Mango Products
-
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. తయారీ విధానమే ప్రత్యేకం మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు. మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు జాగ్రత్త లేకుంటే నష్టం తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. నిల్వ చేసే దారిలేదు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు. ఎండ ఉంటేనే పని ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. –జి.సత్యవతి, తయారీదారు కోల్డ్ స్టోరేజీ నిర్మించాలి ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది. – ఎస్.రమణ, తయారీదారు అమ్మకపు పన్ను రద్దుచేయాలి కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
మామిడి తాండ్ర రుచి.. తినరా మైమరచి
తాండ్ర...ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం: గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న మామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకీ.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే తాము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. - బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు, కురుపాం మండలం -
ఆవకాయ.. టేస్టే వేరు..
ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మహిళలు మార్కెట్కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు. దిల్సుఖ్నగర్: మలక్పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. మామిడి పచ్చళ్లలో రకాలెన్నో... మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. పెరిగిన మామిడికాయ ధరలు.. గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. -
ఆవకాయ పచ్చడి మరింత ప్రియం
జనగామ అర్బన్: ఆవకాయ పచ్చడి. దాని పేరు చేపితేనే అబ్బో నోరూరిపోతుంది. ఇది ఈ ఏడాది మరింత ప్రియం కానుంది. జిల్లాలో మామిడి తోటలు కాపు లేక వెలవెలబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వ్యాప్తంగా 2301 మంది రైతులు 9,405 ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో జనగామ రెవెన్యూ డివిజన్లో 3,419 ఎకరాల్లో, స్టేషన్ఘన్పూర్ డివిజన్లో 4,063 ఎకరాల్లో అదే విధంగా పాలకుర్తి డివిజన్లో 1,922 ఎకరాల్లో ఈ తోటలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు అంచనా ప్రకారం 16,31 మొట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. కానీ, 9 నుంచి 10వేల మెట్రిక్ టన్నులు వచ్చినా సంతోషమే అంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లాలోని మూడు డివిజన్ అంటే 12 మండలాల నుంచి ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సారి తోటలు అంతగా కాపు లేదు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా మంచిగా కాసిన తోటలు ఎకరానికి నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. కానీ అది కాస్త ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 2 నుంచి 2.5 టన్నులు కూడ వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 శాతం పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ సారి మామిడి ధరలు ఆకాశంటనున్నాయి. మామిడి రేటు ఇలా.. సాధారణంగా 50 గ్రాములున్న మామిడి కాయలను దాదాపు రూ.4 నుంచి రూ.6 కు విక్రయించే వారు. కానీ, ఈ సారి అదే సైజులో ఉన్న కాయలు కూడా రూ. 8 నుండి 10 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆశించిన దిగబడి రాకపోవచ్చు ఈ సారి జిల్లా వ్యాపంగా మామిడి తోటల నుండి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. చాల చోట్లు తోటలు పూత దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. లక్ష్యం 16వేల మెట్రిక్ టన్నులు ఉంది. అయితే పది వేల మెట్రిక్ టన్నులపైగా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఆశించిన దిగుబడి వస్తే కాస్త ఇబ్బంది ఉండదు.– కేఆర్.లత,జిల్లా ఉద్యాన అధికారి, జనగామ -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
మామిడితాండ్ర C/O ఊనగట్ల
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రామంలో 450 మందికి ఉపాధి మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రుణ సౌకర్యం కల్పించాలి ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి. – కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల మహిళలకు ఉపాధి మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి. – యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల సీజన్లో పనికి వెళతా నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం. – కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల -
పచ్చిళ్లు
పచ్చళ్లే! పచ్చికాయలు కనుక పచ్చిళ్లు!పచ్చిగా చెప్పాలంటే..కొంచెం వయలెన్స్ ఉంటే కానీతయారీలో ఘాటు..ప్లేట్లోకి వచ్చాక షూట్ ఎట్ సైటు.. ఉండవు.కారం... ఉప్పు.. ఆవపొడి.. నువ్వులనూనెకలిస్తే.. చేతినిండా కలిపితేజిహ్వ జిమ్మాస్టిక్సే. నోరు ఏరోబిక్సే. వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను తయారీ: ►ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు నీడలో ఆరబెట్టాలి ►ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల అన్ని మామిడి పిందెలకు నూనె పడుతుంది) ►బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చి, జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ►ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ►రోజుకి మూడు నాలుగుసార్లు చొప్పున అలా మూడు రోజులు కలపాలి ►మామిడి పిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతాయి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే వడు మాంగా రుచిగా ఉంటుంది. టెండర్ మ్యాంగో పికిల్ కావలసినవి: మామిడి పిందెలు – ముప్పావు కిలో; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 20 తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, నీడలో కొద్దిసేపు ఆరబెట్టాలి ►తొడిమలను చాకుతో కట్ చేయాలి ►రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ►ఆవ పొడి జత చేసి మరోమారు కలపాలి ►ఉప్పు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి ►మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ►నాలుగో రోజుకి ఊట కిందకి దిగుతుంది ►మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయలో నుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండు మిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి, జాడీలోకి తీసుకోవాలి ►పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుంటే వడ దెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి) తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి ►తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ►పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ►నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ►ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ►ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్æస్పూన్లు తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ►పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ►మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ►మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపేయాలి ►చల్లారాక గాలి చొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు మామిడి కాయ గ్రేవీ చట్నీ కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక కప్పు; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 15 (కాశ్మీర్ మిర్చి); కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి – రెండు కప్పులు; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: ►తరిగిన పచ్చిమామిడికాయ ముక్కలను ఒక పెద్ద పాత్రలో వేసి పసుపు, ఉప్పు, బెల్లం జత చేసి కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించి తీసి చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి ►బాణలిలో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి కాగాక ఒక టీ స్పూను బియ్యం వేసి వేయించాలి ►మెంతులు కొద్దిగా జత చేయాలి ►మినప్పప్పు కూడా జత చేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►మిక్సీలో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, వేయించిన బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి ►మామిడికాయ ముక్కలు జత చేయాలి ►మిక్సీ పట్టిన మిశ్రమం జత చేయాలి ►కప్పుడు నీళ్లు పోసి కలపాలి ►ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోసి మరోమారు కలిపి మూత పెట్టాలి ►పావు గంట తరవాత మూత తీయాలి ►మామిడి గ్రేవీ చట్నీ అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడి కాయలు – 4 (పచ్చివి); ఎండు మిర్చి – 8 ; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు. తయారీ: ►మామిడికాయల తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక్కో ఎండు మిర్చిని మంట మీద దోరగా కాల్చాలి ►మిక్సీలో ఎండు మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేయాలి ►అన్నంలోకి వేడి వేడి నేతితో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడికాయ – కొత్తిమీర పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నానబెట్టిన పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవనూనె – అర టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4; పంచదార – అర టీ స్పూను తయారీ: ►మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, నానబెట్టిన పచ్చి సెనగ పప్పు, జీలకర్ర పొడి, ఉప్పులను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి ►ఆవ నూనె వేసి మరోమారు తిప్పాలి ►ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి తిప్పాలి ►పంచదార జత చేసి మరోమారు తిప్పాలి ►అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్నంలో ఏ పదార్థంతోనైనా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – అరకప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం: ►ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. ►పైన చెప్పిన పదార్థాలను (పోపు సామాను మినహాయించి) మిక్సీలో వేసి మెత్తగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పచ్చడిలో కలపాలి. -
కందకాలే మామిడి చెట్లను బతికించాయి!
కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు. బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు. జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500 వరకు ఖర్చయిందన్నారు. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు. -
కోహితూర్.. నిజమైన రాజ ఫలం!
చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్ను పాలించిన ముర్షీదాబాద్ చివరి నవాబు సిరాజ్–ఉద్–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్ నవాబు సిరాజ్–ఉద్–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు. హకీమ్ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్ వంగడాన్ని రూపొందించారు. రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!! -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్గఢ్లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
దారుణం: మామిడి పళ్లు కోయబోతే..
పట్నా : ఒక పక్క విచ్చలవిడి తుపాకీ సంస్కృతితో అమెరికాలో రోజుకో రక్తచరిత్ర నమోదవుతుండగా.. మన దేశంలో కూడా అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఆకలిగా ఉందని మామిడి పళ్లు కోసుకోవడానికి ఒక తోటలోకి ప్రవేశించిన బాలున్ని యజమాని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్లోని గోర్గి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్గర్ గ్రామ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పన్నెండేళ్ల పిల్లాడు పక్కనే ఉన్న తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లాడు. అక్కడే కాపలాగా ఉన్న యజమాని బాలున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. భయంతో పిల్లాడు పారిపోయేందుకు యత్నించడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ సరాసరి తలలోకి దూసుకుపోవడంతో మైనర్ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన మృతుని స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమచారం అందించారని ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనుకోకుండా జరిగిందా.. లేదా వేరెవరినో కాల్చే క్రమంలో పొరపాటున పిల్లాడు బలయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, తోట కాపలాదారుని వద్ద తుపాకీ ఎందుకుందనే విషయం కలకలం రేపుతోంది. -
‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్’
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్ చరణ్తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు. చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు. -
మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారట!
ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారని వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్గఢ్లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నాసిక్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంబాజీ మాట్లాడుతూ.. మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లితో మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలో ఈ రకమైన మామిడి చెట్లను పెంచాను. ఇప్పటి వరకు నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. శాంబాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, అతని వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్ డిమాండ్ చేశారు. మాజీ ఆరెస్సెస్ కార్యకర్త అయిన శాంబాజీ బిదే జనవరిలో బీమా-కొరిగన్ కులాల మధ్య చేలరిగిన హింసలో నిందితుడు. -
రాయగడ టు ఢిల్లీ
రాయగడ : రాయగడ జిల్లాలోని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, ప్రాంతంలో విదేశీ ఎగుమతికి సంబంధించిన ఉన్నత రకాల మామిడి పంటను ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఢిల్లీలోని మదర్డైరీకి ఆదివారం పంపించారు. రాయగడ రైల్వేస్టేషన్ నుంచి మామిడిపండ్ల మొదటి ఎగుమతిని డీఆర్డీఏ పీడీ సుఖాంత్ త్రిపాఠి రైల్వే వ్యాగన్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మామిడి రైతులకు నేరుగా వారి ఖాతాలో మామి డి మద్దతుధర లభించే విధంగా గత సంవత్సరం నుంచి జిల్లా యంత్రాంగం మామిడి ఎగుమతిని చేపట్టింది. గత సంవత్సరం మామిడి రైతులు దళారుల బెడద లేకుండా నేరుగా మంచి లాభా లను ఆర్జించారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మామిడి ఎగుమతి ప్రారంభం కాగా మొదటిరోజు 288కార్టన్ల(4.5 టన్నులు) మామిడి పండ్లు ఎగుమతి చేయగా ఢిల్లీలో కేజీ మామిడిపండ్లు రూ.50 నుంచి రూ.67 వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కావలసి ఉండగా ఇతర కారణాల వల్ల రాలేకపోవడంతో ఆమెకు బదులుగా డీఆర్డీఏ పీడీ హాజరయ్యారు. మామిడి సీజన్ పూర్తయినంత వరకు రాయగడ నుంచి మామిడి ఎగుమతి జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. -
ఒకే చెట్టు..12 రకాల కాయలు
కర్నూలు,జూపాడుబంగ్లా: ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నాగశేషులు 1993 నుంచి హార్టిక ల్చర్లో చెట్లకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టు పద్ధతి)లో నైపుణ్యం సంపాదించాడు. తనకున్న అనుభవంతో అతను తనపెరట్లో తినిపారేసిన మామిడిపిచ్చలు మొలకెత్తడంతో ఓ చెట్టుపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బనగానపల్లె, డోన్, పంచలింగాల, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో లభించే అల్ఫాన్స్, పెద్దరసం, నీలిశా, స్వర్ణజాంగీర్, రెడ్డి పసంద్, బేనిషా, మల్లికారసం, అనుపాళి, పెద్దాచారి, చిన్నాచారి, నీల్గోవ, హిమయత్ తదితర 20 రకాల మొక్కలను తెచ్చి చెట్టుకు అంటుకట్టాడు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది నాగశేషులు పెరట్లోని మామిడి చెట్టు గుత్తులు గుత్తులుగా 12 రకాల మామిడి కాయలను కాసింది. ఈ చెట్టును చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగశేషులు తనకున్న నైపుణ్యం వల్ల ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు కాయించగలగటాన్ని అందరూ ప్రశంసిస్తున్నా రు. ఇతని పెరట్లో ఉన్న మరో మా మిడి చెట్టు ఐదేళ్లు కావొస్తున్నా కాపునకురాలేదు. అంటుగట్టు పద్ధతి ద్వా రా త్వరగా చెట్లు కాపునకువస్తాయని నాగశేషులు పేర్కొంటున్నారు. గ్రాఫ్టింగ్ జిల్లాలో కొందరికే వస్తుంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో నైపుణ్యం ఉన్న వారు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను 1993 నుంచి హార్టికల్చర్లో పనిచేయడం ద్వారా అప్పట్లోని అధికారులు తెలియజేసిన మెలకువలను నేర్చుకోవడం ద్వారా నైపుణ్యం సంపాదించాను. గ్రాఫ్టింగ్లో కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ కాలంలోనే చెట్లు కాపునకురావటంతోపాటు ఫలాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. – నాగశేషులు, జూపాడుబంగ్లా, (సెల్ 9989491986) -
ఒరుగు.. ఎంతో మెరుగు
కుల్కచర్ల వికారాబాద్: మామిడి ఒరుగుతో మండల పరిధి లోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, కాముని పల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి పొ ందుతున్నారు. స్థానికంగా మామిడి తోటలు త క్కువగా ఉండటంతో ఇతర ప్రాంత్రాల నుంచి మామిడి కాయలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఒ రుగు చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో చా లా మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రా మాలలో నీడకు కూర్చుని ఒరుగు తయారు చేస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో అవి వృథా కాకుండా వాటిని కోసి ఒరుగు తయారు చేసుకున్నారు. ఆదే ఉపాధిగా ఈ గ్రామాలలో ప్రతి సంవత్సరం సీజన్ వ్యాపారంగా మారింది. నిరుద్యోగ యువకులు మండల పరిధిలోని పలు గ్రామలలో ఉన్న మామిడి తోటలను పూత దశలోనే కొనుగోలు చేస్తున్నారు. వాటిని కాపలా కాసీ మామిడి కాయలు కోసి మహిళల చేత ఒరుగు తయారు చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. మండల పరిధిలోని 6 గ్రామాలలో నెల రోజుల పాటు రోజు సూమారు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మామిడి తోటలు లభ్యం కాకుంటే అనంతపురం నుంచి మామిడి కాయలు తీసుకువచ్చి ఒరుగు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఒక సంచి మామిడి కాయలను 150 రూపాయల నుంచి 200 రూపాయలు వరకు ఇచ్చి ఒరుగు తయారు చేస్తున్నారు. ఈ ఒరుగుకు హైదరాబాద్లో మార్కెట్ లేదని నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేస్తున్నామని హైదరాబాద్ ప్రాంతంలో మార్కెట్ ఉంటే బాగుండేదని, స్థానికంగా మార్కెట్ సౌకర్యాం కల్పించాలని ఒరుగు వ్యాపారులు కోరుతున్నారు. సీజన్లో ఉపాధి పొందుతున్నాం ప్రతి సీజన్లో రోజు కూలీ వరకు సంపాది స్తాం. మామిడి కాయలు చిన్నగా ఉన్న సమయంలో తోటలను రై తుల నుంచి కొనుగో లు చేస్తాం. రెండు నెలలు వాటిని కాపలా కాసి కాయలు పెద్దగా అయిన తరువాత కో సి ఒరుగు తయారు చేయిస్తున్నాం. ఒక్కొక్క సారి కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలి పో తాయి. అప్పడప్పడు నష్టం కూడా వస్తుంది. – వెంకటేష్, వ్యాపారి, విఠలాపూర్ రోజూ రూ. 200 సంపాదిస్తున్నాం ఈ ఒరుగు ఉన్నని రో జులు రోజుకు 200 సంపాదిస్తాం. ఎండకు వెళ్లి పనిచేయాలంటే చే యలేక పోతున్నాం. చె ట్ల కింద కూర్చుని మా మిడి కాయలు కోసి ఒరుగు తయారు చేస్తా ం. ఒక సంచికి 150 రూపాయలు ఇస్తారు, ఇ ద్దరం కలిసి రెండు నుంచి మూడు సంచులు కోస్తాం. – లక్ష్మమ్మ విఠలాపూర్, కుల్కచర్ల -
విషం..నిగనిగ
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? అయితే..వాటిని కొనే ముందు, తినే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది స్వచ్ఛమైనదా? లేక ‘కార్బైడ్’ పండా అనే విషయం తెలుసుకోండి. లేదంటే అనారోగ్యాన్ని డబ్బు పెట్టి కొనుకున్నట్లే. కొద్ది రోజులుగా పెనుగాలుల తీవ్రతకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని కార్బైడ్తో కృత్రిమంగా మాగబెడుతూ.. అకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్లోకి తెస్తున్నారు. జిల్లాలో కాపు కాసే తోటలు 12వేల హెక్టార్లలో ఉన్నాయి. ప్రధానంగా మామిడి తోటలు వెల్దుర్తి, బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు, తుగ్గలి, కల్లూరు తదితర మండలాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని దిగుబడి 60 శాతం వరకు హైదరాబాద్కు తరలిస్తుండగా, మిగిలిన 40 శాతంలో ఎక్కువ భాగం కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర నిర్వహించే పండ్ల మార్కెట్కు వస్తోంది. కార్బైడ్ వాడకం ఏడాది పొడవునా ఉన్నా.. మామిడి సీజన్లో మరీ ఎక్కువవుతోంది. సాధారణంగా కాయ పక్వానికి వచ్చేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. దీంతో వ్యాపారులు రెండు, మూడు రోజుల్లో మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్ను యథేచ్ఛగా వాడుతున్నారు. అరటి, సపోట, యాపిల్ తదితర వాటిని కూడా ఇదే పద్ధతిలోనే మాగబెడుతున్నారు. చివరికి నిమ్మ కాయలకు కూడా ఆకర్షణీయమైన రంగు తెప్పించేందుకు కార్బైడ్ను వాడుతుండటం గమనార్హం. బంగినపల్లి మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రకం పండుకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అయితే.. ఈ పండ్లను సైతం మాగించడానికి కార్బైడ్ను వినియోగిస్తుండటంతో ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది. తనిఖీలు నామమాత్రమే ప్రజలకు సురక్షితమైన పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది. ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండటం, ఉన్న వారు పట్టించుకోక పోవడంతో విషతుల్యమైన పండ్లను ప్రజలు తినాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ పోస్టు ఖాళీగా ఉండటంతో అనంతపురం జిల్లా అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా మూడు రోజుల క్రితమే భర్తీ అయింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 4 ఉండగా, ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారులకు వాహన సదుపాయం కూడా లేకపోవడంతో తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శ్యాంపిల్స్ తీశారు. ఇందులో 6 శ్యాంపిల్స్ సురక్షితం కాదని, మరో మూడు శ్యాంపిల్స్ మిస్ బ్రాండ్ అని తేలింది. మరో 2 నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. కార్బైడ్ నిషేధం.. కాగితాలకే పరిమితం కార్బైడ్తో మాగించిన ఫలాలు తిని వినియోగదారులు వ్యాధుల బారిన పడుతుండటంతో ప్రభుత్వం 2012 మార్చి 19న కార్బైడ్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 288ని జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో నిషేధం కాగితాలకే పరిమితమైంది. సంబంధిత అధికారులు అడపాదడపా శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపడం మినహా ఎలాంటి చర్యలూ లేవు. రైతులు, వ్యాపారులకు కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించి, ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నేడు జేసీ ప్రత్యేక సమావేశం మార్కెట్లో కార్బైడ్తో మాగించిన పండ్లు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మలాయి చికెన్ వ్యాపారుల దందాపైనా ఈ సమావేశంలో చర్చించన్నారు. స్వచ్ఛమైన పండ్లు ఇలా ఉంటాయి. ♦ పుసుపు, లేత ఆకు పచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కార్బైడ్తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి.. ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపు రంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినపుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాల్షియం కార్బైడ్వాడకంతో అనర్థాలు ♦ క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ♦ చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, అధిక విరేచనాలు అవుతాయి. ♦ గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. -
అమామిడిని దూరం పెడుతున్నాం: చెంగల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి దిగుమతి అయిన పళ్లను తింటున్నాం కానీ, స్థానికంగా పండే మామిడి పండ్లను మాత్రం దూరం పెడుతున్నామని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు చెంగల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ‘పండ్ల సాగు రైతుల సమస్యలు– పరిష్కారాల’పై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాలిఫోర్నియా నుంచి యాపిల్, న్యూజిలాండ్ నుంచి కివీ పండ్లను దిగుమతి చేసుకొని తింటున్న మనం వివిధ కారణాలతో మామిడి పండ్లను దూరం పెట్టే పరిస్థితి దాపురించింది. ఆయా దేశాలకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పండ్లను ఎగుమతి చేస్తుంటే, అటువంటి పరిజ్ఞానం మామిడికి ఉపయోగించలేక పోతున్నాం. దీంతో రైతులు నష్టపోతున్నారు’ అని వాపోయారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!
గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో పెంచిన మామిటి చెట్టు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చెట్టుకు దాదాపు పది రకాల మామిడి కాయలు కాయడంతో వీక్షకులను అబ్బుర పరుస్తోంది. నాటు మామిడి మొక్క పెరుగుతున్న కొద్దీ దాని కొమ్మలకు బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు వంటి వివిధ రకాల కొమ్మలను శ్రీనివాసరావు అంటుకట్టారు. ప్రస్తుతం ఈ చెట్టుకు తోతపురి, బంగినపల్లి, సువర్ణరేఖ, సొరమామిడి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసం, తుమాని వంటి పది రకాలు మామిడి కాయలు కాస్తున్నాయి. తన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు ఇన్ని రకాల మామిళ్లు కాయిస్తున్న శ్రీనివాస శర్మ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఆయన ఇప్పటివరకూ మామిడి, సీతాఫలం, నేరేడు, బత్తాయి, రేగు పండ్లతో పాటు మందారం, గన్నేరు, వంటి పుష్ప జాతులకూ అంటుకట్టారు. -
మామిడి ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మార్చి 15న సాధారణ రకం మామిడి ధర టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షలు పలికింది.. అదే నెల 30న రూ. 65 వేలకు తగ్గిపోయింది.. ఏప్రిల్ 15న ధర రూ.50 వేలకు దిగజారింది. మే 1న(మంగళవారం) మామిడి ధర రూ.40 వేలకు పడిపోయింది. మామిడి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నాడు. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మామిడి ధర పడిపోవడంతో వినియోగదారులకు ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే అదీ లేదు. బహిరంగ మార్కెట్లో మాత్రం మామిడి ధరను రెండింతలు పెంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా అటు రైతును, ఇటు వినియోగదారులను దళారులు ఎడాపెడా దోచేస్తున్నారు. 30 శాతానికిపైగా పడిపోయిన ఉత్పత్తి రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల ఉత్పత్తి వస్తుంది. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఎకరానికి రెండు మూడు టన్నులకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రంలో సాధారణంగా 28 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నులలోపే ఉత్పత్తి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. మొత్తంగా 30 శాతం వరకు ఉత్పత్తి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి రైతుకు ఎక్కువ ధర రావాలి. కానీ రైతుకు దక్కాల్సిన సొమ్మును దళారులు సొంతం చేసుకుంటున్నారు. వినియోగదారులపై బాదుడే.. రైతుల నుంచి టన్నును రూ.40 వేలకు వ్యాపారులు కొంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో వినియోగదారుల నుంచి దీనికి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి రూ.40 వరకు ఉండాలి. కానీ మార్కెట్లో ఏకంగా రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ.150–200 వరకూ ఉన్నాయి. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తుంది. డిమాండ్ ఉన్నా సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్న పడిపోయాడు. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే మామిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. రూ. 41 వేలకే కొన్నారు రెండ్రోజుల కిందట నాలుగు టన్నుల మామిడి కాయలను తీసుకొచ్చాను. కానీ హైదరాబాద్లో దళారులు నాణ్యత సరిగా లేదనే సాకుతో టన్ను రూ. 41 వేలకే కొనుగోలు చేశారు. గత్యంతరం లేక దళారులకు నష్టాలకే మామిడి అమ్ముకున్నాను. – రాజశేఖర్, రైతు, సత్తుపల్లి -
లీజుదారులకు నిష్‘ఫలమే’
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సీజన్లో పూత నుంచే సమస్యలు మొదలయ్యాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు, పూత సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, తేమ వాతావరణంతో వచ్చిన పూత నిలువలేదు. నిలిచిన పూతను సైతం తెగుళ్లు ఆశించి నష్టం చేశాయి. మామిడి చెట్లకు అక్కడక్కడ ఉన్న కాయలు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రాలిపోయాయి. ఈ క్రమంలో వడగండ్లు, ఈదురుగాలుల బాధ పడలేక గుత్తేదారులు కాయ సైజు పెరగకుండానే కోస్తున్నారు. మార్కేట్లో ఏదో ఒక రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. గుత్తెదారుల గుండెల్లో దడ మామిడి తోటలను జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు లీజుకు ఇస్తుంటారు. ఈసారి మామిడి తోటలపై వాతావరణ ప్రభావంతోపాటు వడగండ్ల ప్రభావంతో ఉండటంతో లీజుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తోట యాజమానులకు ముందే డబ్బులు చెల్లించడం, కాయలు పెద్దగా లేకపోవడం, ఉన్న కొద్దిపాటి కాయ రాలడం, మంచి కాయ రేటు సైతం రోజు రోజుకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు తెచ్చి మరీ తోటలు లీజుకు తీసుకున్న లీజుదారులు.. దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో లీజు డబ్బులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 వేలపైగా రైతులకు చెల్లించి తోటలు లీజుకుతీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మామిడికాయ లేకపోవడంతో ధర ఓ మోస్తారుగా టన్నుకు మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండటం లీజుదారులకు కొంత ఊరటనిస్తోంది. భారీగా పెట్టుబడి ఖర్చులు.. లీజుదారులు మామిడి తోటలను లీజుకు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ పనిని వారే చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూత రాలిపోవడం, కాయ సైజు పెరగడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులతోపాటు పోటాష్ వేశారు. కాయ సైజు పెరిగినప్పటికీ తోటలకు రక్షణగా ఓ కాపాలదారుడిని పెడుతుంటారు. తర్వాత, సైజుకు వచ్చిన కాయలను కూలీలతో కోయించడం, మార్కెట్కు తరలించడం వంటి వాటికి లీజుదారులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు కనీసం రూ.10 వేలపైనే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి వచ్చేలా లేదు నేను ఐదు ఎకరాల తోట లీజుకు తీసుకున్నాను. పూత బాగానే వచ్చింది కాని ఆ మేరకు కాయ కనబడటం లేదు. కాయ చిన్నగా ఉన్నప్పటికీ రాళ్లవాన వస్తే ఇబ్బంది అని కొంతమేర తెంపి జగిత్యాల మార్కెట్లో అమ్మిన. ఈ సారీ మామిడి తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – గాదె శంకరయ్య, అనంతారం ఏం చేసుడో అర్థమైతలేదు ఈసారి ఐదారు తోటలు లీజుకు తీసుకున్న. పూత బాగా వచ్చిందని తోటలు పట్టిన. రెండుసార్లు మందులు కూడా కొట్టినా. అయినా ఊహించినంతగా కాయ రాలేదు. ఉన్న కాయ గాలులకు రాలిపోతున్నయ్. భయంతో ఇప్పటికే సగం కాయలు తెంపి అమ్మిన. మిగిలిన కాయలకు కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. – సత్తవ్వ, తిర్మలాపూర్ నిరుడు మంచిగ కాసినయ్ నేను ఈ ఏడాది 20 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్న. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులకు ముట్టజెప్పిన. అయితే నిరుడు మామిడి చెట్లు మంచిగ కాసిన. ఈసారి కూడా దిగుబడి బాగా వస్తదనుకున్నం. కానీ అనుకున్నంతగా చెట్లు కాయలేదు. ఇప్పటికే రెండుసార్లు కురిసిన రాళ్లవానకు ఉన్న కాయలు రాలినయ్. మళ్లీ గాలి దుమారం.. రాళ్ల వన పడుతదోనని భయమేస్తుంది. ఉన్న కాయను ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కాయ సైజు పెద్దగా ఉంటే బరువు వచ్చి లాభం ఉంటుంది. – పంబల్ల లక్ష్మి, తాటిపల్లి -
మామిడి ధరలు పుల్లన..!
విజయనగరం ఫోర్ట్ : మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. పది రెట్లు పెరిగాయ్.. గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బాగా పెరిగాయి... గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి ధరలు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి. ఇది రైతులకు కాస్త ఊరటగా ఉంది. తెగుళ్లు, పురుగులు, వాతావరణ మార్పుల వల్లే దిగుబడులు తగ్గాయి. – పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీడీ, ఉద్యానశాఖ -
భగ్గుమంటున్న ‘బంగినపల్లి’
కాశిబుగ్గ వరంగల్ సిటీ : మధుర ఫలాలుగా పేరొందిన మామిడి పండ్లు మామూలుగా ఏప్రిల్ మొదటి వారం నుంచి విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పూత, కాత నెల రోజులు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. కాగా హైదరాబాద్, విజయవాడల నుంచి కొందరు చిరు వ్యాపారులు దొరికిన కొద్దిపాటి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చి కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. ఈ మామిడి పండ్లు ప్రస్తుతం కాశిబుగ్గ చౌరస్తాతో పాటు అండర్బ్రిడ్జి, ములుగురోడ్డు సెంటర్లో లభ్యమవుతున్నాయి. సీజన్ ఆరంభంలో వచ్చిన మామిడి పళ్లను చూసి వినియోగదారులు కొనడానికి ఎగబడుతున్నారు. మందుగా అమ్మకానికి వచ్చే కోబ్రా, నీలంబరి, జలాలు, నీలాలు కూడా ఇప్పటి వరకు అమ్మకానికి రాలేదు. ఒక బంగినపల్లి మాత్రం అక్కడక్కడ అమ్మకానికి ఉండడం విశేషం.కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్మకాలు -
మామిడి.. మహా ప్రియం..!
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు నోరూరిపోతుంది. తమకు ఇష్టమైన మామిడి రుచి చూసేందుకు ఉవ్విళ్లూరిపోతారు. ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో బేనిషాన్ రకం ధర కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం.. పంట ఆలస్యం కావడంతో ఈ ఏడాది మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు చెపుతున్నారు. పుంజుకోని సీజన్..: గత ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే మామిడి సీజన్ ప్రారంభమై మార్చి మూడో వారానికి పుంజుకుంది. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి రోజూ దాదాపు 2.5 వేల టన్నుల మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు దిగుమతి అయింది. కానీ ఈ సీజన్లో రోజూ 25 టన్నులు కూడా దాటలేదు. గతంలో ప్రతి రోజు 2.5 వేల టన్నుల మామిడి వచ్చేది. ప్రస్తుతం అది 32 టన్నులకే పరిమితమైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు శుక్రవారం కేవలం 32 టన్నుల మామిడి దిగుమతి అయ్యింది. గతంలో మార్కెట్కు వందల సంఖ్యలో మామిడి లారీలు వచ్చేవి. అలాగే ఈ సీజన్లో ఇంకా మార్కెట్కు రకరకాల మామిడి పండ్లు రావడం లేదు. తగ్గిన దిగుబడి.. : గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సకాలంలో వర్షాలు పడకపోవడం.. భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో సరైన సమయంలో కాపు రాలేదని రైతులు, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మామిడి పూత కూడా ఆలస్యం కావడంతో పంట చేతికి రావటానికి ఇంకా 10–15 రోజులు పట్టే అవకాశం ఉంది. నగరానికి దిగుమతి.. ఎగుమతులు ఇవే.. బేనిషాన్, తోతాపూరి, సన్నరసాలు, పెద్ద రసాలు, హిమాయత్, చెరుకురసాలు, దసేరీ తదితర రకాల మామిడి పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్లో లభిస్తాయి. బంగినపల్లి, తోతాç పురి మాత్రం మార్కెట్కు రోజూ వేల టన్నులు వస్తాయి. చిన్నరసాలు, పెద్దరసాలు, దసేరీ, హిమాయత్ రోజుకు 3 నుంచి 4 టన్నుల వరకు వస్తాయి. గడ్డి అన్నారం మార్కెట్కు కృష్ణా జిల్లా నూజివీడు, విజయవాడ, గుడివాడ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, కొల్లాపూర్, నల్లగొండ, సూర్యాపేట్తో పాటు నగర పరిసరాల నుంచి రోజుకు వేల టన్నుల మామిడి దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. పూత ఆలస్యం వల్లే సీజన్ లేట్ రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మామిడి సీజన్ నెలా పదిహేను రోజులు ఆలస్యమైంది. దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్చి చివరి నుంచి దిగుమతి పెరగనుంది. మార్కెట్లో కార్బైడ్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి -
వ్యక్తి అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం, మందస: మండలంలోని అంబుగాం పంచాయతీ చిన్నలింబుగాం గ్రామానికి చెందిన వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని పులారి తులసి(36) అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి.. రాత్రికి చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం కాశీబుగ్గలో ఉన్నానని చెప్పిన ఆయన.. అంతలోనే విగత జీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మండలంలోని చిన్నలింబుగాం గ్రామానికి చెందిన తులసి.. గుజరాత్లోని గాంధీగ్రాం ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు. అక్కడి నుంచి మళ్లీ స్వగ్రామానికి వచ్చి.. హరిపురంలోని రట్టి రోడ్డు జంక్షన్ సమీపంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. జేసీబీ, ట్రాక్టర్ను అద్దెకు ఇస్తూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య భానుమతి, కుమారుడు హరీష్, కుమార్తె సంధ్య ఉన్నారు. రోజూ ఇంటి వద్ద నుంచి హరిపురం వెళ్లి వస్తున్నారు. బుధవారం యధావిధిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొంత సమయం తర్వాత భార్య భానుమతి ఫోన్ చేయగా.. కాశీబుగ్గలో ఉన్నానని తులసి చెప్పారు. రాత్రి సమయంలో ఫోన్ చేసినా ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అంబుగాం నుంచి చిన్నలింబుగాంనకు వెళ్లేదారిలోని తోటల్లో ఓ మామిడిచెట్టుకు ఉరి వేసుకుని కనిపించడంతో వీరంతా హతాశులయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి సోంపేట సీఐ సన్యాసినాయుడు, మందస ఎస్ఐ యర్ర రవికిరణ్ చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. డాగ్స్ మాత్రం అంబుగాం బస్షెల్టర్ వరకు వచ్చి వెనుతిరిగాయి. మృతదేహాన్ని బారువా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తులసి మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. తులసికి ఎవరితోనూ వివాదాలు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మామిడిచెట్టుకు ఎత్తుగా వేలాడుతుండడం.. సంఘటనా స్థలంలోనే ఓ చిన్న చాకు పడి ఉండడం.. మృతదేహంపై రక్తపు మరకలుగానీ, గాయాలు గానీ లేకపోవడంతో అందరిలోనూ మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం
- కుండపద్ధతిలో మామిడి సాగు పరిశీలన బుక్కపట్నం : మండలంలో కుండలతో సాగవుతున్న మామిడి తోటలను సోమవారం అమెరికా ప్రతినిధి బృందం పరిశీలించింది. బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి రైతులు ఇండో–జర్మన్ ప్రాజెక్టులో భాగంగా కుండల పద్ధతిలో మామిడి తోటలు సాగు చేశారు. అమెరికా ప్రతినిధి బృంద సభ్యులు నటాలియా, నటాలి, శాలినోశర్మ, గోపాల్ ఆధ్వర్యంలో కుండ పద్ధతిని క్షేత్రస్థాయిలో అధ్యనయం చేయడానికి వచ్చారని ఏపీఓ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. వారు రైతులతో నేరుగా మాట్లాడి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో టీఏ శేఖర్, రైతులు పాల్గొన్నారు. -
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలోని ఆడిటోరియంలో సోమవారం జరిగిన వికాసం సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 2017 జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం ఆరు రీజియన్ల పరిధిలోని కళాకారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు సోలో సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, సోలో డ్యాన్స్, డప్పు వాయిద్య పోటీలను నిర్వహించారు. ఆదోని, శ్రీశైలం రీజియన్లకు చెందిన కళాకారులతో కలిపి మొత్తం 218 మంది కళాకారులు పాల్గొన్నారు. వీటిలో విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాలు గల వారు ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి వారికి పోటీలను నిర్వహించారు. మంగళవారం కూడా జరిగే పోటీల అనంతరం విజేతలను ప్రకటిస్తామని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, ఆర్డీటీ డైరెక్టర్లు జేవీఆర్, దశరథరాముడు, నాగేశ్వరరెడ్డి, నిర్మల్కుమార్, కమ్యూనికేషన్ ఏడీ నాగప్ప, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. -
పండే కదా అని తినేస్తే...!
-
పండే కదా అని తినేస్తే..!
-
పరువే కాదు.. మామిడి కాయలు కూడా!
► తమ్ముడిని చంపిన అన్న ►జగిత్యాల జిల్లాలో ఘోరం జగిత్యాల రూరల్: ఆస్థి కోసం, పరువుకోసం హత్యలు చేయడం చూశాము. మరీ ఏకంగా మామిడి కాయల కోసం తమ్ముడి చంపిన ఘటన సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలీవి.. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్లు ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా ఒక మామిడిచెట్టు కాయలు నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం సాయంత్రం కోస్తుండగా రెండో అన్న నాంపెల్లి శ్రీను అక్కడకు చేరుకొని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మామిడి కాయలు తెంపుతున్న లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. ఆందోళనకు గురైన లక్ష్మణ్ కేకలు వేశాడు. సమీపంలో ఉన్న మరో అన్న హన్మండ్లు వచ్చాడు. గమనించిన శ్రీను ఆయనపైనా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే స్థానికులు కొందరు 108కు సమాచారం ఇచ్చి రక్తంమడుగులో పడిఉన్న లక్ష్మణ్ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే లక్ష్మణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురికావడం విషాదం నింపింది. మల్యాల సీఐ కృపాకర్, ఎస్సై కిరణ్కుమార్ జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య రమ, కొడుకులు అజయ్, అభి, కుమార్తె అఖిల ఉన్నారు. -
మామిడి తోటల్లోనే ఇథిలిన్ చాంబర్లు!
మామిడిని సాగు చేసే రైతులు మార్కెట్లో పంటను అమ్ముకోవటానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను మాగబెడుతున్నారనే సాకుతో మధ్య దళారీలు, మార్కెట్ ఏజెంట్లు కుమ్మక్కై రైతుల పొట్టకొట్టి లాభాలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే.. రైతు స్థాయిలో ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్ను ఏర్పాటు చేసుకోవడమే మార్గం. అందరికీ రసాయన అవశేషాలు లేని మామిడి పండ్లు అందుబాటులోకి వస్తా. కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధించిన నేపథ్యంలో.. వినియోగదారులకు హాని కలగకుండా ఇథిలిన్ వాయువు ద్వారా కృత్రిమంగా పండ్లను మాగపెట్టే ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్ గురించి ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చజరుగుతోంది. అయితే వాణిజ్య పరంగా ఇథిలిన్ ఎక్కడ దొరుకుతుందనే అంశంపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఇథిలిన్ ద్వారా మామిడికాయలు మాగపెట్టేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానం... ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్లో మామిడి కాయలను మాగబెట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఉపయోగాల గురించి సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. తోట వద్దే అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు రైతులు తోట వద్దే సొంతంగా రైపెనింగ్ చాంబర్ను నిర్మించుకోవచ్చు. లే దా అందుబాటులో వున్న గదిని వాడుకోవచ్చు. గాలి, వెలుతురు చొరబడకుండా.. కిటికీలు మూసి సీల్ చేయాలి. ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఇథిలిన్ సిలిండర్లు దొరుకుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.350 వరకు ఉంటుంది. ఒక్కో సిలిండర్ను ఉపయోగించి 3 నుంచి 4 టన్నుల మామిడి కాయలను మాగపెట్టొచ్చు. తొలుత గదిని గాలి, వెలుతురు చొరకుండా సీల్ చేసుకోవాలి. రైపెనింగ్ చాంబర్లో మామిడికాయలను వుంచాలి. గది విస్తీర్ణంలో మూడో వంతుకు మించకుండా పక్వానికి సిద్ధంగా వున్న కాయలను క్రేట్లలో అమర్చుకోవాలి. 100 నుంచి 150 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టాలి. 12 నుంచి 24 గంటల పాటు చాంబర్ తలుపులను మూసి ఉంచాలి. తర్వాత గదిని రెండు మూడు గంటల పాటు తెరిచి వుంచితే కార్బన్ డై ఆక్సైడ్ బయటకు పోయి కాయలు నల్లబడకుండా ఉంటాయి. తరువాత మరోమారు ఇథిలిన్ వాయువును పంపి మళ్లీ 12 గంటల పాటు గదిని మూసి వుంచాలి. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పండ్లు పక్వానికి వచ్చి మంచి రంగు, రుచితో వుంటాయి. గదిని మూసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నని పైపు ద్వారా.. ఇథిలిన్ వాయువును పంపాలి. రెగ్యులేటర్ సాయంతో అవసరమైన మొత్తంలో ఇథిలిన్ వాయువును పంపవచ్చు. మొదటి దశలో 150 పీపీఎం, రెండో దశలో 100 పీపీఎం వరకు వాయువును పంపాలి. కాల్షియం కార్బైడ్ వినియోగంతో కాయ చర్మం రంగు మారినా.. లోపల గుజ్జు మాత్రం పక్వానికి రాదు. కానీ ఇథిలిన్ వాయువు ద్వారా మాగపెట్టే పండ్లు లోపల గుజ్జు కూడా పూర్తిగా పక్వానికి వస్తుంది. అవసరమైతే వీటిని కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచి నింపాదిగా మార్కెటింగ్ చేసుకోవచ్చని కిరణ్ కుమార్ తెలిపారు. చైనా పొడికి శాస్త్రీయత లేదు కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం మార్కెట్లో మామిడి కాయలను కృత్రిమంగా మాగపెట్టేందుకు ‘చైనా పొడి’ని వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాల్షియం కార్బైడ్ను పొడి చేసి వాడుతున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి. అయితే చైనా నుంచి దిగుమతి అయిన ఈ పొడిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశోధన, ప్రయోగ సంస్థలేవీ ధ్రువీకరించలేదు. అధికారికంగా ఈ పొడి వాడకానికి ఎలాంటి అనుమతులు లేవని కిరణ్ కుమార్ తెలిపారు. రైపెనింగ్ చాంబర్గా మారిన రేకుల షెడ్డు! కుందూరు బుచ్చిరాంరెడ్డి ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసి వ్యవసాయం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దోమలోనిపల్లి ఆయన స్వగ్రామం.15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మామిడిని సాగు చేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండించిన మామిడి పండ్లను మార్కెట్కు తీసుకెళితే కమిషన్ ఏజెంట్లు నిండా ముంచేవారు. కాయలు కోసి.. వాహనాల్లోకి ఎక్కించేంత వరకు మంచి ధర ఇస్తామని నమ్మబలికేవారు. తీరా మార్కెట్కు వెళ్లిన తర్వాత వారిష్టం వచ్చిన ధర చెప్పి పైసలు చేతిలో పెట్టేవారు. ‘చూట్’ పేరిట 10 శాతం కాయలను ధర చెల్లించకుండానే తీసుకుంటున్నారు. గిట్టుబాటు కాకున్నా సరే వారు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించే వారు. మరోవైపు కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటాన్ని ఆసరాగా చేసుకొని కమిషన్ ఏజెంట్లు రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఏడాదంతా కష్టపడినా గిట్టుబాటు కాకపోవడంతో సొంతంగా మార్కెటింగ్ అవకాశాలపై బుచ్చిరాంరెడ్డి దృష్టి పెట్టారు. హైదరాబాద్లో జరిగిన ‘మ్యాంగో మేళా’లో స్టాల్ను అద్దెకు తీసుకుని.. మూడు నాలుగు రోజుల్లోనే ఒక టన్ను వరకు పండ్లను లాభసాటి ధరకు అమ్ముకున్నారు. మరోవైపు పరిచయస్తులకు, అపార్ట్మెంట్ల వద్ద మొబైల్ వ్యాన్తో కొంత మేర అమ్మకాలు జరిపారు. అయితే అమ్మకాలు బాగున్నప్పటికీ సహజసిద్ధంగా పండ్లను మాగపెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సైంటిస్టు కిరణ్కుమార్ సూచన మేరకు తోటలో ఇన్నాళ్లూ స్టోర్ రూంగా వాడుతున్న రేకుల షెడ్డును ఎలాంటి ఖర్చు లేకుండా ‘రైపెనింగ్ చాంబర్’గా మార్చారు. గదిని పూర్తిగా మూసివేసి.. రేకులపైన ఎండుగడ్డి వేసి రోజూ నీటితో తడిపేవారు. దీంతో గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించగలిగారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నటి పైపు ద్వారా నిర్దేశిత మోతాదులో ఇథిలీన్ వాయువును పంపుతూ పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఒక్కో కాయను మాగబెట్టడానికి 15 పైసలు ఖర్చవుతోంది. రిఫ్రాక్టోమీటర్తో పండ్ల పక్వాన్ని అంచనా వేస్తారు. దీని ఖరీదు రూ.1,600. ఇలా మాగపెట్టిన పండ్లను గ్రేడింగ్ చేసి సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజి గదిలో భద్రపరుస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ను కూడా బుచ్చిరాంరెడ్డి పొందారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు మామిడి తోటను సందర్శించి, అనుసరిస్తున్న సేంద్రియ పద్ధతులు, ఇథిలిన్ వాయువుతో మాగపెట్టడాన్ని పరిశీలించింది. ఈ సంస్థ సిఫారసు మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ పీజీఎస్ ఇండియా తెలంగాణ కౌన్సిల్ బుచ్చిరాంరెడ్డికి స్కోప్ సర్టిఫికెట్ ఇచ్చింది. – కల్వల మల్లికార్జున్ రెడ్డి, సాక్షి, సంగారెడ్డి జిల్లా ఫొటోలు: బగిలి శివప్రసాద్, ఫొటో జర్నలిస్ట్ కాయకు 15 పైసల ఖర్చుతో మాగబెట్టుకోవచ్చు రైపెనింగ్ చాంబర్లో మాగబెట్టిన మామిడి పండ్లను అమ్మేందుకు ఆర్గానిక్ సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. అపార్ట్మెంట్ల వద్ద నేరుగా అమ్మకాలు సాగిస్తున్నాం. నాణ్యత, రకాన్ని బట్టి మంచి ధర పలుకుతోంది. బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ స్టోర్లు కూడా మేము పండించిన మామిడి పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో కాయకు 15 పైసల ఖర్చుతో ఇథిలిన్ చాంబర్లలో మాగబెట్టుకోవచ్చు. ఇథిలిన్ చాంబర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు సిలిండర్లు ఇవ్వాలి. చిన్న రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలి. ఆమ్చూర్, గుజ్జు తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. – కుందూరు బుచ్చిరాంరెడ్డి (94412 84289) సేంద్రియ మామిడి రైతు, దోమలోనిపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం రైతులకు శిక్షణ ఇస్తున్నాం! స్వల్ప ఖర్చుతోనే రైతు స్థాయిలో తోటల్లోనే ఇథిలిన్ ద్వారా మామిడి కాయలను మాగపెట్టడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ద్వారా మాగబెట్టడం, రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటు తదితర అంశాలపై ముందుకు వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా బృందాలుగా వచ్చే ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తున్నాం. నేరుగా వచ్చే రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ఛాంబర్ల ఏర్పాటుపై మరిన్ని వివరాల కోసం.. ‘ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా – 502001, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాలో లేదా 08455– 276451 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. – డాక్టర్ కిరణ్ కుమార్ (94401 08930) సీనియర్ శాస్త్రవేత్త, ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
మామిడికాయల కోసం దారుణ హత్య
తమ్ముడిని చంపిన అన్న జగిత్యాల రూరల్: మామిడి కాయల కోసం ఓ అన్న తమ్ముడిని చంపిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్ అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా, ఒక చెట్టు కాయలను నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం కోస్తుండగా రెండో సోదరుడు నాంపెల్లి శ్రీను వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. లక్ష్మణ్ కేకలు వేయగా, సమీపంలోనే ఉన్న మరో సోదరుడు హన్మాండ్లు వచ్చాడు. దీంతో శ్రీను అతడిపైనా దాడికి ప్రయత్నించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ను స్థానికులు 108లో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్ కాగా, వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలి
► స్టాల్ను ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్ కరీంనగర్సిటీ: జిల్లాలో కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కార్బైడ్ రహిత మామిడిపండ్ల విక్రయం, వాడకంపై అవగాహనలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతిలిన్స్ప్రే ద్వారా పండించిన మామిడి పళ్ల విక్రయ స్టాల్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కార్బైడ్ ద్వారా పండించిన పండ్ల వాడకం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు. కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జేసీ బద్రి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి బండారి శ్రీనివాస్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాకు భారత్ మామిడిపండ్లు
మెల్బోర్న్: భారత్ తొలిసారిగా ఆస్ట్రేలియాకి మామిడి పండ్లను ఎగుమతి చేయనుంది. అన్నీ కుదిరితే మామిడి ఎగుమతులు ఈ ఏడాదే ప్రారంభం కావొచ్చు. జీవభద్రత నియమ నిబంధనలకు లోబడి ఎగుమతులు జరిగితే ఈ ఏడాది మామిడి సీజన్ ముగిసేలోగా భారతదేశం మామిడి పండ్లు ఆస్ట్రేలియాకు చేరుతాయని ఆస్ట్రేలియా మామిడి పరిశ్రమ సంఘ ప్రతినిధి రాబర్ట్ గ్రే చెప్పారు. -
మామిడి పండు.. దళారీ దండు
మార్కెట్ మాయాజాలంతో మామిడి రైతు కుదేలు పండ్ల ధరలు ఒక్కసారిగా పతనం.. పక్షం రోజుల్లో తారుమారైన పరిస్థితి బంగినపల్లి రకం ధర క్వింటాలుకు రూ. వెయ్యే.. తోతాపురి రూ. 6 వందలే.. మార్చిలో రూ. 25 వేల నుంచి 32 వేలు పలికిన క్వింటాలు ధర 11 శాతం కమీషన్ వసూలు చేస్తూ రైతుల్ని టోకుగా ముంచేస్తున్న దళారులు రైతు నుంచి తక్కువ ధరకు కొని నాలుగు రెట్లకు అమ్ముతున్న వ్యాపారులు పంటను వెనక్కి తీసుకెళ్లలేక తెగనమ్ముకుంటున్న రైతులు చిలుకూరి అయ్యప్ప, సాక్షి ప్రతినిధి: ఫలాల్లో రారాజు మామిడి..! మరి ఆ ‘రారాజు’ను పండించే రైతన్న..? దిగుబడి వచ్చినా ధర లేక, మార్కెట్ మాయాజాలపు చదరంగంలో ఓడిపోయి ‘పేద’గా మిగిలిపోతున్నాడు! తియ్యని పండ్లను మార్కెట్లకు తెచ్చి ‘చేదు’నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాట పడుతున్నాడు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, దళారులు మాత్రం బయట మార్కెట్లో నాలుగు రెట్లకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. గతేడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం మామిడి దిగుబడి మునుపటి కంటే భారీగా పెరిగింది. దీంతో ఆదాయం రెట్టింపు అవుతుందని భావించిన మామిడి రైతులకు దళారీ మార్కెట్ షాకిచ్చింది. సీజన్ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. దిగుబడులు పెరుగుతున్న కీలక తరుణంలో ఒక్కసారిగా తగ్గించేశారు. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో మార్చి నెల రెండో వారంలో బంగినపల్లి రకం మామిడి క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.1,500 మించి చెల్లించడం లేదు. గతనెలలో తోతాపురి రకం మామిడి రూ.2 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.600 నుంచి నుంచి రూ.900 మధ్య చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మామిడి పంట 4.71 లక్షల ఎకరాల్లో ఉన్నట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సగటున 21.19 లక్షల టన్నుల దిగుబడులు రావాల్సి ఉన్నా.. వడగళ్ల దెబ్బతో 14.13 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. గతేడాది ఈ దిగుబడులు 10 లక్షల టన్నుల లోపే ఉన్నాయి. మార్కెట్ మాయాజాలమిదీ.. రాష్ట్రంలో మెజారిటీ రైతులు కొత్తపేటలోని గడ్డి అన్నారం పళ్ల మార్కెట్లోనే దిగుబడులు విక్రయిస్తారు. వరంగల్, జగిత్యాలలోని చిన్న మార్కెట్లలో కొనుగోలు చేసిన దిగుబడులు సైతం కొత్తపేట్ మార్కెట్కు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. సమయం గడిస్తే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పంటను ప్రత్యామ్నాయంగా విక్రయించే అవకాశాలు లేకపోవడంతో కొత్తపేట మార్కెట్కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ మార్కెట్కు డిమాండ్ విపరీతంగా ఉండడంతో దళారులు.. కొనుగోలు, అమ్మకాలను శాసిస్తున్నారు. దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించడం ఒకటైతే... 11 శాతం కమీషన్ రూపంలో వసూలు చేయడంతో రైతు టోకుగా మోసపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ నిబంధనల మేరకు 4 శాతానికి మించి కమీషన్ వసూలు చేయకూడదు. రైతును గుల్ల చేస్తున్న వేలం మార్కెట్కు వచ్చిన మామిడి దిగుబడులకు దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారం మార్కెట్లో 97 స్టాళ్లు ఉండగా.. వీటి పరిధిలో 267 మంది కమీషన్ ఏజెంట్లున్నారు. వీరి వద్దకు వచ్చిన దిగుబడులకు ధరను వేలం ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారు సైతం కమీషన్ ఏజెంట్ల మనుషులే కావడంతో ధరల పెంపు, తగ్గింపు అంతా వారి నిర్ణయం మేరకే జరుగుతోంది. ఇక్కడ దిగుబడి తెచ్చిన రైతు కేవలం ప్రేక్షకుడిగానే ఉండాలి. ఈ ప్రక్రియతో అత్యుత్తమ రకం మామిడి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మార్కెట్ పూర్తిగా దళారులమయమైంది. గడ్డి అన్నారం మార్కెట్లో 60 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నా.. ఒక్క రైతుకూ నిల్వ చేసుకునే అవకాశం దక్కడం లేదు. కొనేది రూ.15... అమ్మేది రూ.60 రైతు నుంచి తక్కువ ధరలో మామిడి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు... బహిరంగ మార్కెట్లో నాలుగింతలు పెంచేసి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి టోకుగా కోనుగోలు చేస్తున్న బంగినపల్లి మామిడికి కిలోకు రూ.10–15 చెల్లించి.. అవి మక్కిన తర్వాత రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అలాగే తోతాపురి రకం మామిడిని కిలోకు రూ.6 నుంచి రూ.9కి కొంటున్న వ్యాపారులు.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.35 దాకా విక్రయిస్తున్నారు. ఈయన పేరు సత్తన్న. వనపర్తికి చెందిన ఈ రైతు గతేడాది రూ.2.5 లక్షలు పెట్టి 8 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే వచ్చింది. పళ్లను హైదరాబాద్లోని కొత్తపేట మార్కెట్కు తెచ్చాడు. ఇప్పటిదాకా మూడు దఫాలుగా 8 టన్నుల మామిడి పళ్లను విక్రయించగా రూ. 1.5 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో2 టన్నుల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా లెక్కేసుకుంటే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో శనివారం ఉదయం మార్కెట్లో ఇలా తల పట్టుకుని కూర్చున్నాడు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం ‘‘మార్కెట్లో కమిషన్ 4% మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నాం. లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే.. ఆ కమిషన్ ఏజెంటు లైసెన్సు రద్దు చేసే అధికారం మాకుంది. కానీ ఇప్పటివరకు ఫిర్యాదులేవీ రాలేదు. ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు ఇస్తున్నాం. త్వరలో మార్కెట్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తాం..’’ – పుట్టం పురుషోత్తం రావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూలీ కూడా దక్కలేదు ‘‘రూ.3.5 లక్షలు పెట్టి ఐదెకరాలు కౌలుకు మామిడి వేసిన. మార్కెట్కు ఈ రోజు 16 క్వింటాళ్ల మామిడి తీసుకొచ్చిన. వాటిని కొన్న వ్యాపారులు రూ.5 వేలు చేతిలో పెట్టారు. పొలం నుంచి మార్కెట్కు తీసుకొచ్చేందుకు బండి కిరాయికి రూ.4,500 ఖర్చయింది. కాయ తెంపేందుకు 10 మంది కూలీలకు రూ.3 వేలు చెల్లించిన. ఇప్పుడు మార్కెట్లో రూ.5 వేలు వచ్చినయి. మరి నాకెంత లాభం వచ్చిందో చెప్పండి..’’ – రంగస్వామి, మామిడి రైతు, పెబ్బేరు -
నీ ఆలోచనలే నువ్వు
‘‘స్వామీ! నా మనసు బాగులేదు. ఏదైనా వైద్యం ఉంటే చేయరా ...’’ అని తన ముందు తలవంచుకుని నిల్చున్న వ్యక్తిని చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు జెన్ సాధువు. ‘‘నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నిజానికి నీకు ఎలాంటి సమస్యా లేదు... నీకు ఏ మందూ అక్కరలేదు...’’ అన్నారు. ‘‘అలా అనకండి... నా మీద దయ ఉంచి సహాయం చేయండి. లేకుంటే ఏ స్థితికి లోనైపోతానో తలచుకుంటేనే భయమేస్తోంది...’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘సరే! నేను నీకు ఓ మందు ఇస్తాను... కానీ ఓ షరతు... నువ్వు ఈ మందు వేసుకునేటప్పుడు మామిడి పండు గురించి ఆలోచించకూడదు.. సరేనా’’ అన్నారు సాధువు. ‘‘అలాగే’’ అంటూ గురువుగారి నుంచి ఆయన ఇచ్చిన మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడతను. మరుసటిరోజు ఉదయం, స్నానం చేసి మందు వేసుకోవడానికి కూర్చున్నాడు. ఆ క్షణమే అతనికి మామిడి పండు గురించి జ్ఞాపకం వచ్చింది. అతని మనసంతా మామిడి పళ్ళతో నిండిపోయింది. ‘‘ఏమిటిది?’’ అనుకున్న అతను అర గంట తర్వాత మళ్ళీ మందు వేసుకోవడానికి ఓ మూల కూర్చున్నాడు. మళ్ళీ ఇందాకలాగే అతనికి మామిడి పండు గుర్తుకు వచ్చింది. ఆరోజు అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడి పళ్ళు గుర్తుకు రావడంతో మందు వేసుకోలేక పోయాడు. ఇక లాభం లేదనుకుని అతను ఆ రోజు సాయంత్రం గురువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి ‘‘మీరు ఇచ్చిన మందు వేసుకోవడం నా వల్ల కాలేదు... ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడిపళ్ళు గుర్తుకు వస్తూనే ఉన్నాయి...’’ అన్నాడు బాధగా. ‘‘అవును... ఎందుకు మామిడి పండు జ్ఞాపకానికి రాకుండా ఉంటుంది. నేను నీకిచ్చింది మామిడి పండు రసమే... ఆ వాసన వస్తుంటే నీకు మామిడి పండు గుర్తుకు రాకుండా ఉంటుందా... మామిడిపండు గుర్తుకు వచ్చే తీరుతుంది...’’ అని నవ్వుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నారు – ‘‘నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నీ మనసులో మెదులుతూనే ఉంటుంది. నీకు బుద్ధి పని చేయడం లేదని పదే పదే అనుకుంటే నీకు బుద్ధి లేదనే అనిపిస్తుంది. అలా కాకుండా నీ బుద్ధి బాగానే ఉంది అనుకుంటే నీ బుద్ధి సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది... నువ్వు ఏది అనుకుంటే అదే నిజం... కనుక నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావో ఆలోచించు... నీ ఇష్టం’’ అని అనడంతో అతను తన వాస్తవ స్థితిని తెలుసుకున్నాడు. తనకేమీ అనారోగ్యం లేదని అనుకుని గురువుకు దణ్ణం పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. -
మేలు మామిడి
గుడ్ ఫుడ్ మార్కెట్లోకి మామిడిపండ్లు విరివిగా వస్తున్నాయి. వాటికి సీజన్ ఇది. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. మామిడిలో ఏమేముంటాయి: చిన్న కప్పు మామిడి ముక్కల్లో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిలో ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని ఒక అంచనా. మామిడి ప్రయోజనాలు ⇒మామిడి పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. ⇒కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్ డీజనరేషన్’ ముప్పును తప్పించగల శక్తి దీని సొంతం. ⇒మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణించవచ్చు. ⇒కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్ మామిడిలో పుష్కలంగా ఉంటుంది. ⇒మామిడిలోని బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ⇒మామిడిలో ఉండే పొటాషియమ్ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. -
రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు
-
మధురఫలంలోమతలబు
-
మామిడి కొనుగోళ్ల నిలిపివేత
-
మామిడి కొనుగోళ్ల నిలిపివేత: హరీష్ ఆగ్రహం
హైదరాబాద్ : కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మామిడి కొనుగోళ్ల నిలిపివేతపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్ల నిలిపివేత సరికాదు.. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని వ్యాపారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించక పోతే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఆదేశం మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు. కార్బైడ్, చైనా పౌడర్ను ఉపయోగించి మామిడికాయలను మార్కెట్కి తీసుకు వస్తున్నారని వ్యాపారస్తులు కొనుగోళ్లు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్ వాడుతున్నారంటూ 92 దుకాణాలకు లైసెన్స్లు రద్దు చేస్తూ మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. మరో వైపు సోమవారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. -
ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్!
ప్రకృతి ప్రేమమయం.. చెట్లు మరీనూ.. మానవులకు పండ్లరూపంలో ‘తియ్యని’ ప్రేమను అందించుతాయి. ఆ గుప్పెడంత ప్రేమను ఒక్కోసారి దాచుకోలేక పుష్పం, కాయల రూపంలో బయటపెడతుంటాయి. ఆ బాపతుకు చెందిందే కొవ్వూరు మండలం కాపవరంలోని తాతా శేషారావు ఇంటి పెరట్లోని మామిడిచెట్టు. ఈ చెట్టుకు కాసిన హృదయం ఆకారంలోని మామిడి కాయ ఇదిగో ఇలా ఆకట్టుకుంటోంది. -కొవ్వూరు రూరల్ -
మామిడి తోటకు నిప్పు
శింగనమల : శింగనమల సమీపంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్దనున్న బెస్త సుంకన్నకు చెందిన మామిడి తోటకు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటనలో 150 మామాడి మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఐదేళ్ల కిందట 250 మామిడి మొక్కలు పెంచగా, ప్రసుత్తం అవి కాపు దశకు వచ్చాయని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో మొక్కలన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్ఐ శివారెడ్డి, వీఆర్ఓ వెంకట్రామిరెడ్డి తోట వద్దకు వెళ్లి కాలిపోయిన చెట్లను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
ప్రకృతి సేద్య ప్రసాదం!
- 21 ఎకరాల్లో పాలేకర్ పద్ధతుల్లో మామిడి, వరి, కూరగాయల సాగు - కృష్ణా జిల్లాలో సాగు.. హైదరాబాద్లో అమ్మకం - నేరుగా వినియోగదారులకు విక్రయంతో పెరిగిన నికరాదాయం - వరిలో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం - మామిడిలో కూరగాయల సాగుతో ఎకరాకు రూ. 75 వేల నికరాదాయం హైదరాబాద్లో సొంత వ్యాపారంలో స్థిరపడిన శేషసాయి వరప్రసాద్ జీవితాన్ని పాలేకర్ శిక్షణ మలుపుతిప్పింది. ఆ ప్రేరణతో నడి వయసులో పొలం బాట పట్టారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, పండ్లు, వరిని పండిస్తూ.. నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక నికరాదాయం గడిస్తున్నారు. వందల కి.మీ. దూరంలో ఉన్న తన పొలానికి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తుండడం విశేషం. సొంత గ్రామానికి దూరంగా నివసిస్తున్నా ప్రకృతి సేద్యం చేస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కి చెందిన శేషసాయి వరప్రసాద్. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం బూరుగుగూడెం ఆయన స్వగ్రామం. 1985లో డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి పదేళ్లపాటు క్యాటరింగ్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత నాగోలులో సొంతంగా క్యాటరింగ్ సంస్థను ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. గ్రామంలో ఉన్న 21 ఎకరాల మామిడి తోటను కౌలుకు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ద్వారా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి చదివి 2008లో శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆ విధంగా ప్రసాద్ మనసు ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. 2009 నుంచి తన తోటను కౌలుకు ఇవ్వటం మానేసి.. సొంతంగా తానే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వ్యాపారస్తులకు మామిడి పంటను అమ్మితే వారు దిగుబడి కోసం విచ్చలవిడిగా పూత, పురుగు నివారణ కోసం మందులు పిచికారీ చేసేవారు. దీంతో తోటలు దెబ్బతిని.. రైతులు మామిడి తోటలను తొలగించారు. ప్రసాద్ కూడా ఆరెకరాల్లో చెట్లను తొలగించి.. మూడెకరాల్లో కూరగాయలు, మూడెకరాల్లో వరిని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేపట్టారు. ప్రకృతి వ్యవసాయంలో ఒక వ్యక్తికి తానే శిక్షణ ఇచ్చి పొలంలో సూపర్వైజర్గా నియమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎర్రనేల, బోర్లపైనే వ్యవసాయం. తొలి దశలో దిగుబడులు తగ్గినా తదనంతరం మంచి దిగుబడులు వస్తున్నాయి. కూరగాయల సాగులో అధిక నికరాదాయం తొలి రెండేళ్లు పసుపును ప్రకృతి సేద్యంలో సాగు చేశారు. ఆదాయం కోసం పది నెలలు వేచి చూడాల్సి రావడంతో.. కూరగాయల సాగును చేపట్టారు. మూడెకరాల్లో వంగ, బెండ, టమాటా, దొండ, కాకర, వంకాయ, మునగ, మిర్చి, పొట్ల, బీర, దోసతోపాటు గోంగూర, తోటకూరలను సాగు చేస్తున్నారు. ఇదీ ఆయన సాగు పద్ధతి.. భూమిని పైపైన దున్ని ట్రక్కు మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని ఐదు మడులుగా విభజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు కొన్ని సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయలు వాడుతున్నారు. పురుగును గుడ్డు దశలోనే నివారించేందుకు నీమాస్త్రం వాడతారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేశారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీ. కషాయాన్ని 200 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతాయి. కిలో రూ. 20-30 చొప్పున విక్రయిస్తారు. నీటి కొరత వల్ల కూరగాయలు ఏడాదికి ఒకటే పంట వేస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేలు ఖర్చవుతాయి. ఖర్చులు పోను రూ. 75 వేల నికరాదాయం లభిస్తున్నది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రసాద్ తెలిపారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పోల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగేది.. ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లను హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. కూరగాయలు రుచికరంగా ఉండటం, ఫ్రిజ్లో పెట్టకున్నా మూడు రోజులు తాజాగా ఉండటంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఫోన్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. వరి.. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం ప్రసాద్ తన పొలంలో బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. దమ్ములో ఎకరాకు ట్రక్కు ఆవు పేడ వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని 15 రోజులకోసారి నీటి ద్వారా అందిస్తారు. రెండు వారాలకోసారి చీడపీడల నివారణకు బ్రహ్మస్త్రం,అగ్ని అస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో సాటి రైతులు అవహేళన చేశారు. అయినా.. ఆయన తన పని తాను కొనసాగించారు. గతేడాది ఎకరాకు 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రసాద్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తారు. బస్తా ధాన్యం మరపట్టిస్తే 55 కిలోల ముడి బియ్యం వస్తాయి. కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఆయన దగ్గర బియ్యం కొనే వారిలో కనీసం 50 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ఖర్చులు పోను ఎకరాకు రూ. లక్ష నికరాదాయం వస్తున్నదని ఆయన తెలిపారు. ఖర్చు రూ. 3 వేలు.. ఆదాయం రూ. 60 వేలు 15 ఎకరాల మామిడి తోటలో 300 చెట్లున్నాయి. ఇవి 30 ఏళ్ల నాడు నాటినవి. రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 48 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదు లీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ ట్రాక్టరుతో దున్నుతారు. పూత దశలో బ్రహ్మస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందె దశలో, పురుగు దశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో గతేడాది సగం దిగుబడే వచ్చింది. రసాయనిక సేద్యంలో ఎరువులు, పురుగు మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు మించి ఖర్చు కాదు. పండ్లకు మంచి ధర వస్తుంది. అయితే, చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండు రెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చు అంటారాయన. మామిడి పండ్లను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి, నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో పెట్టెలో 30 కాయలుంటాయి. పెట్టె రూ. 400 చొప్పున విక్రయిస్తారు. గతేడాది ఎకరాకు 150 పెట్టెల దిగుబడి వచ్చింది. రూ. 60 వేల చొప్పున పదిహేనెకరాల్లో రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. మామిడి చెట్ల మధ్య ఖాళీగా ఉండే భూమిలో స్థంభాలను పాతించి.. గుమ్మడి, బూడిద గుమ్మడి, పొట్ల, బీర, ఆనప వంటి తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఎకరాకు రూ. 30 వేల ఆదాయం పొందుతున్నారు. ‘పంతులు హైదారబాద్ నుంచి వచ్చి పిచ్చి వ్యవసాయం చేస్తున్నాడ’ని సాటి రైతులు తొలినాళ్లలో ఎగతాళి చేసేవారని, ఇప్పుడు వారే ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొస్తున్నారని ప్రసాద్ సంతృప్తిగా చెప్పారు. ఆయన తన తోటలో 26 నాటు ఆవులను పెంచుతున్నారు. ఆరుగురు రైతులకు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగా ఇస్తూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషం. కథనం : సాగుబడి డెస్క్ ఇన్పుట్స్ : కొమ్ము అర్జునరావు, సాక్షి, చాట్రాయి, కృష్ణా జిల్లా ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదు! హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ‘హరిత విప్లవం’తో ఆర్థికాభివృద్ధి సాధించాయని చదివి స్ఫూర్తిపొందేవాళ్లం. వరిలో ఎకరాకు 50-60 బస్తాల దిగుబడి అంటే అబ్బురపడేవాళ్లం. కానీ.. ఇప్పుడక్కడ దిగుబడులూ తగ్గాయి. కేన్సర్ రోగుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాల్సి వస్తున్నది. కేవలం డబ్బుంటే సరిపోతుందా.. మనిషి బ్రతకటానికి..? కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే సంపాదించిన రూపాయికి అర్థం లేదు. ప్రతి రైతూ తన కుటుంబం కోసం ఎకరంలో విధిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆరోగ్యంగా జీవించాలి. ప్రకృతి సేద్యం ద్వారా ఐదారు రకాల కూరగాయలు పండించి, మంచి ధరకు అమ్ముకుంటే.. నెలకు ఎకరానికి రూ. 50 వేల వరకూ నికరాదాయం పొందవచ్చు. అంతేకాదు.. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మాదిరిగా వ్యవసాయదారులు కూడా వారాంతపు సెలవులు తీసుకోవచ్చు. - పెండ్యాల శేషసాయి వరప్రసాద్ (98480 23143), బూరుగుగూడెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా -
ఇంటిప్స్
రోజుకు మూడుసార్లు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంటుంటే త్వరగా బరువు పెరుగుతారు. నెల రోజులలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మామిడిపండులో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బాగా పండిన తాజా మామిడిపండు ఒకటి తీసుకుని, గుజ్జును బ్లెండర్లో వేసి మెత్తగా చేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను కలిపి తాగాలి. -
అగ్ని ప్రమాదంలో మామడి తోట దగ్ధం
మైపాడు(ఇందుకూరుపేట): మండలంలోని మైపాడులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి మామిడి తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు మొత్తలు గ్రామానికి చెందిన గౌస్బాష మైపాడు, గంగపట్నం సరిహద్దుల్లో మామిడి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తోట సమీపాన ఓ రైతు పొలం వద్ద వ్యర్ధంగా పడి ఉన్న గడ్డిని తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మామిడి తోట వరకు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కాపలాదారులు కౌలుదారునితోపాటు స్థానికులకు ప్రమాద విషయం తెలియజేశారు. స్థానికులు వెంటనే చేరుకుని దగ్గరగా బోరు నీరు అందుబాటులో ఉండడంతో మంటలను ఆర్పి తీవ్రతను తగ్గించారు. ఈలోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు రెండెకరాల మేర తోట దగ్ధమవడంతో రూ.6 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు. -
మామిడి సాగుపై రేపు శిక్షణ
అనంతపురంఅగ్రికల్చర్ : మామిడి,సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.శ్రీనివాసులు, డాక్టర్ విజయశంకరబాబు హాజరై మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, సేంద్రియ పద్ధతుల ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268లో సంప్రదించాలన్నారు. -
వీడిన మహిళ హత్య మిస్టరీ
వివాహేతర సంబంధం బయటపడుతుందని హతమాచ్చాడు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోరుట్ల : పట్టణ శివారులోని మామిడితోటలోని రెస్ట్హౌస్లో గత నెల 27న గుర్తించిన మహిళ హత్య మిస్టరీ వీడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెవద్ద అప్పు తీసుకున్న వ్యక్తే హతమార్చిట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని సీఐ రాజశేఖర్రాజు సోమవారం అరెస్ట్ చూపారు. సీఐ కథనం ప్రకారం.. మాదాపూర్ వీఆర్వో రాకేశ్ ఫిర్యాదు మేరకు కోరుట్ల శివారులోని గఫార్ మామిడితోటలోని రెస్ట్హౌస్ గదిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహాం ఉన్నట్లు జులై 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన సీఐ రాజశేఖర్రాజు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సల్ల గంగు(45) కొన్ని రోజులుగా కనిపించడంలేదని ఆమె బంధువులకు ఫిర్యాదు చేశారు. వారికి మృతదేహం ఫొటోలు చూపగా వారు గుర్తుపట్టలేదు. దీంతో చనిపోయిన మహిళ విషయంలో స్పష్టత రాలేదు. మహిళ ఎవరన్న విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరికి మృతదేహాం సల్ల గంగుదేనని నిర్ధారించారు. ఆమెకు కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కల్లెడ లక్ష్మీనర్సయ్యతో మూడేళ్లుగా పరిచయం ఉందని తేలింది. ఆ దిశలో విచారణ సాగించగా లక్ష్మీనర్సయ్య తమకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని గంగు వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ తరువాత వడ్డీతోసహా చెల్లించాడు. అయినా ఇంకా డబ్బులు రావాలని లక్ష్మీనర్సయ్యతో గంగు గొడవ పడేది. డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని బయటపెడతానని బెదిరించింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కొన్నిరోజులు గొడవ జరిగింది. విసిగిపోయిన లక్ష్మీనర్సయ్య చివరికి ఆమె చంపాలని నిర్ణయించుకున్నాడు. జులై 22వ తేన గంగును తన మోటార్సైకిల్పై ఎక్కించుకుని కల్లూర్రోడ్లోని గఫార్ తోట వద్ద ఉన్న రెస్ట్హౌస్కు తీసుకెళ్లాడు. అక్కడ గొడవ జరగగా లక్ష్మీనర్సయ్య తన వెంట తెచ్చుకున్న నైలాన్ తాడును గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె సెల్ఫోన్ నుంచి సిమ్కార్డు తీసి వేసి ఫోన్, నైలాన్తాడును సమీపంలో ఉన్న పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడు తాను సల్ల గంగును హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. హత్య మిస్టరీని ఛేదించిన ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సైలు సతీష్, సూరి, అయిలాపూర్ వీపీవో మహేందర్ను సీఐ అభినందించారు. -
ఐదు వేల ఎకరాల్లో మామిడి మొక్కలు
ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల పక్కన నాటేందుకు కార్యాచరణ మహిళా గ్రూపులకు పరిరక్షణ బాధ్యత అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు కలెక్టర్ వాకాటి కరుణ ప్రణాళిక సాక్షిప్రతినిధి, వరంగల్ : హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హరితహారం అమలుతీరును ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుకు కొలమానంగా భావిస్తామని చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం సైతం అదే స్థాయిలో అమలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు ఒకటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రం కొనసాగిస్తూనే... జిల్లా కలెక్టరు వాకాటి కరుణ వినూత్న ప్రణాళిక రూపొందించారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల వెంట ఉన్న ప్రభుత్వ భూములలో మామిడి మొక్కలను పెంచాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మామిడి మొక్కల పెంపకం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో 400 ఎకరాల్లో మామిడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. మామిడి మొక్కల పెంపకం బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. మొక్కలు పెరిగిన తర్వాత వచ్చే మామిడి పళ్ల సేకరణ, అమ్మకం వ్యవహారాలు మహిళా సంఘాలకే అప్పగిస్తారు. ఆర్థికపరమైన అంశాల్లో మహిళా సంఘాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్(ఎస్పారెస్పీ), దేవాదుల ప్రాజెక్టుల నీటి సరఫరా కోసం జిల్లా వ్యాప్తంగా కాలువులను నిర్మించారు. కాలువల నిర్మాణం కోసం సాగునీటి శాఖ భూములను సేకరించింది. కాలువల నిర్మాణం తర్వాత రెండు వైపులా సాగునీటి శాఖ భూములు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో ఉన్నాయి. ఏడాదిలో కనీసం మూడు నెలలు ఈ కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువలకు ఇరువైపులా ఉండే సాగునీటి శాఖ భూములలో మామిడి మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టరు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్న 100 ఎకరాల భూముల్లో మొక్కలు నాటనున్నారు. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం గ్రేటర్ వరంగల్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని కాలువల వెంట 300 ఎకరాల్లో మామిడి మొక్కలను నాటనున్నారు. ఐదు వేల ఎకరాలు లక్ష్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు సాగునీటి కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూములో కొంత స్థలంలోనే నిర్మాణాలు ఉంటాయి. కాలువులకు రెండు వైపులా సాగునీటి శాఖ భూములు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ భూముల్లో మామిడి మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తొలిదశలో వరంగల్ నగరంలోని కాలువలకు పక్కన ఉన్న 100 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటుతాం. దశల వారీగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి శాఖ దీంట్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు మహిళా, శిశు సంక్షేమంలో ప్రధానమైన అంగన్వాడీ కేంద్రాలకు హరితహారంతో కొత్త కళను సంతరించే ప్రయత్నం జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. మొక్కల పెంపకానికి అనువైన స్థలం ఉన్న కేంద్రాలన్నింటిలో మునగ, కరివేప, నిమ్మ మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మొక్కలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. మొక్కలు రాగానే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒకేరోజు ఈ మూడు రకాల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఏర్పాౖటెన అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పోషకాలు ఉండే మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్తులో ఉపయోగాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ నాటేందుకు మునగ, కరివేప, నిమ్మ మొక్కలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి తెలిపారు. 12 వేల మొక్కలను అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ(ఐసీడీఎస్)కు సంబంధించి జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4196 అంగన్వాడీ కేంద్రాలు, మరో 327 మినీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలు కలిపి సగటున 2.18 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. గర్భిణులకు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ జరుగుతోంది. -
మామిడి తోటలో గుర్తుతెలియని మహిళ శవం
కోరుట్ల రూరల్ : మండలంలోని కల్లూర్రోడ్ మాదాపూర్ శివారులోని మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవా రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోట నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో పనిచేస్తున్న కూలీలు వెళ్లి చూశారు. తోటలో ఉన్న షెడ్డులో కుళ్లి పోయిన మహిళ మృత దేహం కనిపించిం ది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాబూరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తుపట్టలేకుండా ఉంది. ఒంటి పై నీలి రంగు చీర, ఎడమ చేతికి వాచీ ఉంది. మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
మామిడితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు మహేశ్వరం: మామిడితోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుండగులు హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మహేశ్వరంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో ఆదివారం దుర్వాసన రావడంతో కార్మికులు పరిశీలించారు. ఓ కుళ్లిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని వేరే ప్రాంతంలో హత్య చేసి రాత్రివేళలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
స్నాక్ సెంటర్
మ్యాంగో రవ్వ ఇడ్లీ కావలసినవి: ఉప్మా రవ్వ - 1 కప్పు, మామిడిపండ్ల గుజ్జు - 1 కప్పు, పంచదార - 1 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకులపొడి - పావు టీ స్పూన్, ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు, సార పప్పు - 1 టీ స్పూన్ లేదా జీడిపప్పు - 4 తయారీ: ముందుగా స్టౌ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులో రవ్వను కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలో మామిడిపండ్ల గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఆపైన కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. అలాగే ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను అందులో పెట్టి స్టౌపై పెట్టాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత తీసి చూడండి.. నోరూరించే మ్యాంగో స్వీట్ ఇడ్లీ రెడీ. బయటికి తీసిన ఇడ్లీలపై సార పప్పు లేదా జీడిపప్పును పెట్టి గార్నిష్ చేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టి పిల్లలకు సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు. రాగి స్నాక్స్ కావలసినవి: రాగి పిండి - ఒకటిన్నర కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, శనగ పిండి - 1 కప్పు, మినప పిండి (మినప పప్పును గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, కారంపొడి - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: ముందుగా నాలుగు రకాల పిండ్లను పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత అవి చల్లారాక ఓ పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ వేయాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లను పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని.. మురుకులు (జంతికలు) చేసే సాధనంలో పెట్టి ఒత్తుకోవాలి. ఆపైన స్టౌపై బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తర్వాత అందులో ఈ మురుకులను కాల్చుకోవాలి. ఒక్క షేప్ అనే కాకుండా వివిధ షేపుల్లో ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు. మష్రూమ్ కట్లెట్ కావలసినవి: సన్నగా తరిగిన మష్రూమ్స్ - రెండున్నర కప్పులు, ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, పసుపు - పావు టీ స్పూన్, కారంపొడి - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర కప్పు, నూనె - సరిపడా తయారీ: స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోసి, వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఆపైన అల్లం- వెల్లుల్లి పేస్ట్, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి వేసి స్టౌను చిన్న మంటపై పెట్టి దింపేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిదిమిన బంగాళాదుంపతో కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగును వేసి కలిపి, కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని గుండ్రంగా ఒత్తి ఉప్మా రవ్వలో ముంచాలి. ఇప్పుడు వాటిని పెనంపై నూనె చుక్కలు వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. (డీప్ఫ్రై కూడా చేసుకోవచ్చు) -
నితిన్కు పవన్ ప్రత్యేక కానుక
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్కు మరోసారి ప్రత్యేక కానుక అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్కు పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు. పవన్ కల్యాణ్కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్.. నితిన్కు మామిడి పళ్లను పంపాడు. Thank u sir..this means a lot -
ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు
మామిడి మాగబెట్టేందుకు కార్బైడ్కు ప్రత్యామ్నాయం ప్రచారం మాత్రం అంతంతమాత్రం నూజివీడులోని మామిడి హబ్లకు స్పందన నిల్ కార్బైడ్కే ఓటేస్తున్న వ్యాపారులు తెనాలి : మామిడికాయలను పండించేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్పై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝుళిపించింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కార్బైడ్ వాడకానికి కళ్లెం వేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూనే.. పండ్లను మాగబెట్టేందుకు ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు పాలకులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇథిలిన్ యూనిట్లకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, కార్బైడ్ను అరికట్టడానికి చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరతో కాయలు పండిస్తున్న వ్యాపారులు, ఆర్థికభారం పేరుతో ఇథిలిన్ హబ్లకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో కార్బైడ్ వినియోగం మితిమీరిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై కదిలిన తెలుగు రాష్ట్రాల అధికారులు మామిడి మార్కెట్లపై దాడులు చేశారు. వివిధ ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అంతటితో సరిపెట్టేశారు. కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు ఉద్యానశాఖ 35 శాతం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఎందువల్లంటే.. కార్బైడ్తో మామిడిపండుకు మంచి రంగు వస్తుంది. తొందరగా పండుతుంది. పచ్చి సరుకైనందున వ్యాపారులు త్వరితగతిన చేతులు మార్చి వీలైనంత లాభాలు ఆర్జించాలని చూస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో మామిడి దిగుబడి భారీగా పడిపోయింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో మామిడి పండు రూ.25-రూ.40 పలుకుతోంది. ఇథిలిన్తో మాగబెడితే మరింత ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుందని, ఎక్కువగా కార్బైడ్నే ఆశ్రయిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు చైనా, కొరియా దేశాల నుంచి పొడిరూపంలో వస్తున్న కార్బైడ్ను వారు వినియోగిస్తున్నారు. నూజివీడు హబ్లకు ప్రచార మేదీ? రాష్ట్రంలో నూజివీడు, తిరుపతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మ్యాంగో హబ్ పేరుతో ఇథిలిన్ యూనిట్లు నడుస్తున్నాయి. ఎగు మతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే వీటిని నిర్మించింది . వీటిని ఓ ప్రైవేటు సంస్థ లీజుకు కూడా ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీతో కృష్ణాజిల్లా నూజివీడులోని ఆగిరిపల్లి మండలం ఈదర శివారు బొద్దనపల్లిలో రత్నం మ్యాంగో హబ్ పేరుతో ఏర్పాటుచేసిన భారీ యూనిట్ గత మార్చి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇథిలిన్ యూనిట్లకు ఏ ఒక్కదానిలోనూ తగినంత మామిడికాయలు మాగబెట్టేందుకు రావటం లేదు. ఉదాహరణకు 300 టన్నుల సామర్థ్యం కలిగిన రత్నం మ్యాంగో హబ్కు అందులో కనీసం 10 శాతం వినియోగం కావటం లేదు. ప్రభుత్వ యూనిట్లలోనూ ఇందుకు భిన్నంగా లేదంటున్నారు. టన్ను కాయలు ఇథిలిన్తో మాగబెట్టాలంటే రూ.1,000 నుంచి రూ.4,000 వరకూ వ్యయం చేయాల్సి వస్తోంది. కార్బైడ్ అయితే కేవలం రూ.600-700తో సరిపోతున్నందున వ్యాపారులు ఇథిలిన్పై ఆసక్తి చూపించడ లేదు. వ్యాపారుల విజ్ఞప్తులతో చూసీచూడనట్టు ఉండాలని పాలకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు దాడులు చేసి సేకరించిన శాంపిల్స్ నివేదికలను ఇప్పటికీ తెప్పించకపోవటం దీనికి ఊతమిస్తోందని పేరు చెప్పని ఒక వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. -
బె‘ధర’గొడుతున్న ఆవకాయ!
* పచ్చళ్ల తయారీపై ధరల పోటు * కన్నీళ్లు తెప్పిస్తున్న కారం పొడి * రెట్టింపైన ఆవాలు, ధనియాలు, మెంతుల రేట్లు * మామిడికాయలదీ అదే దారి కామారెడ్డి: ప్రతి ఇంటా కనిపించే ఆవకాయ.. ఈసారి ఖరీదై పోయింది. పచ్చళ్ల తయారీపై ధర భారం పడింది. తొక్కుల తయారీలో ఉపయోగించే అన్ని వస్తువుల రేట్లకు రెక్కలొచ్చాయి. కారం పొడి, జీలకర్ర, మెంతు లు, ఆవాలు, ధనియాలకు తోడు మామిడికాయ ధరలు చుక్కలనంటుతున్నాయి. నోరూరించే ఆవకా య ప్రస్తుతం ఆర్థికంగా భారమైంది. ఏపూటకు ఆ పూట సర్దుకొనే పేద కుటుంబమైనా, ఆర్థికంగా స్థితిమంతులైనా సరే.. ప్రతి ఇంట్లో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ అన్నంతో పాటు ఆవకాయను ఆరగించాల్సిందే. కొందరు పేదలైతే పచ్చడితోనే పూట గడిపేస్తారు. ఓపూట కూర లేకున్నా ఆవకాయతో సర్దుకుంటారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీ లు ఏడాదికి సరిపడినంతగా పచ్చళ్లను తయారు చేసుకుంటారు. అయితే, ఈసారి పచ్చళ్ల తయారీకి వాడే వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడంతో తొక్కుల తయారీకి సిద్ధమైన పేద, మధ్య తరగతి వర్గాలు నిట్టూరుస్తున్నాయి. ఎన్నెన్ని రకాలో.. మామిడికాయతో రకరకాలు తొక్కులు, పచ్చళ్లు తయారు చేస్తారు. మామిడి కాయను తరిగి చేసే తొక్కును సొప్పు తొక్కు అంటారు. అలాగే, ఆవకాయ తొక్కు, ఎల్లిపాయ తొక్కు, ఉప్పావ, మెంతావ తదితర రకాల పచ్చళ్లు చేస్తారు. చక్కెర, కొబ్బరితోనూ రకరకాల తొక్కులు పెడతారు. పేదల ఇళ్లలో మాత్రం ఆవకాయ తొక్కే ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ధరలు పెరిగినయి తొక్కులు పెట్టెతందుకు ముందుగళ్లనే అన్ని సామాన్లు తెచ్చి పొడులు తయారు చేసుకుంటం. ఇంతకు ముందు పెద్ద పెద్ద మడ్తమాన్లల్ల తొక్కులు పెట్టేటోళ్లం. ఇప్పుడు కొద్దిగంతనే పెట్టుకుంటున్నం. కారంపొడి, ఆవాలు, మెంతులు, ధనియాల ధరలు అడ్డగోలుగా పెరిగినయి. వేలకు వేలు పెట్టి తొక్కులు పెట్టడం భారంగా మారింది. - శేర్ల లక్ష్మి, భిక్కనూరు చుక్కలనంటుతోన్న ధరలు.. తొక్కుల తయారీలో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఆవాల పొడి, కారంపొడి, ఉప్పు, ఆవాలు, పల్లి నూనె వాడతారు. జీలకర్ర ధర గత యేడాది కిలోకు రూ.180 ఉంటే ఈసారి రూ.240కి చేరింది. మెంతులు నిరుడు రూ.60 ఉంటే ఇప్పుడు రూ.130కి చేరాయి. ధనియాల పొడి గతంలో రూ.120 ఉండగా, ఇప్పుడు రూ.170, కారంపొడి నిరుడు రూ.170 ఉంటే, ప్రస్తుతం రూ.240 కి చేరాయి. కుటుంబానికి సరిపడా తొక్కుల తయారీకి గతంలో రూ.2 వేల లోపు సరిపోయేది. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.3-4 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడికాయల ధరలు సైతం.. వాతావరణ పరిస్థితులు సహకరించక ఈసారి మామిడి సరిగా కాయలేదు. కాసినా వడగళ్లు, ఈదురుగాలులతో రాలిపోయాయి. దీంతో మామిడికాయల కొరత ఏర్పడి, వాటి ధరకు రెక్కలొచ్చాయి. ఆవకాయ కోసం అవసరమైన చిన్న మామిడి కాయ ధర ఒక్కొక్కటి గతంలో రూ.2-3 ఉంటే, ప్రస్తుతం రూ.5-6 పలుకుతోంది. అలాగే సొప్పు తొక్కులు పెట్టే పెద్ద మామిడికాయలు గతంలో రూ5 ఉంటే, ఇప్పుడు రూ.10కి చేరింది. నిమ్మకాయలదీ అదే పరిస్థితి. మార్కెట్లో వాటి ధరలు అడ్డగోలుగా ఉన్నాయి. దీంతో తొక్కు అంటేనే జనం ముక్కు విరుస్తున్నారు. తొక్కులు పెట్టుకునేకన్నా అవసరం ఉన్నపుడు రెడీమెడ్ పచ్చళ్లు తెచ్చుకోవడమే ఉత్తమమని చాలా మంది తొక్కులకు దూరమవుతున్నారు. గతంలో ఏ ఇంట్లో అయినా 2-3 మడతమానుల నిండా పచ్చళ్లు పెట్టేవారు. ఇప్పుడు పెరిగిన ధరలతో తొక్కుల వాసన రావడం లేదు. -
మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు
వేసవి జ్ఞాపకం... వేసవి ఉక్కపోతను తట్టుకోలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎండాకాలమంటే ఇష్టం ఎందుకంటే మగ్గిన మామిడి పళ్ల వాసనలు, మల్లెపూల పరిమళాలూనూ. లేత తాటిముంజలు, ఈతపళ్ల తియ్యదనాన్ని రుచి చూడాలంటే వేసవి కాలం రావలసిందే కదా. చిన్నప్పుడు ఎండాకాలం మొదలవడంతోటే అమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా, అత్తలు కలిసి పెట్టిన అప్పడాలు, వడియాలను కాకులు ఎత్తుకుపోకుండా, కుక్కలు ముట్టుకోకుండా కాపలా కాసే డ్యూటీ పడేది! మధ్యమధ్యలో ఎండినయ్యో లేదో చూసే వంకతో పచ్చిపచ్చిగా ఉన్న వడియాలను రుచి చూడటం ఒక పచ్చి జ్ఞాపకం. అన్నట్టు అప్పడాలు ఎండినయ్యో లేదో కనుక్కోవడానికి మా అమ్మమ్మ ఒక చిట్కా చెప్పింది. అదేమంటే అప్పడాలు వాటంతట అవి బోర్లాపడుకోబెట్టినట్టుగా కొద్దిగా పైకి లేస్తే అవి ఎండినట్టు. ఆరేసిన బట్ట కింద చిన్నగా చెయ్యి పోనివ్వగానే ఊడి వస్తుంటే గనక వడియాలు ఆరినట్టు. వాటి సంగతి ఏమోగాని వాటి వంకతో చెట్టు కింద కూచుని చందమామ పుస్తకంలో విక్రమార్కుడి భుజాన వేళ్లాడే తెల్ల తోకదెయ్యం బొమ్మను చూస్తూ కూచోవడం ఒక జ్ఞాపకం. పొద్దున్న పదింటికల్లా అన్నం తినేసి, ఒక రౌండు ఆటలు ఆడుకునేవాళ్లం. మధ్యాన్నం పన్నెండున్నరా ఒంటిగంటకల్లా మా తాతయ్య ఇంట్లో కిటికీలన్నింటికీ తడిబట్టలు కట్టించి ఇంటిని ఏసీలా మార్చేసేవాడు. నాలుగున్నరా అయిదు వరకూ పిల్లలెవరూ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. నిద్దరొచ్చేదాకా తాతయ్య చెప్పిన కబుర్లు వింటూ వాసాలు లెక్కిస్తూ ఎండకు చివ్వుచివ్వుమనే పిచ్చుక కూతలను వింటూ చాపల మీద పడి దొర్లేవాళ్లం. కాసేపు బజ్జోని లేచేసరికి మామిడిపళ్ల వాసన గాలిలోంచి తేలుతూ వచ్చి పలకరించేది. ఒక చిన్నగిన్నెలో మామిడిపండు పెట్టి ఇచ్చేది మా నానమ్మ. అది తినకుండానే ఆశగా రెండో పండు వైపు చూసేవాణ్ణి. ‘ముందు ఇది తిను, దాని సంగతి తర్వాత చూద్దువుగానీ’ అనేది నవ్వుతూ. మామిడిపండో, ఈతకాయలో, సపోటా పళ్లో... ఇలా ఏవో ఒక చిరుతిళ్లు సిద్ధంగా ఉండేవి ఇంట్లో ఎప్పుడూ! ఏవీ లేకపోతే కందులో పెసలో ఉడకబెట్టి, ఉప్పూకారం కొత్తిమీర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే గుగ్గిళ్లు చేసి పెట్టేది. ఇక సాయంత్రం పూట ఆడపిల్లలకు పూలజడలు వేసేవాళ్లు. జడతో ఫొటోలు తీయించేవాళ్లు. పూలజడ వేయించుకుని వచ్చి, పెద్దవాళ్లకు దణ్ణం పెట్టడం వాళ్లు ప్రేమగా బుగ్గలు పుణికి పదో పరకో చేతిలో పెట్టడం ఒక రూపాయి కాసులాంటి జ్ఞాపకం. ఇప్పుడు అప్పడాలూ వడియాలూ పెట్టడం, పూలజడలు వేయించుకోవడం పల్లెటూళ్లలో కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యమే అయింది. పెద్దోళ్లేమో ఏసీలు, కూలర్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఇంట్లో పడుకోవడం, పిల్లలేమో కంప్యూటర్లోనో, స్మార్ట్ ఫోన్లలోనో గేమ్స్ ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ నవ్వులు, ఉట్టుట్టి ఆటలు... అంతా ఉట్టుట్టికే! అసలు ఉబ్బరింత ఇదే కదా. - బాచి -
ఏపీలోని నాలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం
పిడుగుపాటుకు నలుగురి మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నాలుగు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. మామిడి కాయలు నేలరాలి రైతన్నలకు నష్టం మిగిల్చింది. మరోవైపు పిడుగుపాటుకు విశాఖ జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హిందూపురంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గురువారం ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డారుు. విశాఖ ఏజె న్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రికి కూడా అనేక చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఏజెన్సీ రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మామిడి ముక్క గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
ధన్వాడ (మహబూబ్ నగర్) : గొంతులో మామిడి ముక్క ఇరుక్కొని ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లలితమ్మ, కుమ్మరి కాశీమన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా ఆరుబయట కుమార్తెలు మామిడిపండు ముక్కలను తింటున్నారు. అదే సమయంలో చిన్న కుమారుడు అభినేష్ (ఏడు నెలలు) నోట్లో పెట్టుకున్న ఒక ముక్క గొంతులో ఇరుక్కుంది. గమనించిన తల్లి, తాత వెంటనే బాలుడిని మరికల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. -
మామి'డిష్'
పండ్లలో కింగ్.. రారాజు.. మారాజు.. మామిడిపండు. దాంతో కూరొండి... పలావ్ పకాయించి.. స్వీట్ పాకం పోసి.. సమోసా వేయించి... మీ పతికి వడ్డిస్తే ఛత్రపతిలా ఫీలయిపోడూ! ఎంజాయ్ మామిడిష్!! మ్యాంగో జలేబీ కావల్సినవి: మామిడిపండు (అల్ఫోన్సో రకం) - 1 పంచదార - 300 గ్రా.లు కుంకుమపువ్వు - కొన్ని రేకలు నీళ్లు - కప్పు (250 ఎం.ఎల్) పాలు - కప్పు (250 ఎం.ఎల్) పెరుగు - 100 గ్రా.లు మైదా - కప్పు (200 గ్రా.లు) నెయ్యి - 500 గ్రా.లు తయారీ: * మైదా, పెరుగు కలిపి ఒకరోజంతా నానబెట్టాలి. * పంచదారను కరిగించి, లేత పాకం పట్టాలి. దీంట్లో పాలు పోసి కలిపి పక్కనుంచాలి. * మామిడిపండును నిలువు ముక్కలుగా కట్ చేయాలి. * కడాయిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. మామిడిపండు ముక్కలను మైదా పిండిలో ముంచి కాగుతున్న నెయ్యిలో వేసి వేయించాలి. * ఇలా వేయించిన మామిడిపండు ముక్కలను పంచదార పాకంలో ముంచి, సర్వ్ చేయాలి. మలబారి మ్యాంగో కధీ కావల్సినవి: మామిడిపండు - 1 (ముక్కలుగా కట్ చేయాలి) జీలకర్ర - టీ స్పూన్ (వేయించాలి) ఆవాలు - అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు కారం - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత కొబ్బరి నూనె - టీ స్పూన్ మెంతులు - అర టీ స్పూన్ కొబ్బరి తరుగు - అర కప్పు ఎండుమిర్చి - 2, కొత్తిమీర తరుగు - టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; పంచదార - చిటికెడు తయారీ: * అర కప్పు నీళ్లతో మామిడిపండు ఉడికించాలి. * కొబ్బరి తురుము, జీలకర్ర, ఉల్లిపాయముక్కలు, పసుపు కారం కలిపి పేస్ట్ చేయాలి. ఇందుకు కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. * ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడిపండులో వే సి సన్నని మంటమీద ఉంచాలి. * పెరుగును చిలికి, అరకప్పు నీళ్లు పోసి కలపాలి. మామిడిపండు-కొబ్బరి మిశ్రమం ఉడికాక మంట తీసేసి చిలికిన పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. * చిన్న కడాయిలో టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును మామిడిపండు పెరుగు మిశ్రమంలో కలపాలి. దీన్ని రైస్లోకి వడ్డించాలి. మ్యాంగో కోఫ్తా పలావ్ కావల్సినవి: బాస్మతి బియ్యం - కప్పు (ఉడికించి, పక్కన పెట్టాలి) మామిడిపండు ముక్కలు - కప్పు పనీర్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు నూనె - 4 టీ స్పూన్లు మొక్కజొన్న పిండి - టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - కప్పు బిర్యానీ ఆకులు - 2 లవంగాలు - 2 దాల్చిన చెక్క - చిన్న ముక్క నెయ్యి - టీ స్పూన్ రోజ్వాటర్ - టీ స్పూన్ అల్లం ముద్ద - టీ స్పూన్ శనగపిండి - టీ స్పూన్ కోఫ్తా తయారీ: * టీ స్పూన్ పనీర్, మామిడిపండు ముక్కలు, మొక్కజొన్న పిండి, చిటికెడు శనగపిండి, చిటికెడు యాలకుల పొడి, టీ స్పూన్ జీడిపప్పు పలుకులు కలిపి, ముద్ద చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. * విడిగా మరో పాత్రలో మొక్కజొన్న పిండి, శనగపిండి, ఉప్పు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా చిక్కటి మిశ్రమం కలుపుకోవాలి. * కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న పనీర్ ఉండలు జారుగా కలిపిన శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి బాగా వేయించి, తీసి పక్కన పెట్టాలి. పలావ్ తయారీ * కడాయిలో టీ స్పూన్ నూనె, జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తరిగిన అల్లం, ఉప్పు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. * దీంట్లో పచ్చిమిర్చి, ఉడికిన బాస్మతి రైస్, కొత్తిమీర వేసి కలపాలి. కొద్దిగా రోజ్వాటర్ పైన చిలకరించి, కోఫ్తా బాల్స్ వేసి కలిపి, కొత్తిమీర, పుదీనా, మామిడిపండు ముక్కలతో అలంకరించి వేడి వేడిగా వడ్డించాలి. కైరీ చనాదాల్ ఢోక్లా కావల్సినవి: శనగపప్పు - కప్పు ఉప్పు - టీ స్పూన్ పచ్చిమిర్చి తరగు - టీ స్పూన్ పంచదార - టీ స్పూన్ తెల్ల నువ్వులు - టీ స్పూన్ రిఫైండ్ ఆయిల్ - టీ స్పూన్ ఆవాలు - టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్ కరివేపాకు - 2 రెమ్మలు ఉప్పు - చిటికెడు మామిడికాయ తురుము - కప్పు కొత్తిమీర - అర కప్పు తయారీ: * శనగపప్పును కడిగి 3 గంటలు నానబెట్టాలి. * నీళ్లను వడకట్టి, పప్పు మెత్తగా రుబ్బాలి. దీంట్లో ఉప్పు, కొద్దిగా నూనె కలపాలి. * అలాగే మామిడికాయ తురుము వేసి కలపాలి. * ఢోక్లా ఉడికించే గిన్నెకు అడుగు భాగాన నెయ్యి రాసి దాంట్లో పిండి పోయాలి. * ఈ ప్లేట్ను ఇడ్లీ పాత్రలో పెట్టి 10-15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. * తర్వాత కత్తితో ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి. * కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పంచదార, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. దీంట్లో కట్ చేసిన ఢోక్లా వేసి వేయించి, సర్వ్ చేయాలి. కైరి సమోసా కి సబ్జీ కావల్సినవి: పచ్చిబఠాణీలు - కప్పు; పనీర్ ముక్కలు - కప్పు రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు - 4 వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; వాము - టీ స్పూన్; ఉల్లిపాయల తరుగు - కప్పు; పసుపు - అర టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ మొక్కజొన్న పిండి - టీ స్పూన్; ఇంగువ పొడి - అర టీ స్పూన్ క్యారట్ తరుగు - కప్పు; బీన్స్ తరుగు - కప్పు; మైదా - కప్పు మామిడికాయ ముక్కలు - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు జీడిపప్పు - 5; ఎండుకొబ్బరి తరుగు - టీ స్పూన్; సారపప్పు - 3 యాలకులు - 3; మసాలా దినుసులు - (దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 2; అనాసపువ్వు - 2; ధనియాలు - టీ స్పూన్ నల్లమిరియాలు - 6; సోంపు - టీ స్పూన్) నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; తయారీ: సమోసా: మైదాలో వేడి నీళ్లు, ఉప్పు, వాము, నెయ్యి కలిపి, ముద్ద చేసి, పైన మూత పెట్టి, పక్కన పెట్టాలి. * మసాలా దినుసులు వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. * మరో కడాయిలో నూనె వేసి అందులో ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బంగాళదుంప, మామిడిముక్కలు, క్యారట్, బఠాణీ, బీన్స్, పనీర్, పసుపు, కారం, ఉప్పు, కొబ్బరి తురుము, పంచదార, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం వేగాక కొత్తిమీర వేయాలి. * కలిపిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని, పూరీలా ఒత్తుకోవాలి. చేత్తో కోన్ షేప్లో తయారుచేసుకొని, దీంట్లో ఉడికిన కూర మిశ్రమాన్ని నింపి, నీళ్లు అద్దుకుంటూ చివర్లు మూయాలి. * ఇలా అన్నీ తయారుచేసుకున్నాక కాగుతున్న నూనెలో వేసి, అన్ని వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి, తీసి పక్కన ఉంచాలి. గ్రేవీ: కప్పు టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, సారపప్పు కలిపి ఉడికించి, పేస్ట్ చేయాలి. * కడాయిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మసాలా, పసుపు, ఉప్పు కలపాలి. ఎండుకొబ్బరి వేసి మిశ్రమం బాగా ఉడికాక దించాలి. ఈ చిక్కటి గ్రేవీలో సిద్ధం చేసుకున్న సమోసాలను వేసి, కొత్తిమీర చల్లి వేడి వేడిగా వడ్డించాలి. కర్టెసీ జోధారామ్ చౌదరి కార్పొరేట్ షెఫ్ ఖాన్ధానీ రాజ్ధానీ, కూకట్పల్లి, హైదరాబాద్ -
చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి
ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు
♦ చెరువులో 6.13 ఎకరాలు కబ్జా.. ♦ మామిడితోట సాగు చేస్తున్న ఇద్దరు నగరవాసులు వికారాబాద్: కొంతకాలంగా హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు 6.13 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మామిడి తోట సాగుచేస్తున్నారు. అదే గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉండటంతో వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించుకుంటూ రాగా.. చెరువులో యధేచ్ఛగా మామిడి తోట సాగు చేస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో స్పందించిన తహసీల్దార్ సాగు చేస్తున్న ఆక్రమణదారులకు రెవెన్యూ యాక్టు 1905 సెక్షన్ 7 కింద నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదన్పల్లి గ్రామంలోని చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 154లో మూడెకరాలు.. మరో సర్వే నంబర్ 170లో మూడెకరాల 16 గుంటల భూమిని కబ్జా చేసి కొంత కాలంగా హైదరాబాద్కు చెందిన లతీఫ్ హమ్మద్, షేక్ మహరూఫ్ మామిడి తోట సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు పర్యటన అదే గ్రామంలో మరో రెండు రోజుల్లో ఉండటంతో ముందుజాగ్రతగా తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం రోజు సందర్శించారు. ప్రభుత్వ కార్యక్రమం చేపట్టే స్థలంతోపాటు అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను, చెరువులను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెరువులో ఏదో తోట ఉన్నట్లుంది.. అని అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లి చూడగా.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మామిడి తోటను సాగుచేస్తున్న దృశ్యం ఆయన కంటపడింది. దీంతో ఆగ్ర హించిన ఆయన సంబంధిత వీఆర్ఓను తీవ్రస్థాయిలో మందలించారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులను, కుంటలను పునరుద్ధరించాలని చెబుతుంటే.. కొంతకాలంగాా సాగు చేస్తున్న తోటను యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వీఆర్ఓను మందలించారు. ‘పద్దతి మార్చుకో.. లేదంటే నీపై వేటు వేయాల్సి ఉంటుంది’ అని తహసీల్దార్ వీఆర్ఓను హెచ్చరించారు. అనంతరం అక్కడినుంచి వికారాబాద్ కార్యాలయానికి వచ్చి మండలంలోని వీఆర్ఓలందరినీ పిలిచి వెంటనే తన చాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఎవరైన కబ్జా చేసినా.. దాంట్లో ఎలాంటి పంటలను సాగు చేసినా.. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మీపై నేనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్రమార్కులకు కొమ్ముకాసే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. అనంతరం ఆయన మదన్పల్లి చెరువును ఆక్రమించి మామిడి తోట సాగు చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మీ సంజాయిషీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. -
రసవత్తరంలో మ్యాంగో నగర్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత దేశంలో సేలం అతి పెద్ద మ్యాంగో నగరం. అత్యధిక నియోజకవర్గాలను కల్గిన ఈ జిల్లాలో ఈ సారి రసవత్తర సమరం సాగుతున్నది. కొత్త ముఖాలు అత్యధికంగా రేసులో ఉండగా, ముగ్గురు సీనియర్లు, నలుగురు మాజీలు మళ్లీ పోటీకి సిద్ధం కావడంతో గెలుపు గుర్రాలు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకేల మధ్య సమరం హోరాహోరీగా సాగుతున్నది. అతి పెద్ద మ్యాంగో మార్కెట్ పేదల ఊటీగా పిలవబడే ఏర్కాడులు సేలం జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే సీనియర్లు వాళ్లప్పాడి రామమూర్తి, వీర పాండి ఆర్ముగం చక్రం తిప్పిన జిల్లా. గతంలో సాగిన పునర్విభజన ప్రభావంతో ఈ జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపాలే మారాయి. తారా మంగళం, పనమరత్తు పట్టి వంటి నియోజకవర్గాలు ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతు అయ్యాయి. సేలం నగరాన్ని మూడుగా చీల్చేశారు. తలవాసల్గా ఉన్న స్థానాన్ని గంగవళ్లిగా పేరు మార్చారు. పక్కనే ఉన్న నామక్కల్ జిల్లాకు చెందిన శంఖగిరిని సేలం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చేశారు. అందుకే ఇక్కడి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో గందర గోళ పరిస్థితి ఉంటుంది. ఈ జిల్లాలో ప్రస్తుతం గంగవళ్లి (రి), ఆత్తూర్ (రి), ఏర్కాడు (రి), ఓ మలూరు, మెట్టూర్, ఎడప్పాడి, శంఖగిరి, సేలం పశ్చిమం, సేలం ఉత్తరం, సేలం దక్షిణం, వీర పాండి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తొలుత కాంగ్రెస్కు తదుపరి డీఎంకే కంచుకోటగా ఉన్న ఈ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రస్తుతం అన్నాడీఎంకే పాగా వేసింది. వెనుక బడిన వర్గాలు, మైనారిటీలు, వన్నియర్ సామాజిక వర్గంతో పాటుగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా ఇక్కడి నియోజకవర్గాల్లో ఎక్కువే. వీరి ఆశీస్సుల కోసం అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 లక్షల 96 వేల 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14 లక్షల ఆరు వేల 392 మంది పురుషులు, 13 లక్షల 90 వేల 321 మంది స్త్రీలు, 271 మంది ఉన్నారు. సేలం(పశ్చిమం): గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడిఎంకేకు చెందిన జి వెంకటాచలం ఉన్నారు. మళ్లీ ఆయనకే సీటు దక్కింది. గతంలో తాను చేసిన ప్రగతి పనులు, అమ్మ ఆశీస్సులతో మళ్లీ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా పన్నీరు సెల్వం రేసులో ఉన్నారు. ఓటర్లకు సుపరిచితుడైన ఈ మాజీ డిప్యూటీ మేయర్ ఈ సారి పాగా వేసి తీరుతానన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాల్ని అస్త్రంగాచేసుకుని ఓట్ల వేటలో పడ్డారు. ఇక, ఓట్లను చీల్చి సత్తాను చాటుకునేందుకు పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి ఇర అరుల్ బరి దిగారు. అలాగే, ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా సేలం ఉత్తరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రాజులు రేసులో దిగడంతో నలుగురు సమ ఉజ్జీల మధ్య సమరం వేడెక్కింది. సేలం(ఉత్తరం): ఇది కూడా గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డీఎండీకేకు చెందిన మోహన్ రాజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనడంతో గట్టెక్కారు. ఈ సారి ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ మోహన్ రాజ్ బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే, తన మకాంను సేలం పశ్చిమానికి మార్చేశారు. ఇందుకు కారణం అదృష్టం కలిసి వచ్చేనా అన్న బెంగే అంటా..!, ఇక ప్రజా సంక్షేమ కూటమిలో ఈ సీటును తమిళ మానిల కాంగ్రెస్కు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా దేవదాసు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఆర్ఎస్ శరవణన్ డీఎంకే అభ్యర్థిగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ రేసులో ఉన్నారు. కేఆర్ఎస్ శరవణన్ కొత్త ముఖం కావడంతో ఓటర్ల ప్రసన్నం కోసం సీనియర్లతో కలిసి తీవ్ర కుస్తీలు పడుతున్నారు. డిఎంకే అభ్యర్థి రాజేంద్రన్ మాజీ ఎమ్మెల్యేగా ఓటర్లకు సుపరిచితులే. ఇక, పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కదిర్ రాజరత్నం పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీగోపినాథ్ పోటీ చేస్తున్నారు. అయితే, ఇక్కడి ఓటరు నాడి ఎటో అన్నది మాత్రం అంతుచిక్కని పరిస్థితి. సేలం(దక్షిణం): గత ఎన్నికల్లో ఇది కూడా కొత్తగా పుట్టుకొచ్చిన సీటు. ఇక్కడి అన్నాడీఎంకేకు చెందిన ఎంకే సెల్వరాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టారు. కొత్త ముఖంగా ఎబి శక్తి వేల్ బరిలో దిగారు. ఇక, డిఎంకే తరపున కూడా కొత్త ముఖంగా గుణశేఖర్ రేసులో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు గెలుపు లక్ష్యంగా ప్రజా మద్దతుకు సిద్ధం కావడంతో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారో..!. ఇక తాను సైతం అంటూ బీజేపీ అభ్యర్థిగా అన్నాదురై రేసులో ఉన్నారు. వీర పాండి: ఇది డీఎంకే సీనియర్ వీర పాండి ఆర్ముగం సొంత గడ్డ. అయితే. ఒక్క సారి కూడా ఆయన ఇక్కడ పోటీ చేయలేదు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆరు, డీఎంకే నాలుగు సార్లు గెలిచాయి. అయితే, 1991 నుంచి ఇక్కడ ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకేలు విజయకేతనం ఎగుర వేశాయి. ఇక, తనకు బదులుగా గతంలో వారసుడు ఎ రాజేంద్రన్ అలియాస్ రాజను ఇక్కడి నుంచి వీరపాండి ఆర్ముగం పోటీకి దించారు. ఓ సారి గెలిచినా, మరో సారి ఆయనకు ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్కే సెల్వం విజయ కేతనం ఎగుర వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈ సారి సీటు దక్కలేదు. మహిళా అభ్యర్థిగా ఎస్ మనోన్మణి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో చేజారిన విజయాన్ని మళ్లీ దక్కించుకునేందుకు వీర పాండి వారసుడు రాజేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో ముందుకు సాగుతున్నా, గతంలో సాగించిన భూదందాల్ని ఇంకా ఓటర్లు మరవ లేదని చెప్పవచ్చు. సీపీఐ అభ్యర్థిగా మోహన్, పీఎంకే అభ్యర్థిగా పి సామ్రాజ్ రేసులో ఉండటంతో ఓట్ల చీలిక ఆధారంగా డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఎవరో ఒకరు తక్కువ మెజారిటీతో గట్టెక్కాల్సిందే. ఓ మలూరు: అన్నాడీఎంకేకు బలం ఉన్న స్థానం ఇది. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, డీఎంకే, తమిళమానిల కాంగ్రెస్, పీఎంకేలు తలా ఓ సారి గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన సి కృష్ణన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త ముఖంగా ఎస్ వెట్రివేల్ను పోటీకి దించారు. అమ్మ చరిష్మా, పార్టీ బలం గెలిపిస్తుందన్న నమ్మకంతో ప్రజా మద్దతు కోసం పరుగులు తీస్తున్నారు. ఇక, డీఎంకే కూడా కొత్త ముఖంగా అమ్మాస్సీని అభ్యర్థిగా ప్రకటించింది. 1971 తర్వాత తమకు చాన్స్ ఇవ్వని దృష్ట్యా, ఈ సారి అవకాశం ఇస్తే, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ అమ్మాస్సీ ఓట్ల వేటలో ఉన్నారు. ఇక, ఈ ఇద్దరికి సరైన ప్రత్యర్థిగా ప్రజా సంక్షేమ కూటమి రేసులో దించింది. డీఎండీకే కోశాధికారి ఇలంగోవన్ ఇక్కడ పోటీకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి ఓ మారు అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఎ తమిళరసు పీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు, ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ పార్టీ సీనియర్ నేత తలబడుతుండడంతో సమరం ఆసక్తికరంగా మారింది. ఎడప్పాడి: ఇది పీఎంకే, అన్నాడీఎంకేల కోట. అలాగే, వీఐపీ స్థానం. 1971 తర్వాత ఇక్కడ డీఎంకే గెలిచింది లేదు. ఈ సారి ఒక్క చాన్స్ అంటూ డీఎంకే అభ్యర్థిగా ఎడపాడి పీసీ మురుగేషన్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎడ పాడి కె పళని స్వామి ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా అవతరించిన కె పళని స్వామి హవాను ఎదుర్కొనేందుకు మురుగేషన్ తీవ్ర ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో ఎడపాడికి చెక్ పెట్టేందుకు పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థిగా తంగ వేల్ రేసులో దిగారు. కార్మిక, అన్నదాతల ఓటు బ్యాంక్ను కొల్లగొట్టేందుకు సీపీఎం, వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కైవసానికి పీఎంకేలు సిద్ధం కావడం, ఒక్క చాన్స్ అంటూ మురుగేషన్ తీవ్ర ఓట్ల వేటలో ఉండటం వెరసి మంత్రికి మళ్లీ చాన్స్ దక్కేనా..! మెట్టూరు: ఇది మరో వీఐపీ నియోజకవర్గం. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, అన్నాడీఎంకే కార్యదర్శి సెమ్మలై పోటీలో ఉన్న స్థా నం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పైచే యి. డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, సీపీఎంలు తలా ఓ సారి గెలి చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి డీఎండీకే అభ్యర్థిగా పార్తీబన్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అన్నాడీఎంకే కూటమితో కలిసి గత ఎన్నికల్లో పనిచేసిన పార్తీబన్ ఈ సారి డీఎండీకే నుంచి బయటకు వచ్చారు. డీఎంకే తరఫున ఎండీఎండీకే అభ్యర్థిగా పోటీకి సిద్ధం అయ్యారు. డీఎంకే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తోంటే, అన్నాడీఎంకే అభ్యర్థిగా సెమ్మలైకు సీటు దక్కడంతో సమరం వేడెక్కింది. ఇక, గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పీఎంకే అధ్యక్షుడు జికే మణి, బిజేపి అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం రేసులో ఉండడంతో సమరం హోరాహోరీగా మారింది. శంఖగిరి: నామక్కల్ జిల్లా నుంచి సేలంలోకి గతంలో వచ్చిన స్థా నం ఇది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. 1989 నుంచి డీఎంకే ఓ సారి, అన్నాడీఎంకే మరో సారి విజయ కేతనం ఎగుర వేస్తున్నాయి. ఇక్కడ సి ట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన పీ విజయలక్ష్మి ఉన్నా రు. ఈ సారి ఆమెను పక్కన పెట్టి కొత్తముఖంగా ఎస్ రాజా రేసు లో దిగారు. డిఎంకే కూటమి ఈ సీటును కాంగ్రెస్కు అప్పగించిం ది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త ముఖం కె రాజేశ్వరన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చే దిశగా ప్రజా సంక్షేమ కూటమి తరపున తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థి సెల్వకుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏసీ మురేగేషన్ బరిలో ఉన్నారు. ఈ నలుగురు కొత్త వాళ్లే కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..! ఏర్కాడు (రి): పేదల ఊటి ఇది. గిరిజన , అటవీ గ్రామాల్లోని ప్రజల ఓటు బ్యాంక్ న్యాయ నిర్ణేతలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఏడు సార్లు, డీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్ ఓ సారి ఇక్కడ గెలిచాయి. అన్నాడీఎంకేకు చెందిన పి సరోజ సిట్టింగ్ ఎమ్మెల్యే. సరోజను పక్కన పెట్టి కొత్త ముఖంగా కె చిత్రను తెర మీదకు తెచ్చారు. ఓటర్లను ఆకర్షించడంలో చిత్ర ముందంజలో ఉన్నారు. డిఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ రేసులో దిగడం కలిసి వచ్చే అంశం. ఇక, ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా కుమార్, బీజేపీ అభ్యర్థిగా పొన్రాస్ పోటీకి సిద్ధమయ్యారు. గంగవళ్లి(రి): డీఎండీకేకు చెందిన ఆర్ సుభా సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేసిన ఆర్ సుభా, ఈ సారి ప్రజా సంక్షేమకూటమి డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. అయితే, అదృష్టం ఏ మేరకు కలి వస్తుందో అన్నది అనుమానమే. అన్నాడీఎంకే అభ్యర్థిగా న్యాయవాది మరుద ముత్తు, డీఎంకే అభ్యర్థిగా సేలం మాజీ మేయర్ ప్రియదర్శిని పోటీకి సిద్ధం అయ్యారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు కావడంతో పోటీ ఆసక్తికరం. ఇక, బీజేపీ అభ్యర్థిగా శివగామి పరమశివం ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా, డీఎంకే అభ్యర్థి ప్రియదర్శిని మహిళా అభ్యర్థులుగా ఢీ కొడుతున్నారు. ఆత్తూర్(రి): ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కోట. అన్నాడీఎంకే పాగా వేసింది. తదుపరి డిఎంకే కూడా అప్పుడప్పుడు బలాన్ని చాటుతున్నది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, అన్నాడీఎంకే, డీఎంకేలు తలా మూడు సార్లు గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన ఎస్ మాదేశ్వరన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త వ్యక్తి ఆర్ఎం చిన్న తంబి పోటీకి సిద్ధమయ్యారు. తమ చేతి నుంచి జారిన ఈ సీటును మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే అర్ధనారి పోటీకి దిగారు. పీఎంకేకు కూడా ఇక్కడ బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా హంసవేణి రేసులో ఉన్నారు. -
కరెంట్ షాక్తో చెట్టుపైనే చివరి శ్వాస
మామిడికాయలు కోసేందుకు కూలీకి వెళ్లిన బాలిక మృతి హుస్నాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు శనివారం కూలీకి వెళ్లిన బాలిక కరెంట్ షాక్తో చెట్టుపైనే మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం కన్నారానికి చెందిన మందడల రాజు, శారదల పెద్ద కూతురు సంధ్య(16) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. సెలవులు కావడంతో గ్రామస్తులతో కలసి అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు కూలీకి వచ్చింది. చెట్టు ఎక్కి కాయలు తెంపుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగల్ని గమనించక పోవడంతో షాక్ కొట్టి చెట్టుపైనే మృతి చెందింది. అదే చెట్టుపై ఉన్న సాంబరాజు, నితిన్లు సంధ్యను చూసి భయంతో చెట్టుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతకపేటకు చెందిన రాంరెడ్డి మామిడితోటను మరొకరు గుత్తకు తీసుకుని కాయలను తెంపిస్తున్నాడు. కాయలు తెంపేందుకు బాలకార్మికులను వినియోగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడితోట యజమాని, గుత్తేదారు, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
మధురఫలం మహాప్రియం
భారీగా తగ్గిన మామిడి పండ్ల దిగుమతి ఎగుమతులకే సరిపోతున్న మేలు రకాలు వెలవెలబోతున్న మార్కెట్లు గతేడాదితో పోలిస్తే రెండింతలైన ధరలు హైదరాబాద్: మామిడి..! మండు వేసవిలో ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదూ. నిజమే ..ఫలాలన్నింటిలో రాజఠీవిని ఒలకబోస్తూ, అనేక పోషకాలనిచ్చే ఈ రాజఫలం నగరంలో మహా ప్రియమైంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. వెంటాడిన కరువుకు తోడు, ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన మామిడి రకాలు, అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి అనూహ్యంగా తగ్గిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుకు నగరంలోని ప్రధాన మార్కెట్లన్నింటినీ మామిడి దిగుబడులు ముంచెత్తగా, ఈమారు భారీగా పడిపోయాయి. అక్కడక్కడ వస్తున్న మేలు రకాలను దిల్లీ, లక్నో వ్యాపారులే ఇక్కడి నుండి నేరుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత ఏడాదితో పోలిస్తే రెండింతలైంది. హోల్సేల్ మార్కెట్లో క్వింటా గత ఏడాది రూ.5000 మోడల్ ధర కాగా, ఈ యేడాది రూ.7000కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ. 80 నుండి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏడాదిలో ఎంత తేడా.. ఏటా మార్చి నుండి జూలై వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు దొరికే గడ్డిఅన్నారం మార్కెట్లో ప్రస్తుతం రెండు మూడు రకాలకు మించిన మామిడి పండ్లు దొరకటం లేదు. ఒక వైపు భారీగా పడిపోయిన దిగుమతులకు తోడు, వినియోగదారులను నోరూరించే రకాలు సైతం ఈ మారు పెద్దగా రావటం లేదు. గడిచిన ఏడాది వరకు బెనీషాన్, ఆలంపూర్, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తొతపూరి తదితర రకాల అందుబాటులో ఉండగా, ఈ మారు బెనీషాన్ రకం ఒక్కటే ఎక్కువగా వస్తోంది. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఒక్క గడ్డి అన్నారం మార్కెట్కే 6,40,239 క్వింటాళ్ల మామిడి రాగా, ఈ యేడు మాత్రం కేవలం 47,406 క్వింటాళ్లు మాత్రమే రావటం దారుణమైన పరిస్థితికి నిదర్శనమని మార్కెట్ కమిటీ ఉద్యోగి జీవన్ చెప్పారు. అందుబాటులోకి రైఫనింగ్ చాంబర్స్ పండ్లను మగ్గించటంలో కార్బైడ్, ఇథిలిన్ తదితర విష రసాయనాలు వాడొద్దన్న కఠిన నిబంధనల నేపథ్యంలో మార్కెట్లలో రైఫనింగ్ ఛాంబర్స్ అందుబాటులోకి వచ్చాయి. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నిర్మించాల్సిన ఛాంబర్లు, ఇంకా పూర్తి కాకపోగా, 15 మంది ప్రైవేటు వ్యాపారులు అనుమతి తీసుకుని, ఆరు చోట్ల అందుబాటులోకి తెచ్చారు. ఎండ తీవ్రతతో..మగ్గటంలో ఇబ్బంది మార్కెట్కు వస్తోన్న మామిడిని మగ్గించేందుకు కొందరు వ్యాపారులు రైఫనింగ్ ఛాంబర్స్ను ఉపయోగించుకుంటుండగా, మిగిలిన వాళ్లు సాధారణ పద్ధతులు పాటిస్తున్నారు. ఎండ తీవ్రతతో సరిగ్గా పోషకాలు అందక, మామి డి పండులో 16 శాతం వరకు ఉండాల్సిన ఇథిలిన్, తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉంటోంది. దీంతో మళ్లీ రైఫనింగ్ ఛాంబర్లలో మూడు రోజుల పాటు ఉంచి మగ్గిస్తున్నారు. కష్టమైనా తప్పటం లేదు.. 50 సంవత్సరాల నుంచి కార్బైడ్తోనే మామిడి కాయలను అమ్మడం..కొనడం జరుగుతుంది. ఇప్పడు కార్బైడ్ లేకుండా మామిడి కొనుగోలు చేయ డం అంటే కష్టంగా ఉంది. వ్యాపారాలు చాల వరకు తగ్గాయి. దీనికి తోడు కరువుతో దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే కిట కిటలాడ్సిన మార్కెట్ నేడు బోసిపోతోంది. - తాజొద్దీన్, పండ్ల వ్యాపారి రైతుకు గడ్డుకాలం ఈ సారి రైతుకు సరియైన పంట లేకపోవడంతో గిట్టుబాటులేదు. రైతులకు పంటను చూస్తే రక్తం చుక్కలేదు. నేను 200 ఎకరాలు కౌలుకు తీసుకుని మామిడి సాగుచేశాను. సకాలంలో వర్షంలేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీరు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కాయ సైజు 10 శాతం తగ్గింది. కార్బైడ్ వాడొద్దంటూ ప్రభుత్వం వ్యాపారులపై ఆంక్షలు విధించింది. ఇథిలిన్తో మామిడి పండ్లను మగ్గపెట్టాలంటే రైతులు ముందుకు రావడంలేదు. ఖర్చుతో కూడుకుంది. గత సంవత్సరం నేను 600 టన్నులు మామిడిని మార్కెట్లో అమ్మితే ఈ సంవత్సరం కేవలం 150 టన్నులు మాత్రమే అమ్మాను. - రైతు తాజ్బాబు, కోదాడ సొంతంగా ..ఛాంబర్ ఏర్పాటు చేశా పండ్లను ఇథలిన్తో పండించడం ఖర్చుతో కూడుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలేదు. మేమే పండ్ల మార్కెట్లో కోల్డ్స్టోరేజ్ను ఏర్పాటు చేసుకున్నాం. కార్బైడ్ లేకుండా పండ్లను పండిస్తున్నాం. ఇథిలిన్ను రోజుకు రెండు సార్లు వదులుతాం. మూడు నుంచి నాలుగు రోజుల్లో మామిడి పండ్లు పండుతాయి. వాటిని మార్కెట్లో అమ్ముతాం. ఇలా స్టోరేజ్ వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ40 వేల నుంచి 50 వేల వరకు వస్తుంది. నిర్వహణ కష్టసాధ్యంగా ఉంది. - అజంఖాన్, ఫేమస్ ప్రూట్కంపెనీ -
టాప్ హీరోయిన్తో వీధి వ్యాపారి పోటీ
ఆమె దేశంలోనే టాప్ హీరోయిన్. అతను వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. జిల్ జిగేల్ మెరుపులు తోడవడంతో సహజంగానే హీరోయిన్ ముందంజలో ఉంది. బతుకుపోరులో వెనుకపడిపోయిన ఆ వృద్ధ వ్యాపారి.. తారను నేలకు దించి, వెలిగిపోగలడా? నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి ఏమన్నారంటే.. 'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పండ్లే మంచివి. కానీ ఇది వ్యాపారం. వ్యాపారమన్నాక పోటీ తప్పదు. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడది విచిత్రంగా మారిపోయింది. నా వరకైతే నా ప్రధాన పోటీదారు కత్రినా కైఫే. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం దొరుకుతుంది' అంటూ టాప్ హీరోయిన్ తో పోటీపడుతున్నట్లు వెల్లడిస్తాడు వీధి వ్యాపారి. -
నిరాశపరచిన ‘మామిడి’
♦ ఈ సారి కాపు 40 శాతం లోపే..! ♦ రాలిపోతున్న పూత, కాత ♦ కాసిన కొద్దిపాటి కాయలపై ఎండ ప్రభావం ♦ ఆందోళనలో రైతన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం మామిడి పంటపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవక తోటల్లో కాపు బాగా తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో నాటిన మామిడి మొక్కలు నీరులేక ఎండిపోతున్నాయి. కాసిన కొద్దిపాటి కాయలు సైతం ఎండల ప్రభావానికి వాడి నేల రాలుతున్నాయి. ఈ సారి కూడా మామిడి పంట నిరాశాజనకమేనని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనీసం 40 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల అయితే 20 శాతం పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. - పరిగి నియోజకవర్గంలో 3,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క పూడూరు మండలంలోనే అత్యధికంగా 2,200 పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు. జిల్లాలోనే పెద్ద మామిడి పళ్ల మార్కెట్గా పూడూరు మండలం మన్నేగూడకు పేరుంది. ప్రతి ఏడాది.. హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రదేశాలకు టన్నుల కొలది మామిడి పళ్లను, కాయలను ఇ క్కడి నుంచే ఎగుమతి చేస్తారు. కేవలం మన్నేగూడ ప్రాంతంలోనే ప్రతి ఏడాది రూ.2 కోట్ల నుంచి రూ. మూ డు కోట్ల వ్యాపారం జరుగుతుంది. అ యితే ఇప్పుడిప్పుడే మామిడి తోటల సాగుపై దృష్టి సారించిన రైతులు పలువురు.. ప్రస్తుత పరిస్థితిని చూసి మునుముందు వెనక్కి తగ్గుతారేమోనని హార్టికల్చర్ అధికారులు ఆందోళనలో ఉన్నా రు. కాగా.. వచ్చిన కొద్దిపాటి కాపైనా చే తికి వచ్చే వరకు చెట్టుపై నిలుస్తుందో లేదోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు. గణనీయంగా తగ్గనున్న మామిడి.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ఈ పరిస్థితుల్లో రైతులతో పాటు మామిడికాయలు, మామిడి పళ్ల వ్యాపారం పైనే ఆధారపడి బతికే వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఎ కరంలో సాగైన మామిడి తోటకు వ్యాపారులు రూ. 50 నుంచి రూ. 80 వేల వరకు గుత్తగా చెల్లించేవారు. ఈ ఏడాది ఎకరానికి రూ. 20 వెచ్చించినా గిట్టుబాటు కష్టమని వ్యాపారులు అంటున్నారు. రూ. లక్షలు వ్యాపారంలో కుమ్మరించి తరువాత చేతులు కాల్చుకునే క న్నా.. ఈ ఏడాది వ్యాపారానికి దూరం గా ఉంటే బాగుంటుందని పలువురు మిన్నకుండిపోయారు. ధరలు ఆకాశన్నంటనున్నాయి.. ఈసారి మామిడి కాపు గణనీయంగా పడిపోవడంతో మామిడికాయలతో పాటు మామిడి పళ్ల ధరలు ఆకాశన్నం టనున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. మామిడి పళ్ల ప్రియులకు కొనే స్తోమత తగ్గి.. తియ్యని పళ్లు చేదెక్కనున్నాయి. గతేడాది మామిడి పళ్లు పుష్కలంగా ఉండడంతో కిలో రూ. 25 నుంచి రూ. 80 చొప్పున విక్రయించగా ఈఏడాది కాస్త కిలో ధర రూ. 100 లోపు దొరకడం కష్టమేనని అంటున్నారు. ఈ ఏడాది పేదలు మామిడి పళ్లు తినడం కష్టమేనని ఉద్యానవన శాఖ అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. -
దుబాయ్కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’
♦ ఎగుమతులు చేయాలని ఉద్యాన శాఖ యోచన ♦ వ్యాపారులతో చర్చిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ♦ రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టడంపై కసరత్తు ♦ విదేశాల్లో కిలో రూ. 300 వరకు పలుకుతున్న నాణ్యమైన పండ్లు సాక్షి, హైదరాబాద్: పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడితో రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దుబాయ్కు ‘తెలంగాణ బ్రాండ్’తో మామిడి పండ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. నాణ్యమైన పండ్లను గుర్తించి వాటిని దుబాయ్కు పం పేందుకు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే మామిడి పండ్ల వ్యాపారులు, రైతులతో చర్చించారు. అన్నీ కుదిరితే వచ్చే నెలలో దుబాయ్కు మామిడి పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉంది. రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి.. రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో ఏటా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కాస్తాయి. అందులో దాదాపు 6 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్తర భారతదేశానికి వెళ్తుంటాయి. విదేశాలకు మాత్రం 5-6 వేల మెట్రిక్ టన్నులకు మించి మామిడి పండ్ల ఎగుమతులు కావడంలేదు. చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాలకు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచే మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ బ్రాండ్తో నాణ్యమైన మామిడి రకం అంటూ ఒకటి ప్రజాదరణ పొందలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో సరైన మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులకు కిలో రూ. 25-50 మించి దక్కడంలేదు. స్థానికంగా ఇంత తక్కువ ధర పలుకుతున్న మామిడి పండ్లు... విదేశాలకు ఎగుమతి చేస్తే వాటి ధర కిలో రూ. 300 వరకు ఉంటోంది. కాబట్టి సేంద్రీయ, సహజ మామిడి పండ్లపై దృష్టి సారించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాండ్తో విక్రయించేలా నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పండుతోన్న నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించి వాటిని తెలంగాణ బ్రాండ్తో విక్రయించాలని భావి స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ పండ్లపైనే దృష్టి.. తెలంగాణ బ్రాండ్తో రాష్ట్రవ్యాప్తంగా కల్తీలేని సేంద్రీయ పండ్లు, కూరగాయలు, అల్లం, కారం, పసుపు తదితర పదార్థాలను ప్రజలకు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ(టీహెచ్డీసీ)ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులు పండించిన సేంద్రీయ పండ్లను కార్పొరేషన్ సేకరిస్తుంది. మామిడి పండ్లను సహజంగా మాగబెట్టి నాణ్యమైన వాటిని ఎగుమతి చేస్తారు. భారీ చెట్లు పెరగకుండా తక్కువ ఎత్తులోనే మామిడి కోసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల ఒక ఎకరంలోనే దాదాపు 675 మొక్కలను వేసే అవకాశం ఉంటుంది. ఎగుమతి చేసే ఆలోచన ఉంది దుబాయ్కు మామిడి పండ్లను ఎగుమతి చేయాలని యోచిస్తున్నాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రైతులకు అధికలాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. - వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ -
మామిడిచెట్టుకు పెళ్లి
తూప్రాన్: పురుషునితో మహిళకు పెళ్లి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలం వెంకటాపూర్లో మామిడి చెట్టు.. మరో మామిడి మొక్క వివాహ బంధంతో బుధవారం ఒక్కటయ్యాయి. మామిడితోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యజమాని ఈ తంతు నిర్వహించారు. పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులనూ ఆహ్వానించాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డిగారి శ్రీకాంత్రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద 2007-08లో 350 మామిడి మొక్కలను తన నాలుగు ఎకరాల పొలంలో నాటాడు. ప్రస్తుతం అవి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. దీంతో ఆ రైతు తోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మామిడితోటలో రెండు మామిడి చెట్లకు బ్రాహ్మణోత్తములతో వేదమంత్రాలు. బాజాభజంత్రీల మధ్య వైభవంగా వివాహం జరిపించాడు. పెద్ద మామిడిచెట్టుకు చిన్న మామిడి మొక్కనిచ్చి పెళ్లి జరిపించిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
మామిడి తోటలో మృతదేహం
రేగిడి (శ్రీకాకుళం) : మామిడి తోటలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో తోటలో పని చేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
300 మామిడిచెట్లు నరికివేత
అనంతపురం జిల్లా నార్పల మండలం నడిందొడ్డి గ్రామంలో 300 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఈ తోట వైఎస్సార్సీపీకి చెందిన నల్లప్పదని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని.. నల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మామిడిపై ‘ఆకు తేళ్లు’ అవుట్!
* ఆకు జల్లెడ గూడు పురుగు నుంచి మామిడి తోటలకు విముక్తి * తొలిసారి అంతర్ధానమైన ఆకు జల్లెడ గూడు పురుగు * పముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డా. ఎం. సుగుణాకర్రెడ్డి వెల్లడి ఈసారి ఖరీఫ్ పంటలను చావు దెబ్బ తీసిన తీవ్ర కరువు.. మామిడి తోటలకు ఒక రకంగా మేలు చేసిందా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటలకు ఆకు జల్లెడ గూడు పురుగు (Orthaga exvinacea : Leaf Skeletoniser and webber) ఆశిస్తూ, 10-15 శాతం మేరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నది. అయితే, ఈ ఏడాది ఈ పురుగు ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిందని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. మహాకళ సుగుణాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. మామిడి తోటలపై గత ముప్పయ్యేళ్లుగా తిష్టవేసి నష్టపరుస్తున్న ఈ పురుగు ఈ ఏడాది అనూహ్యంగా నాశనమైందని ఆయన తెలిపారు. ఆకు జల్లెడ గూడు పురుగు లార్వా ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి, ఆకుల్ని జల్లెడలాగా చేసి ఈనెలను దగ్గరకు చేర్చి గూడును ఏర్పరచుకుంటుంది. ఇది ఆశించిన చెట్టు ఆకులు బాగా రాలిపోతాయి. ఈ పురుగు పూత దశలో పూలను, పూ మొగ్గలను ఆరగించి.. తర్వాత పూగుత్తుల్ని గూడుగా ఏర్పరుస్తుంది. క్వినాల్ఫాస్ తదితర మందులను పంట కాలంలో 3-4 సార్లు ట్రాక్టరుకు అమర్చిన స్ప్రేయర్ ద్వారా హైజెట్ నాజిల్తో పిచికారీ చేయాలి. అయినా, పూర్తిగా పోకుండా 10-15 శాతం వరకు పంట నష్టం కలిగిస్తుంటుంది. పూత దశలో ఈ పురుగులు సోకితే దిగుబడి మరింత నష్టం కలుగుతుంది. దీన్ని రైతులు ‘ఆకు తేళ్లు’ అని పిలుస్తుంటారని, తమ మామిడి తోటల్లోనూ ఇది ముప్పయ్యేళ్లుగా ఉందని, ఈ ఏడాది ఆశ్చర్యకరంగా పోయిందని డా. సుగుణాకర్రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ పురుగు పోయిందని రైతులు తనతో చెప్పారన్నారు. ‘ఆకు తేళ్లు’ పూర్తిగా పోవడానికి గల కారణాలను శోధించాలని డా. సుగుణాకర్రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నాటి ‘ఆకు తేళ్ల’ సిల్కు వస్త్రం! 1997లో తమ మామిడి తోటను పూర్తిగా ఆకు జల్లెడ గూడు పురుగు పూర్తిగా జల్లెడ పట్టేసిందని డా. సుగుణాకర్రెడ్డి తెలిపారు. అప్పుడు చెట్ల మీద ఒక్క ఆకూ మిగల్లేదని, వరుసగా రెండేళ్ల పాటు మామిడి దిగుబడిని పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ పురుగు చెట్టు మీద నుంచి నేల మీదకు పాకుతూ దిగుతుంది. ఆ క్రమంలో పురుగు వదిలే సన్నని సిల్కుదారం చెట్టు కొమ్మలపై సున్నపు పూత మాదిరిగా కనిపించిందని, ఆ సిల్క్ పోగులన్నీ కలిసి ఒక పల్చని వస్త్రంలా ఏర్పడిందన్నారు. ఆ వస్త్రాన్ని డా. సుగుణాకర్రెడ్డి జాగ్రత్తగా సేకరించి, అప్పట్లోనే (1997-98) ఉద్యాన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. ఆకు తేళ్ల బెడద అంత ఎక్కువగా ఉంటుందన్న విషయం అంతకు పూర్వం తెలియదని డా. సుగుణాకర్రెడ్డి (94416 77401) తెలిపారు. బత్తాయి, ఆరెంజ్ తోటల్లో ప్రకృతి సేద్యంపై అధ్యయన యాత్ర తక్కువ నీటితో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా బత్తాయి, నారింజ తోటలను సాగు చేయాలనుకునే తెలుగు రైతుల కోసం అక్టోబర్ 8-11 తేదీల్లో అధ్యయన యాత్రతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పి. కరుణాకర్ గౌడ్ తెలిపారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్వయంగా వెంట ఉండి మహారాష్ట్రలోని కాటోల్ జిల్లాలో ఈ పద్ధతిలో సాగయ్యే బత్తాయి, నాగపూర్ నారింజ తోటలను అక్టోబర్ 8,9 తేదీల్లో చూపిస్తారు. ఈ తోటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడంపై నాగపూర్కు 50 కిలోమీటర్ల దూరంలోని కాటోల్ పట్టణంలో 10,11 తేదీల్లో పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు రోజులకు రవాణా వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు కాటోల్కు చెందిన మనోజ్ జనాన్లాల్ (098225 15913) లేదా హేమంత్ చౌహాన్ (075886 90688)ను లేదా హైదరాబాద్లోని కరుణాకర్ గౌడ్ (94404 17995)ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల్లో శాశ్వత వ్యవసాయం (పర్మాకల్చర్) ఒకటి. శాశ్వత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న వారు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. శాశ్వత వ్యవసాయంపై అంతర్జాతీయ మహాసభ (సెప్టెంబర్ 7-17) లండన్లో జరుగుతున్నది. తదుపరి అంతర్జాతీయ మహాసభను 2017లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పర్మాకల్చర్ అంతర్జాతీయ సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణకు చెందిన పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు హైదరాబాద్ మహాసభ (నవంబర్ 15-23, 2017) నిర్వహణ బాధ్యతను లండన్ సభలో స్వీకరించారు. అంతర్జాతీయ మహాసభకు ముందే వచ్చే ఫిబ్రవరి 5-7 మధ్య పర్మాకల్చర్ జాతీయ మహాసభను నిర్వహించనున్నామని నరసన్న తెలిపారు. భారతీయ శాశ్వత వ్యవసాయ విభాగానికి తెలుగునాట డా. వెంకట్ తదితరులు పునాదులు వేసి 30 ఏళ్లవుతున్నది. ఈ పూర్వరంగంలో పర్మాకల్చర్ జాతీయ, అంతర్జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. వివరాలకు.. permacultureindia.org వెబ్సైట్ చూడొచ్చు. -
మామిడి పోతోంది!
కరువు రక్కసికి కుదేలైన మామిడి రైతు జిల్లాలో పదివేల ఎకరాల్లో ఎండిన తోటలు రూ.50 కోట్ల మేర నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతాంగం కరువు రక్కసి మామిడి రైతును కోలుకోనీయకుండా చేసింది. కంటికిరెప్పలా పెంచిన తోటలకు నీళ్లులేకుండా చేసింది. పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ముచేసింది. పచ్చని చెట్లను నిలువునా ఎండబెట్టి ఫలితం రాకుండా చేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. తిరుపతి:వరుస కరువులతో అన్నదాత తల్లడిల్లి పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చంటి బిడ్డల్లా పెంచి, పోషించుకున్న మామిడి చెట్లు కళ్లేదుటే ఎండిపోతున్నాయి. కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావటం లేదు. దీంతో ఏమి చేయలేని నిస్సాహాయక స్థితిలో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్కువ వ్యయప్రయాసలతో రైతు కుటుంబానికి ఆర్థికంగా అసరాగా నిలిచే మామిడి తోటలు నేడు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఎండిపోయాయి. ఇంకా కొన్ని తోటల్లో 30 నుంచి 40 శాతం చెట్లు మాడిపోయాయి. 1972 సంపత్సరంలో వచ్చిన గంజి కరువులో సైతం తోటలు ఎండలేదు. ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ కొంత మంది అన్నదాతలు గతాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎండిన మామిడి తోటలను రైతులు నరికి వేశారు. చేయూత‘ కరువు’... కష్టాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న మామిడి రైతుకు చేయూత కరువు అయ్యింది. మూడేళ్ల నుంచి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని తోటల మధ్యలో రాళ్ల నేలలు ఉండడంతో నీటి ఎద్దడికి తట్టుకోలేక చెట్లు ఎండిపోతున్నాయి. ఒకే తోటలోనే కొన్ని పచ్చగా ఉండగా, మరికొన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యాన పంటలను కాపాడేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకుంటామన్నా అమలుకు నోచుకోలేదు. ఎండిన తోటలకు పరిహారం ఇవ్వటం లేదు. రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. కొత్తగా మామిడి తోటల పెంపకానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. దీంతో మామిడి తోటల సాగు తగ్గుతోంది. తోటలు కాపాడే యత్నం మామిడి చెట్లు ఎండిపోకుండా కాపాడేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నాం. పాదుల్లో ఆకులు పరచడం, పచ్చిరొట్ట ఎరువులు వేయడం, జిలుగ, జనుము చల్లిస్తున్నాం. ఎండి పోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు సరఫరా చేస్తాం. బోరుబావుల్లో నీరు అడుగంటడం, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల మామిడి తోటలు ఎండిపోయాయి. - ధర్మజా, ఉప సంచాలకులు, ఉద్యానశాఖ -
మోదీకి పాక్ ప్రధాని ప్రత్యేక కానుక
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈద్ కానుకగా మామిడి పళ్ల బుట్టను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల సరిహద్దు వద్ద భారత జవాన్లు ఈద్ కానుకగా ఇచ్చిన మిఠాయిలు తీసుకునేందుకు పాకిస్థాన్ బలగాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కాల్పులకు దిగడం, సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని మామిడి పండ్ల దౌత్యం నడిపారు. ఇదిలావుండగా, గతేడాది కూడా విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి భారత్ వైదొలిగాక నవాజ్ షరీఫ్ మామిడి పండ్లను మోదీకి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు పంపారు. -
మామిడి కాయల తగాదా.. యువతి హత్య!
ఫతేపూర్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయల కోసం చెలరేగిన వివాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా కేశాన్ గ్రామానికి చెందిన శివ్ భూషణ్ అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే కొంతమంది దుండగులు ఆ తోటలో మామిడికాయలను కోసేందుకు విఫలయత్నం చేశారు. ఆ క్రమంలో శివ్ భూషణ్ కు వారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఆ క్షణంలో అక్కుడ్నుంచి వెళ్లిపోయిన దుండగులు తరువాత శివ భూషణ్ ఇంటిపై దాడి చేశారు. కాగా, దాడికి పాల్పడ్డ సమయంలో ఇంట్లో శివ భూషణ్ కూతురు మాత్రమే ఉంది. దీంతో ఆ యువతిపై అతి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. అదే క్రమంలో యువతి ఒంటిపై కిరోసిన్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు ముందు అసలు విషయం తెలియలేదు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఆ దుండగులేనని తేలడంతో యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ దుండగులు ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదని తండ్రి శివ్ భూషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
నితిన్కు మామిడి పళ్లు పంపిన పవన్
హైదరాబాద్: ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ నుంచి కొంతమందికి ఓ పార్శిల్ అందుతుంది. అది మామిడిపళ్ల బుట్ట. పవన్ కల్యాణ్కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశార హీరో నితిన్. అయితే ఈ సంవత్సరం కూడా అనుకున్నట్టుగానే తనకు మామిడి పళ్ల పార్శిల్ రావడంతో..పవన్ తనకి పంపిన పళ్లబుట్టని ఫోటో తీసి ట్విట్టర్ లో ట్విట్ చేసి...అవును 99 శాతం మీరందరూ ఊహించింది కరక్టే...పవర్ స్టార్ నుంచే వచ్చాయి...అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. YESS..99%of u all r correctt!! Got them from our POWERSTAR..😊😊 pic.twitter.com/Aqi9d42Z4O — nithiin (@actor_nithiin) June 12, 2015