
పరువే కాదు.. మామిడి కాయలు కూడా!
ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మామిడి కాయలు తెంపుతున్న లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. ఆందోళనకు గురైన లక్ష్మణ్ కేకలు వేశాడు. సమీపంలో ఉన్న మరో అన్న హన్మండ్లు వచ్చాడు. గమనించిన శ్రీను ఆయనపైనా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే స్థానికులు కొందరు 108కు సమాచారం ఇచ్చి రక్తంమడుగులో పడిఉన్న లక్ష్మణ్ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే లక్ష్మణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురికావడం విషాదం నింపింది. మల్యాల సీఐ కృపాకర్, ఎస్సై కిరణ్కుమార్ జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య రమ, కొడుకులు అజయ్, అభి, కుమార్తె అఖిల ఉన్నారు.