్పులు చెరిగారు. ‘భారత్పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
సినిమా ఊరట!
ఒకటి కాదు... రెండు కాదు... మూడు దశాబ్దాల పైగా సుదీర్ఘ నిరీక్షణ. ఎట్టకేలకు అది ఆదివారం నాడు ఫలించింది. కశ్మీర్లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో సరికొత్త మల్టీపర్పస్ సినిమా హాళ్ళు రెండింటిని జమ్మూ–కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రారంభించారు. అలాగే, కశ్మీర్లో తొలి మల్టీప్లెక్స్ సైతం 3 స్క్రీన్లతో మంగళవారం శ్రీనగర్లో మొదలైంది. పాలకులు చెబుతున్నట్టు కశ్మీర్లో సినీ రంగానికి ఇది చరిత్రాత్మక దినమే. 1980ల తర్వాత టీవీలో, ఇటీవల ఓటీటీలలో తప్ప థియేటర్లలో పదుగురితో కలసి సినీ సందర్శన అనుభవమే లేని కొత్త తరానికి ఇది మరో ప్రపంచపు స్వాగతమే. అదే సమయంలో వెండితెరతో పాటు జనజీవితాలూ వెలిగిపోవడానికి ఇది సరిపోతుందా? తీవ్రవాదంపై పోరులో తెరపై గెలిచే సినిమా... నిజజీవితంలో అదే తీవ్రవాదానికి దశాబ్దాలుగా బాధితురాలవడమే విచిత్రం. మిగిలిన భారతీయుల్లా కల్లోలిత కశ్మీర్ వాసులూ సాధారణ జీవితం గడపడానికీ, తీరికవేళ సినీవినోదాన్ని ఆస్వాదించడానికీ ఈ కొత్త సినిమా హాళ్ళు ఉపకరిస్తాయని భావన. అందుకే, ప్రతి జిల్లా ముఖ్యపట్టణంలో సినిమా హాలు నెలకొల్పాలని పాలకుల నిశ్చయం. అలా కేంద్రపాలిత జమ్మూ – కశ్మీర్లోని 20 జిల్లాల్లోనూ థియేటర్లు పెడతారు. జిల్లా పాలనా యంత్రాంగంతో కలసి ప్రభుత్వ ‘మిషన్ యూత్ డిపార్ట్మెంట్’ ఈ థియేటర్లను నెలకొల్పుతుంది. వాటి నిర్వహణను నిపుణులకు అప్పగిస్తారు. ఇందులో భాగంగా అనంతనాగ్, శ్రీనగర్, రాజౌరీ, పూంbŒ∙లాంటి చాలాచోట్ల త్వరలో సినీ వినోదశాలలు రానున్నాయి. అక్కడ సినిమా షోలతో పాటు విజ్ఞానభరిత వినోదం, యువతకు నవీన నైపుణ్యాభివృద్ధి వసతులు కల్పించాలని ప్రణాళిక. కనువిందైన మంచు కొండలు, కాదనలేని డాల్ సరస్సులో నౌకా విహారం వగైరాతో అందమైన ప్రకృతి, ఆహ్లాదభరిత వాతావరణంతో చాలాకాలం సినిమా షూటింగ్లకు కశ్మీర్ కేంద్రం. రాజ్ కపూర్ నుంచి తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి సినిమాల దాకా అన్నీ కశ్మీర్ అందాలను కెమెరాకంటితో బంధించినవే. 1989 నాటి వేర్పాటువాద విజృంభణతో ఆ పరిస్థితే పోయింది. మరోపక్క ఎందరో కశ్మీరీలు హిందీ చిత్రసీమలో పేరు తెచ్చుకున్నా, ఎప్పుడో 58 ఏళ్ళ క్రితం తొలి పూర్తినిడివి కశ్మీరీ ఫీచర్ ఫిల్మ్ ‘మైంజ్ రాత్’తో మొదలైన ‘కశ్మీరీ భాషా సినీపరిశ్రమలో ఇప్పటికీ ఎదుగూబొదుగూ లేదు. తర్వాత కొద్ది ఫిల్మ్లే వచ్చాయి. తీవ్రవాదుల భయానికి స్థానిక, పరభాషా చిత్రాల నిర్మాణం రెండూ స్తంభించాయి. చిత్రప్రదర్శనపై అప్రకటిత నిషేధం వచ్చిపడింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం, అనంతర పాలకులూ థియేటర్లు తెరిచేందుకు ప్రయత్నించినా తీవ్రవాద దాడులతో అవేవీ విజయవంతం కాలేదు. పైరసీ రాజ్యమేలుతోంది. హాలులో సినిమా చూడడానికి సినీప్రియులు కశ్మీర్ దాటి పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితి. లోయలో సాధారణ పరిస్థితి తెస్తున్నామంటూ 2019లో కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన పాలకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్ము – కశ్మీర్ను మళ్ళీ భారతీయ సినీనిర్మాణ పటంపైకి తీసుకురావా లని కేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగం గత ఏడాది ఓ సరికొత్త చలనచిత్ర విధానాన్ని తెచ్చింది. హిందీ నిర్మాతలను మళ్ళీ కశ్మీర్ వైపు ఆకర్షించడానికి ప్రత్యేక వసతులు కల్పించింది. ఇప్పుడీ ప్రయత్నాలన్నిటి వల్ల కశ్మీరీలకు వెండితెర వినోదం అందుబాటులోకి రావడమే కాక, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయనేది ఆలోచన. వర్తమాన సంస్కృతి, విలువలతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిఫలించే సినిమా మనోనేత్రానికి ద్వారాలు తీస్తుంది. మతమౌఢ్యంతో అన్నిటినీ నిరాకరించలేం. సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం పంథా మార్చుకొని, సినీ ప్రదర్శనలపై 35 ఏళ్ళ నిషేధాన్ని నాలుగేళ్ళ క్రితం 2018లో ఎత్తివేసి, మార్పును ఆహ్వానించడం ఒక సరికొత్త అధ్యాయం. సినిమా అనే శక్తిమంతమైన సృజనాత్మక సాధనం ఆసరాగా కశ్మీరీలను ప్రధాన స్రవంతిలో మమేకం చేయాలనే ఆలోచన మంచిదే. అయితే, అదొక్కటే సరిపోదు. దాని కన్నా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రతి చిన్న ప్రయత్నం స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు కొత్త ప్రోత్సాహమే. కానీ, పాలకులు కశ్మీర్కు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచి పోషించాల్సిన లక్ష్యం ఇప్పటికీ సుదూరంగా నిలబడి చేరబిలుస్తోంది. కశ్మీర్ పండిట్ల కన్నీటి గాథలపై ‘కశ్మీరీ ఫైల్స్’ లాంటి ప్రచార చిత్రానికి పాలకులు ఇటీవల అండగా ఉండి, అక్కున చేర్చుకున్నారు. మరి, లోయలో సురక్షితంగా జీవించే పరిస్థితులు ఎందుకు కల్పించలేక పోతున్నారు? వారి సమస్యల పరిష్కారానికి ఇప్పటికీ ఎందుకు పూచీ పడలేకపోతు న్నారు? అవన్నీ జరగాలంటే ముందుగా స్థానిక ప్రజల మనసు గెలుచుకోవాలి. అభివృద్ధి సహా అన్నిటిలో తామూ భాగస్వాములమనే భావన కల్పించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా తమ ప్రాంతాన్ని తామే పాలిస్తున్నామనే భావన కల్పించాలి. సైనికుల ఉక్కుపాదంతోనో, ఢిల్లీ ప్రభువుల కనుసన్నల్లోని పాలనా యంత్రాంగంతోనో అది సాధ్యం కాదు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ నుంచి తాజాగా ఓటర్ల జాబితాలో పేర్ల దాకా రకరకాల జిమ్మిక్కులతో పైచేయి కోసం ప్రయత్ని స్తున్న ఏలికలు దొడ్డిదోవ ప్రయత్నాలు మానుకోవాలి. నిజాయతీగా, నిష్పాక్షికంగా, ఎంత త్వరగా కశ్మీర్లో ఎన్నికలు జరిగితే అంత మేలు. కశ్మీర్ సమస్యల పరిష్కారం సినిమాల్లో చూపినంత సులభం కాదు... సినిమాలు చూపినంత సులభం కూడా కాదు. ఆ సంగతి పాలకులకూ తెలుసు! -
కొత్త పార్టీపై ఆజాద్ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ తీరు, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఆజాద్ ఇప్పటికే.. కశ్మీర్లో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కొత్త పార్టీపై ఆజాద్ తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. జమ్మూలో ఆదివారం ఆజాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగినట్టు స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుంగా తనకు సపోర్టు నిలిచారని అన్నారు. మరోవైపు.. తాను రాజీనామా చేసి కశ్మీర్కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే, కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆజాద్ రాజీనామా చేసిన అనంతరం.. కశ్మీర్లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. Former Congress leader Ghulam Nabi Azad said that he would announce a new political party within 10 days. https://t.co/6b2YLXcW4n — Financial Express (@FinancialXpress) September 11, 2022 -
14 రోజుల్లో ఆజాద్ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అన్ని సభ్యుత్వాలకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిగంటల్లోనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆజాద్ 14 రోజుల్లోనే కొత్త పార్టీ తొలి యునిట్ను జమ్ము కశ్మీర్ ఏర్పాటు చేయుబోతున్నారని ఆయన సన్నిహితుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీఎం సరూరి తెలిపారు. సైద్ధాంతికంగా లౌకికవాది అయిన ఆజాద్ ఆదేశానుసారం పనిచేసే ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ మాజీ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, ప్రముఖులు కూడా తమ రాజనామాను సమర్పిచినట్లు పేర్కొన్నారు. అంతేకాద మా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సెప్టెంబర్ 4న అజాద్ జమ్మ కశ్మీర్కి వస్తున్నారని అన్నారు. అదీగాక ఆజాద్ కూడా తాను కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే తొందరలో లేనని, జమ్ము కశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఐతే సరూరి జమ్ముకశ్మీర్కి అజాద్ తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన జమ్ముకశ్మీర్లో నవంబర్ 2, 2005 నుంచి జూలై11, 2008 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు, పైగా ఆయన పాలనను ప్రజలు స్వర్ణయుగంగా చూస్తారని చెప్పారు. తమ కొత్తపార్టీ ఆగస్టు 5, 2019కి ముందు ఉన్న జమ్ము కశ్మర్ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసమే పోరాడుతుందని చెప్పారు. అలాగే ఆజాద్కి మద్దతుగా పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతో సహా డజనుకు పైగా నాయకులు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేగాక మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ వంటి పలువురు ఈ రోజు ఢిల్లీలో ఆజాద్తో సమావేశమై రాజీనామ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: కాంగ్రెస్కు ఆజాద్ గుడ్బై) -
Nasira Akhtar: చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర.. అద్భుత ఆవిష్కరణతో..
‘ఏముందీ... అంతా బూడిద’ అంటుంటారు. చక్కని ఆలోచనలు సొంతం కావాలేగానీ బూడిదలో నుంచి కూడా బంగారంలాంటి అవకాశాలు జనిస్తుంటాయి. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా! అయితే మీరు నసీరా అఖ్తర్ గురించి తెలుసుకోవాల్సిందే... కశ్మీర్లోని కుల్గామ్ ప్రాంతానికి చెందిన నసీరా అఖ్తర్ ‘మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి మనతో మౌనంగా సంభాషిస్తాయి’ అనే పెద్దల మాటను విన్నదో లేదోగానీ మొక్కలతో గడపడం ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టమే తనకు పర్యావరణంపై ఆసక్తిని పెంచింది. హైస్కూల్ రోజులలో క్లాస్రూమ్లో తన ప్రశ్నలు లేని రోజు అంటూ ఉండేది కాదు. ఏదో అడగాలి కాబట్టి అడగాలి అనే కోవకు చెందిన ప్రశ్నలు కావు అవి. తనలోని విజ్ఞానదాహానికి ప్రతీకలుగా నిలిచే ప్రశ్నలు. అయితే నసీరా ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. చాలా ఓపికగా సమాధానాలు చెప్పేవారు. ‘నీలో సైంటిస్ట్ లక్షణాలు కనిపిస్తున్నాయి’ అని అంతా చమత్కారంగా అనేవాళ్లు. కట్ చేస్తే... నసీరాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అంతమాత్రాన ఇల్లే లోకం అనుకోలేదు. ఇంటి పనే సర్వస్వం అనుకోలేదు. దినపత్రికలు, మ్యాగజైన్లలో తనకు ఆసక్తి కలిగించే శాస్త్రీయ విషయాలకు సంబంధించిన వ్యాసాలను కత్తిరించి దాచుకునేది. ఊళ్లో మిగిలిన మహిళలకు భిన్నంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనిపించే నసీరాను ఎవరో ఒకరు వెక్కిరిస్తూనే ఉండేవారు. అయితే.. తన ప్రపంచంలో తాను ఉండే నసీరాకు వాటి గాలి సోకేది కాదు. చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర ఒక కల కన్నది. మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థాన్ని తయారుచేయాలి... అనేది ఆ కలల సారాంశం. సంవత్సరం గడిచింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది. రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రయోగాలు ఆపలేదు. ఆ సమయంలోనే మనసులో ఏదో ఒక మూల చిన్న నిరాశ తొంగిచూసింది. అయితే అంతలోనే తాత చెప్పిన మంచిమాట గుర్తుకు వచ్చి తనను ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లేది. ‘ఒక కాలం నీ కోసం ఎదురుచూస్తుంటుంది. అది దగ్గరికి వచ్చిన తరువాత ఎగుడు దిగుళ్లను సరిచేసి నీ ముందు రాచబాటను ఏర్పాటు చేస్తుంది’... తాత తనకు చెప్పిన కశ్మీరి జానపద కథల్లోని ఒక మాట ఇది. ఆ కథలేవీ గుర్తులేవు. కాని ఈ మాట మాత్రం తనకు చాలా గట్టిగా గుర్తుండిపోయింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత... ఎనిమిది సంవత్సరాల తరువాత... తన ప్రయోగం ఫలించింది. పర్యావరణానికి హాని కలిగించకుండా స్థానికంగా పెరిగే మొక్కలను ఉపయోగించి పాలిథిన్ను బూడిదగా మార్చే బయోడిగ్రేడబుల్ హెర్బల్ ఫార్ములాను తయారుచేసి తొలి విజయకేతనం ఎగరేసింది. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది నసీరా. 48 సంవత్సరాల నసీరా అఖ్తర్కు మరెన్నో కలలు ఉన్నాయి. ఇప్పుడు వాటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్లో జాతీయ జెండాను ఉంచింది. -
ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?
జమ్మూ కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దుచేసి మూడు సంవత్సరాలు అయింది. మూడేళ్ల తర్వాత, ఇక గడియారాన్ని వెనక్కు తిప్పడం సాధ్యంకాని పని అని చాలామంది ప్రజలు భావిస్తున్న సమయంలో ఒక పుస్తకం... ఆర్టికల్ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదని వాదిస్తోంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు గవర్నర్ తన ఆమోదం తెలిపారు. ఇలాంటి సందర్భంలో గవర్నర్ తన స్వతంత్ర హోదాలో కాకుండా రాష్ట్రపతి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుందని పుస్తకం అంటోంది. ఇక రాజ్యాంగాన్ని అన్వయించుకోవడంలో సహాయం చేయడం కోసం ఉద్దేశించిన ఆర్టికల్ 367ను అనుచితంగా ఉపయోగించారనీ చెబుతోంది. వీటిని ఒకానొక పుస్తకపు అభిప్రాయాలుగా కొట్టేయడం అంత సులభం కాదు. ఎందుకంటే దీన్ని ప్రచురించిన విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ అర్ఘ్యా సేన్గుప్తా రాజ్యాంగం మీద సాధికారత కలిగిన వ్యక్తిగా గౌరవం ఉన్నవారు. ఆగస్ట్ 5వ తేదీ శుక్రవారం నాటికి జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసి మూడేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ‘హమీ అస్త్: ఎ బయోగ్రఫీ ఆఫ్ ఆర్టికల్ 370’ అనే పుస్త కాన్ని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ ప్రచురించింది(‘భూమ్మీద ఎక్కడైనా స్వర్గం ఉన్నదీ అంటే... అది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది’ అని కశ్మీర్ సౌందర్యం గురించి అమీర్ ఖుస్రో పలికిన పంక్తుల్లోని ఇక్కడే ఉంది (హమీ అస్త్) అన్నది ఈ పుస్తకం టైటిల్). ఈ పుస్తకం తీవ్రమైన కలకలం సృష్టించగలదు. ఎందుకంటే ‘ఆర్టికల్ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదు’ అని ఇది వాదించింది. ఈ పుస్తకాన్ని నలుగురు రచయితలు రాశారు – అర్ఘ్యా సేన్గుప్తా, జినాలీ డేనీ (రీసెర్చ్ ఫెలో), ప్రణయ్ మోదీ (ప్రాజెక్ట్ ఫెలో), కెవిన్ జేమ్స్ (మాజీ రీసెర్చ్ ఫెలో). సేన్గుప్తా... విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వ్యవ స్థాపకుడు, రీసెర్చ్ డైరెక్టర్ కూడా. (మిగిలిన ముగ్గురూ ‘విధి’ సెంటర్తో సంబంధం ఉన్నవారే.) ‘హమీ అస్త్’ రచయితలు మూడు కారణాల వల్ల ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం అని వాదిస్తున్నారు. ఈ కారణాలు సాంకేతికపర మైనవి. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారు, దాన్ని ఎలా అమలు పర్చారు అనే విషయాన్ని మనందరం తెలుసు కోవలసిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తులు వీటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. అయితే సమస్య చాలా ముఖ్యమైంది కాబట్టి, ఈ వాదన లను సంగ్రహరూపంలో చెబుతాను. ‘హమీ అస్త్’లో చెప్పిన తొలి కారణం ప్రకారం, జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఆమోదం అనేది శాసన సభతో రాజ్యాంగ అసెంబ్లీని సమానం చేస్తోంది. అది ఎలా జరిగింది అన్నది ఇక్కడ ప్రధానం కాదు. నిజానికి అది కూడా ఒక సమస్యే అయినప్పటికీ ఆ సమయంలో గవర్నర్ నడవడిక ఎలా ఉండింది అనేది ఇక్కడ కీలకమైన విషయం. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు గవర్నర్ తన ఆమోదం తెలిపారు. పుస్తకం ఏమంటున్నదంటే: ‘‘జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తన ఆమోదం తెలిపినప్పుడు, తన స్వతంత్ర హోదాలో కాకుండా నిజానికి రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తారు... అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుంది... అయితే అలాంటి స్వీయ ఆమోదం అనేది చట్ట అవసరాలను సంతృప్తి పరుస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. క్లుప్త సమాధానం ఏమిటంటే, లేదు అనే.’’ రెండో కారణం ఏమిటంటే, ఆర్టికల్ 367ను ఉపయోగించిన విధానమే. రాజ్యాంగాన్ని అన్వ యించుకోవడంలో సహాయం చేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం. రాజ్యాంగ అసెంబ్లీని శాసన సభలాగా వ్యాఖ్యానించడానికి ఈ ఆర్టికల్ 367ను ఉప యోగించారు. అయితే, అలా వాడుతున్నప్పుడు ‘‘రాజ్యాంగ నిబంధనల్లోనే గణనీయంగా మార్పులు తీసుకొచ్చారు’’. ‘హమీ అస్త్’ పుస్తకం ఇలా అంటుంది: వివరణాత్మక ఘర్షణ లేదా గందరగోళాన్ని పరిష్కరించడం కోసం ఆర్టికల్ 367ని ఉపయోగించలేదనేది చాలా స్పష్టం... ఇంతకుముందు రాజ్యాంగ సభకు లేని నిర్దిష్టమైన వాస్తవిక అధికారంతో శాసనసభను రద్దు చేయ డానికి ఈ ఆర్టికల్ని ఉపయోగించారు. చివ రగా, ఆర్టికల్ 367ను అనుచితంగానూ, శాసన విరుద్ధంగానూ ఉపయోగించారని ఈ పుస్తకం ముగిస్తుంది. ఇక ‘హమీ అస్త్’ చెప్పిన మూడో కార ణాన్ని పరిశీలిద్దాం. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ప్రకటించే ఉద్దేశంతోనే ఆర్టికల్ 367ను ఉపయో గించారు. సందర్భం మరోలా అవస రమైతే తప్ప, రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు పార్లమెంటు ద్వారా అమలవుతాయని ఇది ప్రకటించింది. అంటే ఇక్కడ సందర్భం అనేదే నిర్ణయాత్మక అంశం అన్నమాట. ఈ సందర్భం అనేది ఏమిటి? జమ్మూ కశ్మీర్, భారత కేంద్రప్రభుత్వం మధ్య చారిత్రక రాజీ కుదరడమే ఆ సందర్భమనీ, ఆర్టికల్ 370లో దీన్ని పొందుపర్చారనీ పుస్తకం చెబుతోంది. అంటే, భారతదేశంతో జమ్మూ కశ్మీర్ రాజ్యాంగబద్ధ సంబంధంలోని నియమ నిబంధనలు జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రతినిధుల ద్వారా, అలాగే తక్కిన భారత ప్రజల ప్రతినిధులతో ఉమ్మడిగా నిర్ణయించబడతాయని దీనర్థం. ఈ రాజ్యాంగ పరమైన సంబంధానికి ఎలాంటి మార్పు చేయా లన్నా రెండు చేతులూ చప్పట్లు కొట్టాల్సి ఉండ టమే ఇక్కడ సందర్భం. కానీ ఆర్టికల్ 370 రద్దులో రెండో చేయి మిస్సయింది. అదీ విషయం. ఈ పుస్తకంలోని అంశం సులభమైందే కానీ, చాలా తీవ్రమైంది. రాష్ట్రపతి పాలన విధింపు పర్యవసానంగా శాసనసభ అధికారాలను పార్ల మెంట్ స్వాధీనపర్చుకుంది. అయితే ఆర్టికల్ 370 వెలుగులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తరఫున పార్ల మెంట్ అధికారాలను అమలు చేయడాన్ని రాష్ట్రపతి పాలన విధింపులోని నిబంధనలు నిషేధిస్తున్నా యని ఈ పుస్తకం చెబుతోంది. ఇప్పుడు ‘హమీ అస్త్’ అనేది కేవలం విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి సంబంధించిన ఒక అభిప్రాయం మాత్రమే. కానీ ప్రత్యేకించి ఈ సెంటర్, అంతకంటే ముఖ్యంగా సేన్గుప్తా అభిప్రా యాలు చాలా విలువైనవి. రాజ్యాంగంపై సాధికా రిక అవగాహన కలిగి ఉన్నారన్న గౌరవం వీరికి ఉంది. కాబట్టి ఇక్కడ వెలువడిన వాదనలు చాలా విలువైనవి. పైగా వీటిని పుస్తక రూపంలో తేవడం అనేది మరింత ప్రాధాన్యం కలిగిన విషయంగా మారింది. తమ వాదనలను తాము నమ్మకపోతే పుస్తక రూపంలో ఇలా ప్రచురించరు కదా! అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఇంకా విచారించలేదు. ఇంతవరకూ ఈ అంశాన్ని సర్వో న్నత న్యాయస్థానం వాయిదాలు వేస్తూ పోతోంది. గడియారాన్ని వెనక్కు తిప్పవచ్చు అనే విశ్వాసం కూడా దీనివెనుక ఉండవచ్చు మరి. కానీ, మూడేళ్ల తర్వాత ఇప్పుడు అది సాధ్యం పని అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ‘హమీ అస్త్’ మరో అడుగు ముందుకేసింది. ఆర్టికల్ 370 రద్దు అనేది జరిగిపోయిన వ్యవహారంగా మిగిలిపోతే, అది రాజకీయ అపహాస్యం కిందికి వస్తుందని ఈ పుస్తకం సూచిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సాహసం.. ఆ సేతు హిమాచలం
