ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూ.118 కోట్ల విలువ ఉండే 1.2 టన్నుల కేటమైన్ మాదకద్రవ్యాన్ని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జల్గావ్ జిల్లాలోని రుఖ్మా ఇండస్ట్రీస్లో ఇది శుక్రవారం రాత్రి దొరికింది. ఈ ముఠా సూత్రధారి వికాస్పురితోపాటు ఐదుగురిని అరెస్టు చేశారు. కేటమైన్ తయారీకి లెసైన్సు లేకున్నా రుఖ్మా యాజమాన్యం దీనిని ఉత్పత్తి చేస్తోందని డీఎఆర్ఐ తెలిపింది. ఇక పురిని పొవాయిలో శనివారం అరెస్టు చేసిన అధికారులు ఇతని ఇంట్లో రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేటమైన్ విక్రయంతోనే ఈ మొత్తం వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే రుఖ్మా ఇండస్ట్రీస్ యజమాని నితిన్ చించోలేను అరెస్టు చేయాల్సి ఉంది.
రూ.118 కోట్ల విలువైన కేటమైన్ స్వాధీనం
Published Sat, Dec 14 2013 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement