Mango Products
-
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. తయారీ విధానమే ప్రత్యేకం మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు. మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు జాగ్రత్త లేకుంటే నష్టం తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. నిల్వ చేసే దారిలేదు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు. ఎండ ఉంటేనే పని ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. –జి.సత్యవతి, తయారీదారు కోల్డ్ స్టోరేజీ నిర్మించాలి ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది. – ఎస్.రమణ, తయారీదారు అమ్మకపు పన్ను రద్దుచేయాలి కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
మామిడి తాండ్ర రుచి.. తినరా మైమరచి
తాండ్ర...ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం: గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న మామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకీ.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే తాము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. - బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు, కురుపాం మండలం -
ఆవకాయ.. టేస్టే వేరు..
ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మహిళలు మార్కెట్కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు. దిల్సుఖ్నగర్: మలక్పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. మామిడి పచ్చళ్లలో రకాలెన్నో... మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. పెరిగిన మామిడికాయ ధరలు.. గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. -
ఆవకాయ పచ్చడి మరింత ప్రియం
జనగామ అర్బన్: ఆవకాయ పచ్చడి. దాని పేరు చేపితేనే అబ్బో నోరూరిపోతుంది. ఇది ఈ ఏడాది మరింత ప్రియం కానుంది. జిల్లాలో మామిడి తోటలు కాపు లేక వెలవెలబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వ్యాప్తంగా 2301 మంది రైతులు 9,405 ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో జనగామ రెవెన్యూ డివిజన్లో 3,419 ఎకరాల్లో, స్టేషన్ఘన్పూర్ డివిజన్లో 4,063 ఎకరాల్లో అదే విధంగా పాలకుర్తి డివిజన్లో 1,922 ఎకరాల్లో ఈ తోటలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు అంచనా ప్రకారం 16,31 మొట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. కానీ, 9 నుంచి 10వేల మెట్రిక్ టన్నులు వచ్చినా సంతోషమే అంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లాలోని మూడు డివిజన్ అంటే 12 మండలాల నుంచి ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సారి తోటలు అంతగా కాపు లేదు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా మంచిగా కాసిన తోటలు ఎకరానికి నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. కానీ అది కాస్త ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 2 నుంచి 2.5 టన్నులు కూడ వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 శాతం పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ సారి మామిడి ధరలు ఆకాశంటనున్నాయి. మామిడి రేటు ఇలా.. సాధారణంగా 50 గ్రాములున్న మామిడి కాయలను దాదాపు రూ.4 నుంచి రూ.6 కు విక్రయించే వారు. కానీ, ఈ సారి అదే సైజులో ఉన్న కాయలు కూడా రూ. 8 నుండి 10 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆశించిన దిగబడి రాకపోవచ్చు ఈ సారి జిల్లా వ్యాపంగా మామిడి తోటల నుండి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. చాల చోట్లు తోటలు పూత దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. లక్ష్యం 16వేల మెట్రిక్ టన్నులు ఉంది. అయితే పది వేల మెట్రిక్ టన్నులపైగా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఆశించిన దిగుబడి వస్తే కాస్త ఇబ్బంది ఉండదు.– కేఆర్.లత,జిల్లా ఉద్యాన అధికారి, జనగామ -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
మామిడితాండ్ర C/O ఊనగట్ల
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రామంలో 450 మందికి ఉపాధి మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రుణ సౌకర్యం కల్పించాలి ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి. – కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల మహిళలకు ఉపాధి మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి. – యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల సీజన్లో పనికి వెళతా నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం. – కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల -
పచ్చిళ్లు
పచ్చళ్లే! పచ్చికాయలు కనుక పచ్చిళ్లు!పచ్చిగా చెప్పాలంటే..కొంచెం వయలెన్స్ ఉంటే కానీతయారీలో ఘాటు..ప్లేట్లోకి వచ్చాక షూట్ ఎట్ సైటు.. ఉండవు.కారం... ఉప్పు.. ఆవపొడి.. నువ్వులనూనెకలిస్తే.. చేతినిండా కలిపితేజిహ్వ జిమ్మాస్టిక్సే. నోరు ఏరోబిక్సే. వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను తయారీ: ►ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు నీడలో ఆరబెట్టాలి ►ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల అన్ని మామిడి పిందెలకు నూనె పడుతుంది) ►బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చి, జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ►ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ►రోజుకి మూడు నాలుగుసార్లు చొప్పున అలా మూడు రోజులు కలపాలి ►మామిడి పిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతాయి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే వడు మాంగా రుచిగా ఉంటుంది. టెండర్ మ్యాంగో పికిల్ కావలసినవి: మామిడి పిందెలు – ముప్పావు కిలో; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 20 తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, నీడలో కొద్దిసేపు ఆరబెట్టాలి ►తొడిమలను చాకుతో కట్ చేయాలి ►రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ►ఆవ పొడి జత చేసి మరోమారు కలపాలి ►ఉప్పు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి ►మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ►నాలుగో రోజుకి ఊట కిందకి దిగుతుంది ►మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయలో నుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండు మిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి, జాడీలోకి తీసుకోవాలి ►పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుంటే వడ దెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి) తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి ►తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ►పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ►నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ►ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ►ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్æస్పూన్లు తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ►పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ►మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ►మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపేయాలి ►చల్లారాక గాలి చొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు మామిడి కాయ గ్రేవీ చట్నీ కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక కప్పు; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 15 (కాశ్మీర్ మిర్చి); కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి – రెండు కప్పులు; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: ►తరిగిన పచ్చిమామిడికాయ ముక్కలను ఒక పెద్ద పాత్రలో వేసి పసుపు, ఉప్పు, బెల్లం జత చేసి కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించి తీసి చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి ►బాణలిలో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి కాగాక ఒక టీ స్పూను బియ్యం వేసి వేయించాలి ►మెంతులు కొద్దిగా జత చేయాలి ►మినప్పప్పు కూడా జత చేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►మిక్సీలో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, వేయించిన బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి ►మామిడికాయ ముక్కలు జత చేయాలి ►మిక్సీ పట్టిన మిశ్రమం జత చేయాలి ►కప్పుడు నీళ్లు పోసి కలపాలి ►ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోసి మరోమారు కలిపి మూత పెట్టాలి ►పావు గంట తరవాత మూత తీయాలి ►మామిడి గ్రేవీ చట్నీ అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడి కాయలు – 4 (పచ్చివి); ఎండు మిర్చి – 8 ; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు. తయారీ: ►మామిడికాయల తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక్కో ఎండు మిర్చిని మంట మీద దోరగా కాల్చాలి ►మిక్సీలో ఎండు మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేయాలి ►అన్నంలోకి వేడి వేడి నేతితో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడికాయ – కొత్తిమీర పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నానబెట్టిన పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవనూనె – అర టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4; పంచదార – అర టీ స్పూను తయారీ: ►మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, నానబెట్టిన పచ్చి సెనగ పప్పు, జీలకర్ర పొడి, ఉప్పులను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి ►ఆవ నూనె వేసి మరోమారు తిప్పాలి ►ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి తిప్పాలి ►పంచదార జత చేసి మరోమారు తిప్పాలి ►అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్నంలో ఏ పదార్థంతోనైనా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – అరకప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం: ►ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. ►పైన చెప్పిన పదార్థాలను (పోపు సామాను మినహాయించి) మిక్సీలో వేసి మెత్తగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పచ్చడిలో కలపాలి. -
కందకాలే మామిడి చెట్లను బతికించాయి!
కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు. బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు. జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500 వరకు ఖర్చయిందన్నారు. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు. -
కోహితూర్.. నిజమైన రాజ ఫలం!
చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్ను పాలించిన ముర్షీదాబాద్ చివరి నవాబు సిరాజ్–ఉద్–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్ నవాబు సిరాజ్–ఉద్–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు. హకీమ్ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్ వంగడాన్ని రూపొందించారు. రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!! -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్గఢ్లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
దారుణం: మామిడి పళ్లు కోయబోతే..
పట్నా : ఒక పక్క విచ్చలవిడి తుపాకీ సంస్కృతితో అమెరికాలో రోజుకో రక్తచరిత్ర నమోదవుతుండగా.. మన దేశంలో కూడా అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఆకలిగా ఉందని మామిడి పళ్లు కోసుకోవడానికి ఒక తోటలోకి ప్రవేశించిన బాలున్ని యజమాని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్లోని గోర్గి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్గర్ గ్రామ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పన్నెండేళ్ల పిల్లాడు పక్కనే ఉన్న తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లాడు. అక్కడే కాపలాగా ఉన్న యజమాని బాలున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. భయంతో పిల్లాడు పారిపోయేందుకు యత్నించడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ సరాసరి తలలోకి దూసుకుపోవడంతో మైనర్ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన మృతుని స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమచారం అందించారని ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనుకోకుండా జరిగిందా.. లేదా వేరెవరినో కాల్చే క్రమంలో పొరపాటున పిల్లాడు బలయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, తోట కాపలాదారుని వద్ద తుపాకీ ఎందుకుందనే విషయం కలకలం రేపుతోంది. -
‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్’
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్ చరణ్తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు. చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు. -
మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారట!
ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారని వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్గఢ్లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నాసిక్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంబాజీ మాట్లాడుతూ.. మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లితో మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలో ఈ రకమైన మామిడి చెట్లను పెంచాను. ఇప్పటి వరకు నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. శాంబాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, అతని వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్ డిమాండ్ చేశారు. మాజీ ఆరెస్సెస్ కార్యకర్త అయిన శాంబాజీ బిదే జనవరిలో బీమా-కొరిగన్ కులాల మధ్య చేలరిగిన హింసలో నిందితుడు. -
రాయగడ టు ఢిల్లీ
రాయగడ : రాయగడ జిల్లాలోని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, ప్రాంతంలో విదేశీ ఎగుమతికి సంబంధించిన ఉన్నత రకాల మామిడి పంటను ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఢిల్లీలోని మదర్డైరీకి ఆదివారం పంపించారు. రాయగడ రైల్వేస్టేషన్ నుంచి మామిడిపండ్ల మొదటి ఎగుమతిని డీఆర్డీఏ పీడీ సుఖాంత్ త్రిపాఠి రైల్వే వ్యాగన్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మామిడి రైతులకు నేరుగా వారి ఖాతాలో మామి డి మద్దతుధర లభించే విధంగా గత సంవత్సరం నుంచి జిల్లా యంత్రాంగం మామిడి ఎగుమతిని చేపట్టింది. గత సంవత్సరం మామిడి రైతులు దళారుల బెడద లేకుండా నేరుగా మంచి లాభా లను ఆర్జించారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మామిడి ఎగుమతి ప్రారంభం కాగా మొదటిరోజు 288కార్టన్ల(4.5 టన్నులు) మామిడి పండ్లు ఎగుమతి చేయగా ఢిల్లీలో కేజీ మామిడిపండ్లు రూ.50 నుంచి రూ.67 వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కావలసి ఉండగా ఇతర కారణాల వల్ల రాలేకపోవడంతో ఆమెకు బదులుగా డీఆర్డీఏ పీడీ హాజరయ్యారు. మామిడి సీజన్ పూర్తయినంత వరకు రాయగడ నుంచి మామిడి ఎగుమతి జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. -
ఒకే చెట్టు..12 రకాల కాయలు
కర్నూలు,జూపాడుబంగ్లా: ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నాగశేషులు 1993 నుంచి హార్టిక ల్చర్లో చెట్లకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టు పద్ధతి)లో నైపుణ్యం సంపాదించాడు. తనకున్న అనుభవంతో అతను తనపెరట్లో తినిపారేసిన మామిడిపిచ్చలు మొలకెత్తడంతో ఓ చెట్టుపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బనగానపల్లె, డోన్, పంచలింగాల, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో లభించే అల్ఫాన్స్, పెద్దరసం, నీలిశా, స్వర్ణజాంగీర్, రెడ్డి పసంద్, బేనిషా, మల్లికారసం, అనుపాళి, పెద్దాచారి, చిన్నాచారి, నీల్గోవ, హిమయత్ తదితర 20 రకాల మొక్కలను తెచ్చి చెట్టుకు అంటుకట్టాడు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది నాగశేషులు పెరట్లోని మామిడి చెట్టు గుత్తులు గుత్తులుగా 12 రకాల మామిడి కాయలను కాసింది. ఈ చెట్టును చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగశేషులు తనకున్న నైపుణ్యం వల్ల ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు కాయించగలగటాన్ని అందరూ ప్రశంసిస్తున్నా రు. ఇతని పెరట్లో ఉన్న మరో మా మిడి చెట్టు ఐదేళ్లు కావొస్తున్నా కాపునకురాలేదు. అంటుగట్టు పద్ధతి ద్వా రా త్వరగా చెట్లు కాపునకువస్తాయని నాగశేషులు పేర్కొంటున్నారు. గ్రాఫ్టింగ్ జిల్లాలో కొందరికే వస్తుంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో నైపుణ్యం ఉన్న వారు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను 1993 నుంచి హార్టికల్చర్లో పనిచేయడం ద్వారా అప్పట్లోని అధికారులు తెలియజేసిన మెలకువలను నేర్చుకోవడం ద్వారా నైపుణ్యం సంపాదించాను. గ్రాఫ్టింగ్లో కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ కాలంలోనే చెట్లు కాపునకురావటంతోపాటు ఫలాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. – నాగశేషులు, జూపాడుబంగ్లా, (సెల్ 9989491986) -
ఒరుగు.. ఎంతో మెరుగు
కుల్కచర్ల వికారాబాద్: మామిడి ఒరుగుతో మండల పరిధి లోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, కాముని పల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి పొ ందుతున్నారు. స్థానికంగా మామిడి తోటలు త క్కువగా ఉండటంతో ఇతర ప్రాంత్రాల నుంచి మామిడి కాయలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఒ రుగు చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో చా లా మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రా మాలలో నీడకు కూర్చుని ఒరుగు తయారు చేస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో అవి వృథా కాకుండా వాటిని కోసి ఒరుగు తయారు చేసుకున్నారు. ఆదే ఉపాధిగా ఈ గ్రామాలలో ప్రతి సంవత్సరం సీజన్ వ్యాపారంగా మారింది. నిరుద్యోగ యువకులు మండల పరిధిలోని పలు గ్రామలలో ఉన్న మామిడి తోటలను పూత దశలోనే కొనుగోలు చేస్తున్నారు. వాటిని కాపలా కాసీ మామిడి కాయలు కోసి మహిళల చేత ఒరుగు తయారు చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. మండల పరిధిలోని 6 గ్రామాలలో నెల రోజుల పాటు రోజు సూమారు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మామిడి తోటలు లభ్యం కాకుంటే అనంతపురం నుంచి మామిడి కాయలు తీసుకువచ్చి ఒరుగు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఒక సంచి మామిడి కాయలను 150 రూపాయల నుంచి 200 రూపాయలు వరకు ఇచ్చి ఒరుగు తయారు చేస్తున్నారు. ఈ ఒరుగుకు హైదరాబాద్లో మార్కెట్ లేదని నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేస్తున్నామని హైదరాబాద్ ప్రాంతంలో మార్కెట్ ఉంటే బాగుండేదని, స్థానికంగా మార్కెట్ సౌకర్యాం కల్పించాలని ఒరుగు వ్యాపారులు కోరుతున్నారు. సీజన్లో ఉపాధి పొందుతున్నాం ప్రతి సీజన్లో రోజు కూలీ వరకు సంపాది స్తాం. మామిడి కాయలు చిన్నగా ఉన్న సమయంలో తోటలను రై తుల నుంచి కొనుగో లు చేస్తాం. రెండు నెలలు వాటిని కాపలా కాసి కాయలు పెద్దగా అయిన తరువాత కో సి ఒరుగు తయారు చేయిస్తున్నాం. ఒక్కొక్క సారి కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలి పో తాయి. అప్పడప్పడు నష్టం కూడా వస్తుంది. – వెంకటేష్, వ్యాపారి, విఠలాపూర్ రోజూ రూ. 200 సంపాదిస్తున్నాం ఈ ఒరుగు ఉన్నని రో జులు రోజుకు 200 సంపాదిస్తాం. ఎండకు వెళ్లి పనిచేయాలంటే చే యలేక పోతున్నాం. చె ట్ల కింద కూర్చుని మా మిడి కాయలు కోసి ఒరుగు తయారు చేస్తా ం. ఒక సంచికి 150 రూపాయలు ఇస్తారు, ఇ ద్దరం కలిసి రెండు నుంచి మూడు సంచులు కోస్తాం. – లక్ష్మమ్మ విఠలాపూర్, కుల్కచర్ల -
విషం..నిగనిగ
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? అయితే..వాటిని కొనే ముందు, తినే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది స్వచ్ఛమైనదా? లేక ‘కార్బైడ్’ పండా అనే విషయం తెలుసుకోండి. లేదంటే అనారోగ్యాన్ని డబ్బు పెట్టి కొనుకున్నట్లే. కొద్ది రోజులుగా పెనుగాలుల తీవ్రతకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని కార్బైడ్తో కృత్రిమంగా మాగబెడుతూ.. అకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్లోకి తెస్తున్నారు. జిల్లాలో కాపు కాసే తోటలు 12వేల హెక్టార్లలో ఉన్నాయి. ప్రధానంగా మామిడి తోటలు వెల్దుర్తి, బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు, తుగ్గలి, కల్లూరు తదితర మండలాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని దిగుబడి 60 శాతం వరకు హైదరాబాద్కు తరలిస్తుండగా, మిగిలిన 40 శాతంలో ఎక్కువ భాగం కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర నిర్వహించే పండ్ల మార్కెట్కు వస్తోంది. కార్బైడ్ వాడకం ఏడాది పొడవునా ఉన్నా.. మామిడి సీజన్లో మరీ ఎక్కువవుతోంది. సాధారణంగా కాయ పక్వానికి వచ్చేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. దీంతో వ్యాపారులు రెండు, మూడు రోజుల్లో మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్ను యథేచ్ఛగా వాడుతున్నారు. అరటి, సపోట, యాపిల్ తదితర వాటిని కూడా ఇదే పద్ధతిలోనే మాగబెడుతున్నారు. చివరికి నిమ్మ కాయలకు కూడా ఆకర్షణీయమైన రంగు తెప్పించేందుకు కార్బైడ్ను వాడుతుండటం గమనార్హం. బంగినపల్లి మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రకం పండుకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అయితే.. ఈ పండ్లను సైతం మాగించడానికి కార్బైడ్ను వినియోగిస్తుండటంతో ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది. తనిఖీలు నామమాత్రమే ప్రజలకు సురక్షితమైన పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది. ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండటం, ఉన్న వారు పట్టించుకోక పోవడంతో విషతుల్యమైన పండ్లను ప్రజలు తినాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ పోస్టు ఖాళీగా ఉండటంతో అనంతపురం జిల్లా అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా మూడు రోజుల క్రితమే భర్తీ అయింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 4 ఉండగా, ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారులకు వాహన సదుపాయం కూడా లేకపోవడంతో తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శ్యాంపిల్స్ తీశారు. ఇందులో 6 శ్యాంపిల్స్ సురక్షితం కాదని, మరో మూడు శ్యాంపిల్స్ మిస్ బ్రాండ్ అని తేలింది. మరో 2 నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. కార్బైడ్ నిషేధం.. కాగితాలకే పరిమితం కార్బైడ్తో మాగించిన ఫలాలు తిని వినియోగదారులు వ్యాధుల బారిన పడుతుండటంతో ప్రభుత్వం 2012 మార్చి 19న కార్బైడ్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 288ని జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో నిషేధం కాగితాలకే పరిమితమైంది. సంబంధిత అధికారులు అడపాదడపా శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపడం మినహా ఎలాంటి చర్యలూ లేవు. రైతులు, వ్యాపారులకు కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించి, ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నేడు జేసీ ప్రత్యేక సమావేశం మార్కెట్లో కార్బైడ్తో మాగించిన పండ్లు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మలాయి చికెన్ వ్యాపారుల దందాపైనా ఈ సమావేశంలో చర్చించన్నారు. స్వచ్ఛమైన పండ్లు ఇలా ఉంటాయి. ♦ పుసుపు, లేత ఆకు పచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కార్బైడ్తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి.. ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపు రంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినపుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాల్షియం కార్బైడ్వాడకంతో అనర్థాలు ♦ క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ♦ చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, అధిక విరేచనాలు అవుతాయి. ♦ గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. -
అమామిడిని దూరం పెడుతున్నాం: చెంగల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి దిగుమతి అయిన పళ్లను తింటున్నాం కానీ, స్థానికంగా పండే మామిడి పండ్లను మాత్రం దూరం పెడుతున్నామని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు చెంగల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ‘పండ్ల సాగు రైతుల సమస్యలు– పరిష్కారాల’పై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాలిఫోర్నియా నుంచి యాపిల్, న్యూజిలాండ్ నుంచి కివీ పండ్లను దిగుమతి చేసుకొని తింటున్న మనం వివిధ కారణాలతో మామిడి పండ్లను దూరం పెట్టే పరిస్థితి దాపురించింది. ఆయా దేశాలకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పండ్లను ఎగుమతి చేస్తుంటే, అటువంటి పరిజ్ఞానం మామిడికి ఉపయోగించలేక పోతున్నాం. దీంతో రైతులు నష్టపోతున్నారు’ అని వాపోయారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!
గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో పెంచిన మామిటి చెట్టు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చెట్టుకు దాదాపు పది రకాల మామిడి కాయలు కాయడంతో వీక్షకులను అబ్బుర పరుస్తోంది. నాటు మామిడి మొక్క పెరుగుతున్న కొద్దీ దాని కొమ్మలకు బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు వంటి వివిధ రకాల కొమ్మలను శ్రీనివాసరావు అంటుకట్టారు. ప్రస్తుతం ఈ చెట్టుకు తోతపురి, బంగినపల్లి, సువర్ణరేఖ, సొరమామిడి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసం, తుమాని వంటి పది రకాలు మామిడి కాయలు కాస్తున్నాయి. తన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు ఇన్ని రకాల మామిళ్లు కాయిస్తున్న శ్రీనివాస శర్మ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఆయన ఇప్పటివరకూ మామిడి, సీతాఫలం, నేరేడు, బత్తాయి, రేగు పండ్లతో పాటు మందారం, గన్నేరు, వంటి పుష్ప జాతులకూ అంటుకట్టారు. -
మామిడి ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మార్చి 15న సాధారణ రకం మామిడి ధర టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షలు పలికింది.. అదే నెల 30న రూ. 65 వేలకు తగ్గిపోయింది.. ఏప్రిల్ 15న ధర రూ.50 వేలకు దిగజారింది. మే 1న(మంగళవారం) మామిడి ధర రూ.40 వేలకు పడిపోయింది. మామిడి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నాడు. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మామిడి ధర పడిపోవడంతో వినియోగదారులకు ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే అదీ లేదు. బహిరంగ మార్కెట్లో మాత్రం మామిడి ధరను రెండింతలు పెంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా అటు రైతును, ఇటు వినియోగదారులను దళారులు ఎడాపెడా దోచేస్తున్నారు. 30 శాతానికిపైగా పడిపోయిన ఉత్పత్తి రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల ఉత్పత్తి వస్తుంది. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఎకరానికి రెండు మూడు టన్నులకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రంలో సాధారణంగా 28 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నులలోపే ఉత్పత్తి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. మొత్తంగా 30 శాతం వరకు ఉత్పత్తి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి రైతుకు ఎక్కువ ధర రావాలి. కానీ రైతుకు దక్కాల్సిన సొమ్మును దళారులు సొంతం చేసుకుంటున్నారు. వినియోగదారులపై బాదుడే.. రైతుల నుంచి టన్నును రూ.40 వేలకు వ్యాపారులు కొంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో వినియోగదారుల నుంచి దీనికి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి రూ.40 వరకు ఉండాలి. కానీ మార్కెట్లో ఏకంగా రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ.150–200 వరకూ ఉన్నాయి. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తుంది. డిమాండ్ ఉన్నా సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్న పడిపోయాడు. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే మామిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. రూ. 41 వేలకే కొన్నారు రెండ్రోజుల కిందట నాలుగు టన్నుల మామిడి కాయలను తీసుకొచ్చాను. కానీ హైదరాబాద్లో దళారులు నాణ్యత సరిగా లేదనే సాకుతో టన్ను రూ. 41 వేలకే కొనుగోలు చేశారు. గత్యంతరం లేక దళారులకు నష్టాలకే మామిడి అమ్ముకున్నాను. – రాజశేఖర్, రైతు, సత్తుపల్లి -
లీజుదారులకు నిష్‘ఫలమే’
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సీజన్లో పూత నుంచే సమస్యలు మొదలయ్యాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు, పూత సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, తేమ వాతావరణంతో వచ్చిన పూత నిలువలేదు. నిలిచిన పూతను సైతం తెగుళ్లు ఆశించి నష్టం చేశాయి. మామిడి చెట్లకు అక్కడక్కడ ఉన్న కాయలు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రాలిపోయాయి. ఈ క్రమంలో వడగండ్లు, ఈదురుగాలుల బాధ పడలేక గుత్తేదారులు కాయ సైజు పెరగకుండానే కోస్తున్నారు. మార్కేట్లో ఏదో ఒక రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. గుత్తెదారుల గుండెల్లో దడ మామిడి తోటలను జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు లీజుకు ఇస్తుంటారు. ఈసారి మామిడి తోటలపై వాతావరణ ప్రభావంతోపాటు వడగండ్ల ప్రభావంతో ఉండటంతో లీజుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తోట యాజమానులకు ముందే డబ్బులు చెల్లించడం, కాయలు పెద్దగా లేకపోవడం, ఉన్న కొద్దిపాటి కాయ రాలడం, మంచి కాయ రేటు సైతం రోజు రోజుకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు తెచ్చి మరీ తోటలు లీజుకు తీసుకున్న లీజుదారులు.. దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో లీజు డబ్బులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 వేలపైగా రైతులకు చెల్లించి తోటలు లీజుకుతీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మామిడికాయ లేకపోవడంతో ధర ఓ మోస్తారుగా టన్నుకు మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండటం లీజుదారులకు కొంత ఊరటనిస్తోంది. భారీగా పెట్టుబడి ఖర్చులు.. లీజుదారులు మామిడి తోటలను లీజుకు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ పనిని వారే చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూత రాలిపోవడం, కాయ సైజు పెరగడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులతోపాటు పోటాష్ వేశారు. కాయ సైజు పెరిగినప్పటికీ తోటలకు రక్షణగా ఓ కాపాలదారుడిని పెడుతుంటారు. తర్వాత, సైజుకు వచ్చిన కాయలను కూలీలతో కోయించడం, మార్కెట్కు తరలించడం వంటి వాటికి లీజుదారులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు కనీసం రూ.10 వేలపైనే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి వచ్చేలా లేదు నేను ఐదు ఎకరాల తోట లీజుకు తీసుకున్నాను. పూత బాగానే వచ్చింది కాని ఆ మేరకు కాయ కనబడటం లేదు. కాయ చిన్నగా ఉన్నప్పటికీ రాళ్లవాన వస్తే ఇబ్బంది అని కొంతమేర తెంపి జగిత్యాల మార్కెట్లో అమ్మిన. ఈ సారీ మామిడి తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – గాదె శంకరయ్య, అనంతారం ఏం చేసుడో అర్థమైతలేదు ఈసారి ఐదారు తోటలు లీజుకు తీసుకున్న. పూత బాగా వచ్చిందని తోటలు పట్టిన. రెండుసార్లు మందులు కూడా కొట్టినా. అయినా ఊహించినంతగా కాయ రాలేదు. ఉన్న కాయ గాలులకు రాలిపోతున్నయ్. భయంతో ఇప్పటికే సగం కాయలు తెంపి అమ్మిన. మిగిలిన కాయలకు కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. – సత్తవ్వ, తిర్మలాపూర్ నిరుడు మంచిగ కాసినయ్ నేను ఈ ఏడాది 20 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్న. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులకు ముట్టజెప్పిన. అయితే నిరుడు మామిడి చెట్లు మంచిగ కాసిన. ఈసారి కూడా దిగుబడి బాగా వస్తదనుకున్నం. కానీ అనుకున్నంతగా చెట్లు కాయలేదు. ఇప్పటికే రెండుసార్లు కురిసిన రాళ్లవానకు ఉన్న కాయలు రాలినయ్. మళ్లీ గాలి దుమారం.. రాళ్ల వన పడుతదోనని భయమేస్తుంది. ఉన్న కాయను ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కాయ సైజు పెద్దగా ఉంటే బరువు వచ్చి లాభం ఉంటుంది. – పంబల్ల లక్ష్మి, తాటిపల్లి -
మామిడి ధరలు పుల్లన..!
విజయనగరం ఫోర్ట్ : మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. పది రెట్లు పెరిగాయ్.. గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బాగా పెరిగాయి... గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి ధరలు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి. ఇది రైతులకు కాస్త ఊరటగా ఉంది. తెగుళ్లు, పురుగులు, వాతావరణ మార్పుల వల్లే దిగుబడులు తగ్గాయి. – పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీడీ, ఉద్యానశాఖ -
భగ్గుమంటున్న ‘బంగినపల్లి’
కాశిబుగ్గ వరంగల్ సిటీ : మధుర ఫలాలుగా పేరొందిన మామిడి పండ్లు మామూలుగా ఏప్రిల్ మొదటి వారం నుంచి విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పూత, కాత నెల రోజులు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. కాగా హైదరాబాద్, విజయవాడల నుంచి కొందరు చిరు వ్యాపారులు దొరికిన కొద్దిపాటి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చి కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. ఈ మామిడి పండ్లు ప్రస్తుతం కాశిబుగ్గ చౌరస్తాతో పాటు అండర్బ్రిడ్జి, ములుగురోడ్డు సెంటర్లో లభ్యమవుతున్నాయి. సీజన్ ఆరంభంలో వచ్చిన మామిడి పళ్లను చూసి వినియోగదారులు కొనడానికి ఎగబడుతున్నారు. మందుగా అమ్మకానికి వచ్చే కోబ్రా, నీలంబరి, జలాలు, నీలాలు కూడా ఇప్పటి వరకు అమ్మకానికి రాలేదు. ఒక బంగినపల్లి మాత్రం అక్కడక్కడ అమ్మకానికి ఉండడం విశేషం.కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్మకాలు -
మామిడి.. మహా ప్రియం..!
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు నోరూరిపోతుంది. తమకు ఇష్టమైన మామిడి రుచి చూసేందుకు ఉవ్విళ్లూరిపోతారు. ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో బేనిషాన్ రకం ధర కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం.. పంట ఆలస్యం కావడంతో ఈ ఏడాది మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు చెపుతున్నారు. పుంజుకోని సీజన్..: గత ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే మామిడి సీజన్ ప్రారంభమై మార్చి మూడో వారానికి పుంజుకుంది. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి రోజూ దాదాపు 2.5 వేల టన్నుల మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు దిగుమతి అయింది. కానీ ఈ సీజన్లో రోజూ 25 టన్నులు కూడా దాటలేదు. గతంలో ప్రతి రోజు 2.5 వేల టన్నుల మామిడి వచ్చేది. ప్రస్తుతం అది 32 టన్నులకే పరిమితమైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు శుక్రవారం కేవలం 32 టన్నుల మామిడి దిగుమతి అయ్యింది. గతంలో మార్కెట్కు వందల సంఖ్యలో మామిడి లారీలు వచ్చేవి. అలాగే ఈ సీజన్లో ఇంకా మార్కెట్కు రకరకాల మామిడి పండ్లు రావడం లేదు. తగ్గిన దిగుబడి.. : గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సకాలంలో వర్షాలు పడకపోవడం.. భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో సరైన సమయంలో కాపు రాలేదని రైతులు, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మామిడి పూత కూడా ఆలస్యం కావడంతో పంట చేతికి రావటానికి ఇంకా 10–15 రోజులు పట్టే అవకాశం ఉంది. నగరానికి దిగుమతి.. ఎగుమతులు ఇవే.. బేనిషాన్, తోతాపూరి, సన్నరసాలు, పెద్ద రసాలు, హిమాయత్, చెరుకురసాలు, దసేరీ తదితర రకాల మామిడి పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్లో లభిస్తాయి. బంగినపల్లి, తోతాç పురి మాత్రం మార్కెట్కు రోజూ వేల టన్నులు వస్తాయి. చిన్నరసాలు, పెద్దరసాలు, దసేరీ, హిమాయత్ రోజుకు 3 నుంచి 4 టన్నుల వరకు వస్తాయి. గడ్డి అన్నారం మార్కెట్కు కృష్ణా జిల్లా నూజివీడు, విజయవాడ, గుడివాడ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, కొల్లాపూర్, నల్లగొండ, సూర్యాపేట్తో పాటు నగర పరిసరాల నుంచి రోజుకు వేల టన్నుల మామిడి దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. పూత ఆలస్యం వల్లే సీజన్ లేట్ రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మామిడి సీజన్ నెలా పదిహేను రోజులు ఆలస్యమైంది. దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్చి చివరి నుంచి దిగుమతి పెరగనుంది. మార్కెట్లో కార్బైడ్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి -
వ్యక్తి అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం, మందస: మండలంలోని అంబుగాం పంచాయతీ చిన్నలింబుగాం గ్రామానికి చెందిన వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని పులారి తులసి(36) అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి.. రాత్రికి చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం కాశీబుగ్గలో ఉన్నానని చెప్పిన ఆయన.. అంతలోనే విగత జీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మండలంలోని చిన్నలింబుగాం గ్రామానికి చెందిన తులసి.. గుజరాత్లోని గాంధీగ్రాం ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు. అక్కడి నుంచి మళ్లీ స్వగ్రామానికి వచ్చి.. హరిపురంలోని రట్టి రోడ్డు జంక్షన్ సమీపంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. జేసీబీ, ట్రాక్టర్ను అద్దెకు ఇస్తూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య భానుమతి, కుమారుడు హరీష్, కుమార్తె సంధ్య ఉన్నారు. రోజూ ఇంటి వద్ద నుంచి హరిపురం వెళ్లి వస్తున్నారు. బుధవారం యధావిధిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొంత సమయం తర్వాత భార్య భానుమతి ఫోన్ చేయగా.. కాశీబుగ్గలో ఉన్నానని తులసి చెప్పారు. రాత్రి సమయంలో ఫోన్ చేసినా ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అంబుగాం నుంచి చిన్నలింబుగాంనకు వెళ్లేదారిలోని తోటల్లో ఓ మామిడిచెట్టుకు ఉరి వేసుకుని కనిపించడంతో వీరంతా హతాశులయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి సోంపేట సీఐ సన్యాసినాయుడు, మందస ఎస్ఐ యర్ర రవికిరణ్ చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. డాగ్స్ మాత్రం అంబుగాం బస్షెల్టర్ వరకు వచ్చి వెనుతిరిగాయి. మృతదేహాన్ని బారువా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తులసి మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. తులసికి ఎవరితోనూ వివాదాలు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మామిడిచెట్టుకు ఎత్తుగా వేలాడుతుండడం.. సంఘటనా స్థలంలోనే ఓ చిన్న చాకు పడి ఉండడం.. మృతదేహంపై రక్తపు మరకలుగానీ, గాయాలు గానీ లేకపోవడంతో అందరిలోనూ మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం
- కుండపద్ధతిలో మామిడి సాగు పరిశీలన బుక్కపట్నం : మండలంలో కుండలతో సాగవుతున్న మామిడి తోటలను సోమవారం అమెరికా ప్రతినిధి బృందం పరిశీలించింది. బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి రైతులు ఇండో–జర్మన్ ప్రాజెక్టులో భాగంగా కుండల పద్ధతిలో మామిడి తోటలు సాగు చేశారు. అమెరికా ప్రతినిధి బృంద సభ్యులు నటాలియా, నటాలి, శాలినోశర్మ, గోపాల్ ఆధ్వర్యంలో కుండ పద్ధతిని క్షేత్రస్థాయిలో అధ్యనయం చేయడానికి వచ్చారని ఏపీఓ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. వారు రైతులతో నేరుగా మాట్లాడి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో టీఏ శేఖర్, రైతులు పాల్గొన్నారు. -
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలోని ఆడిటోరియంలో సోమవారం జరిగిన వికాసం సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 2017 జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం ఆరు రీజియన్ల పరిధిలోని కళాకారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు సోలో సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, సోలో డ్యాన్స్, డప్పు వాయిద్య పోటీలను నిర్వహించారు. ఆదోని, శ్రీశైలం రీజియన్లకు చెందిన కళాకారులతో కలిపి మొత్తం 218 మంది కళాకారులు పాల్గొన్నారు. వీటిలో విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాలు గల వారు ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి వారికి పోటీలను నిర్వహించారు. మంగళవారం కూడా జరిగే పోటీల అనంతరం విజేతలను ప్రకటిస్తామని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, ఆర్డీటీ డైరెక్టర్లు జేవీఆర్, దశరథరాముడు, నాగేశ్వరరెడ్డి, నిర్మల్కుమార్, కమ్యూనికేషన్ ఏడీ నాగప్ప, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. -
పండే కదా అని తినేస్తే...!
-
పండే కదా అని తినేస్తే..!
-
పరువే కాదు.. మామిడి కాయలు కూడా!
► తమ్ముడిని చంపిన అన్న ►జగిత్యాల జిల్లాలో ఘోరం జగిత్యాల రూరల్: ఆస్థి కోసం, పరువుకోసం హత్యలు చేయడం చూశాము. మరీ ఏకంగా మామిడి కాయల కోసం తమ్ముడి చంపిన ఘటన సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలీవి.. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్లు ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా ఒక మామిడిచెట్టు కాయలు నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం సాయంత్రం కోస్తుండగా రెండో అన్న నాంపెల్లి శ్రీను అక్కడకు చేరుకొని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మామిడి కాయలు తెంపుతున్న లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. ఆందోళనకు గురైన లక్ష్మణ్ కేకలు వేశాడు. సమీపంలో ఉన్న మరో అన్న హన్మండ్లు వచ్చాడు. గమనించిన శ్రీను ఆయనపైనా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే స్థానికులు కొందరు 108కు సమాచారం ఇచ్చి రక్తంమడుగులో పడిఉన్న లక్ష్మణ్ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే లక్ష్మణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురికావడం విషాదం నింపింది. మల్యాల సీఐ కృపాకర్, ఎస్సై కిరణ్కుమార్ జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య రమ, కొడుకులు అజయ్, అభి, కుమార్తె అఖిల ఉన్నారు. -
మామిడి తోటల్లోనే ఇథిలిన్ చాంబర్లు!
మామిడిని సాగు చేసే రైతులు మార్కెట్లో పంటను అమ్ముకోవటానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను మాగబెడుతున్నారనే సాకుతో మధ్య దళారీలు, మార్కెట్ ఏజెంట్లు కుమ్మక్కై రైతుల పొట్టకొట్టి లాభాలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే.. రైతు స్థాయిలో ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్ను ఏర్పాటు చేసుకోవడమే మార్గం. అందరికీ రసాయన అవశేషాలు లేని మామిడి పండ్లు అందుబాటులోకి వస్తా. కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధించిన నేపథ్యంలో.. వినియోగదారులకు హాని కలగకుండా ఇథిలిన్ వాయువు ద్వారా కృత్రిమంగా పండ్లను మాగపెట్టే ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్ గురించి ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చజరుగుతోంది. అయితే వాణిజ్య పరంగా ఇథిలిన్ ఎక్కడ దొరుకుతుందనే అంశంపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఇథిలిన్ ద్వారా మామిడికాయలు మాగపెట్టేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానం... ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్లో మామిడి కాయలను మాగబెట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఉపయోగాల గురించి సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. తోట వద్దే అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు రైతులు తోట వద్దే సొంతంగా రైపెనింగ్ చాంబర్ను నిర్మించుకోవచ్చు. లే దా అందుబాటులో వున్న గదిని వాడుకోవచ్చు. గాలి, వెలుతురు చొరబడకుండా.. కిటికీలు మూసి సీల్ చేయాలి. ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఇథిలిన్ సిలిండర్లు దొరుకుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.350 వరకు ఉంటుంది. ఒక్కో సిలిండర్ను ఉపయోగించి 3 నుంచి 4 టన్నుల మామిడి కాయలను మాగపెట్టొచ్చు. తొలుత గదిని గాలి, వెలుతురు చొరకుండా సీల్ చేసుకోవాలి. రైపెనింగ్ చాంబర్లో మామిడికాయలను వుంచాలి. గది విస్తీర్ణంలో మూడో వంతుకు మించకుండా పక్వానికి సిద్ధంగా వున్న కాయలను క్రేట్లలో అమర్చుకోవాలి. 100 నుంచి 150 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టాలి. 12 నుంచి 24 గంటల పాటు చాంబర్ తలుపులను మూసి ఉంచాలి. తర్వాత గదిని రెండు మూడు గంటల పాటు తెరిచి వుంచితే కార్బన్ డై ఆక్సైడ్ బయటకు పోయి కాయలు నల్లబడకుండా ఉంటాయి. తరువాత మరోమారు ఇథిలిన్ వాయువును పంపి మళ్లీ 12 గంటల పాటు గదిని మూసి వుంచాలి. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పండ్లు పక్వానికి వచ్చి మంచి రంగు, రుచితో వుంటాయి. గదిని మూసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నని పైపు ద్వారా.. ఇథిలిన్ వాయువును పంపాలి. రెగ్యులేటర్ సాయంతో అవసరమైన మొత్తంలో ఇథిలిన్ వాయువును పంపవచ్చు. మొదటి దశలో 150 పీపీఎం, రెండో దశలో 100 పీపీఎం వరకు వాయువును పంపాలి. కాల్షియం కార్బైడ్ వినియోగంతో కాయ చర్మం రంగు మారినా.. లోపల గుజ్జు మాత్రం పక్వానికి రాదు. కానీ ఇథిలిన్ వాయువు ద్వారా మాగపెట్టే పండ్లు లోపల గుజ్జు కూడా పూర్తిగా పక్వానికి వస్తుంది. అవసరమైతే వీటిని కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచి నింపాదిగా మార్కెటింగ్ చేసుకోవచ్చని కిరణ్ కుమార్ తెలిపారు. చైనా పొడికి శాస్త్రీయత లేదు కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం మార్కెట్లో మామిడి కాయలను కృత్రిమంగా మాగపెట్టేందుకు ‘చైనా పొడి’ని వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాల్షియం కార్బైడ్ను పొడి చేసి వాడుతున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి. అయితే చైనా నుంచి దిగుమతి అయిన ఈ పొడిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశోధన, ప్రయోగ సంస్థలేవీ ధ్రువీకరించలేదు. అధికారికంగా ఈ పొడి వాడకానికి ఎలాంటి అనుమతులు లేవని కిరణ్ కుమార్ తెలిపారు. రైపెనింగ్ చాంబర్గా మారిన రేకుల షెడ్డు! కుందూరు బుచ్చిరాంరెడ్డి ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసి వ్యవసాయం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దోమలోనిపల్లి ఆయన స్వగ్రామం.15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మామిడిని సాగు చేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండించిన మామిడి పండ్లను మార్కెట్కు తీసుకెళితే కమిషన్ ఏజెంట్లు నిండా ముంచేవారు. కాయలు కోసి.. వాహనాల్లోకి ఎక్కించేంత వరకు మంచి ధర ఇస్తామని నమ్మబలికేవారు. తీరా మార్కెట్కు వెళ్లిన తర్వాత వారిష్టం వచ్చిన ధర చెప్పి పైసలు చేతిలో పెట్టేవారు. ‘చూట్’ పేరిట 10 శాతం కాయలను ధర చెల్లించకుండానే తీసుకుంటున్నారు. గిట్టుబాటు కాకున్నా సరే వారు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించే వారు. మరోవైపు కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటాన్ని ఆసరాగా చేసుకొని కమిషన్ ఏజెంట్లు రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఏడాదంతా కష్టపడినా గిట్టుబాటు కాకపోవడంతో సొంతంగా మార్కెటింగ్ అవకాశాలపై బుచ్చిరాంరెడ్డి దృష్టి పెట్టారు. హైదరాబాద్లో జరిగిన ‘మ్యాంగో మేళా’లో స్టాల్ను అద్దెకు తీసుకుని.. మూడు నాలుగు రోజుల్లోనే ఒక టన్ను వరకు పండ్లను లాభసాటి ధరకు అమ్ముకున్నారు. మరోవైపు పరిచయస్తులకు, అపార్ట్మెంట్ల వద్ద మొబైల్ వ్యాన్తో కొంత మేర అమ్మకాలు జరిపారు. అయితే అమ్మకాలు బాగున్నప్పటికీ సహజసిద్ధంగా పండ్లను మాగపెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సైంటిస్టు కిరణ్కుమార్ సూచన మేరకు తోటలో ఇన్నాళ్లూ స్టోర్ రూంగా వాడుతున్న రేకుల షెడ్డును ఎలాంటి ఖర్చు లేకుండా ‘రైపెనింగ్ చాంబర్’గా మార్చారు. గదిని పూర్తిగా మూసివేసి.. రేకులపైన ఎండుగడ్డి వేసి రోజూ నీటితో తడిపేవారు. దీంతో గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించగలిగారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నటి పైపు ద్వారా నిర్దేశిత మోతాదులో ఇథిలీన్ వాయువును పంపుతూ పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఒక్కో కాయను మాగబెట్టడానికి 15 పైసలు ఖర్చవుతోంది. రిఫ్రాక్టోమీటర్తో పండ్ల పక్వాన్ని అంచనా వేస్తారు. దీని ఖరీదు రూ.1,600. ఇలా మాగపెట్టిన పండ్లను గ్రేడింగ్ చేసి సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజి గదిలో భద్రపరుస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ను కూడా బుచ్చిరాంరెడ్డి పొందారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు మామిడి తోటను సందర్శించి, అనుసరిస్తున్న సేంద్రియ పద్ధతులు, ఇథిలిన్ వాయువుతో మాగపెట్టడాన్ని పరిశీలించింది. ఈ సంస్థ సిఫారసు మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ పీజీఎస్ ఇండియా తెలంగాణ కౌన్సిల్ బుచ్చిరాంరెడ్డికి స్కోప్ సర్టిఫికెట్ ఇచ్చింది. – కల్వల మల్లికార్జున్ రెడ్డి, సాక్షి, సంగారెడ్డి జిల్లా ఫొటోలు: బగిలి శివప్రసాద్, ఫొటో జర్నలిస్ట్ కాయకు 15 పైసల ఖర్చుతో మాగబెట్టుకోవచ్చు రైపెనింగ్ చాంబర్లో మాగబెట్టిన మామిడి పండ్లను అమ్మేందుకు ఆర్గానిక్ సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. అపార్ట్మెంట్ల వద్ద నేరుగా అమ్మకాలు సాగిస్తున్నాం. నాణ్యత, రకాన్ని బట్టి మంచి ధర పలుకుతోంది. బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ స్టోర్లు కూడా మేము పండించిన మామిడి పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో కాయకు 15 పైసల ఖర్చుతో ఇథిలిన్ చాంబర్లలో మాగబెట్టుకోవచ్చు. ఇథిలిన్ చాంబర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు సిలిండర్లు ఇవ్వాలి. చిన్న రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలి. ఆమ్చూర్, గుజ్జు తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. – కుందూరు బుచ్చిరాంరెడ్డి (94412 84289) సేంద్రియ మామిడి రైతు, దోమలోనిపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం రైతులకు శిక్షణ ఇస్తున్నాం! స్వల్ప ఖర్చుతోనే రైతు స్థాయిలో తోటల్లోనే ఇథిలిన్ ద్వారా మామిడి కాయలను మాగపెట్టడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ద్వారా మాగబెట్టడం, రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటు తదితర అంశాలపై ముందుకు వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా బృందాలుగా వచ్చే ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తున్నాం. నేరుగా వచ్చే రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ఛాంబర్ల ఏర్పాటుపై మరిన్ని వివరాల కోసం.. ‘ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా – 502001, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాలో లేదా 08455– 276451 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. – డాక్టర్ కిరణ్ కుమార్ (94401 08930) సీనియర్ శాస్త్రవేత్త, ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
మామిడికాయల కోసం దారుణ హత్య
తమ్ముడిని చంపిన అన్న జగిత్యాల రూరల్: మామిడి కాయల కోసం ఓ అన్న తమ్ముడిని చంపిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్ అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా, ఒక చెట్టు కాయలను నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం కోస్తుండగా రెండో సోదరుడు నాంపెల్లి శ్రీను వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. లక్ష్మణ్ కేకలు వేయగా, సమీపంలోనే ఉన్న మరో సోదరుడు హన్మాండ్లు వచ్చాడు. దీంతో శ్రీను అతడిపైనా దాడికి ప్రయత్నించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ను స్థానికులు 108లో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్ కాగా, వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలి
► స్టాల్ను ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్ కరీంనగర్సిటీ: జిల్లాలో కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కార్బైడ్ రహిత మామిడిపండ్ల విక్రయం, వాడకంపై అవగాహనలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతిలిన్స్ప్రే ద్వారా పండించిన మామిడి పళ్ల విక్రయ స్టాల్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కార్బైడ్ ద్వారా పండించిన పండ్ల వాడకం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు. కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జేసీ బద్రి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి బండారి శ్రీనివాస్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాకు భారత్ మామిడిపండ్లు
మెల్బోర్న్: భారత్ తొలిసారిగా ఆస్ట్రేలియాకి మామిడి పండ్లను ఎగుమతి చేయనుంది. అన్నీ కుదిరితే మామిడి ఎగుమతులు ఈ ఏడాదే ప్రారంభం కావొచ్చు. జీవభద్రత నియమ నిబంధనలకు లోబడి ఎగుమతులు జరిగితే ఈ ఏడాది మామిడి సీజన్ ముగిసేలోగా భారతదేశం మామిడి పండ్లు ఆస్ట్రేలియాకు చేరుతాయని ఆస్ట్రేలియా మామిడి పరిశ్రమ సంఘ ప్రతినిధి రాబర్ట్ గ్రే చెప్పారు. -
మామిడి పండు.. దళారీ దండు
మార్కెట్ మాయాజాలంతో మామిడి రైతు కుదేలు పండ్ల ధరలు ఒక్కసారిగా పతనం.. పక్షం రోజుల్లో తారుమారైన పరిస్థితి బంగినపల్లి రకం ధర క్వింటాలుకు రూ. వెయ్యే.. తోతాపురి రూ. 6 వందలే.. మార్చిలో రూ. 25 వేల నుంచి 32 వేలు పలికిన క్వింటాలు ధర 11 శాతం కమీషన్ వసూలు చేస్తూ రైతుల్ని టోకుగా ముంచేస్తున్న దళారులు రైతు నుంచి తక్కువ ధరకు కొని నాలుగు రెట్లకు అమ్ముతున్న వ్యాపారులు పంటను వెనక్కి తీసుకెళ్లలేక తెగనమ్ముకుంటున్న రైతులు చిలుకూరి అయ్యప్ప, సాక్షి ప్రతినిధి: ఫలాల్లో రారాజు మామిడి..! మరి ఆ ‘రారాజు’ను పండించే రైతన్న..? దిగుబడి వచ్చినా ధర లేక, మార్కెట్ మాయాజాలపు చదరంగంలో ఓడిపోయి ‘పేద’గా మిగిలిపోతున్నాడు! తియ్యని పండ్లను మార్కెట్లకు తెచ్చి ‘చేదు’నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాట పడుతున్నాడు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, దళారులు మాత్రం బయట మార్కెట్లో నాలుగు రెట్లకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. గతేడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం మామిడి దిగుబడి మునుపటి కంటే భారీగా పెరిగింది. దీంతో ఆదాయం రెట్టింపు అవుతుందని భావించిన మామిడి రైతులకు దళారీ మార్కెట్ షాకిచ్చింది. సీజన్ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. దిగుబడులు పెరుగుతున్న కీలక తరుణంలో ఒక్కసారిగా తగ్గించేశారు. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో మార్చి నెల రెండో వారంలో బంగినపల్లి రకం మామిడి క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.1,500 మించి చెల్లించడం లేదు. గతనెలలో తోతాపురి రకం మామిడి రూ.2 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.600 నుంచి నుంచి రూ.900 మధ్య చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మామిడి పంట 4.71 లక్షల ఎకరాల్లో ఉన్నట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సగటున 21.19 లక్షల టన్నుల దిగుబడులు రావాల్సి ఉన్నా.. వడగళ్ల దెబ్బతో 14.13 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. గతేడాది ఈ దిగుబడులు 10 లక్షల టన్నుల లోపే ఉన్నాయి. మార్కెట్ మాయాజాలమిదీ.. రాష్ట్రంలో మెజారిటీ రైతులు కొత్తపేటలోని గడ్డి అన్నారం పళ్ల మార్కెట్లోనే దిగుబడులు విక్రయిస్తారు. వరంగల్, జగిత్యాలలోని చిన్న మార్కెట్లలో కొనుగోలు చేసిన దిగుబడులు సైతం కొత్తపేట్ మార్కెట్కు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. సమయం గడిస్తే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పంటను ప్రత్యామ్నాయంగా విక్రయించే అవకాశాలు లేకపోవడంతో కొత్తపేట మార్కెట్కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ మార్కెట్కు డిమాండ్ విపరీతంగా ఉండడంతో దళారులు.. కొనుగోలు, అమ్మకాలను శాసిస్తున్నారు. దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించడం ఒకటైతే... 11 శాతం కమీషన్ రూపంలో వసూలు చేయడంతో రైతు టోకుగా మోసపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ నిబంధనల మేరకు 4 శాతానికి మించి కమీషన్ వసూలు చేయకూడదు. రైతును గుల్ల చేస్తున్న వేలం మార్కెట్కు వచ్చిన మామిడి దిగుబడులకు దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారం మార్కెట్లో 97 స్టాళ్లు ఉండగా.. వీటి పరిధిలో 267 మంది కమీషన్ ఏజెంట్లున్నారు. వీరి వద్దకు వచ్చిన దిగుబడులకు ధరను వేలం ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారు సైతం కమీషన్ ఏజెంట్ల మనుషులే కావడంతో ధరల పెంపు, తగ్గింపు అంతా వారి నిర్ణయం మేరకే జరుగుతోంది. ఇక్కడ దిగుబడి తెచ్చిన రైతు కేవలం ప్రేక్షకుడిగానే ఉండాలి. ఈ ప్రక్రియతో అత్యుత్తమ రకం మామిడి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మార్కెట్ పూర్తిగా దళారులమయమైంది. గడ్డి అన్నారం మార్కెట్లో 60 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నా.. ఒక్క రైతుకూ నిల్వ చేసుకునే అవకాశం దక్కడం లేదు. కొనేది రూ.15... అమ్మేది రూ.60 రైతు నుంచి తక్కువ ధరలో మామిడి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు... బహిరంగ మార్కెట్లో నాలుగింతలు పెంచేసి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి టోకుగా కోనుగోలు చేస్తున్న బంగినపల్లి మామిడికి కిలోకు రూ.10–15 చెల్లించి.. అవి మక్కిన తర్వాత రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అలాగే తోతాపురి రకం మామిడిని కిలోకు రూ.6 నుంచి రూ.9కి కొంటున్న వ్యాపారులు.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.35 దాకా విక్రయిస్తున్నారు. ఈయన పేరు సత్తన్న. వనపర్తికి చెందిన ఈ రైతు గతేడాది రూ.2.5 లక్షలు పెట్టి 8 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే వచ్చింది. పళ్లను హైదరాబాద్లోని కొత్తపేట మార్కెట్కు తెచ్చాడు. ఇప్పటిదాకా మూడు దఫాలుగా 8 టన్నుల మామిడి పళ్లను విక్రయించగా రూ. 1.5 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో2 టన్నుల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా లెక్కేసుకుంటే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో శనివారం ఉదయం మార్కెట్లో ఇలా తల పట్టుకుని కూర్చున్నాడు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం ‘‘మార్కెట్లో కమిషన్ 4% మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నాం. లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే.. ఆ కమిషన్ ఏజెంటు లైసెన్సు రద్దు చేసే అధికారం మాకుంది. కానీ ఇప్పటివరకు ఫిర్యాదులేవీ రాలేదు. ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు ఇస్తున్నాం. త్వరలో మార్కెట్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తాం..’’ – పుట్టం పురుషోత్తం రావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూలీ కూడా దక్కలేదు ‘‘రూ.3.5 లక్షలు పెట్టి ఐదెకరాలు కౌలుకు మామిడి వేసిన. మార్కెట్కు ఈ రోజు 16 క్వింటాళ్ల మామిడి తీసుకొచ్చిన. వాటిని కొన్న వ్యాపారులు రూ.5 వేలు చేతిలో పెట్టారు. పొలం నుంచి మార్కెట్కు తీసుకొచ్చేందుకు బండి కిరాయికి రూ.4,500 ఖర్చయింది. కాయ తెంపేందుకు 10 మంది కూలీలకు రూ.3 వేలు చెల్లించిన. ఇప్పుడు మార్కెట్లో రూ.5 వేలు వచ్చినయి. మరి నాకెంత లాభం వచ్చిందో చెప్పండి..’’ – రంగస్వామి, మామిడి రైతు, పెబ్బేరు -
నీ ఆలోచనలే నువ్వు
‘‘స్వామీ! నా మనసు బాగులేదు. ఏదైనా వైద్యం ఉంటే చేయరా ...’’ అని తన ముందు తలవంచుకుని నిల్చున్న వ్యక్తిని చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు జెన్ సాధువు. ‘‘నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నిజానికి నీకు ఎలాంటి సమస్యా లేదు... నీకు ఏ మందూ అక్కరలేదు...’’ అన్నారు. ‘‘అలా అనకండి... నా మీద దయ ఉంచి సహాయం చేయండి. లేకుంటే ఏ స్థితికి లోనైపోతానో తలచుకుంటేనే భయమేస్తోంది...’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘సరే! నేను నీకు ఓ మందు ఇస్తాను... కానీ ఓ షరతు... నువ్వు ఈ మందు వేసుకునేటప్పుడు మామిడి పండు గురించి ఆలోచించకూడదు.. సరేనా’’ అన్నారు సాధువు. ‘‘అలాగే’’ అంటూ గురువుగారి నుంచి ఆయన ఇచ్చిన మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడతను. మరుసటిరోజు ఉదయం, స్నానం చేసి మందు వేసుకోవడానికి కూర్చున్నాడు. ఆ క్షణమే అతనికి మామిడి పండు గురించి జ్ఞాపకం వచ్చింది. అతని మనసంతా మామిడి పళ్ళతో నిండిపోయింది. ‘‘ఏమిటిది?’’ అనుకున్న అతను అర గంట తర్వాత మళ్ళీ మందు వేసుకోవడానికి ఓ మూల కూర్చున్నాడు. మళ్ళీ ఇందాకలాగే అతనికి మామిడి పండు గుర్తుకు వచ్చింది. ఆరోజు అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడి పళ్ళు గుర్తుకు రావడంతో మందు వేసుకోలేక పోయాడు. ఇక లాభం లేదనుకుని అతను ఆ రోజు సాయంత్రం గురువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి ‘‘మీరు ఇచ్చిన మందు వేసుకోవడం నా వల్ల కాలేదు... ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడిపళ్ళు గుర్తుకు వస్తూనే ఉన్నాయి...’’ అన్నాడు బాధగా. ‘‘అవును... ఎందుకు మామిడి పండు జ్ఞాపకానికి రాకుండా ఉంటుంది. నేను నీకిచ్చింది మామిడి పండు రసమే... ఆ వాసన వస్తుంటే నీకు మామిడి పండు గుర్తుకు రాకుండా ఉంటుందా... మామిడిపండు గుర్తుకు వచ్చే తీరుతుంది...’’ అని నవ్వుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నారు – ‘‘నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నీ మనసులో మెదులుతూనే ఉంటుంది. నీకు బుద్ధి పని చేయడం లేదని పదే పదే అనుకుంటే నీకు బుద్ధి లేదనే అనిపిస్తుంది. అలా కాకుండా నీ బుద్ధి బాగానే ఉంది అనుకుంటే నీ బుద్ధి సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది... నువ్వు ఏది అనుకుంటే అదే నిజం... కనుక నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావో ఆలోచించు... నీ ఇష్టం’’ అని అనడంతో అతను తన వాస్తవ స్థితిని తెలుసుకున్నాడు. తనకేమీ అనారోగ్యం లేదని అనుకుని గురువుకు దణ్ణం పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. -
మేలు మామిడి
గుడ్ ఫుడ్ మార్కెట్లోకి మామిడిపండ్లు విరివిగా వస్తున్నాయి. వాటికి సీజన్ ఇది. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. మామిడిలో ఏమేముంటాయి: చిన్న కప్పు మామిడి ముక్కల్లో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిలో ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని ఒక అంచనా. మామిడి ప్రయోజనాలు ⇒మామిడి పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. ⇒కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్ డీజనరేషన్’ ముప్పును తప్పించగల శక్తి దీని సొంతం. ⇒మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణించవచ్చు. ⇒కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్ మామిడిలో పుష్కలంగా ఉంటుంది. ⇒మామిడిలోని బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ⇒మామిడిలో ఉండే పొటాషియమ్ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. -
రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు
-
మధురఫలంలోమతలబు
-
మామిడి కొనుగోళ్ల నిలిపివేత
-
మామిడి కొనుగోళ్ల నిలిపివేత: హరీష్ ఆగ్రహం
హైదరాబాద్ : కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మామిడి కొనుగోళ్ల నిలిపివేతపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్ల నిలిపివేత సరికాదు.. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని వ్యాపారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించక పోతే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఆదేశం మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు. కార్బైడ్, చైనా పౌడర్ను ఉపయోగించి మామిడికాయలను మార్కెట్కి తీసుకు వస్తున్నారని వ్యాపారస్తులు కొనుగోళ్లు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్ వాడుతున్నారంటూ 92 దుకాణాలకు లైసెన్స్లు రద్దు చేస్తూ మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. మరో వైపు సోమవారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. -
ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్!
ప్రకృతి ప్రేమమయం.. చెట్లు మరీనూ.. మానవులకు పండ్లరూపంలో ‘తియ్యని’ ప్రేమను అందించుతాయి. ఆ గుప్పెడంత ప్రేమను ఒక్కోసారి దాచుకోలేక పుష్పం, కాయల రూపంలో బయటపెడతుంటాయి. ఆ బాపతుకు చెందిందే కొవ్వూరు మండలం కాపవరంలోని తాతా శేషారావు ఇంటి పెరట్లోని మామిడిచెట్టు. ఈ చెట్టుకు కాసిన హృదయం ఆకారంలోని మామిడి కాయ ఇదిగో ఇలా ఆకట్టుకుంటోంది. -కొవ్వూరు రూరల్ -
మామిడి తోటకు నిప్పు
శింగనమల : శింగనమల సమీపంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్దనున్న బెస్త సుంకన్నకు చెందిన మామిడి తోటకు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటనలో 150 మామాడి మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఐదేళ్ల కిందట 250 మామిడి మొక్కలు పెంచగా, ప్రసుత్తం అవి కాపు దశకు వచ్చాయని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో మొక్కలన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్ఐ శివారెడ్డి, వీఆర్ఓ వెంకట్రామిరెడ్డి తోట వద్దకు వెళ్లి కాలిపోయిన చెట్లను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
ప్రకృతి సేద్య ప్రసాదం!
- 21 ఎకరాల్లో పాలేకర్ పద్ధతుల్లో మామిడి, వరి, కూరగాయల సాగు - కృష్ణా జిల్లాలో సాగు.. హైదరాబాద్లో అమ్మకం - నేరుగా వినియోగదారులకు విక్రయంతో పెరిగిన నికరాదాయం - వరిలో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం - మామిడిలో కూరగాయల సాగుతో ఎకరాకు రూ. 75 వేల నికరాదాయం హైదరాబాద్లో సొంత వ్యాపారంలో స్థిరపడిన శేషసాయి వరప్రసాద్ జీవితాన్ని పాలేకర్ శిక్షణ మలుపుతిప్పింది. ఆ ప్రేరణతో నడి వయసులో పొలం బాట పట్టారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, పండ్లు, వరిని పండిస్తూ.. నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక నికరాదాయం గడిస్తున్నారు. వందల కి.మీ. దూరంలో ఉన్న తన పొలానికి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తుండడం విశేషం. సొంత గ్రామానికి దూరంగా నివసిస్తున్నా ప్రకృతి సేద్యం చేస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కి చెందిన శేషసాయి వరప్రసాద్. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం బూరుగుగూడెం ఆయన స్వగ్రామం. 1985లో డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి పదేళ్లపాటు క్యాటరింగ్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత నాగోలులో సొంతంగా క్యాటరింగ్ సంస్థను ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. గ్రామంలో ఉన్న 21 ఎకరాల మామిడి తోటను కౌలుకు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ద్వారా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి చదివి 2008లో శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆ విధంగా ప్రసాద్ మనసు ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. 2009 నుంచి తన తోటను కౌలుకు ఇవ్వటం మానేసి.. సొంతంగా తానే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వ్యాపారస్తులకు మామిడి పంటను అమ్మితే వారు దిగుబడి కోసం విచ్చలవిడిగా పూత, పురుగు నివారణ కోసం మందులు పిచికారీ చేసేవారు. దీంతో తోటలు దెబ్బతిని.. రైతులు మామిడి తోటలను తొలగించారు. ప్రసాద్ కూడా ఆరెకరాల్లో చెట్లను తొలగించి.. మూడెకరాల్లో కూరగాయలు, మూడెకరాల్లో వరిని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేపట్టారు. ప్రకృతి వ్యవసాయంలో ఒక వ్యక్తికి తానే శిక్షణ ఇచ్చి పొలంలో సూపర్వైజర్గా నియమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎర్రనేల, బోర్లపైనే వ్యవసాయం. తొలి దశలో దిగుబడులు తగ్గినా తదనంతరం మంచి దిగుబడులు వస్తున్నాయి. కూరగాయల సాగులో అధిక నికరాదాయం తొలి రెండేళ్లు పసుపును ప్రకృతి సేద్యంలో సాగు చేశారు. ఆదాయం కోసం పది నెలలు వేచి చూడాల్సి రావడంతో.. కూరగాయల సాగును చేపట్టారు. మూడెకరాల్లో వంగ, బెండ, టమాటా, దొండ, కాకర, వంకాయ, మునగ, మిర్చి, పొట్ల, బీర, దోసతోపాటు గోంగూర, తోటకూరలను సాగు చేస్తున్నారు. ఇదీ ఆయన సాగు పద్ధతి.. భూమిని పైపైన దున్ని ట్రక్కు మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని ఐదు మడులుగా విభజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు కొన్ని సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయలు వాడుతున్నారు. పురుగును గుడ్డు దశలోనే నివారించేందుకు నీమాస్త్రం వాడతారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేశారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీ. కషాయాన్ని 200 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతాయి. కిలో రూ. 20-30 చొప్పున విక్రయిస్తారు. నీటి కొరత వల్ల కూరగాయలు ఏడాదికి ఒకటే పంట వేస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేలు ఖర్చవుతాయి. ఖర్చులు పోను రూ. 75 వేల నికరాదాయం లభిస్తున్నది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రసాద్ తెలిపారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పోల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగేది.. ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లను హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. కూరగాయలు రుచికరంగా ఉండటం, ఫ్రిజ్లో పెట్టకున్నా మూడు రోజులు తాజాగా ఉండటంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఫోన్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. వరి.. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం ప్రసాద్ తన పొలంలో బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. దమ్ములో ఎకరాకు ట్రక్కు ఆవు పేడ వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని 15 రోజులకోసారి నీటి ద్వారా అందిస్తారు. రెండు వారాలకోసారి చీడపీడల నివారణకు బ్రహ్మస్త్రం,అగ్ని అస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో సాటి రైతులు అవహేళన చేశారు. అయినా.. ఆయన తన పని తాను కొనసాగించారు. గతేడాది ఎకరాకు 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రసాద్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తారు. బస్తా ధాన్యం మరపట్టిస్తే 55 కిలోల ముడి బియ్యం వస్తాయి. కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఆయన దగ్గర బియ్యం కొనే వారిలో కనీసం 50 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ఖర్చులు పోను ఎకరాకు రూ. లక్ష నికరాదాయం వస్తున్నదని ఆయన తెలిపారు. ఖర్చు రూ. 3 వేలు.. ఆదాయం రూ. 60 వేలు 15 ఎకరాల మామిడి తోటలో 300 చెట్లున్నాయి. ఇవి 30 ఏళ్ల నాడు నాటినవి. రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 48 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదు లీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ ట్రాక్టరుతో దున్నుతారు. పూత దశలో బ్రహ్మస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందె దశలో, పురుగు దశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో గతేడాది సగం దిగుబడే వచ్చింది. రసాయనిక సేద్యంలో ఎరువులు, పురుగు మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు మించి ఖర్చు కాదు. పండ్లకు మంచి ధర వస్తుంది. అయితే, చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండు రెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చు అంటారాయన. మామిడి పండ్లను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి, నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో పెట్టెలో 30 కాయలుంటాయి. పెట్టె రూ. 400 చొప్పున విక్రయిస్తారు. గతేడాది ఎకరాకు 150 పెట్టెల దిగుబడి వచ్చింది. రూ. 60 వేల చొప్పున పదిహేనెకరాల్లో రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. మామిడి చెట్ల మధ్య ఖాళీగా ఉండే భూమిలో స్థంభాలను పాతించి.. గుమ్మడి, బూడిద గుమ్మడి, పొట్ల, బీర, ఆనప వంటి తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఎకరాకు రూ. 30 వేల ఆదాయం పొందుతున్నారు. ‘పంతులు హైదారబాద్ నుంచి వచ్చి పిచ్చి వ్యవసాయం చేస్తున్నాడ’ని సాటి రైతులు తొలినాళ్లలో ఎగతాళి చేసేవారని, ఇప్పుడు వారే ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొస్తున్నారని ప్రసాద్ సంతృప్తిగా చెప్పారు. ఆయన తన తోటలో 26 నాటు ఆవులను పెంచుతున్నారు. ఆరుగురు రైతులకు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగా ఇస్తూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషం. కథనం : సాగుబడి డెస్క్ ఇన్పుట్స్ : కొమ్ము అర్జునరావు, సాక్షి, చాట్రాయి, కృష్ణా జిల్లా ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదు! హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ‘హరిత విప్లవం’తో ఆర్థికాభివృద్ధి సాధించాయని చదివి స్ఫూర్తిపొందేవాళ్లం. వరిలో ఎకరాకు 50-60 బస్తాల దిగుబడి అంటే అబ్బురపడేవాళ్లం. కానీ.. ఇప్పుడక్కడ దిగుబడులూ తగ్గాయి. కేన్సర్ రోగుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాల్సి వస్తున్నది. కేవలం డబ్బుంటే సరిపోతుందా.. మనిషి బ్రతకటానికి..? కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే సంపాదించిన రూపాయికి అర్థం లేదు. ప్రతి రైతూ తన కుటుంబం కోసం ఎకరంలో విధిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆరోగ్యంగా జీవించాలి. ప్రకృతి సేద్యం ద్వారా ఐదారు రకాల కూరగాయలు పండించి, మంచి ధరకు అమ్ముకుంటే.. నెలకు ఎకరానికి రూ. 50 వేల వరకూ నికరాదాయం పొందవచ్చు. అంతేకాదు.. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మాదిరిగా వ్యవసాయదారులు కూడా వారాంతపు సెలవులు తీసుకోవచ్చు. - పెండ్యాల శేషసాయి వరప్రసాద్ (98480 23143), బూరుగుగూడెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా -
ఇంటిప్స్
రోజుకు మూడుసార్లు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంటుంటే త్వరగా బరువు పెరుగుతారు. నెల రోజులలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మామిడిపండులో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బాగా పండిన తాజా మామిడిపండు ఒకటి తీసుకుని, గుజ్జును బ్లెండర్లో వేసి మెత్తగా చేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను కలిపి తాగాలి. -
అగ్ని ప్రమాదంలో మామడి తోట దగ్ధం
మైపాడు(ఇందుకూరుపేట): మండలంలోని మైపాడులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి మామిడి తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు మొత్తలు గ్రామానికి చెందిన గౌస్బాష మైపాడు, గంగపట్నం సరిహద్దుల్లో మామిడి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తోట సమీపాన ఓ రైతు పొలం వద్ద వ్యర్ధంగా పడి ఉన్న గడ్డిని తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మామిడి తోట వరకు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కాపలాదారులు కౌలుదారునితోపాటు స్థానికులకు ప్రమాద విషయం తెలియజేశారు. స్థానికులు వెంటనే చేరుకుని దగ్గరగా బోరు నీరు అందుబాటులో ఉండడంతో మంటలను ఆర్పి తీవ్రతను తగ్గించారు. ఈలోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు రెండెకరాల మేర తోట దగ్ధమవడంతో రూ.6 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు. -
మామిడి సాగుపై రేపు శిక్షణ
అనంతపురంఅగ్రికల్చర్ : మామిడి,సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.శ్రీనివాసులు, డాక్టర్ విజయశంకరబాబు హాజరై మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, సేంద్రియ పద్ధతుల ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268లో సంప్రదించాలన్నారు. -
వీడిన మహిళ హత్య మిస్టరీ
వివాహేతర సంబంధం బయటపడుతుందని హతమాచ్చాడు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోరుట్ల : పట్టణ శివారులోని మామిడితోటలోని రెస్ట్హౌస్లో గత నెల 27న గుర్తించిన మహిళ హత్య మిస్టరీ వీడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెవద్ద అప్పు తీసుకున్న వ్యక్తే హతమార్చిట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని సీఐ రాజశేఖర్రాజు సోమవారం అరెస్ట్ చూపారు. సీఐ కథనం ప్రకారం.. మాదాపూర్ వీఆర్వో రాకేశ్ ఫిర్యాదు మేరకు కోరుట్ల శివారులోని గఫార్ మామిడితోటలోని రెస్ట్హౌస్ గదిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహాం ఉన్నట్లు జులై 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన సీఐ రాజశేఖర్రాజు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సల్ల గంగు(45) కొన్ని రోజులుగా కనిపించడంలేదని ఆమె బంధువులకు ఫిర్యాదు చేశారు. వారికి మృతదేహం ఫొటోలు చూపగా వారు గుర్తుపట్టలేదు. దీంతో చనిపోయిన మహిళ విషయంలో స్పష్టత రాలేదు. మహిళ ఎవరన్న విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరికి మృతదేహాం సల్ల గంగుదేనని నిర్ధారించారు. ఆమెకు కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కల్లెడ లక్ష్మీనర్సయ్యతో మూడేళ్లుగా పరిచయం ఉందని తేలింది. ఆ దిశలో విచారణ సాగించగా లక్ష్మీనర్సయ్య తమకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని గంగు వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ తరువాత వడ్డీతోసహా చెల్లించాడు. అయినా ఇంకా డబ్బులు రావాలని లక్ష్మీనర్సయ్యతో గంగు గొడవ పడేది. డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని బయటపెడతానని బెదిరించింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కొన్నిరోజులు గొడవ జరిగింది. విసిగిపోయిన లక్ష్మీనర్సయ్య చివరికి ఆమె చంపాలని నిర్ణయించుకున్నాడు. జులై 22వ తేన గంగును తన మోటార్సైకిల్పై ఎక్కించుకుని కల్లూర్రోడ్లోని గఫార్ తోట వద్ద ఉన్న రెస్ట్హౌస్కు తీసుకెళ్లాడు. అక్కడ గొడవ జరగగా లక్ష్మీనర్సయ్య తన వెంట తెచ్చుకున్న నైలాన్ తాడును గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె సెల్ఫోన్ నుంచి సిమ్కార్డు తీసి వేసి ఫోన్, నైలాన్తాడును సమీపంలో ఉన్న పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడు తాను సల్ల గంగును హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. హత్య మిస్టరీని ఛేదించిన ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సైలు సతీష్, సూరి, అయిలాపూర్ వీపీవో మహేందర్ను సీఐ అభినందించారు. -
ఐదు వేల ఎకరాల్లో మామిడి మొక్కలు
ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల పక్కన నాటేందుకు కార్యాచరణ మహిళా గ్రూపులకు పరిరక్షణ బాధ్యత అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు కలెక్టర్ వాకాటి కరుణ ప్రణాళిక సాక్షిప్రతినిధి, వరంగల్ : హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హరితహారం అమలుతీరును ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుకు కొలమానంగా భావిస్తామని చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం సైతం అదే స్థాయిలో అమలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు ఒకటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రం కొనసాగిస్తూనే... జిల్లా కలెక్టరు వాకాటి కరుణ వినూత్న ప్రణాళిక రూపొందించారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల వెంట ఉన్న ప్రభుత్వ భూములలో మామిడి మొక్కలను పెంచాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మామిడి మొక్కల పెంపకం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో 400 ఎకరాల్లో మామిడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. మామిడి మొక్కల పెంపకం బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. మొక్కలు పెరిగిన తర్వాత వచ్చే మామిడి పళ్ల సేకరణ, అమ్మకం వ్యవహారాలు మహిళా సంఘాలకే అప్పగిస్తారు. ఆర్థికపరమైన అంశాల్లో మహిళా సంఘాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్(ఎస్పారెస్పీ), దేవాదుల ప్రాజెక్టుల నీటి సరఫరా కోసం జిల్లా వ్యాప్తంగా కాలువులను నిర్మించారు. కాలువల నిర్మాణం కోసం సాగునీటి శాఖ భూములను సేకరించింది. కాలువల నిర్మాణం తర్వాత రెండు వైపులా సాగునీటి శాఖ భూములు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో ఉన్నాయి. ఏడాదిలో కనీసం మూడు నెలలు ఈ కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువలకు ఇరువైపులా ఉండే సాగునీటి శాఖ భూములలో మామిడి మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టరు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్న 100 ఎకరాల భూముల్లో మొక్కలు నాటనున్నారు. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం గ్రేటర్ వరంగల్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని కాలువల వెంట 300 ఎకరాల్లో మామిడి మొక్కలను నాటనున్నారు. ఐదు వేల ఎకరాలు లక్ష్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు సాగునీటి కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూములో కొంత స్థలంలోనే నిర్మాణాలు ఉంటాయి. కాలువులకు రెండు వైపులా సాగునీటి శాఖ భూములు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ భూముల్లో మామిడి మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తొలిదశలో వరంగల్ నగరంలోని కాలువలకు పక్కన ఉన్న 100 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటుతాం. దశల వారీగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి శాఖ దీంట్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు మహిళా, శిశు సంక్షేమంలో ప్రధానమైన అంగన్వాడీ కేంద్రాలకు హరితహారంతో కొత్త కళను సంతరించే ప్రయత్నం జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. మొక్కల పెంపకానికి అనువైన స్థలం ఉన్న కేంద్రాలన్నింటిలో మునగ, కరివేప, నిమ్మ మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మొక్కలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. మొక్కలు రాగానే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒకేరోజు ఈ మూడు రకాల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఏర్పాౖటెన అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పోషకాలు ఉండే మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్తులో ఉపయోగాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ నాటేందుకు మునగ, కరివేప, నిమ్మ మొక్కలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి తెలిపారు. 12 వేల మొక్కలను అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ(ఐసీడీఎస్)కు సంబంధించి జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4196 అంగన్వాడీ కేంద్రాలు, మరో 327 మినీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలు కలిపి సగటున 2.18 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. గర్భిణులకు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ జరుగుతోంది. -
మామిడి తోటలో గుర్తుతెలియని మహిళ శవం
కోరుట్ల రూరల్ : మండలంలోని కల్లూర్రోడ్ మాదాపూర్ శివారులోని మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవా రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోట నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో పనిచేస్తున్న కూలీలు వెళ్లి చూశారు. తోటలో ఉన్న షెడ్డులో కుళ్లి పోయిన మహిళ మృత దేహం కనిపించిం ది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాబూరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తుపట్టలేకుండా ఉంది. ఒంటి పై నీలి రంగు చీర, ఎడమ చేతికి వాచీ ఉంది. మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
మామిడితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు మహేశ్వరం: మామిడితోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుండగులు హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మహేశ్వరంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో ఆదివారం దుర్వాసన రావడంతో కార్మికులు పరిశీలించారు. ఓ కుళ్లిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని వేరే ప్రాంతంలో హత్య చేసి రాత్రివేళలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
స్నాక్ సెంటర్
మ్యాంగో రవ్వ ఇడ్లీ కావలసినవి: ఉప్మా రవ్వ - 1 కప్పు, మామిడిపండ్ల గుజ్జు - 1 కప్పు, పంచదార - 1 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకులపొడి - పావు టీ స్పూన్, ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు, సార పప్పు - 1 టీ స్పూన్ లేదా జీడిపప్పు - 4 తయారీ: ముందుగా స్టౌ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులో రవ్వను కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలో మామిడిపండ్ల గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఆపైన కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. అలాగే ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను అందులో పెట్టి స్టౌపై పెట్టాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత తీసి చూడండి.. నోరూరించే మ్యాంగో స్వీట్ ఇడ్లీ రెడీ. బయటికి తీసిన ఇడ్లీలపై సార పప్పు లేదా జీడిపప్పును పెట్టి గార్నిష్ చేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టి పిల్లలకు సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు. రాగి స్నాక్స్ కావలసినవి: రాగి పిండి - ఒకటిన్నర కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, శనగ పిండి - 1 కప్పు, మినప పిండి (మినప పప్పును గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, కారంపొడి - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: ముందుగా నాలుగు రకాల పిండ్లను పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత అవి చల్లారాక ఓ పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ వేయాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లను పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని.. మురుకులు (జంతికలు) చేసే సాధనంలో పెట్టి ఒత్తుకోవాలి. ఆపైన స్టౌపై బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తర్వాత అందులో ఈ మురుకులను కాల్చుకోవాలి. ఒక్క షేప్ అనే కాకుండా వివిధ షేపుల్లో ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు. మష్రూమ్ కట్లెట్ కావలసినవి: సన్నగా తరిగిన మష్రూమ్స్ - రెండున్నర కప్పులు, ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, పసుపు - పావు టీ స్పూన్, కారంపొడి - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర కప్పు, నూనె - సరిపడా తయారీ: స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోసి, వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఆపైన అల్లం- వెల్లుల్లి పేస్ట్, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి వేసి స్టౌను చిన్న మంటపై పెట్టి దింపేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిదిమిన బంగాళాదుంపతో కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగును వేసి కలిపి, కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని గుండ్రంగా ఒత్తి ఉప్మా రవ్వలో ముంచాలి. ఇప్పుడు వాటిని పెనంపై నూనె చుక్కలు వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. (డీప్ఫ్రై కూడా చేసుకోవచ్చు) -
నితిన్కు పవన్ ప్రత్యేక కానుక
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్కు మరోసారి ప్రత్యేక కానుక అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్కు పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు. పవన్ కల్యాణ్కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్.. నితిన్కు మామిడి పళ్లను పంపాడు. Thank u sir..this means a lot -
ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు
మామిడి మాగబెట్టేందుకు కార్బైడ్కు ప్రత్యామ్నాయం ప్రచారం మాత్రం అంతంతమాత్రం నూజివీడులోని మామిడి హబ్లకు స్పందన నిల్ కార్బైడ్కే ఓటేస్తున్న వ్యాపారులు తెనాలి : మామిడికాయలను పండించేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్పై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝుళిపించింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కార్బైడ్ వాడకానికి కళ్లెం వేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూనే.. పండ్లను మాగబెట్టేందుకు ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు పాలకులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇథిలిన్ యూనిట్లకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, కార్బైడ్ను అరికట్టడానికి చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరతో కాయలు పండిస్తున్న వ్యాపారులు, ఆర్థికభారం పేరుతో ఇథిలిన్ హబ్లకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో కార్బైడ్ వినియోగం మితిమీరిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై కదిలిన తెలుగు రాష్ట్రాల అధికారులు మామిడి మార్కెట్లపై దాడులు చేశారు. వివిధ ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అంతటితో సరిపెట్టేశారు. కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు ఉద్యానశాఖ 35 శాతం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఎందువల్లంటే.. కార్బైడ్తో మామిడిపండుకు మంచి రంగు వస్తుంది. తొందరగా పండుతుంది. పచ్చి సరుకైనందున వ్యాపారులు త్వరితగతిన చేతులు మార్చి వీలైనంత లాభాలు ఆర్జించాలని చూస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో మామిడి దిగుబడి భారీగా పడిపోయింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో మామిడి పండు రూ.25-రూ.40 పలుకుతోంది. ఇథిలిన్తో మాగబెడితే మరింత ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుందని, ఎక్కువగా కార్బైడ్నే ఆశ్రయిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు చైనా, కొరియా దేశాల నుంచి పొడిరూపంలో వస్తున్న కార్బైడ్ను వారు వినియోగిస్తున్నారు. నూజివీడు హబ్లకు ప్రచార మేదీ? రాష్ట్రంలో నూజివీడు, తిరుపతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మ్యాంగో హబ్ పేరుతో ఇథిలిన్ యూనిట్లు నడుస్తున్నాయి. ఎగు మతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే వీటిని నిర్మించింది . వీటిని ఓ ప్రైవేటు సంస్థ లీజుకు కూడా ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీతో కృష్ణాజిల్లా నూజివీడులోని ఆగిరిపల్లి మండలం ఈదర శివారు బొద్దనపల్లిలో రత్నం మ్యాంగో హబ్ పేరుతో ఏర్పాటుచేసిన భారీ యూనిట్ గత మార్చి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇథిలిన్ యూనిట్లకు ఏ ఒక్కదానిలోనూ తగినంత మామిడికాయలు మాగబెట్టేందుకు రావటం లేదు. ఉదాహరణకు 300 టన్నుల సామర్థ్యం కలిగిన రత్నం మ్యాంగో హబ్కు అందులో కనీసం 10 శాతం వినియోగం కావటం లేదు. ప్రభుత్వ యూనిట్లలోనూ ఇందుకు భిన్నంగా లేదంటున్నారు. టన్ను కాయలు ఇథిలిన్తో మాగబెట్టాలంటే రూ.1,000 నుంచి రూ.4,000 వరకూ వ్యయం చేయాల్సి వస్తోంది. కార్బైడ్ అయితే కేవలం రూ.600-700తో సరిపోతున్నందున వ్యాపారులు ఇథిలిన్పై ఆసక్తి చూపించడ లేదు. వ్యాపారుల విజ్ఞప్తులతో చూసీచూడనట్టు ఉండాలని పాలకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు దాడులు చేసి సేకరించిన శాంపిల్స్ నివేదికలను ఇప్పటికీ తెప్పించకపోవటం దీనికి ఊతమిస్తోందని పేరు చెప్పని ఒక వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. -
బె‘ధర’గొడుతున్న ఆవకాయ!
* పచ్చళ్ల తయారీపై ధరల పోటు * కన్నీళ్లు తెప్పిస్తున్న కారం పొడి * రెట్టింపైన ఆవాలు, ధనియాలు, మెంతుల రేట్లు * మామిడికాయలదీ అదే దారి కామారెడ్డి: ప్రతి ఇంటా కనిపించే ఆవకాయ.. ఈసారి ఖరీదై పోయింది. పచ్చళ్ల తయారీపై ధర భారం పడింది. తొక్కుల తయారీలో ఉపయోగించే అన్ని వస్తువుల రేట్లకు రెక్కలొచ్చాయి. కారం పొడి, జీలకర్ర, మెంతు లు, ఆవాలు, ధనియాలకు తోడు మామిడికాయ ధరలు చుక్కలనంటుతున్నాయి. నోరూరించే ఆవకా య ప్రస్తుతం ఆర్థికంగా భారమైంది. ఏపూటకు ఆ పూట సర్దుకొనే పేద కుటుంబమైనా, ఆర్థికంగా స్థితిమంతులైనా సరే.. ప్రతి ఇంట్లో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ అన్నంతో పాటు ఆవకాయను ఆరగించాల్సిందే. కొందరు పేదలైతే పచ్చడితోనే పూట గడిపేస్తారు. ఓపూట కూర లేకున్నా ఆవకాయతో సర్దుకుంటారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీ లు ఏడాదికి సరిపడినంతగా పచ్చళ్లను తయారు చేసుకుంటారు. అయితే, ఈసారి పచ్చళ్ల తయారీకి వాడే వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడంతో తొక్కుల తయారీకి సిద్ధమైన పేద, మధ్య తరగతి వర్గాలు నిట్టూరుస్తున్నాయి. ఎన్నెన్ని రకాలో.. మామిడికాయతో రకరకాలు తొక్కులు, పచ్చళ్లు తయారు చేస్తారు. మామిడి కాయను తరిగి చేసే తొక్కును సొప్పు తొక్కు అంటారు. అలాగే, ఆవకాయ తొక్కు, ఎల్లిపాయ తొక్కు, ఉప్పావ, మెంతావ తదితర రకాల పచ్చళ్లు చేస్తారు. చక్కెర, కొబ్బరితోనూ రకరకాల తొక్కులు పెడతారు. పేదల ఇళ్లలో మాత్రం ఆవకాయ తొక్కే ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ధరలు పెరిగినయి తొక్కులు పెట్టెతందుకు ముందుగళ్లనే అన్ని సామాన్లు తెచ్చి పొడులు తయారు చేసుకుంటం. ఇంతకు ముందు పెద్ద పెద్ద మడ్తమాన్లల్ల తొక్కులు పెట్టేటోళ్లం. ఇప్పుడు కొద్దిగంతనే పెట్టుకుంటున్నం. కారంపొడి, ఆవాలు, మెంతులు, ధనియాల ధరలు అడ్డగోలుగా పెరిగినయి. వేలకు వేలు పెట్టి తొక్కులు పెట్టడం భారంగా మారింది. - శేర్ల లక్ష్మి, భిక్కనూరు చుక్కలనంటుతోన్న ధరలు.. తొక్కుల తయారీలో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఆవాల పొడి, కారంపొడి, ఉప్పు, ఆవాలు, పల్లి నూనె వాడతారు. జీలకర్ర ధర గత యేడాది కిలోకు రూ.180 ఉంటే ఈసారి రూ.240కి చేరింది. మెంతులు నిరుడు రూ.60 ఉంటే ఇప్పుడు రూ.130కి చేరాయి. ధనియాల పొడి గతంలో రూ.120 ఉండగా, ఇప్పుడు రూ.170, కారంపొడి నిరుడు రూ.170 ఉంటే, ప్రస్తుతం రూ.240 కి చేరాయి. కుటుంబానికి సరిపడా తొక్కుల తయారీకి గతంలో రూ.2 వేల లోపు సరిపోయేది. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.3-4 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడికాయల ధరలు సైతం.. వాతావరణ పరిస్థితులు సహకరించక ఈసారి మామిడి సరిగా కాయలేదు. కాసినా వడగళ్లు, ఈదురుగాలులతో రాలిపోయాయి. దీంతో మామిడికాయల కొరత ఏర్పడి, వాటి ధరకు రెక్కలొచ్చాయి. ఆవకాయ కోసం అవసరమైన చిన్న మామిడి కాయ ధర ఒక్కొక్కటి గతంలో రూ.2-3 ఉంటే, ప్రస్తుతం రూ.5-6 పలుకుతోంది. అలాగే సొప్పు తొక్కులు పెట్టే పెద్ద మామిడికాయలు గతంలో రూ5 ఉంటే, ఇప్పుడు రూ.10కి చేరింది. నిమ్మకాయలదీ అదే పరిస్థితి. మార్కెట్లో వాటి ధరలు అడ్డగోలుగా ఉన్నాయి. దీంతో తొక్కు అంటేనే జనం ముక్కు విరుస్తున్నారు. తొక్కులు పెట్టుకునేకన్నా అవసరం ఉన్నపుడు రెడీమెడ్ పచ్చళ్లు తెచ్చుకోవడమే ఉత్తమమని చాలా మంది తొక్కులకు దూరమవుతున్నారు. గతంలో ఏ ఇంట్లో అయినా 2-3 మడతమానుల నిండా పచ్చళ్లు పెట్టేవారు. ఇప్పుడు పెరిగిన ధరలతో తొక్కుల వాసన రావడం లేదు. -
మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు
వేసవి జ్ఞాపకం... వేసవి ఉక్కపోతను తట్టుకోలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎండాకాలమంటే ఇష్టం ఎందుకంటే మగ్గిన మామిడి పళ్ల వాసనలు, మల్లెపూల పరిమళాలూనూ. లేత తాటిముంజలు, ఈతపళ్ల తియ్యదనాన్ని రుచి చూడాలంటే వేసవి కాలం రావలసిందే కదా. చిన్నప్పుడు ఎండాకాలం మొదలవడంతోటే అమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా, అత్తలు కలిసి పెట్టిన అప్పడాలు, వడియాలను కాకులు ఎత్తుకుపోకుండా, కుక్కలు ముట్టుకోకుండా కాపలా కాసే డ్యూటీ పడేది! మధ్యమధ్యలో ఎండినయ్యో లేదో చూసే వంకతో పచ్చిపచ్చిగా ఉన్న వడియాలను రుచి చూడటం ఒక పచ్చి జ్ఞాపకం. అన్నట్టు అప్పడాలు ఎండినయ్యో లేదో కనుక్కోవడానికి మా అమ్మమ్మ ఒక చిట్కా చెప్పింది. అదేమంటే అప్పడాలు వాటంతట అవి బోర్లాపడుకోబెట్టినట్టుగా కొద్దిగా పైకి లేస్తే అవి ఎండినట్టు. ఆరేసిన బట్ట కింద చిన్నగా చెయ్యి పోనివ్వగానే ఊడి వస్తుంటే గనక వడియాలు ఆరినట్టు. వాటి సంగతి ఏమోగాని వాటి వంకతో చెట్టు కింద కూచుని చందమామ పుస్తకంలో విక్రమార్కుడి భుజాన వేళ్లాడే తెల్ల తోకదెయ్యం బొమ్మను చూస్తూ కూచోవడం ఒక జ్ఞాపకం. పొద్దున్న పదింటికల్లా అన్నం తినేసి, ఒక రౌండు ఆటలు ఆడుకునేవాళ్లం. మధ్యాన్నం పన్నెండున్నరా ఒంటిగంటకల్లా మా తాతయ్య ఇంట్లో కిటికీలన్నింటికీ తడిబట్టలు కట్టించి ఇంటిని ఏసీలా మార్చేసేవాడు. నాలుగున్నరా అయిదు వరకూ పిల్లలెవరూ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. నిద్దరొచ్చేదాకా తాతయ్య చెప్పిన కబుర్లు వింటూ వాసాలు లెక్కిస్తూ ఎండకు చివ్వుచివ్వుమనే పిచ్చుక కూతలను వింటూ చాపల మీద పడి దొర్లేవాళ్లం. కాసేపు బజ్జోని లేచేసరికి మామిడిపళ్ల వాసన గాలిలోంచి తేలుతూ వచ్చి పలకరించేది. ఒక చిన్నగిన్నెలో మామిడిపండు పెట్టి ఇచ్చేది మా నానమ్మ. అది తినకుండానే ఆశగా రెండో పండు వైపు చూసేవాణ్ణి. ‘ముందు ఇది తిను, దాని సంగతి తర్వాత చూద్దువుగానీ’ అనేది నవ్వుతూ. మామిడిపండో, ఈతకాయలో, సపోటా పళ్లో... ఇలా ఏవో ఒక చిరుతిళ్లు సిద్ధంగా ఉండేవి ఇంట్లో ఎప్పుడూ! ఏవీ లేకపోతే కందులో పెసలో ఉడకబెట్టి, ఉప్పూకారం కొత్తిమీర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే గుగ్గిళ్లు చేసి పెట్టేది. ఇక సాయంత్రం పూట ఆడపిల్లలకు పూలజడలు వేసేవాళ్లు. జడతో ఫొటోలు తీయించేవాళ్లు. పూలజడ వేయించుకుని వచ్చి, పెద్దవాళ్లకు దణ్ణం పెట్టడం వాళ్లు ప్రేమగా బుగ్గలు పుణికి పదో పరకో చేతిలో పెట్టడం ఒక రూపాయి కాసులాంటి జ్ఞాపకం. ఇప్పుడు అప్పడాలూ వడియాలూ పెట్టడం, పూలజడలు వేయించుకోవడం పల్లెటూళ్లలో కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యమే అయింది. పెద్దోళ్లేమో ఏసీలు, కూలర్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఇంట్లో పడుకోవడం, పిల్లలేమో కంప్యూటర్లోనో, స్మార్ట్ ఫోన్లలోనో గేమ్స్ ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ నవ్వులు, ఉట్టుట్టి ఆటలు... అంతా ఉట్టుట్టికే! అసలు ఉబ్బరింత ఇదే కదా. - బాచి -
ఏపీలోని నాలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం
పిడుగుపాటుకు నలుగురి మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నాలుగు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. మామిడి కాయలు నేలరాలి రైతన్నలకు నష్టం మిగిల్చింది. మరోవైపు పిడుగుపాటుకు విశాఖ జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హిందూపురంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గురువారం ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డారుు. విశాఖ ఏజె న్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రికి కూడా అనేక చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఏజెన్సీ రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మామిడి ముక్క గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
ధన్వాడ (మహబూబ్ నగర్) : గొంతులో మామిడి ముక్క ఇరుక్కొని ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లలితమ్మ, కుమ్మరి కాశీమన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా ఆరుబయట కుమార్తెలు మామిడిపండు ముక్కలను తింటున్నారు. అదే సమయంలో చిన్న కుమారుడు అభినేష్ (ఏడు నెలలు) నోట్లో పెట్టుకున్న ఒక ముక్క గొంతులో ఇరుక్కుంది. గమనించిన తల్లి, తాత వెంటనే బాలుడిని మరికల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. -
మామి'డిష్'
పండ్లలో కింగ్.. రారాజు.. మారాజు.. మామిడిపండు. దాంతో కూరొండి... పలావ్ పకాయించి.. స్వీట్ పాకం పోసి.. సమోసా వేయించి... మీ పతికి వడ్డిస్తే ఛత్రపతిలా ఫీలయిపోడూ! ఎంజాయ్ మామిడిష్!! మ్యాంగో జలేబీ కావల్సినవి: మామిడిపండు (అల్ఫోన్సో రకం) - 1 పంచదార - 300 గ్రా.లు కుంకుమపువ్వు - కొన్ని రేకలు నీళ్లు - కప్పు (250 ఎం.ఎల్) పాలు - కప్పు (250 ఎం.ఎల్) పెరుగు - 100 గ్రా.లు మైదా - కప్పు (200 గ్రా.లు) నెయ్యి - 500 గ్రా.లు తయారీ: * మైదా, పెరుగు కలిపి ఒకరోజంతా నానబెట్టాలి. * పంచదారను కరిగించి, లేత పాకం పట్టాలి. దీంట్లో పాలు పోసి కలిపి పక్కనుంచాలి. * మామిడిపండును నిలువు ముక్కలుగా కట్ చేయాలి. * కడాయిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. మామిడిపండు ముక్కలను మైదా పిండిలో ముంచి కాగుతున్న నెయ్యిలో వేసి వేయించాలి. * ఇలా వేయించిన మామిడిపండు ముక్కలను పంచదార పాకంలో ముంచి, సర్వ్ చేయాలి. మలబారి మ్యాంగో కధీ కావల్సినవి: మామిడిపండు - 1 (ముక్కలుగా కట్ చేయాలి) జీలకర్ర - టీ స్పూన్ (వేయించాలి) ఆవాలు - అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు కారం - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత కొబ్బరి నూనె - టీ స్పూన్ మెంతులు - అర టీ స్పూన్ కొబ్బరి తరుగు - అర కప్పు ఎండుమిర్చి - 2, కొత్తిమీర తరుగు - టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; పంచదార - చిటికెడు తయారీ: * అర కప్పు నీళ్లతో మామిడిపండు ఉడికించాలి. * కొబ్బరి తురుము, జీలకర్ర, ఉల్లిపాయముక్కలు, పసుపు కారం కలిపి పేస్ట్ చేయాలి. ఇందుకు కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. * ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడిపండులో వే సి సన్నని మంటమీద ఉంచాలి. * పెరుగును చిలికి, అరకప్పు నీళ్లు పోసి కలపాలి. మామిడిపండు-కొబ్బరి మిశ్రమం ఉడికాక మంట తీసేసి చిలికిన పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. * చిన్న కడాయిలో టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును మామిడిపండు పెరుగు మిశ్రమంలో కలపాలి. దీన్ని రైస్లోకి వడ్డించాలి. మ్యాంగో కోఫ్తా పలావ్ కావల్సినవి: బాస్మతి బియ్యం - కప్పు (ఉడికించి, పక్కన పెట్టాలి) మామిడిపండు ముక్కలు - కప్పు పనీర్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు నూనె - 4 టీ స్పూన్లు మొక్కజొన్న పిండి - టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - కప్పు బిర్యానీ ఆకులు - 2 లవంగాలు - 2 దాల్చిన చెక్క - చిన్న ముక్క నెయ్యి - టీ స్పూన్ రోజ్వాటర్ - టీ స్పూన్ అల్లం ముద్ద - టీ స్పూన్ శనగపిండి - టీ స్పూన్ కోఫ్తా తయారీ: * టీ స్పూన్ పనీర్, మామిడిపండు ముక్కలు, మొక్కజొన్న పిండి, చిటికెడు శనగపిండి, చిటికెడు యాలకుల పొడి, టీ స్పూన్ జీడిపప్పు పలుకులు కలిపి, ముద్ద చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. * విడిగా మరో పాత్రలో మొక్కజొన్న పిండి, శనగపిండి, ఉప్పు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా చిక్కటి మిశ్రమం కలుపుకోవాలి. * కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న పనీర్ ఉండలు జారుగా కలిపిన శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి బాగా వేయించి, తీసి పక్కన పెట్టాలి. పలావ్ తయారీ * కడాయిలో టీ స్పూన్ నూనె, జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తరిగిన అల్లం, ఉప్పు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. * దీంట్లో పచ్చిమిర్చి, ఉడికిన బాస్మతి రైస్, కొత్తిమీర వేసి కలపాలి. కొద్దిగా రోజ్వాటర్ పైన చిలకరించి, కోఫ్తా బాల్స్ వేసి కలిపి, కొత్తిమీర, పుదీనా, మామిడిపండు ముక్కలతో అలంకరించి వేడి వేడిగా వడ్డించాలి. కైరీ చనాదాల్ ఢోక్లా కావల్సినవి: శనగపప్పు - కప్పు ఉప్పు - టీ స్పూన్ పచ్చిమిర్చి తరగు - టీ స్పూన్ పంచదార - టీ స్పూన్ తెల్ల నువ్వులు - టీ స్పూన్ రిఫైండ్ ఆయిల్ - టీ స్పూన్ ఆవాలు - టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్ కరివేపాకు - 2 రెమ్మలు ఉప్పు - చిటికెడు మామిడికాయ తురుము - కప్పు కొత్తిమీర - అర కప్పు తయారీ: * శనగపప్పును కడిగి 3 గంటలు నానబెట్టాలి. * నీళ్లను వడకట్టి, పప్పు మెత్తగా రుబ్బాలి. దీంట్లో ఉప్పు, కొద్దిగా నూనె కలపాలి. * అలాగే మామిడికాయ తురుము వేసి కలపాలి. * ఢోక్లా ఉడికించే గిన్నెకు అడుగు భాగాన నెయ్యి రాసి దాంట్లో పిండి పోయాలి. * ఈ ప్లేట్ను ఇడ్లీ పాత్రలో పెట్టి 10-15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. * తర్వాత కత్తితో ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి. * కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పంచదార, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. దీంట్లో కట్ చేసిన ఢోక్లా వేసి వేయించి, సర్వ్ చేయాలి. కైరి సమోసా కి సబ్జీ కావల్సినవి: పచ్చిబఠాణీలు - కప్పు; పనీర్ ముక్కలు - కప్పు రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు - 4 వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; వాము - టీ స్పూన్; ఉల్లిపాయల తరుగు - కప్పు; పసుపు - అర టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ మొక్కజొన్న పిండి - టీ స్పూన్; ఇంగువ పొడి - అర టీ స్పూన్ క్యారట్ తరుగు - కప్పు; బీన్స్ తరుగు - కప్పు; మైదా - కప్పు మామిడికాయ ముక్కలు - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు జీడిపప్పు - 5; ఎండుకొబ్బరి తరుగు - టీ స్పూన్; సారపప్పు - 3 యాలకులు - 3; మసాలా దినుసులు - (దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 2; అనాసపువ్వు - 2; ధనియాలు - టీ స్పూన్ నల్లమిరియాలు - 6; సోంపు - టీ స్పూన్) నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; తయారీ: సమోసా: మైదాలో వేడి నీళ్లు, ఉప్పు, వాము, నెయ్యి కలిపి, ముద్ద చేసి, పైన మూత పెట్టి, పక్కన పెట్టాలి. * మసాలా దినుసులు వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. * మరో కడాయిలో నూనె వేసి అందులో ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బంగాళదుంప, మామిడిముక్కలు, క్యారట్, బఠాణీ, బీన్స్, పనీర్, పసుపు, కారం, ఉప్పు, కొబ్బరి తురుము, పంచదార, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం వేగాక కొత్తిమీర వేయాలి. * కలిపిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని, పూరీలా ఒత్తుకోవాలి. చేత్తో కోన్ షేప్లో తయారుచేసుకొని, దీంట్లో ఉడికిన కూర మిశ్రమాన్ని నింపి, నీళ్లు అద్దుకుంటూ చివర్లు మూయాలి. * ఇలా అన్నీ తయారుచేసుకున్నాక కాగుతున్న నూనెలో వేసి, అన్ని వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి, తీసి పక్కన ఉంచాలి. గ్రేవీ: కప్పు టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, సారపప్పు కలిపి ఉడికించి, పేస్ట్ చేయాలి. * కడాయిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మసాలా, పసుపు, ఉప్పు కలపాలి. ఎండుకొబ్బరి వేసి మిశ్రమం బాగా ఉడికాక దించాలి. ఈ చిక్కటి గ్రేవీలో సిద్ధం చేసుకున్న సమోసాలను వేసి, కొత్తిమీర చల్లి వేడి వేడిగా వడ్డించాలి. కర్టెసీ జోధారామ్ చౌదరి కార్పొరేట్ షెఫ్ ఖాన్ధానీ రాజ్ధానీ, కూకట్పల్లి, హైదరాబాద్ -
చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి
ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు
♦ చెరువులో 6.13 ఎకరాలు కబ్జా.. ♦ మామిడితోట సాగు చేస్తున్న ఇద్దరు నగరవాసులు వికారాబాద్: కొంతకాలంగా హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు 6.13 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మామిడి తోట సాగుచేస్తున్నారు. అదే గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉండటంతో వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించుకుంటూ రాగా.. చెరువులో యధేచ్ఛగా మామిడి తోట సాగు చేస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో స్పందించిన తహసీల్దార్ సాగు చేస్తున్న ఆక్రమణదారులకు రెవెన్యూ యాక్టు 1905 సెక్షన్ 7 కింద నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదన్పల్లి గ్రామంలోని చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 154లో మూడెకరాలు.. మరో సర్వే నంబర్ 170లో మూడెకరాల 16 గుంటల భూమిని కబ్జా చేసి కొంత కాలంగా హైదరాబాద్కు చెందిన లతీఫ్ హమ్మద్, షేక్ మహరూఫ్ మామిడి తోట సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు పర్యటన అదే గ్రామంలో మరో రెండు రోజుల్లో ఉండటంతో ముందుజాగ్రతగా తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం రోజు సందర్శించారు. ప్రభుత్వ కార్యక్రమం చేపట్టే స్థలంతోపాటు అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను, చెరువులను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెరువులో ఏదో తోట ఉన్నట్లుంది.. అని అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లి చూడగా.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మామిడి తోటను సాగుచేస్తున్న దృశ్యం ఆయన కంటపడింది. దీంతో ఆగ్ర హించిన ఆయన సంబంధిత వీఆర్ఓను తీవ్రస్థాయిలో మందలించారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులను, కుంటలను పునరుద్ధరించాలని చెబుతుంటే.. కొంతకాలంగాా సాగు చేస్తున్న తోటను యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వీఆర్ఓను మందలించారు. ‘పద్దతి మార్చుకో.. లేదంటే నీపై వేటు వేయాల్సి ఉంటుంది’ అని తహసీల్దార్ వీఆర్ఓను హెచ్చరించారు. అనంతరం అక్కడినుంచి వికారాబాద్ కార్యాలయానికి వచ్చి మండలంలోని వీఆర్ఓలందరినీ పిలిచి వెంటనే తన చాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఎవరైన కబ్జా చేసినా.. దాంట్లో ఎలాంటి పంటలను సాగు చేసినా.. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మీపై నేనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్రమార్కులకు కొమ్ముకాసే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. అనంతరం ఆయన మదన్పల్లి చెరువును ఆక్రమించి మామిడి తోట సాగు చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మీ సంజాయిషీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. -
రసవత్తరంలో మ్యాంగో నగర్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత దేశంలో సేలం అతి పెద్ద మ్యాంగో నగరం. అత్యధిక నియోజకవర్గాలను కల్గిన ఈ జిల్లాలో ఈ సారి రసవత్తర సమరం సాగుతున్నది. కొత్త ముఖాలు అత్యధికంగా రేసులో ఉండగా, ముగ్గురు సీనియర్లు, నలుగురు మాజీలు మళ్లీ పోటీకి సిద్ధం కావడంతో గెలుపు గుర్రాలు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకేల మధ్య సమరం హోరాహోరీగా సాగుతున్నది. అతి పెద్ద మ్యాంగో మార్కెట్ పేదల ఊటీగా పిలవబడే ఏర్కాడులు సేలం జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే సీనియర్లు వాళ్లప్పాడి రామమూర్తి, వీర పాండి ఆర్ముగం చక్రం తిప్పిన జిల్లా. గతంలో సాగిన పునర్విభజన ప్రభావంతో ఈ జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపాలే మారాయి. తారా మంగళం, పనమరత్తు పట్టి వంటి నియోజకవర్గాలు ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతు అయ్యాయి. సేలం నగరాన్ని మూడుగా చీల్చేశారు. తలవాసల్గా ఉన్న స్థానాన్ని గంగవళ్లిగా పేరు మార్చారు. పక్కనే ఉన్న నామక్కల్ జిల్లాకు చెందిన శంఖగిరిని సేలం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చేశారు. అందుకే ఇక్కడి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో గందర గోళ పరిస్థితి ఉంటుంది. ఈ జిల్లాలో ప్రస్తుతం గంగవళ్లి (రి), ఆత్తూర్ (రి), ఏర్కాడు (రి), ఓ మలూరు, మెట్టూర్, ఎడప్పాడి, శంఖగిరి, సేలం పశ్చిమం, సేలం ఉత్తరం, సేలం దక్షిణం, వీర పాండి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తొలుత కాంగ్రెస్కు తదుపరి డీఎంకే కంచుకోటగా ఉన్న ఈ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రస్తుతం అన్నాడీఎంకే పాగా వేసింది. వెనుక బడిన వర్గాలు, మైనారిటీలు, వన్నియర్ సామాజిక వర్గంతో పాటుగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా ఇక్కడి నియోజకవర్గాల్లో ఎక్కువే. వీరి ఆశీస్సుల కోసం అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 లక్షల 96 వేల 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14 లక్షల ఆరు వేల 392 మంది పురుషులు, 13 లక్షల 90 వేల 321 మంది స్త్రీలు, 271 మంది ఉన్నారు. సేలం(పశ్చిమం): గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడిఎంకేకు చెందిన జి వెంకటాచలం ఉన్నారు. మళ్లీ ఆయనకే సీటు దక్కింది. గతంలో తాను చేసిన ప్రగతి పనులు, అమ్మ ఆశీస్సులతో మళ్లీ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా పన్నీరు సెల్వం రేసులో ఉన్నారు. ఓటర్లకు సుపరిచితుడైన ఈ మాజీ డిప్యూటీ మేయర్ ఈ సారి పాగా వేసి తీరుతానన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాల్ని అస్త్రంగాచేసుకుని ఓట్ల వేటలో పడ్డారు. ఇక, ఓట్లను చీల్చి సత్తాను చాటుకునేందుకు పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి ఇర అరుల్ బరి దిగారు. అలాగే, ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా సేలం ఉత్తరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రాజులు రేసులో దిగడంతో నలుగురు సమ ఉజ్జీల మధ్య సమరం వేడెక్కింది. సేలం(ఉత్తరం): ఇది కూడా గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డీఎండీకేకు చెందిన మోహన్ రాజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనడంతో గట్టెక్కారు. ఈ సారి ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ మోహన్ రాజ్ బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే, తన మకాంను సేలం పశ్చిమానికి మార్చేశారు. ఇందుకు కారణం అదృష్టం కలిసి వచ్చేనా అన్న బెంగే అంటా..!, ఇక ప్రజా సంక్షేమ కూటమిలో ఈ సీటును తమిళ మానిల కాంగ్రెస్కు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా దేవదాసు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఆర్ఎస్ శరవణన్ డీఎంకే అభ్యర్థిగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ రేసులో ఉన్నారు. కేఆర్ఎస్ శరవణన్ కొత్త ముఖం కావడంతో ఓటర్ల ప్రసన్నం కోసం సీనియర్లతో కలిసి తీవ్ర కుస్తీలు పడుతున్నారు. డిఎంకే అభ్యర్థి రాజేంద్రన్ మాజీ ఎమ్మెల్యేగా ఓటర్లకు సుపరిచితులే. ఇక, పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కదిర్ రాజరత్నం పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీగోపినాథ్ పోటీ చేస్తున్నారు. అయితే, ఇక్కడి ఓటరు నాడి ఎటో అన్నది మాత్రం అంతుచిక్కని పరిస్థితి. సేలం(దక్షిణం): గత ఎన్నికల్లో ఇది కూడా కొత్తగా పుట్టుకొచ్చిన సీటు. ఇక్కడి అన్నాడీఎంకేకు చెందిన ఎంకే సెల్వరాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టారు. కొత్త ముఖంగా ఎబి శక్తి వేల్ బరిలో దిగారు. ఇక, డిఎంకే తరపున కూడా కొత్త ముఖంగా గుణశేఖర్ రేసులో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు గెలుపు లక్ష్యంగా ప్రజా మద్దతుకు సిద్ధం కావడంతో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారో..!. ఇక తాను సైతం అంటూ బీజేపీ అభ్యర్థిగా అన్నాదురై రేసులో ఉన్నారు. వీర పాండి: ఇది డీఎంకే సీనియర్ వీర పాండి ఆర్ముగం సొంత గడ్డ. అయితే. ఒక్క సారి కూడా ఆయన ఇక్కడ పోటీ చేయలేదు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆరు, డీఎంకే నాలుగు సార్లు గెలిచాయి. అయితే, 1991 నుంచి ఇక్కడ ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకేలు విజయకేతనం ఎగుర వేశాయి. ఇక, తనకు బదులుగా గతంలో వారసుడు ఎ రాజేంద్రన్ అలియాస్ రాజను ఇక్కడి నుంచి వీరపాండి ఆర్ముగం పోటీకి దించారు. ఓ సారి గెలిచినా, మరో సారి ఆయనకు ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్కే సెల్వం విజయ కేతనం ఎగుర వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈ సారి సీటు దక్కలేదు. మహిళా అభ్యర్థిగా ఎస్ మనోన్మణి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో చేజారిన విజయాన్ని మళ్లీ దక్కించుకునేందుకు వీర పాండి వారసుడు రాజేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో ముందుకు సాగుతున్నా, గతంలో సాగించిన భూదందాల్ని ఇంకా ఓటర్లు మరవ లేదని చెప్పవచ్చు. సీపీఐ అభ్యర్థిగా మోహన్, పీఎంకే అభ్యర్థిగా పి సామ్రాజ్ రేసులో ఉండటంతో ఓట్ల చీలిక ఆధారంగా డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఎవరో ఒకరు తక్కువ మెజారిటీతో గట్టెక్కాల్సిందే. ఓ మలూరు: అన్నాడీఎంకేకు బలం ఉన్న స్థానం ఇది. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, డీఎంకే, తమిళమానిల కాంగ్రెస్, పీఎంకేలు తలా ఓ సారి గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన సి కృష్ణన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త ముఖంగా ఎస్ వెట్రివేల్ను పోటీకి దించారు. అమ్మ చరిష్మా, పార్టీ బలం గెలిపిస్తుందన్న నమ్మకంతో ప్రజా మద్దతు కోసం పరుగులు తీస్తున్నారు. ఇక, డీఎంకే కూడా కొత్త ముఖంగా అమ్మాస్సీని అభ్యర్థిగా ప్రకటించింది. 1971 తర్వాత తమకు చాన్స్ ఇవ్వని దృష్ట్యా, ఈ సారి అవకాశం ఇస్తే, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ అమ్మాస్సీ ఓట్ల వేటలో ఉన్నారు. ఇక, ఈ ఇద్దరికి సరైన ప్రత్యర్థిగా ప్రజా సంక్షేమ కూటమి రేసులో దించింది. డీఎండీకే కోశాధికారి ఇలంగోవన్ ఇక్కడ పోటీకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి ఓ మారు అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఎ తమిళరసు పీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు, ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ పార్టీ సీనియర్ నేత తలబడుతుండడంతో సమరం ఆసక్తికరంగా మారింది. ఎడప్పాడి: ఇది పీఎంకే, అన్నాడీఎంకేల కోట. అలాగే, వీఐపీ స్థానం. 1971 తర్వాత ఇక్కడ డీఎంకే గెలిచింది లేదు. ఈ సారి ఒక్క చాన్స్ అంటూ డీఎంకే అభ్యర్థిగా ఎడపాడి పీసీ మురుగేషన్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎడ పాడి కె పళని స్వామి ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా అవతరించిన కె పళని స్వామి హవాను ఎదుర్కొనేందుకు మురుగేషన్ తీవ్ర ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో ఎడపాడికి చెక్ పెట్టేందుకు పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థిగా తంగ వేల్ రేసులో దిగారు. కార్మిక, అన్నదాతల ఓటు బ్యాంక్ను కొల్లగొట్టేందుకు సీపీఎం, వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కైవసానికి పీఎంకేలు సిద్ధం కావడం, ఒక్క చాన్స్ అంటూ మురుగేషన్ తీవ్ర ఓట్ల వేటలో ఉండటం వెరసి మంత్రికి మళ్లీ చాన్స్ దక్కేనా..! మెట్టూరు: ఇది మరో వీఐపీ నియోజకవర్గం. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, అన్నాడీఎంకే కార్యదర్శి సెమ్మలై పోటీలో ఉన్న స్థా నం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పైచే యి. డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, సీపీఎంలు తలా ఓ సారి గెలి చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి డీఎండీకే అభ్యర్థిగా పార్తీబన్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అన్నాడీఎంకే కూటమితో కలిసి గత ఎన్నికల్లో పనిచేసిన పార్తీబన్ ఈ సారి డీఎండీకే నుంచి బయటకు వచ్చారు. డీఎంకే తరఫున ఎండీఎండీకే అభ్యర్థిగా పోటీకి సిద్ధం అయ్యారు. డీఎంకే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తోంటే, అన్నాడీఎంకే అభ్యర్థిగా సెమ్మలైకు సీటు దక్కడంతో సమరం వేడెక్కింది. ఇక, గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పీఎంకే అధ్యక్షుడు జికే మణి, బిజేపి అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం రేసులో ఉండడంతో సమరం హోరాహోరీగా మారింది. శంఖగిరి: నామక్కల్ జిల్లా నుంచి సేలంలోకి గతంలో వచ్చిన స్థా నం ఇది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. 1989 నుంచి డీఎంకే ఓ సారి, అన్నాడీఎంకే మరో సారి విజయ కేతనం ఎగుర వేస్తున్నాయి. ఇక్కడ సి ట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన పీ విజయలక్ష్మి ఉన్నా రు. ఈ సారి ఆమెను పక్కన పెట్టి కొత్తముఖంగా ఎస్ రాజా రేసు లో దిగారు. డిఎంకే కూటమి ఈ సీటును కాంగ్రెస్కు అప్పగించిం ది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త ముఖం కె రాజేశ్వరన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చే దిశగా ప్రజా సంక్షేమ కూటమి తరపున తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థి సెల్వకుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏసీ మురేగేషన్ బరిలో ఉన్నారు. ఈ నలుగురు కొత్త వాళ్లే కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..! ఏర్కాడు (రి): పేదల ఊటి ఇది. గిరిజన , అటవీ గ్రామాల్లోని ప్రజల ఓటు బ్యాంక్ న్యాయ నిర్ణేతలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఏడు సార్లు, డీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్ ఓ సారి ఇక్కడ గెలిచాయి. అన్నాడీఎంకేకు చెందిన పి సరోజ సిట్టింగ్ ఎమ్మెల్యే. సరోజను పక్కన పెట్టి కొత్త ముఖంగా కె చిత్రను తెర మీదకు తెచ్చారు. ఓటర్లను ఆకర్షించడంలో చిత్ర ముందంజలో ఉన్నారు. డిఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ రేసులో దిగడం కలిసి వచ్చే అంశం. ఇక, ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా కుమార్, బీజేపీ అభ్యర్థిగా పొన్రాస్ పోటీకి సిద్ధమయ్యారు. గంగవళ్లి(రి): డీఎండీకేకు చెందిన ఆర్ సుభా సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేసిన ఆర్ సుభా, ఈ సారి ప్రజా సంక్షేమకూటమి డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. అయితే, అదృష్టం ఏ మేరకు కలి వస్తుందో అన్నది అనుమానమే. అన్నాడీఎంకే అభ్యర్థిగా న్యాయవాది మరుద ముత్తు, డీఎంకే అభ్యర్థిగా సేలం మాజీ మేయర్ ప్రియదర్శిని పోటీకి సిద్ధం అయ్యారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు కావడంతో పోటీ ఆసక్తికరం. ఇక, బీజేపీ అభ్యర్థిగా శివగామి పరమశివం ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా, డీఎంకే అభ్యర్థి ప్రియదర్శిని మహిళా అభ్యర్థులుగా ఢీ కొడుతున్నారు. ఆత్తూర్(రి): ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కోట. అన్నాడీఎంకే పాగా వేసింది. తదుపరి డిఎంకే కూడా అప్పుడప్పుడు బలాన్ని చాటుతున్నది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, అన్నాడీఎంకే, డీఎంకేలు తలా మూడు సార్లు గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన ఎస్ మాదేశ్వరన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త వ్యక్తి ఆర్ఎం చిన్న తంబి పోటీకి సిద్ధమయ్యారు. తమ చేతి నుంచి జారిన ఈ సీటును మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే అర్ధనారి పోటీకి దిగారు. పీఎంకేకు కూడా ఇక్కడ బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా హంసవేణి రేసులో ఉన్నారు. -
కరెంట్ షాక్తో చెట్టుపైనే చివరి శ్వాస
మామిడికాయలు కోసేందుకు కూలీకి వెళ్లిన బాలిక మృతి హుస్నాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు శనివారం కూలీకి వెళ్లిన బాలిక కరెంట్ షాక్తో చెట్టుపైనే మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం కన్నారానికి చెందిన మందడల రాజు, శారదల పెద్ద కూతురు సంధ్య(16) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. సెలవులు కావడంతో గ్రామస్తులతో కలసి అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు కూలీకి వచ్చింది. చెట్టు ఎక్కి కాయలు తెంపుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగల్ని గమనించక పోవడంతో షాక్ కొట్టి చెట్టుపైనే మృతి చెందింది. అదే చెట్టుపై ఉన్న సాంబరాజు, నితిన్లు సంధ్యను చూసి భయంతో చెట్టుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతకపేటకు చెందిన రాంరెడ్డి మామిడితోటను మరొకరు గుత్తకు తీసుకుని కాయలను తెంపిస్తున్నాడు. కాయలు తెంపేందుకు బాలకార్మికులను వినియోగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడితోట యజమాని, గుత్తేదారు, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
మధురఫలం మహాప్రియం
భారీగా తగ్గిన మామిడి పండ్ల దిగుమతి ఎగుమతులకే సరిపోతున్న మేలు రకాలు వెలవెలబోతున్న మార్కెట్లు గతేడాదితో పోలిస్తే రెండింతలైన ధరలు హైదరాబాద్: మామిడి..! మండు వేసవిలో ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదూ. నిజమే ..ఫలాలన్నింటిలో రాజఠీవిని ఒలకబోస్తూ, అనేక పోషకాలనిచ్చే ఈ రాజఫలం నగరంలో మహా ప్రియమైంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. వెంటాడిన కరువుకు తోడు, ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన మామిడి రకాలు, అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి అనూహ్యంగా తగ్గిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుకు నగరంలోని ప్రధాన మార్కెట్లన్నింటినీ మామిడి దిగుబడులు ముంచెత్తగా, ఈమారు భారీగా పడిపోయాయి. అక్కడక్కడ వస్తున్న మేలు రకాలను దిల్లీ, లక్నో వ్యాపారులే ఇక్కడి నుండి నేరుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత ఏడాదితో పోలిస్తే రెండింతలైంది. హోల్సేల్ మార్కెట్లో క్వింటా గత ఏడాది రూ.5000 మోడల్ ధర కాగా, ఈ యేడాది రూ.7000కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ. 80 నుండి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏడాదిలో ఎంత తేడా.. ఏటా మార్చి నుండి జూలై వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు దొరికే గడ్డిఅన్నారం మార్కెట్లో ప్రస్తుతం రెండు మూడు రకాలకు మించిన మామిడి పండ్లు దొరకటం లేదు. ఒక వైపు భారీగా పడిపోయిన దిగుమతులకు తోడు, వినియోగదారులను నోరూరించే రకాలు సైతం ఈ మారు పెద్దగా రావటం లేదు. గడిచిన ఏడాది వరకు బెనీషాన్, ఆలంపూర్, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తొతపూరి తదితర రకాల అందుబాటులో ఉండగా, ఈ మారు బెనీషాన్ రకం ఒక్కటే ఎక్కువగా వస్తోంది. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఒక్క గడ్డి అన్నారం మార్కెట్కే 6,40,239 క్వింటాళ్ల మామిడి రాగా, ఈ యేడు మాత్రం కేవలం 47,406 క్వింటాళ్లు మాత్రమే రావటం దారుణమైన పరిస్థితికి నిదర్శనమని మార్కెట్ కమిటీ ఉద్యోగి జీవన్ చెప్పారు. అందుబాటులోకి రైఫనింగ్ చాంబర్స్ పండ్లను మగ్గించటంలో కార్బైడ్, ఇథిలిన్ తదితర విష రసాయనాలు వాడొద్దన్న కఠిన నిబంధనల నేపథ్యంలో మార్కెట్లలో రైఫనింగ్ ఛాంబర్స్ అందుబాటులోకి వచ్చాయి. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నిర్మించాల్సిన ఛాంబర్లు, ఇంకా పూర్తి కాకపోగా, 15 మంది ప్రైవేటు వ్యాపారులు అనుమతి తీసుకుని, ఆరు చోట్ల అందుబాటులోకి తెచ్చారు. ఎండ తీవ్రతతో..మగ్గటంలో ఇబ్బంది మార్కెట్కు వస్తోన్న మామిడిని మగ్గించేందుకు కొందరు వ్యాపారులు రైఫనింగ్ ఛాంబర్స్ను ఉపయోగించుకుంటుండగా, మిగిలిన వాళ్లు సాధారణ పద్ధతులు పాటిస్తున్నారు. ఎండ తీవ్రతతో సరిగ్గా పోషకాలు అందక, మామి డి పండులో 16 శాతం వరకు ఉండాల్సిన ఇథిలిన్, తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉంటోంది. దీంతో మళ్లీ రైఫనింగ్ ఛాంబర్లలో మూడు రోజుల పాటు ఉంచి మగ్గిస్తున్నారు. కష్టమైనా తప్పటం లేదు.. 50 సంవత్సరాల నుంచి కార్బైడ్తోనే మామిడి కాయలను అమ్మడం..కొనడం జరుగుతుంది. ఇప్పడు కార్బైడ్ లేకుండా మామిడి కొనుగోలు చేయ డం అంటే కష్టంగా ఉంది. వ్యాపారాలు చాల వరకు తగ్గాయి. దీనికి తోడు కరువుతో దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే కిట కిటలాడ్సిన మార్కెట్ నేడు బోసిపోతోంది. - తాజొద్దీన్, పండ్ల వ్యాపారి రైతుకు గడ్డుకాలం ఈ సారి రైతుకు సరియైన పంట లేకపోవడంతో గిట్టుబాటులేదు. రైతులకు పంటను చూస్తే రక్తం చుక్కలేదు. నేను 200 ఎకరాలు కౌలుకు తీసుకుని మామిడి సాగుచేశాను. సకాలంలో వర్షంలేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీరు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కాయ సైజు 10 శాతం తగ్గింది. కార్బైడ్ వాడొద్దంటూ ప్రభుత్వం వ్యాపారులపై ఆంక్షలు విధించింది. ఇథిలిన్తో మామిడి పండ్లను మగ్గపెట్టాలంటే రైతులు ముందుకు రావడంలేదు. ఖర్చుతో కూడుకుంది. గత సంవత్సరం నేను 600 టన్నులు మామిడిని మార్కెట్లో అమ్మితే ఈ సంవత్సరం కేవలం 150 టన్నులు మాత్రమే అమ్మాను. - రైతు తాజ్బాబు, కోదాడ సొంతంగా ..ఛాంబర్ ఏర్పాటు చేశా పండ్లను ఇథలిన్తో పండించడం ఖర్చుతో కూడుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలేదు. మేమే పండ్ల మార్కెట్లో కోల్డ్స్టోరేజ్ను ఏర్పాటు చేసుకున్నాం. కార్బైడ్ లేకుండా పండ్లను పండిస్తున్నాం. ఇథిలిన్ను రోజుకు రెండు సార్లు వదులుతాం. మూడు నుంచి నాలుగు రోజుల్లో మామిడి పండ్లు పండుతాయి. వాటిని మార్కెట్లో అమ్ముతాం. ఇలా స్టోరేజ్ వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ40 వేల నుంచి 50 వేల వరకు వస్తుంది. నిర్వహణ కష్టసాధ్యంగా ఉంది. - అజంఖాన్, ఫేమస్ ప్రూట్కంపెనీ -
టాప్ హీరోయిన్తో వీధి వ్యాపారి పోటీ
ఆమె దేశంలోనే టాప్ హీరోయిన్. అతను వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. జిల్ జిగేల్ మెరుపులు తోడవడంతో సహజంగానే హీరోయిన్ ముందంజలో ఉంది. బతుకుపోరులో వెనుకపడిపోయిన ఆ వృద్ధ వ్యాపారి.. తారను నేలకు దించి, వెలిగిపోగలడా? నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి ఏమన్నారంటే.. 'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పండ్లే మంచివి. కానీ ఇది వ్యాపారం. వ్యాపారమన్నాక పోటీ తప్పదు. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడది విచిత్రంగా మారిపోయింది. నా వరకైతే నా ప్రధాన పోటీదారు కత్రినా కైఫే. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం దొరుకుతుంది' అంటూ టాప్ హీరోయిన్ తో పోటీపడుతున్నట్లు వెల్లడిస్తాడు వీధి వ్యాపారి. -
నిరాశపరచిన ‘మామిడి’
♦ ఈ సారి కాపు 40 శాతం లోపే..! ♦ రాలిపోతున్న పూత, కాత ♦ కాసిన కొద్దిపాటి కాయలపై ఎండ ప్రభావం ♦ ఆందోళనలో రైతన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం మామిడి పంటపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవక తోటల్లో కాపు బాగా తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో నాటిన మామిడి మొక్కలు నీరులేక ఎండిపోతున్నాయి. కాసిన కొద్దిపాటి కాయలు సైతం ఎండల ప్రభావానికి వాడి నేల రాలుతున్నాయి. ఈ సారి కూడా మామిడి పంట నిరాశాజనకమేనని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనీసం 40 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల అయితే 20 శాతం పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. - పరిగి నియోజకవర్గంలో 3,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క పూడూరు మండలంలోనే అత్యధికంగా 2,200 పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు. జిల్లాలోనే పెద్ద మామిడి పళ్ల మార్కెట్గా పూడూరు మండలం మన్నేగూడకు పేరుంది. ప్రతి ఏడాది.. హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రదేశాలకు టన్నుల కొలది మామిడి పళ్లను, కాయలను ఇ క్కడి నుంచే ఎగుమతి చేస్తారు. కేవలం మన్నేగూడ ప్రాంతంలోనే ప్రతి ఏడాది రూ.2 కోట్ల నుంచి రూ. మూ డు కోట్ల వ్యాపారం జరుగుతుంది. అ యితే ఇప్పుడిప్పుడే మామిడి తోటల సాగుపై దృష్టి సారించిన రైతులు పలువురు.. ప్రస్తుత పరిస్థితిని చూసి మునుముందు వెనక్కి తగ్గుతారేమోనని హార్టికల్చర్ అధికారులు ఆందోళనలో ఉన్నా రు. కాగా.. వచ్చిన కొద్దిపాటి కాపైనా చే తికి వచ్చే వరకు చెట్టుపై నిలుస్తుందో లేదోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు. గణనీయంగా తగ్గనున్న మామిడి.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ఈ పరిస్థితుల్లో రైతులతో పాటు మామిడికాయలు, మామిడి పళ్ల వ్యాపారం పైనే ఆధారపడి బతికే వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఎ కరంలో సాగైన మామిడి తోటకు వ్యాపారులు రూ. 50 నుంచి రూ. 80 వేల వరకు గుత్తగా చెల్లించేవారు. ఈ ఏడాది ఎకరానికి రూ. 20 వెచ్చించినా గిట్టుబాటు కష్టమని వ్యాపారులు అంటున్నారు. రూ. లక్షలు వ్యాపారంలో కుమ్మరించి తరువాత చేతులు కాల్చుకునే క న్నా.. ఈ ఏడాది వ్యాపారానికి దూరం గా ఉంటే బాగుంటుందని పలువురు మిన్నకుండిపోయారు. ధరలు ఆకాశన్నంటనున్నాయి.. ఈసారి మామిడి కాపు గణనీయంగా పడిపోవడంతో మామిడికాయలతో పాటు మామిడి పళ్ల ధరలు ఆకాశన్నం టనున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. మామిడి పళ్ల ప్రియులకు కొనే స్తోమత తగ్గి.. తియ్యని పళ్లు చేదెక్కనున్నాయి. గతేడాది మామిడి పళ్లు పుష్కలంగా ఉండడంతో కిలో రూ. 25 నుంచి రూ. 80 చొప్పున విక్రయించగా ఈఏడాది కాస్త కిలో ధర రూ. 100 లోపు దొరకడం కష్టమేనని అంటున్నారు. ఈ ఏడాది పేదలు మామిడి పళ్లు తినడం కష్టమేనని ఉద్యానవన శాఖ అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. -
దుబాయ్కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’
♦ ఎగుమతులు చేయాలని ఉద్యాన శాఖ యోచన ♦ వ్యాపారులతో చర్చిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ♦ రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టడంపై కసరత్తు ♦ విదేశాల్లో కిలో రూ. 300 వరకు పలుకుతున్న నాణ్యమైన పండ్లు సాక్షి, హైదరాబాద్: పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడితో రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దుబాయ్కు ‘తెలంగాణ బ్రాండ్’తో మామిడి పండ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. నాణ్యమైన పండ్లను గుర్తించి వాటిని దుబాయ్కు పం పేందుకు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే మామిడి పండ్ల వ్యాపారులు, రైతులతో చర్చించారు. అన్నీ కుదిరితే వచ్చే నెలలో దుబాయ్కు మామిడి పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉంది. రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి.. రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో ఏటా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కాస్తాయి. అందులో దాదాపు 6 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్తర భారతదేశానికి వెళ్తుంటాయి. విదేశాలకు మాత్రం 5-6 వేల మెట్రిక్ టన్నులకు మించి మామిడి పండ్ల ఎగుమతులు కావడంలేదు. చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాలకు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచే మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ బ్రాండ్తో నాణ్యమైన మామిడి రకం అంటూ ఒకటి ప్రజాదరణ పొందలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో సరైన మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులకు కిలో రూ. 25-50 మించి దక్కడంలేదు. స్థానికంగా ఇంత తక్కువ ధర పలుకుతున్న మామిడి పండ్లు... విదేశాలకు ఎగుమతి చేస్తే వాటి ధర కిలో రూ. 300 వరకు ఉంటోంది. కాబట్టి సేంద్రీయ, సహజ మామిడి పండ్లపై దృష్టి సారించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాండ్తో విక్రయించేలా నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పండుతోన్న నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించి వాటిని తెలంగాణ బ్రాండ్తో విక్రయించాలని భావి స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ పండ్లపైనే దృష్టి.. తెలంగాణ బ్రాండ్తో రాష్ట్రవ్యాప్తంగా కల్తీలేని సేంద్రీయ పండ్లు, కూరగాయలు, అల్లం, కారం, పసుపు తదితర పదార్థాలను ప్రజలకు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ(టీహెచ్డీసీ)ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులు పండించిన సేంద్రీయ పండ్లను కార్పొరేషన్ సేకరిస్తుంది. మామిడి పండ్లను సహజంగా మాగబెట్టి నాణ్యమైన వాటిని ఎగుమతి చేస్తారు. భారీ చెట్లు పెరగకుండా తక్కువ ఎత్తులోనే మామిడి కోసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల ఒక ఎకరంలోనే దాదాపు 675 మొక్కలను వేసే అవకాశం ఉంటుంది. ఎగుమతి చేసే ఆలోచన ఉంది దుబాయ్కు మామిడి పండ్లను ఎగుమతి చేయాలని యోచిస్తున్నాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రైతులకు అధికలాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. - వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ -
మామిడిచెట్టుకు పెళ్లి
తూప్రాన్: పురుషునితో మహిళకు పెళ్లి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలం వెంకటాపూర్లో మామిడి చెట్టు.. మరో మామిడి మొక్క వివాహ బంధంతో బుధవారం ఒక్కటయ్యాయి. మామిడితోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యజమాని ఈ తంతు నిర్వహించారు. పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులనూ ఆహ్వానించాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డిగారి శ్రీకాంత్రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద 2007-08లో 350 మామిడి మొక్కలను తన నాలుగు ఎకరాల పొలంలో నాటాడు. ప్రస్తుతం అవి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. దీంతో ఆ రైతు తోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మామిడితోటలో రెండు మామిడి చెట్లకు బ్రాహ్మణోత్తములతో వేదమంత్రాలు. బాజాభజంత్రీల మధ్య వైభవంగా వివాహం జరిపించాడు. పెద్ద మామిడిచెట్టుకు చిన్న మామిడి మొక్కనిచ్చి పెళ్లి జరిపించిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
మామిడి తోటలో మృతదేహం
రేగిడి (శ్రీకాకుళం) : మామిడి తోటలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో తోటలో పని చేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
300 మామిడిచెట్లు నరికివేత
అనంతపురం జిల్లా నార్పల మండలం నడిందొడ్డి గ్రామంలో 300 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఈ తోట వైఎస్సార్సీపీకి చెందిన నల్లప్పదని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని.. నల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మామిడిపై ‘ఆకు తేళ్లు’ అవుట్!
* ఆకు జల్లెడ గూడు పురుగు నుంచి మామిడి తోటలకు విముక్తి * తొలిసారి అంతర్ధానమైన ఆకు జల్లెడ గూడు పురుగు * పముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డా. ఎం. సుగుణాకర్రెడ్డి వెల్లడి ఈసారి ఖరీఫ్ పంటలను చావు దెబ్బ తీసిన తీవ్ర కరువు.. మామిడి తోటలకు ఒక రకంగా మేలు చేసిందా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటలకు ఆకు జల్లెడ గూడు పురుగు (Orthaga exvinacea : Leaf Skeletoniser and webber) ఆశిస్తూ, 10-15 శాతం మేరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నది. అయితే, ఈ ఏడాది ఈ పురుగు ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిందని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. మహాకళ సుగుణాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. మామిడి తోటలపై గత ముప్పయ్యేళ్లుగా తిష్టవేసి నష్టపరుస్తున్న ఈ పురుగు ఈ ఏడాది అనూహ్యంగా నాశనమైందని ఆయన తెలిపారు. ఆకు జల్లెడ గూడు పురుగు లార్వా ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి, ఆకుల్ని జల్లెడలాగా చేసి ఈనెలను దగ్గరకు చేర్చి గూడును ఏర్పరచుకుంటుంది. ఇది ఆశించిన చెట్టు ఆకులు బాగా రాలిపోతాయి. ఈ పురుగు పూత దశలో పూలను, పూ మొగ్గలను ఆరగించి.. తర్వాత పూగుత్తుల్ని గూడుగా ఏర్పరుస్తుంది. క్వినాల్ఫాస్ తదితర మందులను పంట కాలంలో 3-4 సార్లు ట్రాక్టరుకు అమర్చిన స్ప్రేయర్ ద్వారా హైజెట్ నాజిల్తో పిచికారీ చేయాలి. అయినా, పూర్తిగా పోకుండా 10-15 శాతం వరకు పంట నష్టం కలిగిస్తుంటుంది. పూత దశలో ఈ పురుగులు సోకితే దిగుబడి మరింత నష్టం కలుగుతుంది. దీన్ని రైతులు ‘ఆకు తేళ్లు’ అని పిలుస్తుంటారని, తమ మామిడి తోటల్లోనూ ఇది ముప్పయ్యేళ్లుగా ఉందని, ఈ ఏడాది ఆశ్చర్యకరంగా పోయిందని డా. సుగుణాకర్రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ పురుగు పోయిందని రైతులు తనతో చెప్పారన్నారు. ‘ఆకు తేళ్లు’ పూర్తిగా పోవడానికి గల కారణాలను శోధించాలని డా. సుగుణాకర్రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నాటి ‘ఆకు తేళ్ల’ సిల్కు వస్త్రం! 1997లో తమ మామిడి తోటను పూర్తిగా ఆకు జల్లెడ గూడు పురుగు పూర్తిగా జల్లెడ పట్టేసిందని డా. సుగుణాకర్రెడ్డి తెలిపారు. అప్పుడు చెట్ల మీద ఒక్క ఆకూ మిగల్లేదని, వరుసగా రెండేళ్ల పాటు మామిడి దిగుబడిని పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ పురుగు చెట్టు మీద నుంచి నేల మీదకు పాకుతూ దిగుతుంది. ఆ క్రమంలో పురుగు వదిలే సన్నని సిల్కుదారం చెట్టు కొమ్మలపై సున్నపు పూత మాదిరిగా కనిపించిందని, ఆ సిల్క్ పోగులన్నీ కలిసి ఒక పల్చని వస్త్రంలా ఏర్పడిందన్నారు. ఆ వస్త్రాన్ని డా. సుగుణాకర్రెడ్డి జాగ్రత్తగా సేకరించి, అప్పట్లోనే (1997-98) ఉద్యాన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. ఆకు తేళ్ల బెడద అంత ఎక్కువగా ఉంటుందన్న విషయం అంతకు పూర్వం తెలియదని డా. సుగుణాకర్రెడ్డి (94416 77401) తెలిపారు. బత్తాయి, ఆరెంజ్ తోటల్లో ప్రకృతి సేద్యంపై అధ్యయన యాత్ర తక్కువ నీటితో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా బత్తాయి, నారింజ తోటలను సాగు చేయాలనుకునే తెలుగు రైతుల కోసం అక్టోబర్ 8-11 తేదీల్లో అధ్యయన యాత్రతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పి. కరుణాకర్ గౌడ్ తెలిపారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్వయంగా వెంట ఉండి మహారాష్ట్రలోని కాటోల్ జిల్లాలో ఈ పద్ధతిలో సాగయ్యే బత్తాయి, నాగపూర్ నారింజ తోటలను అక్టోబర్ 8,9 తేదీల్లో చూపిస్తారు. ఈ తోటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడంపై నాగపూర్కు 50 కిలోమీటర్ల దూరంలోని కాటోల్ పట్టణంలో 10,11 తేదీల్లో పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు రోజులకు రవాణా వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు కాటోల్కు చెందిన మనోజ్ జనాన్లాల్ (098225 15913) లేదా హేమంత్ చౌహాన్ (075886 90688)ను లేదా హైదరాబాద్లోని కరుణాకర్ గౌడ్ (94404 17995)ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల్లో శాశ్వత వ్యవసాయం (పర్మాకల్చర్) ఒకటి. శాశ్వత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న వారు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. శాశ్వత వ్యవసాయంపై అంతర్జాతీయ మహాసభ (సెప్టెంబర్ 7-17) లండన్లో జరుగుతున్నది. తదుపరి అంతర్జాతీయ మహాసభను 2017లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పర్మాకల్చర్ అంతర్జాతీయ సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణకు చెందిన పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు హైదరాబాద్ మహాసభ (నవంబర్ 15-23, 2017) నిర్వహణ బాధ్యతను లండన్ సభలో స్వీకరించారు. అంతర్జాతీయ మహాసభకు ముందే వచ్చే ఫిబ్రవరి 5-7 మధ్య పర్మాకల్చర్ జాతీయ మహాసభను నిర్వహించనున్నామని నరసన్న తెలిపారు. భారతీయ శాశ్వత వ్యవసాయ విభాగానికి తెలుగునాట డా. వెంకట్ తదితరులు పునాదులు వేసి 30 ఏళ్లవుతున్నది. ఈ పూర్వరంగంలో పర్మాకల్చర్ జాతీయ, అంతర్జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. వివరాలకు.. permacultureindia.org వెబ్సైట్ చూడొచ్చు. -
మామిడి పోతోంది!
కరువు రక్కసికి కుదేలైన మామిడి రైతు జిల్లాలో పదివేల ఎకరాల్లో ఎండిన తోటలు రూ.50 కోట్ల మేర నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతాంగం కరువు రక్కసి మామిడి రైతును కోలుకోనీయకుండా చేసింది. కంటికిరెప్పలా పెంచిన తోటలకు నీళ్లులేకుండా చేసింది. పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ముచేసింది. పచ్చని చెట్లను నిలువునా ఎండబెట్టి ఫలితం రాకుండా చేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. తిరుపతి:వరుస కరువులతో అన్నదాత తల్లడిల్లి పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చంటి బిడ్డల్లా పెంచి, పోషించుకున్న మామిడి చెట్లు కళ్లేదుటే ఎండిపోతున్నాయి. కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావటం లేదు. దీంతో ఏమి చేయలేని నిస్సాహాయక స్థితిలో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్కువ వ్యయప్రయాసలతో రైతు కుటుంబానికి ఆర్థికంగా అసరాగా నిలిచే మామిడి తోటలు నేడు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఎండిపోయాయి. ఇంకా కొన్ని తోటల్లో 30 నుంచి 40 శాతం చెట్లు మాడిపోయాయి. 1972 సంపత్సరంలో వచ్చిన గంజి కరువులో సైతం తోటలు ఎండలేదు. ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ కొంత మంది అన్నదాతలు గతాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎండిన మామిడి తోటలను రైతులు నరికి వేశారు. చేయూత‘ కరువు’... కష్టాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న మామిడి రైతుకు చేయూత కరువు అయ్యింది. మూడేళ్ల నుంచి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని తోటల మధ్యలో రాళ్ల నేలలు ఉండడంతో నీటి ఎద్దడికి తట్టుకోలేక చెట్లు ఎండిపోతున్నాయి. ఒకే తోటలోనే కొన్ని పచ్చగా ఉండగా, మరికొన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యాన పంటలను కాపాడేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకుంటామన్నా అమలుకు నోచుకోలేదు. ఎండిన తోటలకు పరిహారం ఇవ్వటం లేదు. రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. కొత్తగా మామిడి తోటల పెంపకానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. దీంతో మామిడి తోటల సాగు తగ్గుతోంది. తోటలు కాపాడే యత్నం మామిడి చెట్లు ఎండిపోకుండా కాపాడేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నాం. పాదుల్లో ఆకులు పరచడం, పచ్చిరొట్ట ఎరువులు వేయడం, జిలుగ, జనుము చల్లిస్తున్నాం. ఎండి పోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు సరఫరా చేస్తాం. బోరుబావుల్లో నీరు అడుగంటడం, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల మామిడి తోటలు ఎండిపోయాయి. - ధర్మజా, ఉప సంచాలకులు, ఉద్యానశాఖ -
మోదీకి పాక్ ప్రధాని ప్రత్యేక కానుక
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈద్ కానుకగా మామిడి పళ్ల బుట్టను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల సరిహద్దు వద్ద భారత జవాన్లు ఈద్ కానుకగా ఇచ్చిన మిఠాయిలు తీసుకునేందుకు పాకిస్థాన్ బలగాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కాల్పులకు దిగడం, సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని మామిడి పండ్ల దౌత్యం నడిపారు. ఇదిలావుండగా, గతేడాది కూడా విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి భారత్ వైదొలిగాక నవాజ్ షరీఫ్ మామిడి పండ్లను మోదీకి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు పంపారు. -
మామిడి కాయల తగాదా.. యువతి హత్య!
ఫతేపూర్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయల కోసం చెలరేగిన వివాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా కేశాన్ గ్రామానికి చెందిన శివ్ భూషణ్ అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే కొంతమంది దుండగులు ఆ తోటలో మామిడికాయలను కోసేందుకు విఫలయత్నం చేశారు. ఆ క్రమంలో శివ్ భూషణ్ కు వారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఆ క్షణంలో అక్కుడ్నుంచి వెళ్లిపోయిన దుండగులు తరువాత శివ భూషణ్ ఇంటిపై దాడి చేశారు. కాగా, దాడికి పాల్పడ్డ సమయంలో ఇంట్లో శివ భూషణ్ కూతురు మాత్రమే ఉంది. దీంతో ఆ యువతిపై అతి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. అదే క్రమంలో యువతి ఒంటిపై కిరోసిన్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు ముందు అసలు విషయం తెలియలేదు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఆ దుండగులేనని తేలడంతో యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ దుండగులు ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదని తండ్రి శివ్ భూషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
నితిన్కు మామిడి పళ్లు పంపిన పవన్
హైదరాబాద్: ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ నుంచి కొంతమందికి ఓ పార్శిల్ అందుతుంది. అది మామిడిపళ్ల బుట్ట. పవన్ కల్యాణ్కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశార హీరో నితిన్. అయితే ఈ సంవత్సరం కూడా అనుకున్నట్టుగానే తనకు మామిడి పళ్ల పార్శిల్ రావడంతో..పవన్ తనకి పంపిన పళ్లబుట్టని ఫోటో తీసి ట్విట్టర్ లో ట్విట్ చేసి...అవును 99 శాతం మీరందరూ ఊహించింది కరక్టే...పవర్ స్టార్ నుంచే వచ్చాయి...అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. YESS..99%of u all r correctt!! Got them from our POWERSTAR..😊😊 pic.twitter.com/Aqi9d42Z4O — nithiin (@actor_nithiin) June 12, 2015 -
సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మధ్య గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ఆనీ వన్ మార్గ్లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉంటున్న వీరిద్దరికీ ఒకరి పొడ ఒకరికి గిట్టడం లేదు. నితీష్ కుమార్ పుణ్యమా అని ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి, మళ్లీ ఆయన కారణంగానే గత ఫిబ్రవరిలో అర్ధంతరంగా పదవిని కోల్పోయిన మాంఝీ.. ఖాళీ చేయమన్నా అధికార నివాసాన్ని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ‘మ్యాంగో ఫైట్’ మొదలైంది. సీఎం బంగ్లా ప్రాంగణంలో మామిడి చెట్లకు విరగకాసిన కాయలను తాను, తమవారు తెంపుకోనీయకుండా నితీష్ కుమార్ 24 మంది పోలీసులను కాపలా పెట్టారంటూ మాంఝీ విచిత్ర ఆరోపణలు చేశారు. బీసీ వర్గానికి చెందిన తన వద్దకు బీసీ ప్రజలు, నాయకులు వస్తుంటారని, వారు అప్పుడప్పుడు మామిడికాయలు, తోటలోని ఇతర పండ్లను తెంపుకుంటారని, అది చూసి ఓర్వలేకనే నితీష్ కుమార్ పోలీసుల కాపలా పెట్టారని ఆరోపించారు. నగరంలో చోరీలను అరికట్టేందుకు అవసరమైన పోలీసు సిబ్బంది లేక సతమతమవుతుంటే మామిడి చెట్లకు పోలీసుల కాపలా పెట్టడం ఎంతమేరకు సమంజసమని మాంఝీ ప్రశ్నించారు. ఈ ఆరోపణలను నితీష్ కుమార్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా, ఆయన పగలబడి నవ్వుతూ...‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు. మామిడి చెట్ల వద్ద పోలీసు కాపలానా... సీఎం భద్రత కోసం ఏర్పాటుచేశారా, మామిడి పండ్ల కోసం పెట్టారా? అన్న విషయాన్ని ఉన్నతాధికారులను అడిగి చెబుతాను’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మళ్లీ మాట్లాడుతూ ‘బంగళాలో మామిడి చెట్లకు పోలీసు భద్రత గురించి పోలీసు ఇంచార్జి అధికారికి కూడా తెలియదట. మాంఝీకి నిజంగా మామిడి కాయలు, పండ్లు కావాలని కబురంపితే నేనే స్వయంగా వాటిని తెంపించి పంపించేవాణ్ణి కదా! చెట్ల నుంచి కాయలు, పండ్లు తెంపినందుకు ఏమైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే కూడా నా జీతం డబ్బులతోనే చెల్లిస్తా కదా !’ అని వ్యాఖ్యానించారు. అనీ మార్గ్ బంగళాలో 2006 నుంచి నితీష్ కుమార్ ఉంటున్నారు. అంతకుముందు 15 ఏళ్లపాటు లాలూ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో అందులో ఉన్నారు. బంగళాలోని ఐదెకరాల స్థలంలో వంద ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల పెంపకానికి నితీష్ కుమార్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడా తోటలో వాటితోపాటు 35 మామిడి చెట్లు, పదుల సంఖ్యలో పనస, అల్ల నేరేడు, జామ చెట్లు ఉన్నాయి. పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండడం మంచిది కాదని భావించిన నితీష్ కుమార్, 2013, జనవరి 4వ తేదీన దలైలామాను పిలిపించి ఆయన చేత రావి చెట్టుకు ‘పవిత్ర’తను ఆపాదింపచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 నుంచి 1952 వరకు బీహార్ గవర్నర్గా పనిచేసిన మాధవ్ శ్రీహరి ఆనీ పేరిట సీఎం బంగళాను అనీ మార్గ్ వన్ అని పిలుస్తున్నారు. -
మాంఝీ ఇంట్లో మామిడిపళ్లకు పోలీసు కాపలా!