(విశాఖపట్నం) చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండాలి. నాలుగు గోడల మధ్య గొంగళి పురుగులా బతకడం కంటే సీతాకోకచిలుకలా మారి ప్రపంచాన్ని చుట్టేయాలి. కళ్లకు గంతలు విప్పేయాలి. హాయిగా.. ఆనందంగా ప్రపంచంతో కబుర్లాడేయాలి. చేసే ప్రయాణం లో సామాజిక బాధ్యత ఉండాలి. ఇదే ఆలోచన 20 ఏళ్ల యువకుడికి వచ్చింది. మనసులో ‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం’ అనే సాంగ్ మోగింది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాడు. తన 125 సీసీ బైక్పై విశాఖ నుంచి కశ్మీర్ , కశ్మీర్ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి విశాఖకు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజుకు 500 నుంచి 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. 55 రోజుల్లో 11,600 కిలోమీటర్ల బైక్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇరవై ఏళ్ల బొంతు సంపత్ బైక్పై దేశాన్ని చుట్టివచ్చాడు. లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ట్రావెల్ అంట్ టూరిజంలో బీఏ సెకండియర్ చదువుతున్నాడు. సంపత్ పర్యావరణ పరిరక్షణ కోసం ‘సేవ్ సాయిల్’పేరుతో బైక్పై సాహసయాత్ర చేపట్టి అందరి మన్ననలు, అభినందనలు అందుకున్నాడు. చైనా, పాకిస్థాన్ బోర్డర్ల మీదుగా సాగిన ఈ యాత్రలో ఎన్నో ఆహ్లాదకరమైన, ఆనందమైన క్షణాలను అనుభవించాడు. చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. మొత్తంగా ఈ యాత్ర తనలో గొప్ప ఆత్మవిశ్వాసం, సంతృప్తినిచ్చిందని, త్వరలో టీవీఎస్ ఎక్స్ఎల్పై నేపాల్ యాత్ర చేపడతానని చెప్పాడు. ఈ యాత్ర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఆనందం.. అయోమయం యాత్రలో చాలా వరకు ఇంగ్లీష్, వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసేవాడిని. కశ్మీర్ బోర్డర్ నుంచి అసలు సమస్య మొదలైంది. వారు మాట్లాటే కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో మాట్లాడే లద్దాఖీ భాష రాక.. మన భాష వారికి అర్థం కాక ఇబ్బందిపడ్డాను. రోజూ హైవే పక్కన డాబాల్లో భోజనం చేసేవాడిని. జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, లద్దాఖ్ రీజియన్లో టిబెటన్ సంప్రదాయ వంటలే దొరికేవి. అవి తినలేక వారం రోజుల పాటు మ్యాగీ తిని సరిపెట్టుకున్నా. కశ్మీర్ బోర్డర్లో మన సిమ్ పని చేయలేదు. అక్కడ లోకల్ సిమ్ తీసుకున్నా. అయినప్పటికీ లూసర్, స్పిటీవేలీ తదితర ప్రాంతాల్లో ఆ సిమ్ పని చేయలేదు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులతో మాట్లాడలేకపోయా. లద్దాఖ్లో అనుమతుల కోసం ఏడు రోజులు నిరీక్షించాను. వాతావరణం బాగోక, వర్షాల కారణంగా మొత్తం యాత్రలో 15 రోజులు రెస్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ దాటాక బాగా చలి వేసింది. కశ్మీర్, హిమాచలప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతాల్లో –6 డిగ్రీల చలిలో ప్రయాణించేటపుడు బాగా ఇబ్బంది పడ్డా. కాళ్లు, చేతులు తిమ్మిరెక్కిపోయేవి. గేర్ వేస్తున్నా స్పర్మ ఉండేది కాదు. హ్యాండిల్ పట్టుకోలేక పోయేవాడిని. అయినా మొండిగా ప్రయాణం కొనసాగించాను. బైక్ ఏపీ రిజిస్ట్రేషన్ చూసి చాలా మంది టూరిస్టులు, రైడర్స్ పలకరించేవారు. ఎటువైపు వెళ్లాలో సలహాలిచ్చేవారు. ఆ క్షణంలో మనోళ్లు కనిపించారన్న ఆనందం కలిగేది. యాత్ర సాగిందిలా.. విశాఖలో మొదలై తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మీదుగా జమ్మూకశ్మీర్ చేరుకున్నా. తిరిగి అక్కడ నుంచి లద్దాఖ్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని అక్కడ నుంచి విశాఖకు చేరుకున్నా. మొత్తంగా 14 రాష్ట్రాలను చుట్టి.. తన యాత్రను పూర్తి చేశానని సంపత్ తెలిపాడు. గరిష్టంగా 850 కి.మీ. ప్రయాణం రోజూ ఉదయం 8 గంటలకు బైక్పై యాత్ర ప్రారంభం అయ్యేది. ప్రారంభంలో సేవ్ సాయిల్పై అవగాహన కల్పించేవాడిని. భోజన విరామం తీసుకుని రాత్రి 11 గంటల వరకు బైక్పై ప్రయాణం చేసేవాడిని. రోజుకు 500 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగేది. అత్యధికంగా ఒక్క రోజులో 850 కిలోమీటర్లు దూరం కూడా ప్రయాణం సాగించా.. రోజూ 12 నుంచి 14 గంటల సేపు బైక్పై ప్రయాణించి అలసిపోయేవాడిని. ఈ ప్రయాణంలో ఎక్కడ హోటల్ అందుబాటులో ఉండే.. అక్కడే రాత్రి బస చేసేవాడిని. తన హెల్మెట్కు అమర్చిన మైక్, కెమెరా ద్వారా నా రైడ్ను వీడియోలుగా తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశా. సామాజిక బాధ్యతగా.. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సంపత్ మొదటి నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతగా ఏదైనా చేయాలన్న తపన ఉండేది. ఆరిలోవకు చెందిన సంపత్ తండ్రి బొంతు శ్రీనివాసరావు పరవాడలో చిన్న రెస్టారెంట్ నడుపుతున్నారు. తల్లి ఓమ్న గృహిణి. తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. బుల్లయ్య కళాశాలలో ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులో బీఏ జాయిన్ అయ్యాక తన సబ్జెక్ట్ పరంగా ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. గతేడాది ‘నో ప్లాస్టిక్’నినాదంతో అవగాహన కలి్పస్తూ సైకిల్పై విశాఖ నుంచి కన్యాకుమారి వరకు 23 రోజుల్లో 1,857 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఏడాది మే 30న తన హోండా షైన్ 125 సీసీ బైక్పై బుల్లయ్య కళాశాల వద్ద బయలుదేరి కశ్మీర్ చేరుకుని, అక్కడ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాడు. కన్యాకుమారి నుంచి మరలా ఈ నెల 23న నగరానికి చేరుకున్నాడు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రయాణం ఇండియాకు చైనాకు కనెక్టింగ్ రోడ్ లద్దాఖ్లో ప్రయాణం కొత్త అనుభూతిని కలిగించింది. చైనా బోర్డర్లో ప్రయాణం కొనసాగించా. తిరుగు ప్రయాణంలో భారత్–పాకిస్తాన్ బోర్డర్లో వాఘా వద్ద సైనిక వందనం చూశాను. చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. 55 రోజుల ప్రయాణానికి రూ.1.60 లక్షలు ఖర్చు అయింది. కేవలం పెట్రోల్కే రూ.40 వేల వరకు ఖర్చు చేశా. ఆ తర్వాత రాత్రి పూట బస చేయడానికి హోటల్ రూమ్స్కు ఎక్కువ చెల్లించా. లద్దాఖ్లో ఉన్న ఒక్క రూమ్ కోసం ఆ రాత్రి రూ. 5500 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ యాత్రకు బుల్లయ్య కళాశాల యాజమాన్యం రూ.22 వేల వరకు సాయం అందించింది. ధాన్ ఫౌండేషన్ రూ.60 వేల సాయం అందించి నన్ను ప్రోత్సహించింది. వారి సహాయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.. ప్రపంచంలో ఎత్తైన ఉమ్లింగ్ లా.. సముద్రమట్టానికి 19,042 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్కు 125 సీసీ బైక్పై చేరుకోవడం చాలా గొప్ప విషయం. 400 సీసీ బైక్పై ప్రయాణించలేని మార్గంలో 125 సీసీ బైక్పై ప్రయాణించా. ఉమ్లింగ్ లా పాస్కు చేరాక ఊపిరి ఆడక ముఖమంతా పచ్చగా మారిపోయింది. సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఫస్ట్ ఎయిడ్ చేసి సాయం అందించారు. కొత్త అనుభూతి కలిగింది నేను ఈ ప్రయాణంలో జీవితంలో మొదటిసారి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అరుదైన ప్రాంతాలను చూడగలిగాను. ఆగ్రా, నూబ్రా వేలీ, ప్రపంచంలో ఎత్తైన చిచామ్ బ్రిడ్జి, ప్రపంచంలో ఎత్తైన పెట్రోల్ బంకు ఖాజా బంకు, హిక్కింలో ఎత్తైన పోస్టాఫీస్, సిమ్లా, మనాలీ, ఇండియా పాక్ బోర్డర్, ఇండియా చైనా బోర్డర్, జోజి లా పాస్, కన్యాకుమారి, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, పాంగాంగ్ లేక్, డిస్కిట్, సోన్మార్గ్, ప్రపంచంలో ఎత్తైన రోడ్ ఖార్దుంగ్లా, ఉమ్లింగ్ లా పాస్ రహదారుల్లో ప్రయాణం, లాంగెస్ట్ అటల్ టన్నెల్లో ప్రయాణం, అందమైన ప్రకృతి, ఆహ్లాదమైన మంచు, లోయలు, జలపాతాలను చూస్తూ కశీ్మర్, హిమాచల్ప్రదేశ్లో బైక్ ప్రయాణం జీవితంలో మర్చిపోలేనని సంపత్ తన యాత్ర విశేషాలను వివరించాడు. 60 కిలోమీటర్లు.. 8.30 గంటలు కార్గిల్ నుంచి లేహ్ వెళ్తున్న సమయంలో రోడ్ బాగోక బైక్ స్కిడ్ అయి పడిపోయా. అటుగా వెళ్తున్న రైడర్ల సాయంతో బైక్ సరిచేసుకుని ముందుకు సాగా. అలాగే మనాలి నుంచి లూసర్ వరకు 60 కిలోమీటర్ల జర్నీ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డా. ఈ మార్గం నేషనల్ హైవే అయినప్పటికీ రహదారి అంతా పెద్ద పెద్ద రాళ్లతో ఉంది. బైక్పై వెళ్లడానికి నానా పాట్లు పడ్డా. 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పట్టింది. రాళ్లపై ప్రయాణంతో ఆ రోజు బాగా అలసిపోయా.. -
ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డు సాధించారు ఈ కేరళ దంపతులు. కన్యాకుమారి నుంచి కశ్మీర్కు తిరిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. బెన్నీ కొట్టరత్తిల్, అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘయాత్ర చేశారు. డిసెంబర్ 1, 2021 నాడు ‘చలో భారత్’ అని బయలుదేరి 216 రోజులలో 17 రాష్ట్రాలలో తిరిగి జూలై 3, 2022న ఇల్లు చేరారు. ఏడు నెలల మూడు రోజుల తమ పర్యటనలో వారు గడించిన అనుభవాలు మరొకరు పొందలేనివి. ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయడం కాదు. మణికట్టు మీదున్న వాచ్లో ‘ఓ... ఇవాళ ఐదు వేల అడుగులు నడిచాను’ అని లెక్క చూసుకోవడం కాదు. నడుస్తూ ఉండాలి. రోజంతా నడుస్తూ ఉండాలి. వారమంతా నడుస్తూ ఉండాలి. నెలంతా నడుస్తూ ఉండాలి. నడవగలరా? కొట్టాయం దంపతులు బెన్నీ, మాలి నడిచారు. దేశమంతా నడిచారు. పాదాలతోపాటు కనులు, మనసు, ఆత్మ ధన్యం చేసుకున్నారు. వారు ఇదంతా ఎలా చేశారు? ‘ప్లాన్ చేయకుండా. ప్లాన్ చేస్తే చాలా పనులు జరగవు. మీనమేషాలు లెక్కెట్టకండి... అనుకున్నదే తడవు చేసేయండి’ అనేది వీరి ఫిలాసఫీ. కోవిడ్ ‘రోడ్డున పడేసింది’ ప్రపంచంలో అందరి జీవితాలు గందరగోళం అయినట్టే బెన్ని, మాలి జీవితాలు కూడా గందరగోళం అయ్యాయి. 50 ఏళ్ల బెన్నీ ఆంధ్రప్రదేశ్లోని ప్రయివేట్ స్కూల్లో టీచర్గా పని చేసేవాడు. కాని కోవిడ్ వల్ల 2019లో ఉద్యోగం పోయింది. భార్యాభర్తలు తమ సొంత ఊరు కొట్టాయం చేరుకున్నారు. చేయడానికి పని దొరకలేదు. చివరకు బెన్నీకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది ఒక హాస్పిటల్లో. ఆ సమయంలో పోస్ట్ కోవిడ్ అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్లు చాలా చూశాడు బెన్ని.‘తగినంత వ్యాయామం లేకనే ఇవన్నీ’ అని అర్థమైంది. మరి తానేం చేస్తున్నట్టు? అప్పటికే ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. 2019 నవంబర్లో ఒక సైకిలెక్కి ‘అలా దేశం చూసి వస్తా’ అని భార్యకు చెప్పి బయలు దేరాడు. కేవలం 58 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు 13 రాష్ట్రాల మీదుగా. ఆ పని కిక్ ఇచ్చింది. మళ్లీ 2021 జూలైలో ఒక సైకిల్ యాత్ర చేశాడు భూటాన్, నేపాల్ వరకు. మూడోసారి కూడా ప్లాన్ చేస్తుంటే భార్య మాలి ‘నన్ను కూడా తీసుకెళతావా?’ అంది అతడు సైకిల్ తుడుస్తుంటే... ‘మనిద్దరం సైకిల్ మీద ఎక్కడెళ్లగలం. నడవాల్సిందే’ అన్నాడు బెన్నీ. ‘అయితే నడుద్దాం పద‘ అంది మాలి. యాత్ర మొదలైంది. డిసెంబర్లో యాత్ర మొదలు డిసెంబర్ 1, 2021న ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్’ వరకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు బెన్నీ, మాలి. ‘మాకు పిల్లలు లేరు, మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. స్నేహితులు సాయం చేసిన డబ్బు, ఒక టెంట్, నీళ్ల బాటిళ్లు, అవసరమైన మందులు, అన్నింటి కంటే ముఖ్యంగా పవర్ బ్యాంకులు... వీటిని తీసుకుని బయలుదేరాం. మాకు ఆధారం గూగుల్ మేప్సే’ అంటాడు బెన్నీ. ఈ యాత్రను వీళ్లు 17 రాష్ట్రాల మీదుగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా అంత సులభమా.. ఎండా గాలి చలి దుమ్ము... బాత్రూమ్ కష్టాలు... నిద్రకు చోటు... దొంగల భయం... ఇవన్నీ ఉంటాయి. ‘మేమిద్దరం పదే పదే ఒకటే మాట చెప్పుకున్నాం. ఏది ఏమైనా యాత్రను సగంలో ఆపి వెనక్కు పోయేది లేదు అని. ఏం జరిగినా సరే ముందుకే వెళ్లాలి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం’ అంటారు ఇద్దరూ. ఎన్నో అనుభవాలు మొత్తం 216 రోజుల యాత్రలో వారు చలికాలం, ఎండాకాలం చూశారు. చలికాలం టెంట్ సాయపడినా ఎండాకాలం టెంట్లో పడుకోవడం దుర్లభం అయ్యింది వేడికి. ‘టెంట్ బయట పడుకుంటే దోమలు నిర్దాక్షిణ్యం గా పీకి పెట్టేవి’ అన్నాడు బెన్నీ. అదొక్కటే కాదు.. భార్య భద్రత కోసం అతడు సరిగా నిద్రపోయేవాడు కాదు. ‘చీమ చిటుక్కుమన్నా లేచి కూచునేవాణ్ణి‘ అన్నాడు. వీళ్ల కాలకృత్యాల అవసరాలకు పెట్రోలు బంకులు ఉపయోగపడేవి. గుళ్లు, గురుద్వారాలు, పోలీస్ స్టేషన్ల వరండాలు, బడులు... ఇవన్నీ వారు రాత్రి పూట ఉండే చోటుగా మారేవి. బడ్జెట్ కోసం రొట్టెల మీదే ఎక్కువ ఆధారపడేవారు. ‘వెస్ట్ బెంగాల్ పురూలియాలో రాత్రి తాగుబోతుల బారిన పడి పారిపోయాం. తమిళనాడు విల్లుపురం గుడిలో పడుకుంటే దొంగలు వచ్చారు. అట్టపెట్టెల వెనుక ఉండటం వల్ల మమ్మల్ని చూడలేదు. కుక్క మొరగడంతో పారిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వేడి వేడి అన్నం, కూర తినడంతో మా ప్రాణం లేచి వచ్చింది. పంజాబ్లో జనం చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ముసలాయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి మరుసటి రోజుకి కట్టి ఇచ్చాడు’ అన్నారు వారు. ఎన్నెన్ని అందాలు అమృత్సర్, మురుడేశ్వర్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, కశ్మీర్, వాఘా బోర్డర్... ఇవన్నీ ఈ దంపతులు తమ కాళ్ల మీద నడుస్తూ చూసి సంతోషించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఎందరికి ఉంటుంది ఈ తెగువ. వారు తమ యాత్రానుభవాలను వారి యూట్యూబ్ చానల్ ‘వికీస్ వండర్ వరల్డ్’లో వీడియోలుగా పోస్ట్ చేశారు. తిరిగి వచ్చాక ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడు బెన్నీ. కాసింత సంపాదన చేసుకుని భార్యతో ఈసారి బైక్ మీద రివ్వున దూసుకెళ్లాలని ఆశ. ఎందుకు నెరవేరదూ? (క్లిక్: పర్యాటకుల స్వర్గధామం.. కాస్ పీఠభూమి) -
కశ్మీర్.. సోలార్ పవర్.. లగ్జరీ కారు
కశ్మీర్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు పదకొండేళ్లు శ్రమించి సామాన్యులకు లగ్జరీ ఫీచర్లు ఉండే అధునాతన కారును రూపొందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కారు నడిచేందుకు పెట్రోలు, డీజిల్ కాకుండా సౌరశక్తినే వినియోగించుకోవడం మరో విశేషం. కశ్మీర్లోని శ్రీనగర్కి చెందిన బిలాల్ అహ్మద్ వృత్తిరీత్య గణిత శాస్త్ర బోధకుడు. అయితే చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా లగ్జరీ కార్లు అందులో ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే తనలాంటి సామాన్యులకు లగ్జరీ కార్లు అందుబాటులో లేకపోవడం లోటుగా తోచింది. దీంతో ఇంటర్నెట్లో వీడియోల ద్వారా సమాచారం సేకరిస్తూ సాధారణ కారుకే లగ్జరీ సౌకర్యాలు అమర్చే పనిలో పడ్డాడు. సామాన్యులకు లగ్జరీ ఫీచర్లతో కారును తీసుకురావలే ఆశయంతో 2009 నుంచి బిలాల్ అహ్మద్ పని చేస్తున్నాడు. పదకొండేళ్ల శ్రమ ఫలించి ఇటీవల మోడిఫైడ్ లగ్జరీ ఫీచర్లతో కూడిన కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారులో లగ్జరీ ఫీచర్లకు తోడు మరొకటి ఫీచర్ కూడా జతయ్యింది. అదే సోలార్ పవర్. బడ్జెట్ ధరలో అధునాత కారు కోసం శ్రమించే క్రమంలో సోలార్ పవర్తో కారును తయారు చేసేందుకు బిలాల్ శ్రమించాడు. సౌర శక్తి కోసం కారుకు నలువైపులా సోలార్ ప్యానెళ్లు అమర్చాడు. అదే విధంగా పైకి తెరుచుకునే డోర్లు ఈ కారుకు కొత్త లుక్ తీసుకువచ్చాయి. Valleys first Solar car A Kashmiri mathematician teacher Bilal Ahmed innovated a solar car pic.twitter.com/F6BAx2JVFN — Basit Zargar (باسط) (@basiitzargar) June 20, 2022 చదవండి: ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు -
Masarat Farooq: కశ్మీర్ లోయకు ట్యూషన్ చెబుతోంది
తుపాకుల మోతలు.. ఉగ్రవాదదాడులు ఇవి కశ్మీర్ అంటే గుర్తుకు వచ్చేది. కాని అక్కడి పిల్లలు చదువుకు చాలా విలువ ఇస్తారు. తరచూ స్కూళ్లకు వచ్చే ‘భయం సెలవులకు’ బాధ పడతారు. వారి భయం పోవాలంటే వాళ్ల ఇళ్లకే వెళ్లి ట్యూషన్ చెప్పాలి అని నిశ్చయించుకుంది మస్రత్ ఫారూక్. తానే ఒక ఎంట్రప్రెన్యూర్గా మారి, లోయ మొత్తం దాదాపు 100 మంది టీచర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లు సాయంత్రమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ట్యూషన్ చెప్పాలి. మస్రత్ ఆలోచన పెద్ద హిట్ అయ్యింది. తాజాగా కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమెకు ‘కశ్మీర్ విద్యారంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్’గా గుర్తింపు ఇచ్చారు. 26 ఏళ్లు మస్రత్ ఫరూక్కు. కాని కాశ్మీర్లోయ అంత ముఖ్యంగా శ్రీనగర్ అంతా ఆమెను ‘మాస్టర్జీ’ అని పిలుస్తారు. నర్వారా నుంచి ఒక తండ్రి ఫోన్ చేస్తాడు.. ‘మాస్టర్జీ... మా అబ్బాయికి ట్యూషన్ కావాలి’... రేషి మొహల్లా నుంచి ఒక తల్లి ఫోన్ చేస్తుంది.. ‘మాస్టర్జీ... మా పిల్లలకు ట్యూషన్ కావాలి’... టాటా బ్రాండ్, బాటా బ్రాండ్లాగా నమ్మకానికి, ఫలితాలకు ఒక గ్యారంటీగా మస్రత్ ఒక బ్రాండ్ అయ్యింది ట్యూషన్లకు ఆ అందమైన లోయలో... కలతల నేలలో. పాఠాలు చెప్పడం ఇష్టం శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్ పదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ‘నాకు పాఠాలు చెప్పడం ఇష్టం’ అంటుంది మస్రత్. ఇంటర్ చదువుతూ, డిగ్రీ చదువుతూ కూడా స్కూళ్లలో పార్ట్టైమ్ టీచర్గా పని చేసింది మస్రత్. క్లినికల్ సైకాలజీలో ఎం.ఎస్సీ చేసింది. అయితే 2019 అక్టోబర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో శ్రీనగర్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో పిల్లలు చదువుకు అంతరాయం కలగడం గమనించింది మస్రత్. ఆ వెంటనే 2020లో ఫిబ్రవరి నుంచి కోవిడ్ ప్రతిబంధకాలు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినా ఆ క్లాసులు జరిగే సమయంలో పిల్లలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం తన సొంత కజిన్స్ చదువు కుంటుపడటం కూడా గమనించింది. ఒక్కోసారి ఉగ్రవాద చర్యల వల్ల కూడా స్కూళ్లు సరిగ్గా నడవవు. బడి దగ్గర పిల్లలు అనే భావన కంటే పిల్లల దగ్గరకే బడి అనే భావన సరైనదని మస్రత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ముగ్గురు టీచర్లు... 20 మంది పిల్లలు విద్య గురు ముఖతా ఉండాలి... టీచర్ సమక్షం లో ఉంటూ టీచర్ను చూస్తూ నేర్చుకుంటే చదువు సరిగ్గా వస్తుందనేది మస్రత్కు తెలుసు. అందుకే స్కూల్ ఎలా నడిచినా హోమ్ ట్యూషన్లు పిల్లలకు మేలు చేస్తాయని భావించింది. తానొక్కతే అందరికీ చెప్పలేదు కనుక తన ఆధ్వర్యంలో పని చేసే టీమ్ ఉండాలనుకుంది. ఒక ముగ్గురు టీచర్లు దొరికితే 20 మంది పిల్లల ఖాతాలు దొరికితే చాలు అనుకుంది. ‘స్మార్ట్క్లాసెస్ హోమ్ ట్యూషన్స్’ పేరుతో సంస్థ ప్రారంభించి పత్రికల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చింది. చాలామంది అప్లికేషన్స్ పంపారు. కాని టీచింగ్కు ఎవరు పనికి వస్తారో కనిపెట్టడమే మస్రత్ విజయానికి కారణం. అలాంటి ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ట్యూషన్లు ఎవరికి చెప్పాలో తాను నిర్ణయించి పంపుతుంది. ఎంతమందికి చెప్తే ఆ మొత్తం నుంచి టీచరు, తాను షేర్ చేసుకుంటారు. అదీ ఒప్పందం. కాని వెంటనే స్పందన రాలేదు. కొన్ని రోజులకు రవూఫ్ అనే యూరాలజిస్ట్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని కోరాడు. మస్రత్ టీచర్ని పంపింది. పిల్లలు చదువుకుంటున్న పద్ధతికి ఆ డాక్టరు చాలా ఆనందించాడు. ఊళ్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ పదే పదే మస్రత్ టీమ్ గురించి చెప్పాడు. విద్యార్థులు పెరుగుతూ పోయారు. నేడు శ్రీనగర్ అంతా 200 మంది పిల్లలు మూలమూలన సాయంత్రమైతే దీపం వెలిగించి మస్రత్ పేరు తలుచుకుంటారు. ఎందుకంటే ట్యూషన్ మొదలయ్యేది అప్పుడే కదా. 80 మంది టీచర్లు మస్రత్ కింద పని చేస్తున్నారు. 50 వేల వరకూ జీతం మస్రత్ చెప్పడం ‘నా ట్యూషన్ల వల్ల 98 శాతం మార్కులు గ్యారంటీ’ అని. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ పిల్లలకు అలాగే మార్కులు వస్తున్నాయి. క్లాసును బట్టి ఫీజు నిర్ణయించడం వల్ల ఒక టీచరు చెప్పగలిగినన్ని ట్యూషన్లు చెప్పే స్వేచ్ఛ ఉండటం వల్ల తన దగ్గర పని చేస్తున్నవారిలో కొందరు నెలకు 50 వేలు (ఆమె వంతు షేర్ పోను) సంపాదిస్తున్నారని మస్రత్ చెప్పింది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’ అంటుంది మస్రత్. ఆమె ఇప్పుడు శ్రీనగర్లో రెండు కంప్యూటర్ సెంటర్లు నడుపుతోంది. త్వరలో స్కూల్ తెరవాలని అనుకుంటోంది. ఆమె చొరవ వల్ల ఒక వైపు చదువు, మరో వైపు ఉపాధి కలుగుతుండటంతో శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా ఆమెను తాజాగా సత్కరించారు. అది మస్రత్కు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఆన్లైన్ ట్యూషన్లతో కొందరు సక్సెస్ అయ్యారు. నాకు ఆన్లైన్తో సంబంధమే లేదు. నా విధానం నేరుగా పిల్లలకు విద్యావిధానం’ అని చెబుతున్న మస్రత్ త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆమె సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అలాంటిది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్స్టాప్లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్!
Khushi Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటున్ను విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓ అప్డేట్ ఇస్తూ హీరో విజయ్, సమంతలకు డైరెక్టర్ శివ థ్యాక్స్ చెప్పాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కశ్మీర్లో జరుగుతున్న మా మూవీ(ఖుషీ) తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చదవండి: సినిమా టికెట్లు అమ్మాలంటూ వేధింపులు? నిజమేంటంటే? కశ్మీర్ షెడ్యూల్ను శరవేగంగా పూర్తి చేసేందుకు సహాకరించిన హీరో విజయ్, హీరోయిన్ సమంత, వెన్నెల కిశోర్తో మా మూవీ యూనిట్కు ధన్యవాదాలు’ అంటూ శివ రాసుకొచ్చాడు. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ మూవీతో పాటు విజయ్, పూరీ జగన్నాథ్తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సామ్ నటించిన కాతువాక్కుల రెండు కాదల్ మూవీ విడుదల కాగా శాకుంతం, యశోద చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీతో పలు ప్రాజెక్ట్లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. Amazing first schedule in kashmir Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations #khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS — Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022 -
కన్యాకుమారి నుంచి కశ్మీర్.. భారత్ జోడో యాత్ర
ఉదయ్పూర్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్లో పునరుత్తేజం తీసుకొచ్చి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్రి సోనియా గాంధీ ‘భారత్ జోడో’ నినాదం ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్ శిబిర్లో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘2024’ దృష్టితో సంస్కరణలు పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్ శిబిర్లో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. ‘‘2024 ఎన్నికలపై దృష్టి పెడుతూ పలు సంస్కరణలు అమలు చేయనున్నాం. అందుకు రెండు మూడు రోజుల్లో టాస్క్పోర్స్ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకొనే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. అడ్వైజరీ కమిటీ భేటీలే కాకుండా సీడబ్ల్యూసీ సమావేశాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె వివరించారు. మేనిఫెస్టోలో ఈవీఎంల రద్దు: చవాన్ ఈవీఎంల విశ్వసనీయత, పనితీరుపై పార్టీల్లో, ప్రజల్లో అనుమానాలున్నందున వాటిని పక్కనపెట్టి, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తేవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇస్తామన్నారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో జరిగే అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేపర్ బ్యాలెట్ల అంశాన్ని చింతన్ శిబిర్లో లేవనెత్తానని అన్నారు. చాలామంది నేతలు తన వాదనకు మద్దతు పలికారని వెల్లడించారు. ఈవీఎంలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినా ఫలితం ఉండదని, అందుకే తమ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నెగ్గడం కాంగ్రెస్కు చాలా ముఖ్యమని వివరించారు. తమ విజయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ పదేపదే కోరుతోంది. సవాళ్లను అధిగమిస్తాం ‘‘చింతన్ శిబిర్ చాలా ఉపయోగకరంగా, ఫలవంతంగా సాగింది. నా పెద్ద కుటుంబం (కాంగ్రెస్)తో గడిపే అవకాశం కలిగింది’’ అని సోనియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్కు కొత్త శుభోదయం రానుంది. అదే మన అంకితభావం. అదే నూతన సంకల్పం’’ అన్నారు. భారత్ జోడోయాత్రలో తన లాంటి సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడకుండా పాల్గొనే మార్గాలు వెతకాలంటూ చమత్కరించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, లుప్తమైపోతున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకే ఈ యాత్ర అన్నారు. నిరుద్యోగం, ధరల భారం అంశాలను జన జాగరణ్ అభియాన్–2లో లేవనెత్తుతామన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలలో ఈ పరిస్థితి లేదు.. -
సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతుంది. అయితే గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. షూటింగ్ సీన్ అంటూ ఒక ఫేక్ డైలాగ్ను సమంతతో రిహార్సల్ జరిపించారు. యాక్షన్ అనగానే లవ్ ఫీల్తో సామ్ ఆ డైలాగ్ను చెబుతుండగా, హ్యాపీ బర్త్డే సమంత అంటూ విజయ్ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్డే అంటూ ఒక్కసారిగా అరవడంతో ఇది ఫేక్ రిహార్సల్ అని అర్థమయ్యింది. ఆ తర్వాత సెట్లోనే సామ్ బర్త్డేను సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సర్ప్రైజింగ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Happy Birthday @Samanthaprabhu2 ❤️ Wishing you full happiness 😊 Let’s make a love story now :) Love and hugs, Vijay. https://t.co/5mEfpp4Wws — Vijay Deverakonda (@TheDeverakonda) April 28, 2022 -
ఒక్కోమెట్టు ఎక్కుదాం.. గమ్యాన్ని చేరుకుందాం
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. దేశవ్యాప్తంగా మరుగన పడిపోయిన ప్రతిభావంతులు, స్ఫూర్తిని అందించే ఘటనలు చోటు చేసుకునప్పుడు ట్విటర్ వేదికగా వాటికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో కల్లోల కశ్మీరానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను మనతో పంచుకున్నారు. జమ్ము కశ్మీర్లోని పల్లి పంచాయితీ దేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామ పంచాయితీగా మారి రికార్డు సృష్టించింది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోలార్ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా గ్రామానికి అవసరమైన విద్యుత్ని సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో గమనించిన ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. పల్లి గ్రామ పంచాయతీ తరహాలో పంచాయతీ తర్వాత పంచాయతీ లక్ష్యంగా పని చేసుకుంటూ పోతే కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. That’s how to battle climate change and become carbon neutral: Step by step, Panchayat by Panchayat…👏🏼👏🏼👏🏼 https://t.co/vjDcMQ0p2U — anand mahindra (@anandmahindra) April 27, 2022 చదవండి: నేను తర్వాత కొనేది అదే.. ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన -
కశ్మీర్లో ల్యాండ్ అయిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తమిళంలో ఆమె నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటికే యశోద, శాకుంతలం షూటింగ్స్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్లో జరగనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. ఫ్లయిట్లో వెళ్తూ కశ్మీర్ అందాలను కెమెరాలో బంధించింది. -
జలజ: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది
ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్’’ అంటోంది జలజా రతీష్. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ. కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు ట్రిప్ను ప్లాన్ చేసేలా చేసింది. భర్తతో కలిసి.. లాంగ్ ట్రిప్కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్ లోడింగ్ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్ల మీదుగా కశ్మీర్ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు. లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్ ట్రిప్ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్లో ప్లైవుడ్ ట్రాన్స్పోర్ట్ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్ దించి, అక్కడ పంచదారను లోడ్ చేసుకుని కేరళ లో అన్లోడ్ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. జలజ తన ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు. సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా.. ‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్మర్గ్, పంజాబ్ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది. రోజూ చేసే పని అయినా రొటీన్కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
అస్సాంని మరో కశ్మీర్గా మార్చకండి!...కీలక వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం
Ten Years Back Muslims Are Not Minority: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అస్సాం జనాభాలో 35 శాతం ముస్లింలు ఉన్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఇకపై వారిని మైనారిటీలుగా పరిగణించలేరని కూడా స్పష్టం చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను గురించి కూడా ప్రస్తావించాడు. అంతేగాదు బాలీవుడ్ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని చెప్పారు. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం. గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయని వారి భూములు ఆక్రమించబడవు అని భరోసా ఇచ్చారు. ఆరో షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఈ భూమిలో స్థిరపడకపోతే ఇస్లాం, రెహమాన్ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో స్థిరపడవు. అధికారం బాధ్యతతో వస్తుంది. అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం" అని ముఖ్యమంత్రి అన్నారు. అస్సామీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు, సంస్కృతి, నాగరికత రక్షింపబడతుందో లేదో అనే భయంతో ఉన్నారని చెప్పారు . సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ అని చెప్పారు. ముస్లింలు శంకరి సంస్కృతి, సత్త్రియ సంస్కృతి రక్షణ గురించి మాట్లాడనివ్వండి.. అప్పుడే సామరస్యం ఉంటుందని నొక్కి చెప్పారు. పదేళ్ల క్రితం ముస్లీంలు మైనారిటీలు కాదు కానీ ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారని తెలిపారు. ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని ముస్లీంలు పోగొట్టాలి. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్) -
ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక
ఉత్తర భారతదేశంలోని... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా హైవే... సమయం... మద్యాహ్నం 3గంటల 30నిమిషాలు. సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకు వెల్తున్న కాన్వాయ్పై ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూకలర్ కార్... వేగంగా దూసుకువచ్చి జవాన్లు వెలుతున్న బస్సులోకి దూసుకుపోయింది. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు తునాతునకలై పోయాయి. అందులో ఉన్న వారి మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. అసలేం జరిగిందో అర్ధం అయ్యేలోపు... జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భద్రతా దళాల మీద జరిగిన భయంకర దాడి తరువాతి కాలంలో దేశభద్రత, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుల్వామా దాడి ఒక ఆత్మాహుతి దాడి. కారుణలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు కూర్చి ఆ కారును భద్రతా దళాల వాహనాలతో ఢీకొట్టడం ఈ మొత్తం దాడిలో కీలకం. ఈ దాడి ఎలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏవిధంగా పేలుడు పదార్ధాలు దేశంలోకి వచ్చాయనేది కూడా విచారణ సంస్థలను విస్మయానికి గురిచేశాయి. ఈ దాడిలో పాల్గొన్నది స్థానిక కశ్మీరీ ఉగ్రవాదులా లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమాంతర ఉగ్రవాదులా అనేది ఈ కేసులో చాలాకాలం మిస్టరీగా ఉండింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. పుల్వామా.. దక్షిణ కాశ్మీర్లో ఉన్న పట్టణం గుండా వెళుతున్న హైవే అటు జమ్మూను ఇటు కాశ్మీర్ను కలుపుతుంది. చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచుక కురవడం వల్ల... హైవేపై రాకపోకలు ఆగిపోతాయి. అటు జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న భద్రతా దళాలకు నిత్యావసరాల నుంచి అమ్యునేషన్ ఏది పంపాలన్నా ఈహైవే ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2019లో కూడా జమ్మూలోని సీఆర్పీఎఫ్ క్యాంప్లో ఉన్న జవాన్లను కాశ్మీర్కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా సెలవుల మీద వెళ్లివచ్చిన జవాన్లు ముందుగా జమ్మూలోని క్యాంప్లో రిపోర్ట్ చేస్తారు... ఆ తరువాత వారు ఒకేసారిగా కాశ్మీర్లోని క్యాంప్లకు భారీ భద్రత మధ్య కాన్వాయ్లో వెళతారు. అయితే 2019 జనవరి15 తరువాత కాశ్మీర్లో భారీగా మంచు కురిసింది దీంతో దాదాపు 20రోజుల పాటు జవాన్లను తరలించడం సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన జవాన్ల కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినా... మంచు కారణంగా అది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. గతంలో కాశ్మీర్లో వ్యవహారలను చూసే బీఎస్ఎఫ్ స్థానంలో సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరి 14న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి భారీగా జవాన్లను తీసుకుని వాహనాలు కాశ్మీర్కు బయలుదేరాయి. మొత్తం 78వాహనాల్లో 2547మంది సీఆర్పీఎఫ్ జవాన్లు... జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న క్యాంపుకు వెలుతున్నారు. జమ్మూ-కాశ్మీర్ను కలిపే టన్నెల్ వద్దకు మద్యాహ్నం సమయానికి జవాన్ల కాన్వాయ్ చేరుకుంది. టన్నెల్ నుంచి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే జవాన్ల తరలింపు జరగాలి. ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. భద్రతా కారణాల దృష్ట్యా కాశ్మీర్లో భద్రతా దళాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లోనే ప్రయాణించాలి. అయితే భారీగా జవాన్లు ఉండటంతో... సరిపోయినన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టన్నెల్ వద్దరు రాలేదు. దీంతో చాలామంది జవాన్లు... సాధారణ బస్సుల్లోనే కూర్చుండి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించారు. 2019ఫిబ్రవరి 14 రోజున మద్యాహ్నం 2గంటల సమయంలో పుల్వామా హైవేపై పోలీసుల హడావిడి ప్రారంభం అయింది. ఏరియా డామినేషన్ పార్టీ పూర్తిగా హైవే తమ ఆధీనంలోకి తీసుకుంది. జవాన్లు ఆ ఏరియా దాటిపోయే వరకు హైవేపై ఇతర వాహనాలను అనుమతించరు. ఇది ఎప్పుడూ ఉండే ప్రొసీజర్. దాదాపు 3గంటల 15నిమిషాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సులు పుల్వామా సరిహద్దులోకి చేరుకున్నాయి. 3గంటల 30నిమిషాలకు పుల్వామా పట్టణాన్నిదాటి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. అంతలోనే రెండు ఒక బ్లూకలర్ మారుతి కారు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకు వెళ్లే మార్గం దగ్గర నుంచి ఒక్కసారిగా కాన్వాయ్లోని బస్సుల మీదకు దూసుకుపోయింది. వెంటనే భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా తునాతునకలైంది. ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ పేలుడు జరగడంతో అసలేం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. వెంటనే ముందు బస్సులో ఉన్న జవాన్లు కన్ఫ్యూజన్లో కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకుని ఎవరూ లేరని గ్రహించి క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. పేలుడు తీవ్రత దాదాపు 10కిలోమీటర్ల వరకు వినిపించింది. బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసం అయింది చాలామంది జవాన్ల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయాయి. హైవే పక్కన ఎలాంటి నివాస జనావాసాలు లేవు. అయితే హైవే కింది భాగంలో నివాస ప్రాంతం ఉంది. పేలుడు తరువాత వెంటనే తేరుకున్న అధికారులు సహాయంకోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రితో పాటు ఆర్మీ క్యాంపుకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ భీతావాహ దృష్యాలను చూసి స్థబ్దులైపోయారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలు చేసి అధికారుల కళ్లు చెమర్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు... చనిపోయిన వారి మృతదేహాల భాగాలను భద్రపరిచారు. దాదాపు 200మీటర్ల వరకు జవాన్ల మృతదేహాలు... చేతివేళ్లు.. కాలి ముక్కలు విసిరివేసినట్లు పడ్డాయి. ఆ భాగాలను బాక్సుల్లో అమర్చి...ఆర్మీ బేస్ క్యాంపుకు తరలించారు. పుల్వామా వార్త టీవీ స్క్రీన్లను తాకగానే .. దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దృశ్యాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ దాడి మీద తీవ్రమైన ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన 15నిమిషాల్లోనే బాంబుదాడి జరిపింది తామేనంటూ జైషే మహమ్మద్ ఒక వీడియో విడుదల చేసింది. మహమ్మద్ దాడికి పాల్పడింది తామే అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ దార్ అని చెప్పుకున్న ఒ ఉగ్రవాది ఎమ్-4 కార్బైన్ గన్ , ఒక పిస్టల్ పట్టుకుని కనిపించాడు. ఆదిల్ వెనకాల జైషే మహమ్మద్ జెండా ఉంది. ఈ దాడికి పాల్పండింది తానేనని చెప్పుకున్న దార్... గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో విడుదల కాగానే భద్రతాదళాలతో పాటు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిపెరిగింది. ఆత్మాహుతి దాడి చేసి ఆ వెంటనే వీడియో విడుదల చేయడం ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రాపగాండాను విస్తరింపజేయాలనే కుట్ర జరిగింది. దాడిలో ఎంత మంది జవాన్లు చనిపోయారనే వార్తను సీఆర్పీఎఫ్ ధృవీకరించక ముందే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వెబ్సైట్ అల్ఖలమ్లో 40మంది జవాన్లు చనిపోయారని ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించింది. దీంతో పేలుడు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు సమాచారం పాకిస్థాన్కు వెలుతుందనే విషయాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. పేలుడు తీవ్రత... భారీగా జవాన్లు చనిపోవడంతో... కేంద్రం వెంటనే ఈ కేసును జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ జమ్మూకాశ్మీర్ చీఫ్...రాకేశ్ బల్వాల్ ఈ కేసు విచారణ అధిపతిగా నియమితులయ్యారు. వెంటనే రాకేశ్ సంఘటనా స్థలానిక వెళ్లి పరిశీలించారు. దాదాపు 200మీటర్ల దూరం వరకు పడి ఉన్న వాహన శకలాలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు. రెండవ రోజు పేలుడు జరిగిన ప్రాంతానికి సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరి, నేషనల్ బాంబ్ డాటా సెంటర్, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడుకు ఉపయోగించిన కారు ముక్కలను సేకరించారు. కారు ఇంజిన్ కు సంబంధించిన కొన్ని భాగాలను సేకరించి దాని ఛాసిస్ నెంబర్ గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తయారీకి సంబంధించిన నెంబర్లను ముందుగానే జాగ్రత్తగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఫిబ్రవరి 18న మారుతీ కంపెనీకి చెందిన ఇంజనీర్ల టీమ్ విచారణ సంస్థలకు సహకరించడానికి ఢిల్లీ నుంచి కాశ్మీర్కు చేరుకుంది. మారుతీ ఇంజనీర్స్ కారు ఇంజన్ పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కారు ఇంజన్ బ్యాచ్ నెంబర్ గుర్తించగలిగారు. ఆ నెంబర్ సహాయంతో దాడికి వాడిన కారు మారుతి ఈకో మోడల్ గా తేల్చారు. దాని మోడల్ నెంబర్ ద్వారా ఇది 25జనవరి 2011రోజున తయారైనట్లు... ఆరోజు తయారైన 7ఈకో కార్లలో ఒక్కటి మాత్రమే కాశ్మీర్లో అమ్ముడైనట్లు గుర్తించారు. ఈ దాడికి వాడిన మారుతి ఈకో కారు ఛాసిస్ నెంబర్ MA3ERLF1SOO183735... కారు ఇంజిన్ నెంబర్...G12BN164140గా గుర్తించారు. విచారణలో కారు డీటేయిల్స్ తెలియగానే... ఆ కారు యజమాని జలీల్ అహ్మద్ హక్కానీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు షోరూంలో కొనుగోలు చేసిన తరువాత కొన్నిరోజులకు తాను ఆ కారును ఇతరులకు అమ్మేసినట్లు హక్కాని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. పోలీసులు విచారణను మరింత లోతుగా జరిపినప్పుడు ఆ కారు తరువాతి కాలంలో దాదాపు 6గురి చేతులు మారిందని... గుర్తించారు. గతంలో కారును కొనుగోలు చేసిన 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణను రహస్యంగా ఉంచేందుకు కొన్నాళ్లపాటు ఆ ఆరుగురిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇక ఈ కారు అమ్మకంలో దానిష్ అహ్మద్ లోన్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అహ్మద్ లోన్ను విచారిస్తే ఈ కారును తన బంధువు సజ్జాద్ భట్కు అమ్మినట్లు తెలిపాడు. చివరిసారిగా మారుతి ఈకో కారును 2019 జనవరిలో 1.85లక్షలకు సజ్జాద్ భట్కు అమ్మినట్లు బ్రోకర్ తెలిపాడు. ఇక సజ్జాద్ భట్ కోసం వెళ్లిన పోలీసులు అప్పటికే అతను పారిపోయినట్లు గుర్తించారు. దీంతో కేసు విచారణ అక్కడే ఆగిపోయింది. ఓ వైపు కేసు విచారణ కొనసాగుతుండగా ... ఈ పేలుడు పెద్ద ఇంటెలిజెన్స్ ఫేయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ కాశ్మీర్లోకి ఎలా వచ్చిందనే చర్చ ప్రారంభం అయింది. అది ఎన్నికల సమయం కావడంతో కావాల్సినంత రాజకీయం జరిగింది. దీంతో విచారణను వేగవంతం చెయ్యాలనే ఒత్తిడి ఎన్ఐఏపై పెరిగింది. దీంతో ఏదో విధంగా కేస్లో బ్రేక్ త్రూ సాధించాలనే పట్టుదలతో... విచారణాధికారి బలవాల్ సంఘటన స్థలంలో 250మీటర్ల వరకు పోలీసులతో క్షుణ్ణంగా వెతికించాలని సంకల్పించారు. ఆ ప్రాతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉండే అతివాద శక్తులున్నాయని... అక్కడ 250మీటర్లు వెతకాలంటే కుదిరే అవకాశం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా వెనక్కి తగ్గని బలావల్ పై అధికారులను ఒప్పించి సంఘటన జరిగిన 6రోజులకు ఫిబ్రవరి 20న బ్లాస్ట్ సైట్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు... ఈ సెర్చ్ ఆపరేషన్లో 400మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, 100మంది ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ వెతుకులాటలో చనిపోయిన జవాన్ల చిన్న చిన్న శరీర భాగాలు... పేలిపోయిన వాహనాల ముక్కలు తప్ప ఏమీ లభించలేదు.అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. మద్యాహ్నం తరువాత పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200మీటర్ల దూరంలో బలావల్కు మట్టిలో మెరుస్తూ ఒక తాళంచెవి కనిపించింది. 1026 నెంబర్తో ఉన్న కారు కీ ఎన్ఐఏ అధికారి బలావల్ చేతికి చిక్కింది. తాళంచెవి మీద ఉన్న రక్తం మరకలను ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ దార్ రక్తం డీఎన్ఏతో పోల్చారు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అహ్మద్ దార్ అధికారులు నిర్ధరించారు. ముందుగా ఈ దాడి చేసింది.. కాశ్మీరీయా లేక పాకిస్థాన్ నుంచి వచ్చి న ఉగ్రవాదా అనే విషంయపై పెద్ద చర్చ జరిగింది. గతంలో కాశ్మీరీలు ఆత్మాహుతి దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో మొదటిసారిగా ఒక కాశ్మీరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వీడియో విడుదల చేసిన ఆదిల్ అహ్మద్ దార్... స్వయంగా ఈ దాడి జరిపాడని పేలుడులో అతను కూడా మరణించాడని నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఆదిల్ దార్గా తేలింది. ఇక కారు పుల్వామాకే చెందిన సజ్జాద్ భట్ కొనుగోలు చేసినట్లు కూడా నిర్దారణ అయింది. దీంతో ఇక కారు ఓనర్ సజ్జాద్ భట్ ఇంటిపై పోలీసులు రేడ్ చేశారు. భట్ అక్కడ లేడని... వారం రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి తెలిపాడు. అయితే సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్ చదువుకున్న సిరాజ్ ఉల్ ఉలుమ్ మదర్సాలోనే భట్ కూడా చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జమాతే ఇస్లామీ జమ్ము-కాశ్మీర్ అనే సంస్థ ఈ మదర్సా నడుపుతోంది. వెంటనే 28ఫిబ్రవరి 2019నాడు ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇక ఫిబ్రవరి 25నాడు ఏకే-47పట్టుకుని సజ్జాద్ భట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఈ కేసులో సజ్జాద్ భట్ కీలకం అని పోలీసులు భావించారు.సజ్జాద్ భట్ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో అతను పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు భావించారు. కేసు మళ్లీ మొదటికొచ్చింది.. ఈ కేసులో విచారణలో పురోగతి లేదు ఇక నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ఎన్ఐఏ అధికారులు పుల్వామా తరువాత జరిగిన ఎన్కౌంటర్లపై దృష్టిసారించారు. ఎన్ఐఏ అధికారి బలావల్ ఓ ఎన్కౌంటర్ సంఘటనపై దృష్టిసారించారు. 2019 మార్చిలో నౌగామ్ పోలిస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో జైషేమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కామ్రాన్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. కామ్రాన్తో పాటు మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడు.కామ్రాన్ స్థానికంగా జైష్ కమాండర్గా ఉన్నాడు... దీంతో చనిపోయిన రెండో ఉగ్రవాదిపై పోలీసులు పెద్దగా దృష్టిసారించలేదు. అయితే కామ్రాన్తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాది ఆడిడాస్ జాకెట్ వెసుకుని నీట్గా హేయిర్ కట్ చేసుకుని ఉన్నాడు. సాధారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులు ఇలా నీట్గా హేయిర్ కట్ చేసుకోవడంగాని గడ్డం ట్రిమ్ చేసుకోవడంలాంటివి చేయరు. దీంతో ఈ ఉగ్రవాదిపై ఎన్ఐఏ అధికారి బలావల్కు అనుమానం వచ్చింది. చనిపోయిన ఉగ్రవాది పేరు ఇద్రీస్ భాయ్ అని స్థానిక పోలీసులు చెప్పారు... ఇద్రీస్ దగ్గర ఒక ఎమ్-4కార్బన్తో పాటు పిస్టర్ రెండు సెల్ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్లలో ఒకటి ఐఫోన్ కాగా మరొకటి సాంసంగ్ ఎస్-9 ప్లస్. అయితే ఈ రెండు ఫోన్లు ఎన్కౌంటర్లో చనిపోకముందు ఇద్రీస్ పూర్తిగా వీటిని ధ్వంసం చేశాడని. ఈ ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని... పోలీసులు చెప్పారు. అయితే ఈ ఫోన్లను పరిశీలించిన కాశ్మీర్ పోలిస్ సైబర్ సెల్ ఇందులో ఎలాంటి డేటా తీయలేకపోయామని బలావల్కు తెలిపారు. ఈ ఫోన్లను ఎలాగైనా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు పంపాలని ఎన్ఐఏ అధికారి బలావల్ ప్రయత్నించాడు. అయితే దీనికి రూల్స్ ఒప్పుకోవని కాశ్మీర్ పోలీసులు కరాఖండీగా చెప్పారు. అయినా పుల్వామా కేసు కొలిక్కి రావాలంటే... ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలనే తపనతో ఉన్న ఎన్ఐఏ అధికారి బలవాల్లో అన్ని అవకాశాలను వాడుకున్నాడు. దీంతో తనకు పరిచయమున్న కాశ్మీర్ క్యాడర్ ఐపిఎస్ అధికారిని రిక్వేస్ట్ చేసి ఆ ఫోన్లు స్వాధీన పరుచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్లు ఢిల్లీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చేతికి అందాయి. చాలా కష్టపడి పూర్తి డేటాను వెలికితీసిన ఇంజనీర్ల టీమ్కు జాక్పాట్ తగిలింది. వెంటనే ఎన్ఐఏ అధికారి రాకేశ్కు అందులో ఉన్న డేటాను పరిశీలించడాని ఢిల్లీ వెల్లాడు. ఓ వైపు ఎన్ఐఏ అధికారులు ఫోన్లో దొరికిన సమాచారాన్ని ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో.. మరో సంఘటన జరిగింది. ఒక వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్లోకి ఎంటర్ అవుతుండగా పోలీసులకు అనుమానం కలిగి చెక్పోస్ట్ దగ్గర ఆపారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నిలదీశారు. దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు అడవిలోకి పారిపోయారు... వీరిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరిని సమీర్ దార్ గా గుర్తించారు. సమీర్ దార్ను విచారించిన తరువాత పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ దార్ కు ఇతను సోదరుడిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు పుల్వామా దాడి తరువాత వచ్చిన వీడియోను సమీర్దార్కు చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ ఆదిల్ దారేనని... అయితే ఆ గొంతుమాత్రం అతనిది కాదని చెప్పాడు. గతంలోనే ఆ వీడియోను పూర్తిగా పరిశీలించిన ఫొరెన్సిక్ అదికారులు ఇది డబ్బింగ్ చెప్పిన వీడియో అని చెప్పారు. చనిపోయింది సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్... డీఎన్ఏ టెస్టులో ఇది నిర్ధరణ అయింది. మరి గొంతు ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో పోలీసులకు గతంలో అర్ధం కాలేదు. ఇప్పుడు విచారణలో సమీర్ ఆ గొంతు మరో ఉగ్రవాది హింజిలా జిహాదిది అని చెప్పాడు. దీంతో ఈ హంజిలా జిహాదీ ఎవరు దానిపై పోలీసులు విచారణ జరిపారు. ఈ హంజిలా జిహాది అనే వ్యక్తి పుల్వామాకే చెందిన ఒక కార్పెంటర్ అని పోలీసుల విచారణలో తేలింది. హంజిలా ఎక్కడున్నాడని పోలీసులు సాగించిన వేటలో... ఆర్టికల్ 370రద్దు సందర్భంగా అతడని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తేలింది. దీంతో పోలిసు కస్టడీలో ఉన్న హంజిలాను తీసుకువచ్చి ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇంతలో ఉగ్రవాది ఇద్రీస్ ఖాన్ ఐఫోన్లో ఉన్న ఫోటోలు కూడా ఎన్ఐఏ అధికారుల చేతికి అందాయి. ఇద్రీస్ఖాన్తో పాటు హంజిలా కూడా ఫోటోల్లో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్రీస్ఖాన్ గురించి అడిగితే హంజిలా అతను ఇద్రీస్ కాదని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉమర్ ఫారూఖ్ అని చెప్పాడు. ఈ మొత్తం దాడిలో ఉమర్ ఫారూఖ్ కీలకం అని.. ఉమర్ ఫారూఖ్ సాక్ష్యాత్తూ పాకిస్థాన్లో ఉన్న మసూద్ అజ్హర్ అన్న కొడుకు అని హంజిలా చెప్పాడు. తానే స్వయంగా సూసైడ్ బాంబర్ను కారులో పుల్వామా హైవే వరకు తీసుకు వెళ్లానని... బాంబు పేలుతున్న సమయంలో అక్కడే ఉన్నానని హంజిలా కథ మొత్తం చెప్పాడు. పుల్వామా బాంబు దాడికోసం పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాదాపు రెండేళ్లుగా రెక్కి నిర్వహించింది. దీనికోసం పాకిస్థాన్ నుంచి మౌలానా మసూద్ అజ్హర్ అన్న కొడుకు ఉస్మాన్ హైదర్ 2017లో కాశ్మీర్లోకి చొరబడ్డాడు. అయితే అతను ఆపరేషన్ పూర్తి చేయకముందే భద్రతా దళాల ఎన్కౌంటర్లోచనిపోయాడు. దీంతో మళ్లీ అతని సోదరుడు ఉమర్ ఫారూఖ్ను ఇద్రీస్ భాయ్ అనే పేరుపెట్టి పాకిస్థాన్ నుంచి కాశ్మీర్లోకి చొప్పించారు. ఆప్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన ఉమర్ ఫారూఖ్... ఐఈడీలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. తాలిబాన్ క్యాంపుల్లో చాలాకాలం పాటు అమెరికా సైనికులతో పోరాడని ఉమర్ ఫారూఖ్... ఇండియాలో పెద్ద పేలుడు చేసే ఉద్దేశంతో కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ఎంటరయ్యాడు. వచ్చే సమయంలో తనతో పాటు పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తెచ్చుకున్నాడు. 50లక్షల రూపాయలు హవాలాద్వారా ఈ ఆపరేషన్కు ఉపయోగించినట్లు సమచారం. ఇండియాకు వచ్చిన ఇద్రీస్ పుల్వామాలోని బిలాల్ అహ్మద్ కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఆదిల్ దార్ను పూర్తిగా సూసైడ్ బాంబర్గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆదిల్ దార్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు... అతడికి మతమౌఢ్యం ఎక్కించడంతో పాటు ఇండియాపై విషం నింపాడు. ఇక పేలుడుకు కావాల్సిన కారును సజ్జాద్ అహ్మద్ భట్ ద్వారా కొనుగోలు చేయించాడు. ఇక తనతో పాటు తెచ్చుకున్న ఆర్డీఎక్స్కు తోడుగా కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు, అల్యూమినియం పౌడర్ సైతం అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. అవేజ్ భోలా అనే యువకుడి అమెజాన్ అకౌంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇక కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూతురు ఇన్షాజాన్తో ఉమర్ ఫారూఖ్ ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా తరువాత అతని ఫోన్లో లభ్యమయ్యాయి. ఇక పేలుడుకు నెల రోజుల ముందే బిలాల్ అహ్మద్ కూచే ఇంట్లో ఆదిల్ దార్తో దాడి తరువాత విడుదల చేసే వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఆదిల్ దార్ సరిగా మాట్లాడలేకపోవడంతో... హంజిలా జివాదీతో డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియోను పాకిస్థాన్కు పంపి...అక్కడ ఉన్న నాయకులతో దానిని ఓకే చేయించారు. ముందుగా ఫిబ్రవరి 5వ తేదీనే దాడి చేయాలనుకున్నా... ఆరోజు మంచు కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బాంబులతో నింపిన కారును దాదాపు పదిరోజుల పాటు కారు కొనుగోలు చేసిన సజ్జాద్ భట్ ఇంటిదగ్గరే ఉంచారు. ఇక చివరిగా 14వ తేదీన పోలీసుల మూవ్మెంట్ చూసి పుల్వామా హైవేపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సూసైడ్ బ్లాస్ట్ చేశారు. కేవలం గంట ముందు పాకిస్థాన్లో ఉన్న మసూద్ అజ్హర్ సోదరుడు తన చిన్నాన్న అమ్మార్ అల్వీకి ఫోన్ చేసి దాడి చేయాలన్న విషయంపై ఉమర్ ఫారూఖ్ పర్మిషన్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఆదిల్ దార్ పారిపోతాడనే భయంతో...అక్కడికి హంజిలా జిహాదీని తోడుగా పంపించాడు. బయట ఉండి హంజిలా జిహాది బాంబు పేలే వరకు మొత్తం ఆపరేషన్ మానిటర్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హంజిలా జిహాది... ఈ విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్
కాశ్మీర్లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ పాకిస్తాన్లోని తమ వ్యాపార డీలర్లు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల వల్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాము భారత దేశానికి క్షమాపణలు తెలియజేస్తున్నాము అని డొమినోస్, ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా పేర్కొన్నాయి. ఒక సోషల్ మీడియా పోస్టులో.. "మేము ఈ దేశంలో 25 సంవత్సరాలకు ఉన్నాము. ఈ దేశ ప్రజలు, సంస్కృతి, జాతీయతా స్ఫూర్తిపట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. ఈ దేశ ఔన్నత్యాన్ని మేము గౌరవిస్తున్నాము. దేశం వెలుపల నుంచి డొమినోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచురితమైన అవాంఛనీయ సోషల్ మీడియా పోస్టులకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఒక బ్రాండ్గా మేము భారతదేశాన్ని గౌరవిస్తాము, ఈ దేశ వినియోగదారులకు & సమాజానికి వినయ, విధేయతలతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము" అని డొమినోస్ కంపెనీ తెలిపింది. This is the country we have called our home for the last 25 years, and we stand here to protect its legacy forever. We respect and honour everything the country has to offer. pic.twitter.com/8II6XuLxb0 — dominos_india (@dominos_india) February 8, 2022 అదేవిధంగా, హోండా కార్ ఇండియా ట్విటర్ హ్యాండిల్స్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో "హోండా పనిచేసే ప్రతి దేశంలో అక్కడి చట్టాల, నిబందనలను అనుసరిస్తాము. ఆ దేశ ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటాము. ఈ విషయంలో దేశ ప్రజలకు ఏదైనా బాధ కలిగితే మేము చింతిస్తున్నాము. తమ కంపెనీ విధానంలో భాగంగా, హోండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, జాతి, రాజకీయాలు, మతం & సామాజిక సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదు" అని తెలిపింది. ఈ కంపెనీలతో పాటు ఇతర ప్రపంచ స్థాయి సంస్థలు హ్యుందాయ్, సుజుకి, టయోటా, కెఎఫ్సి, పిజ్జా హట్ వంటివి కూడా దేశానికి క్షమాపణలు చెప్పాయి. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీలన్ని కాశ్మీర్లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆ కంపెనీ ఉత్పత్తులను అన్నీ మన దేశంలో నిషేదించాలని ప్రజలు కేంద్రాన్ని కోరారు. (చదవండి: ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) -
హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు
హ్యుందాయ్ మోటార్స్ కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. అయితే, ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ట్విటర్ వినియోగదారులు ఈ పోస్టుపై తన వైఖరిని వివరించాలని కోరుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను కోరుతూ భారీ సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఇంకా, చాలా మంది భారతీయ వినియోగదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరుతున్నారు. Hyundai in Pakistan is asking for freedom of Kashmir. Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu — Anshul Saxena (@AskAnshul) February 6, 2022 Hello @Hyundai_Global ,How come your official handle in Pak is supporting terror state Pakistan’s propaganda on Kashmir ?@HyundaiIndia If you can’t respect sovereignty of my nation,Pack your bags and leave my country ! Friends,Keep retweeting till @Hyundai_Global apologise ! pic.twitter.com/zbtth6NklS — Major Surendra Poonia (@MajorPoonia) February 6, 2022 Why do brands need to meddle in Politics? pic.twitter.com/j5xPqWvLCN — Gabbbar (@GabbbarSingh) February 6, 2022 @Hyundai @HyundaiIndia time to change your name pic.twitter.com/okSDJSUX24 — Professor Disrespect (@Deludedindian) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 వినియోగదారులు ఆ ట్వీట్లను చూడకుండా సంస్థ పరిమితం చేసింది. ఈ సమస్యపై నేరుగా ప్రస్తావించకుండా హెచ్ఎంఐఎల్ తన ప్రకటనలో"హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు 25 సంవత్సరాలకు పైగా భారతీయ మార్కెట్ లో ఉంది. జాతీయవాదాన్ని గౌరవించే మా బలమైన నైతిక తత్వానికి మేము దృఢంగా నిలబడతాము. హ్యుందాయ్ మోటార్ ఇండియాను కలిపే అవాంఛనీయ సోషల్ మీడియా పోస్ట్ ఈ గొప్ప దేశానికి మా అసమాన నిబద్ధత, సేవను దెబ్బతీస్తోంది. హ్యుందాయ్ బ్రాండ్'కు భారతదేశం రెండవ నిలయం, సున్నితమైన విషయాలలో ఎటువంటి ఉపేక్ష వహించేది లేదు. అటువంటి అభిప్రాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం పట్ల మా నిబద్ధతలో భాగంగా, దేశంతో పాటు దాని పౌరుల మెరుగుదల దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాము" అని ఆ ప్రకటనలో తెలిపింది. -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..
కశ్మీర్: బీఎస్ఎఫ్ జవాన్ల బృందం బిహు పండుగను పురష్కరించుకుని ఓ జానపద పాటకు నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో జవాన్లు డ్యాన్స్ చేస్తున్న తీరు వారి అచంచలమైన స్ఫూర్తిని, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చెక్కుచెదరని విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరిలో.. అస్సాం, ఈశాన్య భారతదేశంలో జరుపుకునే పంట పండుగ అయిన బిహును పురష్కరించుకుని సైనికదళాలు నృత్యం చేయడం మన గమనించవచ్చు. కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్లో చిత్రీకరించిన ఈ వీడియోలో.. ఆర్మీ జవాన్లు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉత్సాహంగా నృత్యం చేయడం చూడవచ్చు. చదవండి: (తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా) 'పర్వతాలు, మంచు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, 24 గంటలపాటు తీవ్ర ఒత్తిడి, ఎల్ఓసీ, ఇళ్లకు దూరంగా ఉండటం ఇవి ఏవీ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయలేదు.. పండుగ జరుపుకోవడాన్ని అడ్డుకోలేదు' అంటూ క్యాప్షన్ ఇస్తూ 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' వీడియో పోస్ట్ చేసింది. Mountains and mountains of snow, blinding blizzards, freezing temperatures, stress of 24 hours vigil #LoC , away from homes; this all didn’t deter BSF troops to dance few steps & celebrate #Bihu at FDL in #Keran Sector #ForwardArea .@PMOIndia @HMOIndia @BSF_India pic.twitter.com/65c1viqskU — BSF Kashmir (@BSF_Kashmir) January 16, 2022 -
కశ్మీర్లో మీసం తిప్పుతున్న కడక్నాథ్ కోళ్లు.. కారణం ఎంఎస్ ధోని
మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అడవుల్లో పెరిగే కడక్నాథ్ కోళ్లు ఇప్పుడు కశ్మీర్లో సందడి చేస్తున్నాయి. అక్కడి యువతకి సరికొత్త ఉపాధిని చూపిస్తున్నాయి. ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కారణంగా ఈ కోళ్లు ఝార్ఖండ్ మీదుగా కశ్మీర్ చేరుకున్నాయి. తీవ్రవాద ప్రాబల్యంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న కశ్మీర్ యువతలో కొందరికి ధోని ఆదర్శంగా నిలిచాడు. తీవ్రవాదం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువత స్టార్టప్ల వైపు అడుగులు వేసేందుకు పరోక్షంగా సాయం అందించాడు. మైదానం బయట కూడా టార్జన్ వికెట్ కీపర్, డ్యాషింగ్ బ్యాట్స్మన్, కెప్టెన్ కూల్గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఎంతోమంది క్రికెటర్లకు ఇన్సిపిరేషన్గా నిలిచారు. దీంతో ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకునేందుకు కంపెనీలు పోటీ పడ్డాయి. ఎండార్స్మెంట్లలో సచిన్కి ధీటుగా ఎదిగాడు. ధోని ఏదైనా చెబితే చాలు ఆచరించేందుకు బోలెడు మంది సిద్ధంగా ఉండేవాళ్లు, అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ధోని రిటైర్ అయ్యాక మైదానంలో అతని మెరుపు ఇన్సింగ్సులు చాలా వరకు తగ్గినా.. భారత యువతలో అతను నింపుతున్న స్ఫూర్తి అలాగే కొనసాగుతోంది. పౌల్ట్రీ వ్యాపారంలో ధోని క్రికెట్ కెరీర్ లాస్ట్ ఫేజ్లోకి ఎంటర్ కావడానికి ముందే ధోని రాంచీలో యాభై ఎకరాలతో ఫార్మ్ హౌజ్ నిర్మించాడు. ఇందులో పదెకరాల స్థలంలో ఆర్గనిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ.. ఆ ఉత్పత్తులను దుబాయ్కి ఎగుమతి చేస్తున్నాడు. ఈ సాగుకంటే ముందు ఈ రంగంలో రాణించవచ్చనే నమ్మకం ధోనికి కల్పించినవి కడక్నాథ్ కోళ్లు. మధ్యప్రదేశ్ , చత్తీస్ఘడ్ ప్రాంతంలో పెరిగే కఢక్నాథ్ కోళ్లతో గతేడాది ధోని పౌల్ట్రీ రంగంలోకి అడుగు పెట్టారు. రెండు వేల కోళ్లతో ఏర్పాటు చేసిన ఈ పౌల్ట్రీ ఫార్మ్ దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. కడక్నాథ్ స్టార్టప్ ధోని నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు కశ్మీర్ యువకులు తొలిసారిగా సుందర లోయల్లో కడక్నాథ్ కోళ్ల ఫారమ్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన నుమైర్ రషీద్, మమూన్ఖాన్ అనే ఇద్దరు యువకులు ది రాయల్ ఫెదర్స్ పేరుతో స్టార్టప్గా కడక్నాథ్ కోళ్ల ఫారాన్ని శ్రీనగర్ సమీపంలో ఏర్పాటు చేశారు. కశ్మీర్ యువకులు ప్రారంభించిన ఈ రాయల్ ఫెదర్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో కశ్మీర్ యువకుల కడక్నాథ్ కోళ్ల ఫార్మ్ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో వీళ్లకి ప్రోత్సాహం అందించేందుకు దేశం నలుమూలల నుంచి అనేక మంది ముందుకు వస్తున్నారు. Two engineering students has started “Kadaknath” chicken poultry farm in #Kashmir. They have started this joint venture to create employment in the valley. Kadaknath is considered the most expensive chicken breed in world because of its protein value.#Kashmirilivesmatter #Jobs pic.twitter.com/djEASTQn9V — yasinmalik786 (@yasinmalik7861) January 13, 2022 కశ్మీర్లో మార్పు ఇంజనీరింగ్ చేసిన ఇద్దరు యువకులు కోళ్ల ఫార్మ్ ఏర్పాటు చేయడం మిగిలిన దేశానికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ కశ్మీర్కి సంబంధించినంత వరకు ఇది కీలకమైన విషయం. ఎందుకంటే 80వ దశకం చివర్లో కశ్మీర్లో చెలరేగిన హింసతో పచ్చని లోయలో నెత్తురు ఏరులై పారుతోంది. అక్కడి యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా ఆశించిన మేరకు సక్సెక్ కాలేకపోయింది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇండియన్ ఐకాన్స్ని స్ఫూర్తిగా తీసుకుని పైకి ఎదిగేందుకు కశ్మీర్ యువత ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎంతో సానుకూలమైన అంశం. కశ్మీర్ యువతలో స్ఫూర్తి నింపుతున్న వారిలో ధోని లాంటి లెజెండ్స్ ముందు వరుసలో ఉంటున్నారు. అందుకే ఏఎన్ఐ మొదలు అనేక జాతీయ మీడియా సంస్థలు వీరిపై ప్రత్యేక కథనాలు వండివారుస్తున్నాయి. సోషల్ మీడియాలో వీళ్ల గురించి వెతుకులాట మొదలైంది. ఇదే బాటలో కశ్మీర యువత ఉపాధి మీద దృష్టి సారించి పైకి ఎదగాలని దేశం కోరుకుంటోంది. చదవండి: ఊపిరితిత్తుల సమస్య.. నోట్లో పైపు, చిన్నారి జోషి కోసం ‘అవతార్’ సాయం -
వయసులో చిన్నది.. బాధ్యత పెద్దదే! వైరల్ అవుతున్న చిట్టితల్లి
The girl is seen in the video Bad Condition Of Kashmir Roads: ఇంతవరకు మనం చూసే వైరల్ వీడియోలు కొన్ని సందేశాత్మకంగానూ, ప్రజలను ఆలోచింప చేసే విధంగానూ ఉన్నాయి. అయితే కొన్ని వైరల్ వీడియోలైతే ఆనంద్ మహీంద్రలాంటి ప్రముఖులను సైతం కదిలించాయి. అచ్చం అలాంటి సందేశాత్మకమైన ఆలోచింప చేసే క్యూట్ వైరల్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఈ వైరల్ వీడియోలో ఒక చిన్నపాప రిపోర్టర్లా కశ్మీర్లో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు ఏవిధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. పైగా ఆ వీడియోలో ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉండటం వల్ల తన ఇంటికి అతిధులు కూడా రాలేకపోతున్నారని చెబుతోంది. అంతేకాదు రిపొర్టర్ మాదిరి చెప్పి చివరిలో కెమెరామెన్ అమ్మతో అని ముగిస్తుంది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసింది. దీంతో రోడ్లు బురదగా మారి అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ మేరకు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI — Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022 (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) (చదవండి: అఫ్ఘనిస్తాన్లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్
-
IFA Shield: రన్నరప్ శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ
కోల్కతా: భారత్లో రెండో అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఐఎఫ్ఏ షీల్డ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎస్డీఎఫ్సీ) జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఈ టోర్నీలో తొలిసారి పాల్గొన్న శ్రీనిధి డెక్కన్ జట్టు 1–2 గోల్స్తో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టు చేతిలో ఓడింది. శ్రీనిధి డెక్కన్ క్లబ్ గోల్కీపర్ సీకే ఉబైద్కు టోర్నీ ‘ఉత్తమ గోల్కీపర్’ పురస్కారం లభించింది. చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి -
గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్తక్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. -
గంభీర్కు మళ్లీ బెదిరింపులు.. వారంలో మూడోసారి..
సాక్షి, ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావటం కొనసాగుతున్నాయి. మరోసారి ఆదివారం కూడా ఆయనకు బెదిరింపు ఈ మెయిల్స్ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ శ్వేతా(డీసీపీ) ఏం చేయలేరు. పోలీసుల్లో కూడా మా గూఢచారులు ఉన్నారు’ అని ఉగ్రవాద సంస్థ ఐసీస్ కశ్మీర్ పేరుతో ఉన్న ఈ-మెయిల్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో బెదిరింపులు రావటం ఇది మూడోసారి. చదవండి: అఖిలపక్షం భేటీ: ‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’ దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సైబర్ సెల్కు చెందిన స్పెషల్ టీం బెందిరింపు మెయిల్స్పై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. 23 నవంబర్ రోజు కూడా మొదటిసారి బెందింపులు వచ్చాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నమని డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. ఆయన నివాసం వద్ద పోలీసు భద్రత పెంచామని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: గౌతం గంభీర్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. ఐఎస్ఐఎస్ కశ్మీర్ ఉగ్రవాదుల నుంచి తనకు ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కాగా గంభీర్ ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: ఫ్రాన్స్ అమ్మాయితో బిహార్ కుర్రాడి ప్రేమ.. కట్ చేస్తే ఒక్కటైన జంట -
హైదర్పురా కాల్పులపై న్యాయ విచారణ
శ్రీనగర్: కశ్మీర్లోని హైదర్పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఖుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. హైదర్పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక పాక్ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్ అమీర్ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్ అల్తాఫ్ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్ గుల్ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్ భట్, గుల్ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
బంగారంలాంటి బాక్సర్.. తజముల్
అది బుధవారం..టీవీలో కిక్బాక్సింగ్ వస్తోంది. ‘ఏంటబ్బా! ఇది!’ అని ఆశ్చర్యంగా చూసింది ఎల్కేజీ చదువుతోన్న చిన్నారి. కాసేపు చూశాక ‘‘అక్కా! ఏంటిది?’’ అని అడిగింది. ‘‘ఇదా.. కిక్బాక్సింగ్’’ అంది అక్క. ‘‘అవునా ఇది చాలా బావుంది. నేనుకూడా ఇలా కిక్ బాక్సింగ్ చేస్తాను’’ అంది. అది విన్న తోబుట్టువులంతా ఏదో చిన్న పిల్ల అంటోందిలే అనుకున్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ మాట చాలా సీరియస్గానే అంది. కిక్బాక్సింగ్ మీద ఆసక్తి ఏర్పడడంతో ప్రతి బుధ, శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కిక్బాక్సింగ్ను క్రమం తప్పకుండా చూసేది. అవి చూస్తూ తను కూడా ఎలాగైనా అలా టీవీలో కనిపించేంతగా కిక్బాక్సింగ్లో రాణించాలనుకుంది. కొన్ని రోజుల గడిచాక ఉండబట్టలేక ‘‘అమ్మా! నేను కిక్బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అని అమ్మను అడిగింది. ఆ చిన్నారి ఆతృత గమనించిన తల్లి ‘‘అసలు నీకు కిక్బాక్సింగ్ గురించి ఏం తెలుసు? అందులో దెబ్బలు తగులుతాయి’’ అని చెప్పింది. ‘‘లేదు, నేను నొప్పిని ఓర్చుకుని ఎలాగైనా బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అంది. అమ్మలానే నాన్న కూడా ‘‘వద్దు’’ అన్నారు కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా కిక్బాక్సింగ్ నేర్చుకునేందుకు అమ్మానాన్నలని ఒప్పించింది తజముల్ ఇస్లాం. కశ్మీర్కు చెందిన ఈ చిన్నారి అలా పట్టుదలతో కిక్బాక్సింగ్ నేర్చుకోవడమేగాక, ప్రపంచ కిక్బాక్సింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన తజముల్ తాజాగా రెండోసారి ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్–21 అండర్ –14 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి భారతీయులు గర్వపడేలా చేయడమేగాక, ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బందిపొర జిల్లాలోని తారకపొర అనే కుగ్రామంలోన ఓ నిరుపేద కుటుంబంలో తజముల్ ఇస్లాం జన్మించింది. గులాం మహ్మద్ ఐదుగురు సంతానంలో తజముల్ నంబర్ మూడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తండ్రి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. తన చిన్నారి ఆసక్తిని కాదనలేదు మహ్మద్. తజముల్ కోరికను నెరవేర్చేందుకు కిక్బాక్సింగ్లో కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. మొదట్లో సాధన కష్టంగా ఉన్నప్పటికీ, రోజురోజుకీ దృఢంగా తయారై ఉదయం, సాయంత్రం మొత్తం మీద ఐదుగంటలపాటు శ్రమించి, కిక్బాక్సింగ్ను అవపోసన పట్టింది తజముల్. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీ పడి చాంపియన్గా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కిక్బాక్సర్గా ఎదిగింది. తొలి గోల్డ్మెడల్.. 2016లో తజముల్ ప్రపంచస్థాయి కిక్బాక్సింగ్ చాంపియన్షిప్కు ఎంపికైంది. ఇటలీలో జరిగే ఈ పోటీలకు వెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో కశ్మీర్లో స్పాన్సర్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అదే సమయంలో ఆర్మీస్కూల్లో చదువుతోన్న తజముల్ మాష్టారు ఒకరు..విషయం తెలిసి తను ఇటలీ వెళ్లి పాల్గొనడానికి కావాల్సిన ఖర్చును పెట్టుకుంటానని ముందుకొచ్చారు. అంతేగాక ఆర్మీఫెడరేషన్ మరికొంత సాయం చేయడంతో అండర్–9 చాంపియన్షిప్లో పాల్గొని స్వర్ణపతకం సాధించింది. అప్పటిదాక సబ్జూనియర్ స్థాయిలో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ భారత్కు ఒక్కటీ లేదు. తొలిగోల్డ్ మెడల్ సాధించిన భారతీయురాలుగా తజముల్ నిలిచింది. స్పోర్ట్స్ అకాడమీ.. ‘‘నువ్వు చిన్నాచితకా మెడల్స్ సాధించడం కాదు. ఇటువంటి మెడల్స్ను నేను షాపులో కూడా కొనుక్కొస్తాను. నువ్వు గోల్డ్ మెడల్ తీసురావాలి’’ అంటూ ఆమెలో పట్టుదలను రేకెత్తించాడు తండ్రి. నాన్న మాట నిలబెట్టడంతో తజముల్ ఇటలీ నుంచి ఇండియా వచ్చేటప్పటికీ తజముల్ పేరుమీద స్పోర్ట్స్ అకాడమీకి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లను తజముల్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ అకాడమీలో ఐదు నుంచి ఆరు ఏళ్ల వయసు పిల్లలు దాదాపు వందమంది దాక శిక్షణ తీసుకుంటున్నారు. బందిపొరాలో అమ్మాయిలకు క్రీడలపై శిక్షణ ఇచ్చే సంస్థలు పెద్దగా లేవు. తజముల్కు గోల్డ్ మెడల్ వచ్చాక, అమ్మాయిలకు ప్రత్యేక స్పోర్ట్స్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ అవుతా.. ప్రస్తుతం ఆర్మీ గుడ్విల్ స్కూల్లో ఏడోతరగతి చదువుతోన్న 13 ఏళ్ల తజముల్ భవిష్యత్లో ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ సాధించడమే లక్ష్యమంటోంది. ‘‘వార్మప్స్, కిక్స్, పంచ్ల సాధన ద్వారా రోజురోజుకి మెరుగవడమే కాదు.. గోల్డ్మెడల్స్ కూడా సాధించగలిగాను. భవిష్యత్లో మంచి ఎముకల సర్జన్ని అవుతాను. ఎందుకంటే కిక్ బాక్సింగ్లో చాలా మంది ఎముకలు విరగ్గొడుతుంటాను కాబట్టి వాళ్లందరికీ శస్త్రచికిత్స చేసి సరిచేస్తాను’’ అని చెబుతోంది తజముల్ నవ్వుతూ. తండ్రితో తజముల్ -
బహు సుందరం బాబేఝరి అడవులు.. ఎక్కడో తెలుసా..!
