ఐసిస్‌లో చేరిన 17 మంది కేరళ యువత? | 17 member's of womens joined in the ISIS | Sakshi

ఐసిస్‌లో చేరిన 17 మంది కేరళ యువత?

Jul 10 2016 3:45 AM | Updated on Oct 16 2018 2:49 PM

కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది.

తిరువనంతపురం : కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది.  ఉన్నత చదువుల కోసం పశ్చిమాసియా దేశాలకు వెళ్లిన వారి జాడ నెల నుంచి తెలియడంలేదని కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగుచూసింది. తప్పిపోయిన వారిలో 8 నెలల గర్భిణి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.

కొందరు ఇంజినీరింగ్, వైద్య  విద్యను అభ్యసించారు. వీరు ఐసిస్‌లో చేరారని కచ్చితంగా చెప్పలేమని, వీరి  కుటుంబాలు అందించిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement