రైలు ప్రమాదంలో 30 మంది మృతి | atleast 30 dead as trains derailed in madhya pradesh | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో 30 మంది మృతి

Published Wed, Aug 5 2015 7:14 AM | Last Updated on Mon, Oct 8 2018 3:36 PM

రైలు ప్రమాదంలో 30 మంది మృతి - Sakshi

రైలు ప్రమాదంలో 30 మంది మృతి

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
పలువురు కొట్టుకుపోతుండగా చూశామన్న సాక్షులు
హర్దా: మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. 
 
మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో పలువురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలామంది నీళ్లలో కొట్టుకుపోతుండటం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement