బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ | Babri demolition case: Will Advani, others face trial? Supreme Court | Sakshi
Sakshi News home page

బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ

Published Thu, Mar 23 2017 5:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ - Sakshi

బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తన నేతృత్వంలోని బెంచ్‌ దీన్ని విచారిస్తుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ బుధవారం తెలిపారు. అంతకుముందు.. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వారం రోజుల గడవు కావాలని దివంగత పిటిషనర్‌ హాజీ మహబూబ్‌ అహ్మద్‌ తరపు న్యాయవాది కోరారు.     

వారే అడ్డుపడుతున్నారు.. స్వామి: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద అంశంపై పరిష్కారానికి ముస్లిం సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. మంగళవారం ఓ టీవీ చానల్‌ చర్చావేదికలో పాల్గొన్న ముస్లిం పార్టీలు.. అయోధ్య అంశాన్ని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీం సూచనలనుద్దేశించి ఇదో టైం వేస్ట్‌ కార్యక్రమంగా పేర్కొన్నాయని..సుప్రీం కోర్టు దీన్ని తప్పనిసరిగా వినాలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement