
తిరువనంతపురం: తమ రాష్ట్రానికి చెందిన 575 మంది ఇంకా కశ్మీర్ లోనే ఉన్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ వెళ్లిన వారు ఇంకా అక్కడే ఉన్నారన్నారు. వారు తిరిగి వచ్చే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఆయన వెల్లడించారు. వీరంతా కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టికెట్లు బుకింగ్ చేసి వారిని ఢిల్లీ మీదుగా కేరళకు రప్పించే యత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఈ క్రమంలోనే వారికి అవసరమైన ఆహారం తదితర వాటిని ప్రభుత్వం నుంచి తమ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. ఇది దేశంపై జరిగిన దాడి అని, మనమంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయమని విజయన్ పేర్కొన్నారు. మరొక పెహల్గామ్ ఉగ్రదాడి జరగ్గకుంటా దేశమంతా ఐక్యం కావాలన్నారు.
రెండు రోజుల క్రితం కశ్మీర్ ప్రాంతమైన పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలు.. టూరిస్టులను తిరిగి వెనక్కి పంపించే ఏర్పాట్లును కూడా పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా తమ రాష్ట్ర పౌరులు ఎంతమంది అక్కడికి వెళ్లారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ వాసులు 575 అక్కడే చిక్కుకుపోయిన క్రమంలో వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే యత్నాలు చేస్తోంది ప్రభుత్వం.