‘300 మందికి పైగా కాపాడాం’
మధ్యప్రదేశ్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులను కాపాడినట్లు రైల్వే, సహాయ అధికారులు చెబుతున్నారు. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న పలువురిని స్థానికులు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది కాపాడారన్నారు.
కాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు బాగా ప్రభావితమయ్యాయి. ముంబై నుంచి బయల్దేరే దాదాపు 25 రైళ్లను దారి మళ్లించారు. అలాగే పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు. కొన్ని రైళ్లను రాజస్థాన్ - కోట మార్గంలోకి మళ్లించే అవకాశం కనిపిస్తోంది.