కెరమెరి(ఆసిపాబాద్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసీ గ్రామమైన జాబేఝరి అడవులు ఊహల్లోకి విహరింపజేస్తున్నాయి. ఎవరూ ఊహించని, చూడని బాబేఝరి అడవులు మరో కశ్మీర్ను తలపిస్తున్నాయి. బాబేఝరి, టోకెన్మోవాడ్, పిట్టగూడ గ్రామాలకు ఆనుకొని వందల ఎకరాల విస్థీర్ణంలో ఉన్న ఈ అడవులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగుబురుగా పొదలు, ఆ పొదల్ల మధ్య పచ్చపచ్చని పొలాలు, అందమైన లోయలు ఎంతో అహ్లద భరితంగా కనిపిస్తున్నాయి. ఓ సారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించక మానదు. అయితే వర్షాకాలంలో ప్రతి రోజు చల్లటి వాతావరణం ఉండేది ఇక్కడ. ప్రస్తుతానికి వర్షాకాలం ముగిసినా తేలిక పాటి చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. దీంతో ప్రకతి పచ్చదనాన్ని పరచినట్లు ఆ దృశ్యాలను చూస్తే మైమరచి పోతాం. అలాగే హట్టి పై భాగం నుంచి ములుపులు తిరిగిన రోడ్డు, పచ్చపచ్చని పొలాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. -
కశ్మీర్లో జేఎస్డబ్ల్యూ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజాగా కశ్మీర్లోని పుల్వామా జిల్లా లస్సీపురాలో కలర్ కోటెడ్ ఉక్కు తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల టన్నులుగా ఉండనుంది. గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ స్టీల్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూప్ వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్లోని స్థానిక మార్కెట్లో విక్రయాల కోసం స్టీల్ శాండ్విచ్ ప్యానెల్స్, స్టీల్ డోర్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. స్థల కేటాయింపు పత్రాలను హోం మంత్రి అమిత్ షా సోమవారం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్కు అందిం చారు. స్థానిక వ్యాపారాలు, సమాజానికి ఈ ప్లాంటు ప్రయోజనం చేకూర్చగలదని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని జిందాల్ తెలిపారు. -
కశ్మీర్లో ఎందుకీ అభద్రత?
శ్రీనగర్: ఉగ్రవాదులతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లు, ముష్కరుల నుంచి పెరిగిపోతున్న ముప్పు, సాధారణ పౌరుల్ని కాల్చి చంపడం, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో కశ్మీర్లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కశ్మీర్లో భద్రతపై రాజ్భవన్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసు, ఇతర భద్రతా సంస్థల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బలగాలు అన్ని వైపులా మోహరించిన ఉన్నప్పటికీ ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని షా అధికారుల్ని నిలదీశారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. మైనార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రదాడుల్లో ఐదుగురు బీహార్ కూలీలు సహా మొత్తం 11 మంది సాధారణ పౌరులు కేవలం అక్టోబర్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అమిత్ షా కశ్మీర్కు రావడం ఇదే తొలిసారి. మంచు, భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆదివారం జమ్మూలో జరగాల్సిన ర్యాలీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇన్స్పెక్టర్ కుటుంబానికి షా పరామర్శ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా వారి ఇంటికి వెళ్లారు. అహ్మద్ భార్య ఫాతిమా అక్తర్కు కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ని అమిత్ షా ఇచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్లో నివాసం ఉండే అహ్మద్ను జూన్ 22న ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రాష్ట్రహోదా పునరుద్ధరిస్తాం జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. యూత్ క్లబ్ సభ్యులతో ఆయన ముచ్చటిస్తూ..కశ్మీర్ యువతకి స్నేహహస్తం అందించడానికే తాను వచ్చానని చెప్పారు. ‘ఆ భగవంతుడు ఈ లోయని ఒక స్వర్గంలా మార్చాడు. ప్రకృతి సౌందర్యంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతోంది. మోదీ ఈ లోయ అభివృద్ధిని, శాంతి సుస్థిరతల్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం కశ్మీర్ యువత సహకరించాలి. వారి సహకారం కోసమే ఇక్కడికి వచ్చాను’’ అని అమిత్ షా వెల్లడించారు. కేంద్రం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఐఎస్కేపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన లక్షిత దాడుల వంటివే మరికొన్ని చేపడతామంటూ జమ్మూకశ్మీర్ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) హెచ్చరికలు పంపింది. తన అధికార ఆన్లైన్ పత్రిక ‘వాయిస్ ఆఫ్ హింద్’లో సోమవారం ఒక ఫొటోను ప్రచురించింది. చిరు వ్యాపారిని వెనుక నుంచి తుపాకీతో కాలుస్తున్నట్లున్న ఆ ఫొటోకు ‘మేం వస్తున్నాం(వుయ్ ఆర్ కమింగ్)’అంటూ శీర్షిక పెట్టింది. త్రిశూలంతో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోను కూడా ప్రచురించింది. తమ తదుపరి లక్ష్యం వారేనంటూ పరోక్షంగా హెచ్చరించింది. పండుగ సీజన్లో పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులను ఇటీవల భద్రతా బలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐఎస్కేపీ స్లీపర్ సెల్స్ కశ్మీర్ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. -
ఎంపిక చేసిన హత్యలు.. సొంతనేలకు వెళ్లకూడదా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ప్రభుత్వ వైఫల్యం హిందువు, సిక్కు, డోగ్రాలు అనాగరికంగా హత్యకు గురయ్యారు. కశ్మీర్లో మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది పూర్తిగా భద్రత, నిఘా వర్గాల వైఫల్యం. కశ్మీరీ పండితులు తిరిగి రావాలని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు కోరుకోవడం లేదు. – ఆదిత్యా రాజ్ కౌల్, జర్నలిస్ట్ ఎంపిక చేసిన హత్యలు ఇద్దరు టీచర్లు– ఒక సిక్కు, ఒక హిందూ– శ్రీనగర్లో ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో చనిపోయారు. మిగిలిన టీచర్ల నుంచి వాళ్లను వేరు చేసి (ఐడీ కార్డులు పరిశీలించి), కాల్చి చంపారు. కశ్మీరీ పండిత్ ఎం.ఎల్. బింద్రూ, బిహార్కు చెందిన హిందూ దళిత వర్తకుడిని లక్ష్యం చేసుకుని చంపినదానికి ఇవి కొనసాగింపు. కానీ ఉదారవాదులు, వామపక్షీయులు మాత్రం ఏ ఖండనలూ చేయకుండా నోళ్లను కుట్టేసుకున్నారు. – కంచన్ గుప్తా, ప్రభుత్వ సలహాదారు సొంతనేలకు వెళ్లకూడదా? ఇవ్వాళ మా నాన్నను కలిశాను. ఉన్న ఆ ఐదు నిమిషాల పాటు ఆయన చేసిందల్లా నేను అక్కడికి (కల్లోల పరిస్థితుల్లో కశ్మీర్) వెళ్లినందుకు మళ్లీ మళ్లీ నామీద అరవడమే! తమ మాతృభూమిని సందర్శించినందుకు ఏ తండ్రికీ ఇలా తిట్టే పరిస్థితి రాకూడదు; ఏ పిల్లలకూ ఇలాంటి మాటలు వినే దౌర్భాగ్యం ఉండకూడదు. – ఖుష్బూ మట్టూ, సంపాదకురాలు హత్యలు ఆపండి ఇప్పటికే ధ్వంసమైన సుందర కశ్మీరంలో ఇంకా ఏమైనా మిగిలివుంటే, ముస్లింలు కానివారిని లక్ష్యం చేసుకుని చేస్తున్న ఈ హత్యలు దాన్ని మరింత ముక్కలుగా విభజిస్తాయి. హృదయం భారమైపోయింది. – సబా నక్వీ, రచయిత్రి విస్తరించాలి క్రైస్తవంలోకి మారాక కూడా దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారంటే, దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు విస్తరించాలన్నదానికి ఈ ఒక్క కారణం సరిపోతుంది. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు అన్నదాన్ని బట్టి అవి ఉండకూడదు. – ఉధవ్ నైగ్, జర్నలిస్ట్ కొందరి మీదేనా దయ? ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేడీ ఘటనలో చనిపోయిన కొందరికి మాత్రమే పరిహారం ఇవ్వడం మూర్ఖత్వం. నిజంగా (కాంగ్రెస్కు) దాతృత్వ గుణం ఉంటే, దాన్ని వివక్ష లేకుండా చూపాలి. లేదంటే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను నిజం చేసినవాళ్లవుతారు. దయ చూపడంలో భేదభావం కూడదు. – ఎన్.సి. ఆస్థానా, మాజీ డీజీపీ కష్టానికి తగని ఫలితం బాగా చల్లగా ఉన్న రోజున కుర్సియాంగ్(పశ్చిమ బెంగాల్) తేయాకు తోటల్లో ఆకులను తెంపుతూ కనబడ్డారు కార్మికులు. డార్జిలింగ్ టీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధరలకు అమ్ముడుపోతుంది; కానీ కార్మికులకు మాత్రం ముట్టేది చిల్లిగవ్వలు. – ఉమ్మే హెచ్. ఫైజల్, వైద్యురాలు -
లద్దాఖ్లో భూకంపం.. ఉలిక్కి పడిన స్థానికులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. లద్దాఖ్లోని లేహ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12.30 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్టు చెప్పారు. ఇళ్లనుంచి జనం పరుగులు తీశారని, భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. దాయాది దేశం పాకిస్తాన్లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో భూకంప తీవ్రతగా అధికంగా ఉండటంతో వందలాది పలు ఇల్లు, భవనాలు కూలిపోయాయి. (చదవండి: మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై? ) -
కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన: పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్లో భారత్ యంత్రాంగం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి, మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారి, జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసఫ్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్లో హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను ఐక్యరాజ్యసమితికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 131 పేజీల ఈ డాక్యుమెంట్లో113 ఉదాహరణలు న్నాయన్నారు. ఉల్లంఘనలకు కారణమైన అధికా రులపై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని వారు కోరారు. కాగా, పాక్ చేసిన ఆరోపణలను భారత్ పలుమార్లు ఖండించింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. -
కశ్మీర్ విషయం లో మాటమార్చిన తాలిబన్లు
-
కశ్మీర్ ముస్లింల హక్కులపై మాట్లాడుతాం!
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఒకపక్క భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమంటూనే కశ్మీర్పై తాలిబన్లు కొత్త ప్రేలాపనలు మొదలుబెట్టారు. కశ్మీర్ సహా ఎక్కడ నివసించే ముస్లింల హక్కుల కోసమైనా మాట్లాడే హక్కు తమకుందని, అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని తాలిబన్లు వింత భాష్యాలు చెప్పారు. అఫ్గాన్ తిరిగి తాలిబన్ పాలనలోకి పోవడంతో భారత్కు ఉగ్రముప్పు పెరిగిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సహా ప్రపంచంలో ఎక్కడ నివసించే ముస్లింల కోసమైనా మాట్లాడే హక్కు సాటి ముస్లింలుగా తమకుందన్నారు. ఇటీవలే ఖతార్లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్గా్గన్ గడ్డను ఉగ్రనిలయంగా మార్చమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చేసిన ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే భారత వ్యతిరేక హక్కానీ నెట్వర్క్పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని సుహైల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం! ఇన్నాళ్లూ తమకు ఎదురు నిలిచిన పంజ్ షీర్ లోయను సైతం స్వాధీనం చేసుకున్నామని, తద్వారా మొత్తం అఫ్గానిస్తాన్పై పూర్తి పట్టు సాధించామని తాలిబన్ కమాండర్ ఒకరు శుక్రవారం ప్రకటించారు. పంజ్ షీర్లోని తిరుగుబాటుదారులపై విజయం సాధించామని చెప్పారు. కీలకమైన పంజ్ షీర్ తమ వశం కావడంతో రాజధాని కాబూల్లో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. పంజ్ షీర్ను ఆక్రమించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. పునర్నిర్మాణానికి చైనా సాయం చైనా తమకు అత్యంత కీలక భాగస్వామి అని, అఫ్గాన్ పునరి్నర్మాణానికి చైనా సాయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్లోని ఖనిజ నిక్షేపాలు వెలికితీసి దేశానికి ఆర్థిక ఆసరా అందించేందుకు చైనా సహాయం అందిస్తుందన్నారు. చైనా ప్రతిపాదిత వన్బెల్ట్, వన్ రోడ్ను సమర్థి్ధస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వంపై నేడు ప్రకటన పెషావర్: అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు తమ ప్రకటనను ఒకరోజు వాయిదా వేశారు. శనివారం తమ నిర్ణయాన్ని వెల్ల డిస్తామని చెప్పారు. కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్ ప్రస్తుతం దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చైర్మన్గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రమాదంలో మహిళా జడ్జీలు కాబూల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్తాన్లో మహిళా జడ్జీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు నేరస్తులను ఇటీవల తాలిబన్లు విడిపించారు. దీంతో తమకు శిక్ష విధించిన మహిళా జడ్జీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే తాలిబన్లు ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్న మహిళా జడ్జీల సంఖ్య 250 వరకూ ఉంది. తాలిబన్లు అఫ్గాన్ను హస్తగతం చేసుకోగానే కొందరు దేశాన్ని వదిలి వెళ్లిపోగా పరిస్థితులు అనుకూలించక కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి తమకు శిక్ష విధించిన మహిళా జడ్జి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ జడ్జెస్ (ఐఏడబ్ల్యూజే) సభ్యులు తెలిపారు. విడుదలతోనే ప్రమాదం.. దోషులను తాలిబన్లు విడుదల చేయడంతోనే అసలు ప్రమాదం ప్రారంభమైందని అఫ్గాన్ నుంచి యూరోప్కు వెళ్లిన ఓ మహిళా జడ్జి చెప్పారు. జడ్జిలేగాక సామాజిక కార్యకర్తలైన మహిళలకు సైతం ముప్పు పొంచి ఉందని వివరించారు. ‘మిమ్మల్ని వెంటాడి తీరుతాం’ అని తాలిబన్లు ఇప్పటికే మహిళా పోలీసు ఆఫీసర్లకు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. తమ హక్కులను కాపాడాలంటూ అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో మహిళల ర్యాలీ -
వేర్పాటువాద నాయకుడు గిలానీ మృతి, సంతాపదినంగా ప్రకటించిన పాక్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతోపాటు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గిలానీని భారత ప్రభుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్ జెండాను అవనతం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers. — Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021 We in Pakistan salute his courageous struggle & remember his words: "Hum Pakistani hain aur Pakistan Humara hai". The Pakistan flag will fly at half mast and we will observe a day of official mourning. — Imran Khan (@ImranKhanPTI) September 1, 2021 -
గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర
ఆదిలాబాద్ టౌన్: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ జగనన్నకు గుండె నిండా అభిమానాన్ని చాటారు. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని 2018లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపడతానని ప్రతిజ్ఞ చేశాడు. జగన్ సీఎం కావడంతో ఇచ్చిన మాట ప్రకారం సైకిల్ యాత్ర చేపట్టాడు. 2020 ఫిబ్రవరిలో శ్రీనగర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి జమ్ము, పంజాబ్, హర్యాన, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. మార్చి 23వ తేదీన లాక్డౌన్తో సైకిల్ యాత్ర నిలిపివేసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు ఆదిలాబాద్ నుంచే.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ పట్టణం నుంచి మళ్లీ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 33 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, మరో 20 రోజుల్లో 1,800 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఎల్సీ మెంబర్ బెజ్జంకి అనిల్కుమార్ ఈ సైకిల్ యాత్రను గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
ఐసిస్–కెతో భారత్కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్గోడ్కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
ఒకే దేశం.. ఒకే చట్టం... మరి ఇదెక్కడి న్యాయం !
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభించాలని, తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు జమ్మూకశ్మీర్లో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రయత్నించడం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఆక్షేపణీయమని అన్నారు. అక్కడెలా పెంచుతారు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో జూన్ 26 శనివారం వినోద్కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూ కశ్మీర్కు వర్తించదా?’అని వినోద్కుమార్ ప్రశ్నించారు. ఒకే దేశం... ఒకే చట్టం అంటే ఇదేనా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలన్నారు. చదవండి : కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి -
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా..?
-
'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం'
శ్రీనగర్: కశ్మీర్లోని కుల్గామ్కు చెందిన షోహిబ్ బషీర్ అనే విద్యార్థి శనివారం(మే 29న) ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏంఏ సైకాలజీ చదువుతున్న అతను పరీక్ష ఫీజు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే బషీర్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఫోన్లో రికార్డు చేసిన వీడియో వెలుగులోకి రావడంతో అసలు కారణం బయటపడింది. ఆ వీడియోలో బషీర్ పలికిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ''మా నాన్న బషీర్ అహ్మద్ మిర్.. గవర్నమెంట్ పాఠశాలలలో టీచర్గా పనిచేస్తున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన మా నాన్నకు గత రెండు సంవత్సరాలుగా జీతం చెల్లించడం లేదు. దీంతో రెండేళ్లుగా మా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎంతో ఆనందంగా ఉన్న నా కుటుంబ పరిస్థితి విచ్చిన్నంగా తయారైంది. చదువును ఎక్కువగా ఇష్టపడే నేను.. ఏదైనా పని చేసుకొని ఫీజు చెల్లించాలనుకున్నా. కానీ మేముండే ప్రాంతంలో బాంబులు, ఎన్కౌంటర్ల మోత తప్ప ఇంకేం ఉండదు.. దీనికి బయపడి మా ఇంట్లోవారు నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు. ఇది నా తండ్రి ఒక్కడితోనే ఆగిపోలేదు. కశ్మీర్లో ఉన్న 140 మంది ప్రభుత్వ టీచర్లకు గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. నేను నా చదువు మధ్యలో ఆగిపోతుందని ఆత్మహత్యకు పాల్పడడం లేదు. కనీసం నా చావుతోనైనా ఇక్కడి ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లిస్తారని అనుకుంటున్నా. నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం. నా చావుతో ఇక్కడి ప్రభుత్వం కదిలివస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ బషీర్ ముగించాడు. ప్రస్తుతం బషీర్ వీడియో కశ్మీర్ ప్రభుత్వంలో కలకలం రేపింది. ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న తసాదుఖ్ మిర్ ప్రభుత్వ టీచర్ల జీతాల చెల్లింపుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ టీచర్లకు ఇవ్వాల్సిన రెండేళ్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కశ్మీర్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి బషీర్ అహ్మద్ మిర్ స్పందిస్తూ..'' నా కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడుతాడని ఊహించలేదు. వాడిది చాలా సున్నితమైన మనసత్వం. తండ్రి ప్రభుత్వ టీచర్ అయి ఉండి కూడా ఫీజులు చెల్లించలేకపోయాడని బాధపడేవాడు.'' అంటూ ఆవేదన చెందాడు. చదవండి: చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది -
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
శ్రీనగర్: సీనియర్ రాజకీయనాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (82) కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా మంగళవారం తెలియజేశారు. తండ్రికి పాజిటివ్ రావడంతో తానూ ఐసోలేషన్లోకి వెళ్లానని, తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించు కోవాల్సిందిగా సూచించారు. ఫరూక్ కోవిడ్ బారిన పడటంపై ప్రధాని మోదీ స్పందిం చారు. ఆయన త్వరగా కోలుకోవాలని, కుటుంబమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. తిరిగి స్పందించిన ఒమర్ అబ్దుల్లా మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 2న కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. చదవండి: పెళ్లిలో జోష్గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం.. -
ఇమ్రాన్ లేఖ: ‘కశ్మీర్’ పరిష్కారమైతేనే శాంతి
ఇస్లామాబాద్: నిర్మాణాత్మక చర్చలు ప్రారంభమయ్యేందుకు ముందుగా ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అది ఎంతో అవసరమని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ డే సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని రాసిన లేఖకు సోమవారం ఇమ్రాన్ సమాధానమిచ్చారు. పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, పాక్ ప్రజలు కూడా భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత, సహకారాత్మక సంబంధాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద రహిత వాతావరణం ఏర్పడాలన్న మోదీ వ్యాఖ్యకు స్పందనగా.. కశ్మీర్ సహా అన్ని సమస్యలు పరిష్కారమైతేనే శాంతి సాధ్యమని ఇమ్రాన్ స్పష్టం చేయడం గమనార్హం. చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం) -
కశ్మీర్ వెళ్లి తులిప్ అందాలు చూసొద్దామా..
-
వైరల్: ‘మిస్ యూ నాన్న
-
హైదరాబాద్ నుంచి కశ్మీర్ వరకు కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ఫై యాత్ర
-
కాశ్మీరి అందాలను ఎంజాయ్ చేస్తోన్న హన్సిక
-
న్యూయార్క్ అసెంబ్లీలో కశ్మీర్పై తీర్మానం
న్యూయార్క్: ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని గవర్నర్ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు ప్రతికూలతలను అధిగమించారు. పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని వాషింగ్టన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ‘జమ్మూకశ్మీర్ సహా దేశ భిన్న, ఘన సాంస్కృతిక వారసత్వం భారత్కు గర్వకారణం. జమ్మూకశ్మీర్ భారత్లో విడదీయలేని అంతర్భాగం’ అని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్పై న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. -
కశ్మీర్లో ఆపరేషన్ సక్సెస్: ప్రధాన ఉగ్రవాది అరెస్ట్
కశ్మీర్: ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న లష్కరే -ఈ -ముస్తఫా వ్యవస్థాపకుడు హిదాయతుల్లా మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కశ్మీర్లో జరిపిన దాడుల్లో ఈ కీలకమైన ఉగ్రవాది ఆచూకీ లభించింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతి కష్టమ్మీద హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. జమ్మూ, అనంత్నాగ్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ చేపట్టగా కుంజువాణి ప్రాంతంలో హిదాయతుల్లా కనిపించాడు. వాహనాల తనిఖీ సమయంలో కనిపించిన అతడి వివరాలు అడగడానికి ప్రయత్నించగా పోలీసులపై తుపాకీతో ఎదురు దాడి దిగాడు. దీంతో పోలీసులు అతడిని చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టోల్, ఓ గ్రనేడ్ను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ సీనియర్ ఎస్పీ శ్రీధర్ పాటిల్ తెలిపారు. కశ్మీర్ లోయలో జైషే- ఈ- మహ్మద్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ్సాలి ఉంది. -
దేశంలోనే తొలి ఇగ్లూ కేఫ్.. ఎక్కడంటే!
కరోనా వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చిన్న చితక సంస్థల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు అన్నీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయాయి. మహమ్మారితో కుదేలైన రంగాల్లో టూరిజం(పర్యాటకం) కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి. 9 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు బయట ప్రపంచానికి అడుగుపెడుతున్నారు. ఆనందం, ఆహ్లాదం కోసం షికార్లు, టూర్ల బాట పడుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫర్లతో పాటు నూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.ఇ దే క్రమంలో కశ్మీర్లోని గుల్మార్గ్లో ఓ హోటల్ వినూత్న ఆలోచన చేసింది. ఏకంగా దేశంలోని తొలి ఇగ్లూ హోటల్ను రూపొందించింది. గుర్మార్గ్లోని కొలాహోయ్ స్కీ రిసార్ట్లో ఈ మంచు కేఫ్ను నిర్మించారు. చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు! ఇగ్లూ ఆకారంలో నిర్మించిన ఈ కేఫ్ పూర్తిగా మంచుతోనే నిర్మితమైంది. గోడల దగ్గరి నుంచి టేబుళ్లు, కుర్చీలు అన్నీ మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. చల్లటి ఇగ్లూ హోటల్లో పర్యాటకులు కూర్చొని వెచ్చని ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ మొత్తం 15 అడుగుల ఎత్తు.. 26 అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడి స్థానిక నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో డిజైన్లు తయారు చేశారు. నాలుగు టేబుల్స్తో దాదాపు 16 మంది ఒకేసారి కూర్చునేందుకు వీలుగా ఈ కేఫ్ ఉంది. అక్కడికి వెళ్లిన టూరిస్టులు కేఫ్ ముందు దీగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆలోచన కావడంతో ప్రజలు అధికసంఖ్యలో ఇగ్లూ కేఫ్కు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. చదవండి: పర్యాటకం పట్టాలెక్కేనా? -
ఆట ఆడుతూ ఉండు
విధి మన ఆటను సడన్గా మారుస్తుంది. మనం ఏదో గోల్ అనుకుని వెళుతూ ఉంటాం. అది గేమ్ను తిరగేసేస్తుంది. పరిగెత్తేవారిని కూచుండి పోయేట్టు... కూచున్నవారిని పాకుతూ వెళ్లేట్టు చేస్తుంది విధి. అయితే మనం ఓడిపోతామా? కొత్త ఆట మొదలెడతాం. కొత్త గోల్ను సెట్ చేసుకుంటాం. బంతి ఎప్పుడూ విధి చేతిలోనే ఉండదు. మన దగ్గరికీ వస్తుంది. అప్పుడు లాగి పెట్టి కొట్టడమే. కశ్మీర్కు చెందిన ఇష్రత్ అఖ్తర్ చేస్తుంది అదే. అల్లర్ల వల్ల కాళ్లు పోగొట్టుకున్నా వీల్ చైర్ బాస్కెట్బాల్ ప్లేయర్గా స్ఫూర్తినిస్తోందా అమ్మాయి. ఈ సంవత్సరం అంతా సజావుగా జరిగి ఆగస్ట్లో ‘పారలింపిక్స్’ (దివ్యాంగుల ఒలింపిక్స్) టోక్యోలో జరిగితే మనం ఇష్రత్ అఖ్తర్ పేరు తప్పక వింటాం. ఆ అమ్మాయి భారతదేశం తరుఫున ఆ పోటీలలో వీల్చైర్ బాస్కెట్బాల్ టీమ్లో ఆడనుంది. ఇప్పటికే థాయ్లాండ్లో జరిగిన ఆసియా–ఓషెనియా వీల్చైర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో దేశం తరఫున ఆడిన ఇష్రత్ గొప్ప ప్రతిభను ప్రదర్శించింది. కోవిడ్ వల్ల 2020లో జరగాల్సిన పారలింపిక్స్ 2021కు జరపబడ్డాయి. అయినా సరే ఉత్సాహం నీరుగారిపోకుండా బారాముల్లాలోని తన ఇంటి వద్దే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోంది ఇష్రత్. అయితే ఇంత ప్రావీణ్యం ఉన్న అమ్మాయి నిజంగా బాస్కెట్బాల్ ప్లేయర్ కాదు. విధి విసిరిన సవాలుకు ఆమె అలా స్పందించింది. మేడ మీద నుంచి దూకేసి ఇష్రత్ అఖ్తర్ది బారాముల్లాలోని బంగ్దారా అనే గ్రామం. 2016లో ఆమెకు 19 ఏళ్లు. చదువుకుంటోంది. కాని ఆ సంవత్సరం కశ్మీర్లో అతి పెద్ద ఉగ్రవాది అయిన బర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగింది. జూలైలో ఈ ఎన్కౌంటర్ జరిగితే అప్పటి నుంచి జమ్ము కాశ్మీర్ అంతా నిరసనలు అల్లర్లు పెరిగిపోయాయి. ఆగస్టు 24న కొందరు కుర్రాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసురుతూ ఇష్రత్ ఇంట్లోకి వచ్చి దాక్కున్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన భద్రతా దళాలు ఇష్రత్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇష్రత్ ఈ గొడవకి గందరగోళానికి బాగా భయపడిపోయి తన ఇంటి రెండో అంతస్తుకు చేరుకుంది. కుర్రాళ్ల వల్ల లేదంటే లోపలికి వచ్చిన భద్రతాదళాల వల్ల ఏం జరుగుతుందోనని కంగారులో పై నుంచి దూకేసింది. అంతే ఆమెకు ఆ తర్వాత ఏమీ తెలియదు. కళ్లు తెరిచే సరికి రెండు కాళ్లూ చలనం కోల్పోయాయి. ఆమె వెన్నుముకకు సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 6 నెలలు మంచాన ఉండి.. ‘హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తెస్తే అందరూ శవం వచ్చినట్టుగానే శోకం ప్రకటించారు. చలనం లేని నా దేహం శవమే కదా. ఆరునెలలు మంచాన ఉన్నాను. చాలా డిప్రెషన్ వచ్చింది. అప్పుడు మా నాన్న అబ్దుల్ రషీద్ దగ్గరలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అక్కడంతా నాలాంటి వాళ్లే. అవయవాలు కోల్పోయిన వాళ్ళు’ అంది ఇష్రత్. ‘ఆమె తనలాంటి వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఆ పని చేశాను’ అంటాడు అబ్దుల్ రషీద్. అక్కడే కొందరు దివ్యాంగులు వీల్చైర్ బాస్కెట్బాల్ ఆడుతుంటే ఇష్రత్కు కూడా ఆసక్తి కలిగింది. వెళ్లి వాళ్లతో ఆడటం మొదలెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ఆ ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆమె ఆడుతున్న పద్ధతి చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే శ్రీనగర్లో జరుగుతున్న వీల్చైర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ల క్యాంప్ గురించి ఇష్రత్కు తెలిసింది. తండ్రితో అక్కడకు వెళితే సెలెక్టర్లు ఆమె ప్రతిభను చూసి నేషనల్ టీమ్కు సెలెక్ట్ చేశారు. మొత్తం జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క ఇష్రతే ఇందుకు సెలెక్ట్ అయ్యింది. చెన్నైకు వెళ్లి 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్లో పాల్గొనడానికి చెన్నైలో ‘వీల్చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్లు్యబిఎఫ్ఐ) నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది ఆగస్టు 2019. సరిగ్గా ఆ సమయంలోనే జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. నేషనల్ టీమ్ మెంబర్గా ట్రయినింగ్ తీసుకోవాల్సిన ఇష్రత్కు అసలు సమాచారమే అందలేదు. కాని ఆగస్టు 25న కోచ్ లూయిస్ జార్జ్ ఒక రిటైర్డ్ ఇంటెలిజన్స్ అధికారితో యధాలాపంగా ఈ ప్రస్తావన చేస్తే ఆ అధికారి తన సోర్స్ ద్వారా సైన్యానికి ఈ సంగతి చేరవేసి హుటాహుటిన ఇష్రత్ను చెన్నై వచ్చేలా చేశారు. భారత సైన్యం ఇందుకు సహకరించింది. చెన్నైకు చేరిన ఇష్రత్ ఆ తర్వాత థాయ్లాండ్లో విశేష ప్రతిభ కనిపించడంతో ఆమె జీవితమే మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ప్రోత్సహించింది. ‘నన్ను నా వంటి వారిని స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇమ్మని పిలుస్తున్నారు’ అంటోంది ఇష్రత్. ఇష్రత్ నిజంగానే స్ఫూర్తి ఇస్తోంది. కాళ్లు లేకపోతే ఏమి. రెక్కల్లో బలం ఉంది. ఆమె ఎగురుతూనే ఉంటుంది. గోల్స్ కొడుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, ప్రకాశ్ బెల్వాడి, మృణాల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్ను జమ్మూ–కశ్మీర్లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ నన్ను డైరెక్ట్గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్ప్రెస్’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్ కలాం బయోపిక్’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. -
ఒంటికాలిపై.. 43 రోజుల్లో 3,800 కి.మీ.
భోపాల్ : అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఒక చోట నుంచి మరోచోటకి ప్రయాణం చేయాలంటే చిరాకు పడుతుంటాం. అటువంటిది ఒంటి కాలుతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది మధ్యప్రదేశ్కు చెందిన తాన్య దగా. బీఎస్ఎఫ్ సహకారంతో నడిచే ఆదిత్యా మెహతా ఫౌండేషన్.. దేశవ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్పై అవగాహన కల్పించి, విరాళాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఏటా ‘ఇన్ఫినిటీ రైడ్’ను నిర్వహిస్తోంది. అయితే ‘ఇన్ఫినిటీ రైడ్ కె2కే– 2020’లో తొమ్మిది సభ్యుల బృందంలో ఏకైక ఫిమేల్ పారసైక్లిస్ట్గా పాల్గొన్న తాన్య.. 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల (కశ్మీర్ టు కన్యాకుమారి) సైకిల్ యాత్ర పూర్తి చేసింది. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోనే ఏకైక ఫిమేల్ పారా సైక్లిస్ట్గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అది 2018. నేను డెహ్రాడూన్ లో ఎంబీఏ చదువుతున్నాను. ఒకరోజు విధి నాపై కన్నెర్ర చేయడంతో కారు ప్రమాదంలో నా కుడికాలిని కోల్పోయాను. దాంతో ఆరునెలలపాటు బెడ్మీద నుంచి కదలలేని పరిస్థితి. అప్పుడు జీవితం అంతా అయిపోయిందనిపించింది. ఆ సమయంలో నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నూరిపోసారు. శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదని, మన లక్ష్యం కోసం శ్రమించాలని నాన్న చెప్పిన మాటలే నాకు మరో జీవితాన్నిచ్చాయని తాన్య చెప్పుకొచ్చింది. ఆరు నెలల తర్వాత శారీరకంగాను మానసికంగా దృఢంగా తయారై పారాస్పోర్ట్స్ను ప్రోత్సహించే ఫౌండేషన్ లో చేరాను’’ అన్నది. ‘‘ఈ క్రమంలోనే 2020 నవంబర్ 19న కశ్మీర్ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్తో బయలు దేరాము. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి మరోసారి నన్ను వెక్కిరించింది. డిసెంబర్ 18న హైదరాబాద్లో ఉండగా.. నాన్న చనిపోయాడనే వార్త నన్ను ఒక్కసారిగా కలిచివేసింది. మరోసారి జీవితం అంధకారమైనట్లు అనిపించింది. ఆ బాధతోనే మధ్యప్రదేశ్ వెళ్లి నాన్నను కడసారి చూసి వచ్చి.. మళ్లీ మా బృందంతో కలిసి యాత్ర కొనసాగించాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించి, కుంగిపోకుండా కొత్త జీవితాన్ని పరిచయం చేసిన నాన్న చివరి కోరిక ఈ యాత్రను పూర్తి చేయడం. అందుకే అంత బాధలోనూ నాన్న స్ఫూర్తితో లక్ష్యాన్ని పూర్తి చేసి నాన్న కోరికను తీర్చానని తాన్య గర్వంగా చెప్పింది’’. -
కశ్మీరులో చిక్కుకున్న బెల్లంకొండ
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' బృందం చివరి పాట చిత్రీకరణ కోసం కశ్మీర్ కు వెళ్లారు. షూటింగ్ ముగించుకుని వస్తున్న క్రమంలో కశ్మీరులో మంచు తుఫాను కురుస్తున్న కారణంగా హీరోతో పాటు చిత్రబృందం అక్కడే చిక్కుకుంది. విమాన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా శ్రీనగర్, కశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుంది. ప్రత్యేక విమానం ద్వారా కూడా హీరో హైదరాబాద్కు చేరుకోలేని పరిస్థితి ఉంది. రేపు(జనవరి 8న) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఇప్పుడు హీరో వస్తాడా రాడా అనే విషయంలో పెద్ద సందేహం నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.(చదవండి: రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్ స్టార్) -
మంచు ముసుగులో కశ్మీర్ అందాలు
-
తీవ్రమైన చలితో చిత్తూరు జవాను మృతి
చంద్రగిరి : జమ్మూ–కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జమ్మూ–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించారు. ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని, ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాతి్వక్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం మృతదేహం గడ్డకిందపల్లికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్డేట్.. ‘మంచు’లా కరిగిపోయాడు ఇరవై ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. ఆయన చేసిన సేవలకు హవల్దార్గా పదోన్నతి లభించింది. మరో మూడేళ్లలో ఆయన సర్వీసు పూర్తి కానుంది. జనవరి 1న ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. సంక్రాంతికి వస్తానని భార్య రెడ్డమ్మకు తెలిపారు. ఇంతలోనే శనివారం జమ్మూ–కశ్మీర్లో విధినిర్వహణలో చలి తీవ్రతకు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో భరతమాత ఒడిలో అశువులు బాశాడు ఆ వీరుడు. ఆ వీర సైనికుడే గడ్డకిందపల్లెకు చెందిన మంచురెడ్డెప్పనాయుడు. దేశ సేవలో ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు ఉద్వేగంగా తెలిపారు. చంద్రగిరి: జమ్ము–కశ్మీరులో సైనికుడిగా దేశ సేవ చేస్తున్న గడ్డకిందపల్లెకు చెందిన రెడ్డెప్పనాయుడు(38) విధి నిర్వహణలో మృతి చెందాడన్న వార్త జిల్లా వాసులను కలచి వేసింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందçపల్లె్ల గ్రామానికి చెందిన మంచు రెడ్డెప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డెప్పనాయుడు. రెడ్డెప్పనాయుడు పెద్ద కుమారుడు కాగా, పురుషోత్తమ నాయుడు రెండో కుమారుడు. రెడ్డెప్పనాయుడు చిన్నప్పటి నుంచి దేశసేవ చేయాలని పరితపించేవాడు. ఇంటర్ తర్వా త ఆర్మీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆపై 2000 సంవత్సరంలో ఆర్మీకి ఎంపికై దేశ సేవ చేస్తున్నాడు. 20 ఏళ్ల సర్వీసులో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సేవలను అందించారు. ప్రస్తుతం జమ్ము–కశ్మీర్లో విధుల్లో ఉన్నారు. జనవరి 1వ తేదీన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భార్య రెడ్డమ్మతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పాడు. కుటుంబమంతా పండుగ చేసుకుని, నూతనంగా నిర్మించిన కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని తెలిపారు. శనివారం జమ్ము–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో విధి నిర్వహణలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సహచరులు ప్రథ మ చికిత్సను అందించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో రెడ్డెప్పనాయుడు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పిల్లలు రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. మంగళవారం ఉదయం మంచురెడ్డప్పనాయు డు మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరవై ఏళ్లుగా దేశ సేవ 20 సంవత్సరాలుగా నా బిడ్డ దేశానికి సేవ చేస్తున్నాడు. దేశ సేవలో అసువులు బా యడం గర్వంగా ఉంది. మీ కుమారుడు కన్నుమూశారని ఆర్మీ అధికారులు మాకు సమాచారం అందించారు. మంగళవారం భౌతికకాయాన్ని అప్పగిస్తామని చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నాం. – మంచు రెడ్డెప్పనాయుడు, తండ్రి దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది దేశం కోసం నా భర్త చనిపోవడం గర్వంగా ఉంది. కానీ ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. లాక్డౌన్కు ముందు ఇక్కడకు వచ్చారు. కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. అనంతరం హెడ్క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో విధులకు వెళ్లారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త ఇంట్లో చేరి సత్యనారాయణ వ్రతం చేద్దామని ఆయన చెప్పారు. ఇంతలోనే అసువులు బాసారని తెలియడం మనోవేదనకు గురి చేస్తోంది. – మంచు రెడ్డెమ్మ, భార్య -
కశ్మీర్లోకి టర్కీ కిరాయి సైనికులు!
న్యూఢిల్లీ: కశ్మీర్లోకి టర్కీ తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్ఎఫ్ న్యూస్ తెలిపింది. త్వరలో ఇక్కడ నుంచి కశ్మీరుకు చేరాలని సిరియాలోని సులేమన్షా బ్రిగేడ్స్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అబు ఇమ్షా తన అనుచరులకు సూచించారని స్థానిక వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. త్వరలో కశ్మీర్కు వెళ్లే వారి జాబితాను టర్కీ అధికారులు ఇతర టెర్రరిస్టు కమాండర్లను అడిగి తయారు చేస్తారని అబు ఇమ్షా చెప్పాడు. ఈ జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారికి 2 వేల డాలర్లు ముడతాయని వివరించాడు. ఇదంతా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్ మౌంట్జొరాలియస్ ఒక నివేదికలో వెల్లడించారు. ఇస్లాం ప్రపంచంలో సౌదీ డామినేషన్ను సవాలు చేసేందుకు ఎర్డోగాన్ యత్నిస్తున్నారని, ఆగ్నేయాసియాలో ముస్లింలపై పట్టు సాధించేందుకు కశ్మీర్ విషయంలో పాక్కు మద్దతు పలుకుతున్నారని ఆండ్రియాస్ చెప్పారు. అయితే భారత్లో టర్కీ రాయబారి ఈ వార్తలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంలో టర్కీ తలదూరుస్తుందన్న వార్తలపై రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కశ్మీర్ భూ స్కామ్లో మాజీ మంత్రులు!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో రోష్ణి చట్టం అడ్డం పెట్టుకొని అక్రమంగా భూములు కలిగిన మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల జాబితాను జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం బయట పెట్టింది. ఈ జాబితాలో అక్రమంగా భూములు లబ్ధి పొందిన 400 మంది జాబితాలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మాజీ నాయకులు హసీబ్ ద్రాబు, కాంగ్రెస్ నాయకులు కేకే ఆమ్లా, జమ్మూ కశ్మీర్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎంవై ఖాన్ తదితరులు ఉన్నారు. జమ్మూ కశ్మీర్ పరిధిలోని భూ ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2001లో అప్పటి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం ‘జమ్మూ కశ్మీర్ స్టేట్ ల్యాండ్స్ వెస్టింగ్’ పేరిట ఓ చట్టం తీసుకొచ్చింది. ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్ట్ల కోసం అవసరమైన నిధులను సమీకరించడంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకున్న నాటి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆ చట్టాన్ని ‘రోష్ణి’ చట్టంగా పేర్కొంది. ఈ చట్టం దుర్వినియోగం అయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి ఎలాంటి విలువ లేదంటూ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ 2018లో ఈ చట్టాన్ని కొట్టి వేశారు. (చదవండి: రాహుల్ గాంధీ పునరాగమనం!) 2018, జనవరిలో జరిగిన కథువా రేప్ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది అంకుర్ శర్మ ఈ చట్టాన్ని ఎత్తివేయాలంటూ వాదించారు. కశ్మీర్లో ‘జిహాది’ని అంతమొందించాలంటూ ఈ చట్టాన్ని ఎత్తివేయక తప్పదని చెప్పారు. రోష్ణి చట్టం పేరుతో జరిగిన అక్రమ భూ లావాదేవీలపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని అక్టోబర్ 12వ తేదీన జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోష్ణి చట్టం కింద జరిగిన దాదాపు 25 వేల కోట్ల కుంభకోణంలో ప్రతి ఎనిమిది వారాలకోసారి దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని కూడా కోరింది. మాజీ రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్ భల్లా పేరును కూడా ప్రత్యేకించి ప్రస్తావించిన హైకోర్టు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అందరి పేర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ఆ ఆదేశాలను పురస్కరించుకొనే లబ్ధిదారుల పేర్లను సీబీఐ బయట పెట్టింది. వారిలో పీడీపీ నాయకుడు హసీబ్ ద్రాబు ఉన్నారు. ( చదవండి: నితీష్ కుమార్కు ఆర్జేడీ ఆఫర్) తాము మాత్రం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, 1956లో తన తాత, హైకోర్టు జడ్జీ నుంచి అర ఎకరం భూమిని కొనుగోలు చేశారని, దానిపై తాను స్టాంప్ సుంకాన్ని, ప్రభుత్వ ఫీజులను చెల్లించానని హసీబ్ తెలిపారు. తన తాత చనిపోయిన అనంతరం ఆ భూమి 2006–8 మధ్యకాలంలో తన తండ్రికి సంక్రమించిందని, రోష్ణి చట్టం వచ్చినప్పుడు తాను పదవిలో లేనని, ఆ చట్టం కింద లీజులో ఉన్న భూమికి కాస్తా యాజమాన్య హక్కులు వచ్చాయని ఆయన వివరించారు. , -
పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. -
పక్కింట్లో అద్దెకు దిగుతున్న ‘దేవుళ్లు’
దేవుడి రూపంలో ఎవరైనా వచ్చి, ఎవరో ఎందుకు.. దేవుడే వచ్చి.. పక్కింట్లో అద్దెకు దిగి.. ‘మా ఇంట్లో ఉండిపోతావా బాబూ.. మంచి మంచి తుపాకీ బొమ్మలున్నాయి, ఎల్.ఇ.డి. టీవీలో మంచి మంచి టెర్రరిస్ట్ సినిమాలు వస్తాయి, వారానికి రెండుసార్లు స్వర్గానికి ట్రిప్పులు వుంటాయి’ అని పిలిస్తే చిన్న పిల్లలు అయితే నేరుగా వెళ్లిపోయి దేవుడి అద్దింటి హాల్లో కూర్చుంటారు. పొద్దు పోతున్నా అమ్మానాన్న తమని వెతుకుతుంటారని లేకుండా అక్కడి ఆడి, అక్కడే నిద్రపోతారు. పెద్ద పిల్లలు అలాక్కాదు. అద్దెకు దిగిన దేవుడొచ్చి ‘ఆటాడుకుందాం రా..’ అని పిలవగానే ఆలోచిస్తారు. ‘దేవుడేంటి అద్దిల్లేంటి, అదీ మన పక్కిల్లేంటి?’ అని యోచిస్తారు. అది మొదటి స్టెప్ ఆలోచన. రెండో స్టెప్ లో ‘దేవుడేంటి తుపాకులేంటి, మంచి టెర్రరిస్ట్ సినిమాలేంటి?’ అని థింక్ చేస్తారు. నిజంగా దేవుడేనా అని అనుమానిస్తారు. నిజంగా దేవుడే అని రూఢీ అయినా.. ‘సారీ అంకుల్ నాకు మా ఇల్లే బాగుంటుంది’ అని చెప్పే ధైర్యం చేస్తారు. దేవుడు వెంటనే... ‘హ హ హ.. నేనూ మనిషినే’ అని ముసుగు తీసిపారేసి, ‘అయినా మీ ఇంట్లో ఏముందోయ్? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, కరోనా వ్యాక్సిన్ ఉందా, కనీసం ఎవరైనా వస్తే కూర్చోమనడానికి రాజ్ కమల్ ప్లాస్టిక్ కుర్చీ ఉందా?!’ అని ఇంటిని తీసిపారేస్తే.. ‘అవేమీ లేవంకుల్. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్’ ఉన్నారు అని చెప్పి వచ్చేస్తారు. ఈమధ్య బారాముల్లాలో అబిడ్, మెహ్రాజ్ అనే ఇద్దరు యువకులు భారత భద్రతాదళాలకు ఎదురు పడ్డారు. అల్ బద్ర్ ఉగ్రవాద సంస్థలో కొత్తగా రిక్రూట్ అయినవాళ్లు ఆ ఇద్దరు. లొంగిపొమ్మంటే వినడంలేదు. ఎన్ కౌంటర్ సైట్ అది. ఆర్మీ ఇలాంటప్పుడు అస్సలు టైమ్ తీసుకోదు. కానీ అబిడ్, మెహ్రాజ్ ముఖాలు చూసి ఆగింది. పిల్లలు వాళ్లు. గవర్మమెంట్ కి సమాచారం పంపారు. వెంటనే ఆ ఇద్దరు యువకుల తల్లిదండ్రులను వెంటబెట్టుకుని స్పాట్కి చేరుకున్నారు కశ్మీర్ ఐ.జి.పి. విజయ్. పేరెంట్స్ ని చూడగానే తపాకుల్ని పక్కన పడేసి, పరుగున వెళ్లి అమ్మానాన్నల్ని హత్తుకుపోయారు అబిడ్, మెహ్రాజ్. గత నెల (అక్టోబర్) 16 న కూడా ఇలాగే జహంగీర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్ చేయకుండా వదిలేసింది. అతడి తండ్రిని పిలిపించి కొడుకును సరెండర్ చేయించింది. ఆ తండ్రి ఆర్మీ అధికారి కాళ్లకు దండం పెట్టాడు. ఆయనకు ఆ అధికారిలో దేవుడు కనిపించి ఉంటాడు. పక్కింట్లో అద్దెకు దిగుతున్న ‘దేవుళ్ల’ నుంచి పిల్లల్ని కాపాడటానికి దేవుడే కొత్తగా ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయి ఉన్నాడా?! -
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
గుప్కార్ అలయెన్స్ చైర్మన్గా ఫరూఖ్
శ్రీనగర్: కశ్మీర్లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్గా నేషనల్ కాన్ఫరెన్స్కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది బీజేపీ వ్యతిరేక వేదిక అని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది. దుర్గానాగ్ దేవాలయాన్ని దర్శించిన ఫరూఖ్ అబ్దుల్లా ఫరూఖ్.. దుర్గాష్టమి, మహానవమి సందర్భం గా పురాతన దుర్గానాగ్ దేవాలయాన్ని సందర్శించారు. మానవాళికి మంచి జరగాలని, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు ఫరూఖ్ తెలిపారు. దేవాలయానికి ఎంతో ప్రాశçస్త్యం ఉంది. ‘హిందూ సోదర, సోదరీమణులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. పండగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా’ అని అన్నారు. కశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లు తొందరగా తమ ప్రాంతాలకు తిరిగిరావాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దుర్గానాగ్ దేవాలయం 700 సంవత్సరాల పురాతనమైనది. 2013లో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
పోలీసుల చేతుల్లో పౌరుల మృతి.. కశ్మీర్ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత రెండేళ్లలో జరిగిన పోలీస్ ఆపరేషన్స్(కాల్పులు, ఎన్కౌంటర్లు, ప్రమాదవశాత్తూ మరణాలు)లో మొత్తం 183 మంది పౌరులు మృతిచెందారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- ఎన్సీఆర్బి వెల్లడించింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూకశ్మీర్లోనే అత్యధికమంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో జరిగిన పోలీస్ కాల్పుల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 71 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్లో 33 మంది, మహరాష్ట్రలో 15 మంది పౌరులు.. పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. (చదవండి: ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలు) 2018లో మొత్తం 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వీరిలో జమ్మూకశ్మీర్లో జరిగిన దుర్ఘటనల్లోనే 72 మంది మృతిచెందారు. తమిళనాడులో 14, తెలంగాణలో 11 మంది మరణించారు. ఈ రెండేళ్లలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఎన్సీఆర్బి తెలిపింది. -
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప..
కశ్మీర్: మనకు క్రికెట్లో చాలా రకాలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తెలుసు. మరి చేపను ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఇవ్వడం చూశారా. ఒక క్రికెట్ మ్యాచ్లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పెట్టుకోవడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇది కశ్మీర్లోని తెకిపూరా కుప్వారా క్రికెట్ లీగ్లో చోటు చేసుకుంది. మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్కు 2.5 కేజీల చేపను అందించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని జర్నలిస్టు ఫిర్దోస్ హసన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి ఫిదా అవుతున్న అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లీగ్ను ఫేమస్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని ఫిర్దోస్ పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్ పేలవంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపడానికి ఇలా చేసి ఉండవచ్చని కూడా ఫిర్దోస్ తెలిపాడు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్లు తమ జేబులోనుంచే డబ్బులు తీయాల్సిన పరిస్థితితో ఇలా చేపన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మనకు తెలిసినంత వరకు ఒక క్రికెట్ లీగ్లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఇవ్వడం తొలిసారే కావొచ్చు.(చదవండి:రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb — Firdous Hassan (@FirdousHassan) September 21, 2020 -
పద్దెనిమిదేళ్ల తర్వాత పరిహారం
జమ్మూ కశ్మీర్ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ హింసతో ముగిసిన ఎన్నికలు 2002 నాటివి. ఎవరు గెలిచారన్నది కూడా విషయం కానంతగా.. ‘ఇంత ప్రశాంతంగా కూడా పోలింగ్ జరుగుతుందా?!!’ అని ఇళ్లలో కూర్చుని, వీధుల్లో నిలబడి అప్పట్లో అంతా ముక్కు మీద వేలు తీసి మాట్లాడుకున్నారు. చెదురుమదురుగా కొన్ని ఘటనలు ఉన్నా అవి ఎవరి దృష్టికీ వెళ్లలేదు. వాటిల్లోని ఒక ‘చెదురుమదురు’ మాత్రం ప్రమీలాదేవి జీవితాన్ని దుఃఖపు ఉప్పెనై అల్లకల్లోలం చేసింది. ఆమె భర్త రమేష్ సి.ఆర్.పి.ఎఫ్. జవాన్. ఎలక్షన్ డ్యూటీలో ఉండగా.. ‘ఓటు వేస్తే చంపేస్తాం’ అంటూ తుపాకులతో తిరుగుతూ పౌరులను బెదిరిస్తున్న వాళ్లకు ఎదురెళ్లి బులెట్లకు బలైపోయాడు. అతడి డ్యూటీ అతడు చేస్తూ, డ్యూటీ చెయ్యడానికి పోరాడుతూ చనిపోయాడు. ఎలక్షన్ కమిషనే ఇంతకాలంగా తన మాట నిలబెట్టుకోలేదు. రమేష్ భార్యకు పరిహారంగా ప్రకటించిన డబ్బును ఇంతవరకు ఇవ్వలేదు. కశ్మీర్లో మరో నాలుగు ఎన్నికలు గడిచిపోయియినా, ప్రమీలాదేవి కుటుంబానికి నేటికీ పూట గడవని స్థితే!! ఈ ఆగస్టులో మళ్లీ ఒకసారి ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టుకుంది. రావడానికైతే కమిషనర్ నుంచి జవాబు వచ్చింది! మొదట ‘సారీ’ చెప్పారు ఆయన. తర్వాత.. ‘మా తప్పును సవరించుకుంటాం. మరికొంచెం సమయం ఇవ్వండి’ అని అభ్యర్ధించారు. ప్రమీలాదేవికి అర్ధం అయిపోయింది. ఇక ఎప్పటికీ వాళ్లు ఇస్తానన్న డబ్బు రానట్లేనని. 10వ తారీఖున లెటర్ మెయిల్ చేస్తే 26వ తేదీ వరకు బదులు ఇవ్వని వారు ఇంటికి చెక్కు పంపిస్తారా! పంపించలేదు కానీ, బ్యాంక్ నుంచి ప్రమీలా దేవికి సెప్టెంబర్ మొదటి వారంలో ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్లో 20 లక్షలు పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చాయి. మీకు తెలియజేస్తున్నాం’ అని బ్యాంకు మేనేజరే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అప్పుడొచ్చాయి ప్రమీలాదేవికి కన్నీళ్లు. ఎలాగొచ్చాయంటే భర్త జ్ఞాపకాలను అవి ఏకధారగా తడిపేస్తున్నాయి. అకౌంట్లో పడింది వంద రూపాయలే అయినా ఆమె అదేవిధంగా ఉక్కిరిబిక్కిరి అయి ఉండేది. అది తన భర్త డబ్బు. తన భర్త ఇంటికి రాలేక ఎవరి చేతికో ఇచ్చి తనకు చేర్చమని పంపిన డబ్బు. నిజానికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆమెకు రావలసింది ఐదు లక్షలే. ఉపశమన పరిహారంగా కొత్త కమిషనర్ సునీల్ అరోరా ఆమెకు ఇరవై లక్షలు చెల్లించుకున్నారు. -
భారత్పై ఆన్లైన్ వార్కు పాక్ కుట్ర
న్యూఢిల్లీ : భారత్పై ఆన్లైన్లో ప్రచ్ఛన్న యుద్ధానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేపట్టింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు పాకిస్తాన్ మరోసారి కుటిల నీతికి తెరలేపింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 75వ సాధారణ చర్చల సెషన్కు ముందు ట్విటర్లో భారత వ్యతిరేక ప్రచారానికి పాక్ ప్రయత్నిస్తోంది. కశ్మీర్వాంట్స్ఫ్రీడం అనే హ్యాష్ట్యాగ్తో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ ప్రచారానికి పాకిస్తాన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా, మలేషియా, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, భారత్, పాకిస్తాన్లు కేంద్రంగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ట్విటర్ ట్రోల్స్ సైన్యంతో ముమ్మరం చేసేందుకు పాక్ కుయుక్తులు పన్నుతోంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం ఎదుట దుష్ర్పచారం సాగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై పాక్ ప్రయత్నాలు వమ్మయ్యాయి. కశ్మీర్ అభివృద్ధికి భారత్ చేపడుతున్న చర్యలను తక్కువచేసి చూపాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, కశ్మీర్ పరిస్ధితిని వక్రీకరిస్తోందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడించినట్టు టైమ్స్ నౌ పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, భారత్ అణిచివేత వైఖరి అవలంభిస్తోందని ఐఎస్ఐ దుష్ప్రచారం సాగించిందని ఆ అధికారి పేర్కొన్నారు. చదవండి : కంగనా ట్వీట్: పాక్ జర్నలిస్టుపై నెటిజన్ల ఫైర్ -
ట్రంప్కు కలిసొచ్చిన కశ్మీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వే పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఇండియన్ అమెరికన్స్ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు మద్దతిస్తారని ఈ సర్వే తెలిపింది. అయితే గత ఎన్నికలతో పొల్చితే.. ఈ సారి ట్రంప్కు మద్దతిచ్చే ఇండియన్ అమెరికన్ల సంఖ్య పెరిగినట్లు సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలను కూడా సర్వే వెల్లడించింది. కశ్మీర్ అంశం డెమొక్రాట్ల కొంపముంచిందని ఈ సర్వే తెలిపింది. కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల డెమొక్రాట్లు దూకుడుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ట్రంప్, భారత్కు మద్దతిచ్చారు. ఇదే కాక ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ర్యాలీల్లో అధ్యక్షుడు పాల్గొనడం వంటి అంశాలు భారత్-అమెరికా మైత్రికి నిదర్శనంగా నిలిచాయని.. ఫలితంగా ట్రంప్కు మద్దతుదారులు పెరిగారని సర్వే వెల్లడించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్కు మిత్రులెవరు.. కానీ వారు ఎవరు అనే దాన్ని బెరీజు వేశారని సర్వే తెలిపింది. (చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!) అంతేకాక ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలు కూడా ఆయనకు అనుకూలిస్తాయని సర్వే తెలిపింది. ఇకపోతే డెమొక్రాట్లు కశ్మీర్ అంశంలో మోదీని విమర్శించడమే కాక మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీని మెజారిటీ హిందూ ఎజెండాను అనుసరిస్తున్నారని ఆరోపించారు. ఇవన్ని ట్రంప్కు కలిసొచ్చిన అంశాలుగా సర్వే తెలిపింది. ఇన్ని సానుకూల అంశాలున్నప్పటికి 66 శాతం మంది ఇండియన్ అమెరికన్లు బైడెన్కు మద్దతుగా ఉంటే, ట్రంప్కి 28శాతం మాత్రమే అనుకూలంగా ఉండటం గమనార్హం. -
మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్కార్ డిక్లరేషన్’ను పాకిస్తాన్ స్వాగతించడంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్కార్ డిక్లరేషన్ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ‘సాయుధులను కశ్మీర్లోకి పంపడం పాక్ మానాలనీ, భారత్, పాక్లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్కార్ డిక్లరేషన్ అని అంటున్నారు. -
పాక్ కుయుక్తులు : కశ్మీర్పై డ్రాగన్తో మంతనాలు
ఇస్లామాబాద్ : చైనాతో వ్యూహాత్మక సంబంధాల కోసం అర్రులుచాస్తున్న పాకిస్తాన్ ఆ దిశగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మక్దూమ్ షా మహ్మద్ ఖురేషి చైనాతో వ్యూహాత్మక సంప్రదింపుల కోసం బుధవారం బీజింగ్ బయలుదేరారు. పాకిస్తాన్కు అన్ని వేళలా రాజకీయంగా బాసటగా నిలిచిన చైనానే తమకు నిజమైన మిత్రదేశమని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఖురేషి చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్లో ఖురేషి చైనా విదేశాంగ మంత్రి సహా దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పాకిస్తాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటన ఏర్పాట్లపై ఖురేషి చైనా విదేశాంగ మంత్రితో చర్చిస్తారు. కశ్మీర్పై పాక్ వైఖరికి చైనా తోడ్పాటును కోరడంతో పాటు తూర్పు లడఖ్లో ఇండో-చైనా ప్రతిష్టంభనపైనా ఖురేషి తన పర్యటనలో చైనాతో చర్చించనున్నారు. సౌదీఅరేబియాతో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాక్ చైనా వైపు చూస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి. అయితే సౌదీతో తమ సంబంధాలు బెడిసికొట్టలేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మరోవైపు చైనాతో సంబంధాల ప్రాధాన్యతను ఆయన ఇదే ఇంటర్వ్యూలో నొక్కిచెప్పారు. ‘మా భవిష్యత్ చైనాతోనే ముడిపడి ఉంది..పాకిస్తాన్ తోడ్పాటు కూడా చైనాకు అంతే అవసరమ’ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు 2018లో తాము ఇచ్చిన 3 బిలియన్ డాలర్ల రుణంలో 1 బిలియన్ డాలర్లను తక్షణమే చెల్లించాలని సౌదీ అరేబియా పాకిస్తాన్ను కోరినప్పటి నుంచి ఇస్లామాబాద్ డ్రాగన్ వైపు దృష్టి సారించింది. చదవండి : చైనాలో మసీదుల కూల్చివేత.. మౌనం వీడని పాక్! కశ్మీర్ అంశంపై చర్చించేందుకు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటునకు రియాద్ నిరాకరించడంతో ఖురేషి చేసిన ఘాటు వ్యాఖ్యలపై పాక్ ఇంటా బయటా వివాదం నెలకొంది. సౌదీతో సంబంధాలు దెబ్బతినకుండా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా సౌదీ అరేబియా సందర్శించాల్సి వచ్చింది. సౌదీ అరేబియా చొరవ చూపకుంటే కశ్మీర్పై ఇతర ముస్లిం దేశాలను సంప్రదిస్తామని ఖురేషి చేసిన వ్యాఖ్యలు సౌదీకి ఆగ్రహం కలిగించాయి. -
8 నెలలుగా అక్కడే సైనికుడి మృతదేహం
శ్రీనగర్ : జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత శనివారం కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భారతీయ సైన్యం యొక్క 11 గర్హ్వాల్ రైఫిల్స్కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు. అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్లో అతన్ని 'అమరవీరుడు' గా ప్రకటించి, ఈ విషయాన్ని జూన్ 21న నేగి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి నేగిని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది. తన భర్త మృతదేహాన్ని కళ్లతో చూసే వరకు అతను మరణించినట్లు భావించనని ఆమె తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేగి మృతదేహం లభించిన విషయాన్ని ఆతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నేగి మృతదేహాన్ని శ్రీనగర్లోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మృతదేహం డెహ్రాడూన్కు చేరుకుంటుందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. డెహ్రాడూన్కు చెందిన నేగి..2001లో సైన్యంలో చేరారు. అతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కరోనా: కశ్మీర్లో సంపూర్ణ లాక్డౌన్
శ్రీనగర్ : గత మూడు వారాలుగా కరోనా కేసులు అధికమవుతున్నందున అధికారులు కశ్మీర్ లోయలోసంపూర్ణ లాక్డౌన్ విధించారు. బందిపోరా జిల్లా మినహా మొత్తం కశ్మీర్ లోయర్ నేటి (బుధవారం ) నుంచి ఆరో రోజులపాటు లాక్డౌన్ ఉండనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు లాక్డౌన్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. వ్యవసాయం, నిర్మాణ కార్యాకలాపాలు యధావిదిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. (బెంగళూరుకు స్వేచ్ఛ ) ఆరు రోజుల తర్వాత (జూలై 27) అనంతరం పరిస్థితిని సమీక్షించి తదనంతరం నిర్ణయం తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. అప్పటికీ కరోనా కేసులు నియంత్రణలో లేకపోతే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో కరోనా కేసులు, మరణాలు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కరోనా కారణంగా 263 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 15,258కు చేరువైంది. (కరోనా: బస్సులు శానిటైజ్ చేయడం లేదు )