పట్నా: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నివాసం వద్ద ఉన్న వందలాది మామిడి చెట్లకు పండ్లను కోయకుండా ఉండేందుకు గాను నితీశ్ కుమార్ ప్రభుత్వం 24 మంది పోలీసులను నియమించిందని బుధవారం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా ఆరోపించింది. వీరిలో 8 మంది ఎస్ఐలు, 16 మంది కాన్స్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, బిహార్ సీఎంగా పదవి నుంచి దిగిపోయినా, మాంఝీ ఇంకా ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన 1, ఆన్నే మార్గ్ బంగ్లాలోనే ఉంటున్నారు. -
ఎగుమతికి మామిడేది..?
పంట లేక ఈ ఏడాది 30 శాతం తగ్గనున్న ఎగుమతులు ⇒ యూరోప్ నిషేధం ఎత్తేసినా దక్కని ప్రయోజనం ⇒ అంతర్జాతీయంగా తగ్గిన ధరలూ కారణమే ⇒ హుద్హుద్, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి యూరప్తో సహా పలు దేశాలు మామిడి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసినా ఆ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు దొరకడం లేదని ఎగుమతిదారులు వాపోతున్నారు. ఈ నిషేధం ఎత్తివేయడం వల్ల ఎగుమతులు పెరగాల్సింది పోయి గతేడాదితో పోలిస్తే 30 శాతం తగ్గే అవకాశాలున్నాయంటున్నారు. గతేడాది సుమారుగా 42,000 టన్నుల మామిడి పళ్లను ఎగుమతి చేయగా ఈసారి ఈ లక్ష్యం అందుకోవడం కష్టమేనని అపెడా వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన పండు లభ్యత తక్కువగా ఉండటంతో పాటు, పెరిగిన ధరలు విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోవడం కారణంగా పేర్కొంటున్నారు. యూరోప్ నిషేధం తొలగించి నాలుగు నెలలు కావస్తున్నా.. ఆ దేశ ప్రమాణాలకు అనుగుణంగా మామిడి పండ్లను సరఫరా చేసే మౌలిక వసతులు లేకపోవడం పెద్ద గుదిబండగా ఉంది. అమెరికాకు రేడియేషన్ చేసి పంపాలని, అదే యూరప్కి అయితే వేడి నీటి ట్రీట్మెంట్ చేసి ప్యాకేజీ చేయాలని కానీ వీటికి తగిన సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు. చివరి నిమిషంలో నిషేధం ఎత్తివేయడం వల్ల ఈ సీజన్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ఎగుమతులు 50 శాతం పెరుగుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇటీవల వ్యక్తంచేశారు. స్థానికంగా అదే పరిస్థితి.. దేశీయ మామిడి ఉత్పత్తిలో 25 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పంట దిగుబడి 50 శాతం క్షీణించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హుద్హుద్ తుపాన్ వల్ల చెట్లు ధ్వంసంకావడంతో ఆంధ్రప్రదేశ్లో, అకాల వర్షాల వల్ల తెలంగాణలో మామిడి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా అధికాదాయం పొందే వాడినని, కానీ ఈసారి ఒక టన్ను కూడా పంపలేని పరిస్థితిలో ఉన్నట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మురళి వాపోయారు. అకాల వర్షాల వల్ల 15 ఎకరాల మామిడి తోటలో దిగుబడి 80% పడిపోవడంతో ఈసారి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనికితోడు ఈసారి సీజన్ ఇరవై రోజులు ఆలస్యంగా మొదలయ్యిందని, ఇప్పుడిప్పుడే ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు రావడం మొదలైనట్లు ఎగుమతిదారులు చెపుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఎగుమతులు జరుగుతాయని, ఈ నెలరోజుల్లోనైనా మార్కెట్ మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని ఎస్డీ ఫ్రూట్ మర్చెంట్ ప్రతినిధి పేర్కొన్నారు. గతేడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,000 టన్నుల మామిడి కాయలను ఎగుమతి చేశామని, ఈ ఏడాది కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమాను అపెడా హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి. సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు బంగినపల్లి మామిడి పండ్లు ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేయగా, యూరోప్కు రెండు రాష్ట్రాల నుంచి రెండు సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెరిగిన ధరలు.. మన దేశం నుంచి మామిడి పండ్లు ప్రధానంగా యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. అరబ్ దేశాల్లో ఆంక్షలు తక్కు వగా ఉండటంతో ఎగుమతుల్లో 80% ఈ దేశాలకే జరుగుతున్నాయి. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గి నాణ్యమైన కాయ లభించక ధర పెరిగింది. గతేడాది 12 మామిడి కాయలు రూ. 250కి లభిస్తే ఈ ఏడాది రూ. 350-450 వరకు పెరిగినట్లు ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్యాకేజింగ్, రవాణా వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర మరింత పెరుగుతోంది. దీంతో పాకిస్తాన్ వంటి దేశాల నుంచి పోటీ తట్టుకోవడం కష్టంగా ఉందని హైదరాబాద్కు చెందిన ఎగుమతిదారుడు వాపోయాడు. -
నోరూరిస్తున్న మామిడిపండ్లు
-
మా ఇంటి కత్తిపీట...
నేల మీద నీరు మీద బ్రతకగల ఏకైక ప్రాణి కప్ప. అందుకే దానిని ఉభయ చరము అంటాం. అదే విధంగా మాంసాహారుల్ని, శాకాహారుల్ని సంతృప్తి పరచగల ఏకైక తెలుగువారి వంటకం!! మామిడికాయ పచ్చడి. దీనికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ముద్దపప్పు, మామిడికాయ, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్కి మరో ప్రత్యామ్నాయం లేదంటే నమ్మండి. మందు కొట్టిన వాడికి మంచింగ్లో కొరకటానికి, అన్నం తినేటప్పుడు పెరుగన్నంలో నంజుకీ ఉపయోగపడే బహుళార్ధకసాధకం మామిడికాయ పచ్చడి.నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊరు నుండి మామిడి కాయలు వచ్చేవి. వాటిని కడిగి, శుభ్రంగా గుడ్డతో తుడిచి కత్తిపీట కిందపెట్టి, పైన కత్తిని వుంచి, పిడి మీద ఒక గుద్దు గుద్దితే, ఆకాయ రెండు ముక్కలైపోయేది, మరల ఆ రెండు ముక్కల్ని నాలుగు ముక్కులు, ఆ తర్వాత 8 ముక్కలు... ఇలా చేస్తే ఒకకాయకి 16 ముక్కలు వచ్చేవి, ఈలోపు పిల్లలు అటుగావచ్చి ఒక ముక్క, ఇటుగా వచ్చి ఒక ముక్క తీసుకునే వాళ్ళం. కొరికితే పుల్లగా వుండేవి.... అయినా ఇష్టంగా తినేవాళ్ళం... తర్వాత ఆవపిండి కలిపి, నునెలో వేసి జాడీలలోకి పట్టి, వాటిని మచ్చు (అటక) మీద పెట్టి రెండు నెలల తర్వాత తీస్తే, ముక్కలు బాగా నూనె పీల్చుకుని, పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లల్లా తయారయ్యేవి. ఇక పోతే ఆ కత్తి కింద మామిడి ముక్కల్ని కొడితే అది సిక్సర్ కోసం పరిగెత్తే బంతిలా వెళ్లి అటుగా వస్తున్న మా మావయ్య కణతకి తగిలిందొకసారి.... లక్ష్మణస్వామి మూర్చిల్లినట్టుగా అయింది మావయ్య పని. ఆయనకి ఫస్ట్ఎయిడ్ చేసి, మరల ఆయన్ని మామూలు మనిషిని చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. ఈ కత్తి పీట చాలా ప్రత్యేకమైనది, చాలా పడుచుగా ఉంటుంది. పొరపాటున వ్రేలు దానికింద పడితే వేలు కట్ అయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. ఎవరు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్నా కత్తిపీట మాదే... ఇంట్లో అందరూ తలా ఒకరికి మాట ఇస్తే, తేడాలు వస్తున్నాయని, ఆ బాధ్యత మా నాయనమ్మకి అప్పగించారు. ఆమె ఎవరికి ఏ రోజు ఇస్తానని మాట ఇచ్చిందో, దానిని క్యాలెండర్ మీద రాసుకునేది... అంటే ఇప్పుడు హీరోయిన్ కాల్షీట్లు చూసే మేనేజర్లాగా అన్నమాట... ఒక రోజు మా స్కూల్లో వేసే నాటకానికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సివచ్చింది. ఉత్సాహంగా పేర్లు ఇచ్చాం చాలామంది. అందర్నీ స్క్రూటినీ చేసి ఇద్దరి ఫైనల్స్కి వచ్చాం. నేనూ... ఇంకో ఫ్రెండ్...నా దురదృష్టం, ఆ రోజు వాడింట్లో మామిడికాయ పచ్చడి పట్టారు. వాడు వాళ్ల అమ్మని, నాన్నని తీసుకుని రాత్రికి రాత్రే మాస్టారి ఇంటికి వెళ్ళి మామిడికాయ జాడీ మాస్టారికి ఇచ్చారు. అంతే రెండో రోజు స్కూల్లో ఆ వేషానికి వాడిని తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. తర్వాత తెలిసింది నాకు ఇదంతా మామిడికాయ పచ్చడి మహత్యం అని... అదీ నాకు తెలిసిన మామిడికాయ పచ్చడి గురించిన జ్ఞాపకాలు... - శివ నాగేశ్వరరావు -
మ్యాంగో త్రీ
సో స్వీట్ డబ్బులు చెట్లకు కాస్తాయా! కాయవు. కానీ మామిడిపండ్లు కాస్తాయి. పండ్లే కాదు, బాటిల్సూ కాస్తాయి. యాడ్స్లో చూడడంలా... మామిడి కొమ్మనుంచి టప్పున బాటిల్ తెంపుకోవడం! అలాగే ఇప్పుడు మనం ఐస్ టీ తెంపుకుందాం. స్వీట్రైస్ తెంపుకుందాం. ఐస్క్రీమ్ తెంపుకుందాం. ట్రీ నుంచి త్రీ ఐటమ్స్!! మ్యాంగో ఐస్ టీ 3 గ్లాసుల టీ కోసం కావల్సినవి: మామిడిపండ్లు - 2 (ఒకటిన్నర కప్పు గుజ్జు) టీ పొడి - 3 టీ స్పూన్లు లేదా 3 టీ బ్యాగ్స్ నీళ్లు - 4 కప్పులు నిమ్మరసం - అర టేబుల్ స్పూన్ పంచదార - తగినంత పుదీనా ఆకులు - గార్నిష్కి కొన్ని తయారీ: ⇒ మామిడిపండు తొక్క తీసి, ముక్కలు కోసి, పంచదార కలిపి గుజ్జు చేసుకో వాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి. ⇒ స్టౌపై నీళ్లు పెట్టి, మరిగాక స్టౌ కట్టేయాలి. నీటిలో టీ పొడి వేసి, మూతపెట్టి 5 ని.లు అలాగే ఉంచాలి. ⇒ తర్వాత వడకట్టి, ఈ డికాషన్ని కూడా కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి. ⇒ టీ డికాషన్ చల్లబడ్డాక బయటకు తీసి... దీంట్లో మామిడిపండు గుజ్జు, నిమ్మరసం కలిపి బ్లెండ్ చేయాలి. ⇒ పొడవాటి గ్లాస్లో ఈ టీ పోసి, ఐస్క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మ్యాంగో స్వీట్ రైస్ కావల్సినవి: బియ్యం - ఒకటిన్నర కప్పు నీళ్లు - 2 కప్పులు కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు పంచదార - 1 కప్పు ఉప్పు - అర టీ స్పూన్ పంచదార - 1 టేబుల్స్పూన్ టాపికా స్టార్చ్ (మార్కెట్లో లభిస్తుంది) - 1 టేబుల్ స్పూన్ మామిడిపండ్లు-3 (గుజ్జు తీసుకోవాలి) తెల్ల నువ్వులు (వేయించినవి) - 1 టేబుల్ స్పూన్ తయారీ: ⇒ పాత్రలో నీళ్లు, బియ్యం వేసి సన్నని మంట మీద ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక అందులో కొబ్బరి పాలు, పంచదార, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. దీంట్లో మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. ⇒ విడిగా పాత్రలో అరకప్పు పాలలో టేబుల్ స్పూన్ పంచదార, పావు టీ స్పూన్ ఉప్పు, టాపికా స్టార్చ్ వేసి మరిగించాలి. ⇒ ప్లేట్లో మ్యాంగో రైస్ తీసుకొని, పైన విడిగా పాత్రలో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసి, ఆపైన నువ్వులు చల్లాలి. ఆపైన సన్నగా కట్చేసిన మామిడిపండు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి. ⇒ రుచిగానూ, పోషకాలు మెండుగా ఉండే ఈ మ్యాంగో రైస్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. మ్యాంగో ఐస్ క్రీమ్ కావల్సినవి: పాలు - కప్పు క్రీమ్- 3 కప్పులు మామిడిపండు గుజ్జు - కప్పు మామిడిపండు ముక్కలు (సన్నగా కట్ చేయాలి)- కప్పు కస్టర్డ్ పౌడర్ - టేబుల్ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - టేబుల్ స్పూన్ పంచదార - 360 గ్రా.లు తయారీ: ⇒ పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. ⇒ మిగిలిన పాలను వేడి చేసి, అందులో కస్టర్డ్ కలిపిన పాలను వేసి, బాగా కలుపుతూ మరిగించాలి. ⇒ పాలు చల్లారాక మామిడిపండు గుజ్జు, ముక్కలు, క్రీమ్, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ బౌల్లో వేసి, ఫ్రిజ్లో ఉంచాలి. ⇒ మిశ్రమం బాగా గట్టి పడేంతవరకు ఉంచి, ఐస్క్రీమ్ స్కూప్తో తీసి, సర్వ్ చేయాలి. -
’శాంతి స్థిరత్వం కోసం పనిచేద్దాం’
-
మోదీ.. బోధి మొక్క బహుమానం
మూడురోజుల చైనా పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం మంగోలియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశంలో ఘనస్వాగతం లభించింది. రాజధాని ఉలాన్ భతర్ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. స్వాగత కార్యక్రమాల అనంతరం మోదీ.. మంగోలియా ప్రధానమంత్రి చిమెద్ సాయికన్ బిలెగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. మంగోలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశం అనుసరిస్తోన్న తూర్పు విధాన చట్టంలో మంగోలియా అంతర్భాగమని మోదీ పేర్కొన్నారు. ఆ దేశంలో మౌళిక వసతుల కల్పన కోసం బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆథ్యాత్నిక ఉన్నతిగల మంగోలియాకు పొరుగుదేశంగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నామని, భారత్కు ఇస్తోన్న గౌరవానికి తగ్గట్లుగానే మంగోలియా అభివృద్ధి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తామన్నారు. ఆసియాలో శాంతి, సుస్థిరత కోసం కలిసిపనిచేద్దామని పిలుపునిచ్చారు. పరస్పర సహకారంతో ఇరుదేశాలూ అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రసిద్ధ గాంధన్ బౌద్ధారామాన్ని సందర్శించిన ఆయన.. మఠం ప్రధాన గురువు హంబా లామాను కలుసుకుని ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం ఒక బోధి మొక్కను లామాకు బహుమతిగా అందజేశారు. మోదీ కానుకపట్ల బౌధ్ద గురువులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఉమ్మడిగా కొత్త శిఖరాలు
భారత్, చైనాలు పేదరికాన్ని రూపుమాపితే ప్రపంచానికి మేలు: మోదీ షాంఘైలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని ఉగ్రవాదం, భూతాపం సవాళ్లకు గాంధీ బోధనల్లో పరిష్కారాలు ఉన్నాయి ఏడాదిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నా ఏటా ఐదుగురు చైనీయులు భారత్లో పర్యటించేలా భారతీయులు చూడాలి షాంఘైలో భారతీయులతో సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు చైనాలో ముగిసిన మోదీ పర్యటన.. మంగోలియాలో పర్యటన షురూ షాంఘై: చైనా, భారత్లు పేదరికాన్ని తొలగించేందుకు ఉమ్మడిగా కొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని.. ప్రపంచంలోని మూడో వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉన్నందున.. ఇది ప్రపంచానికి ప్రయోజనం కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. షాంఘైలోని ఫుదాన్ విశ్వవిద్యాలయంలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన హిందీలో ప్రసంగించారు. భారత్, చైనాలకు చారిత్రక, నాగరిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు.. ఉగ్రవాదం, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) సమస్యలకు పరిష్కారాలు మహాత్మా గాంధీ బోధనల్లో ఉన్నాయన్నారు. భారత్, చైనాలు ఉమ్మడిగా బుద్ధుని సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీ పరిశోధనలను మేళవించి కొత్త అభివృద్ధి శిఖరాలకు చేరటం ద్వారా.. మానవజాతి సంక్షేమానికి కట్టుబడి ఉండే ఒక వ్యవస్థను ప్రపంచానికి అందించవచ్చని పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి జ్ఞానం రావాలన్నది భారతదేశపు ప్రాథమిక సిద్ధాంతమని మోదీ చెప్పారు. ‘‘జ్ఞానానికి తూర్పు, పడమర లేవు. అది ప్రపంచవ్యాప్తం. ఎటువంటి జ్ఞానమైనా మానవజాతికి ప్రయోజనం కలిగిస్తుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా పనిచేస్తూ ఉండాలని భగవద్గీత చెప్తుంది’’ అని ఆయన ఉటంకించారు. చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ భారత పర్యటనను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల చరిత్రను చూస్తే భారత్, చైనాలు రెండూ జ్ఞానం సముపార్జించాలన్న తపన ఉన్న దేశాలేనన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన సంబంధాలు ప్రస్తుత పరిస్థితులకు ప్రయోజనం కలిగిస్తే.. జ్ఞానం ప్రాతిపదికన సంబంధాలు యుగాల తరబడి ప్రయోజనాన్ని ఇస్తాయని చెప్పారు. అలుపెరుగకుండా పనిచేస్తున్నందుకే విమర్శలు: అలుపెరుగకుండా కృషి చేస్తున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని.. అలా పనిచేయటం నేరమైతే దానిని తాను కొనసాగిస్తానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తాను తరచుగా విదేశీ పర్యటనలు చేయటంపై ప్రతిపక్షాల విమర్శల పట్ల ఆయన పై విధంగా స్పందించారు. శనివారం షాంఘైలో భారతీయుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘మోదీ ఎన్నో దేశాలకు ఎందుకు ప్రయాణిస్తున్నారని జనం అడుగుతున్నారు... మనం తక్కువ పని చేస్తే విమర్శలు సాధారణం.. మనం నిద్రపోతుంటే విమర్శలు సాధారణం.. కానీ.. నా దురదృష్టమేమిటంటే, నేను ఎక్కువ పని చేస్తున్నందుకు విమర్శిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘సరిగ్గా నిరుడు ఇదే రోజున (మే 16వ తేదీన) లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు నేను మూడు హామీలు ఇచ్చాను. అలుపెరుగకుండా పనిచేస్తానని, అనుభవం లేనందున నేర్చుకుంటానని, దురుద్దేశంతో ఏ పొరపాటూ చేయనని చెప్పాను. ఆ మూడు హామీలనూ నేను నెరవేర్చాను. గత ఏడాదిగా నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. పగలూ, రాత్రీ పనిచేశాను. నేను ఏదైనా సెలవుపై వెళ్లానా?’’ అని వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఇటీవల 56 రోజుల పాటు‘సెలవు’పై వెళ్లటాన్ని పరోక్షం గా ఎద్దేవా చేశారు. గత 30 ఏళ్లలో జరిగిన పనినంతటినీ తన తొలి ఏడాదిలోనే చేయటం ప్రారంభింనం దున ప్రపంచం తనను ఎక్కువగా నమ్ముతోందని పేర్కొన్నారు. చైనాలో తన మూడు రోజుల పర్యటన రానున్న కాలంలో ప్రయోజనాలు కల్పించేందుకు పునాదులు వేసిందన్నారు. చైనా అధ్యక్షుడు బీజింగ్ వెలుపల ఎవరైనా విదేశీ నేతను ఆహ్వానించటం ఇదే తొలిసారి అని మోదీ పేర్కొన్నారు. ఇది 125 కోట్ల మంది భారతీయులకు లభించిన ఆహ్వానమని అభివర్ణించారు. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో తన స్నేహం ‘ప్లస్ వన్’ అని అభివర్ణించారు. ఆయనతో తనకు సన్నిహిత స్నేహం ఉందన్నారు. చైనా, భారత్లు భుజం భుజం కలిపి నడవాలన్నారు. చైనా ప్రజలకు భారత్ పట్ల ఆసక్తి ఉందంటూ.. చైనాలో నివసిస్తున్న భారతీయులు ప్రతియేటా ఐదుగురు చైనీయులు భారత్ను సందర్శించేలా ఒప్పించాలని సూచించారు. ఇది భారత్ను చైనా అర్థం చేసుకునేందుకు.. భారత్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని చెప్పారు. షాంఘైలో మోదీకి శాకాహార విందు షాంఘైలో పాలక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ హాన్ ఝెంగ్ శనివారం ప్రధాని మోదీకి మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ విందులో షాంఘైలో ప్రత్యేకమైన శాకాహార వంటకాలు, అన్నం వడ్డించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్స్వరూప్ ట్విటర్ ద్వారా తెలిపారు. మంగోలియా చేరుకున్న మోదీ ప్రధాని మోదీ చైనాలో మూడు రోజుల పర్యటన శనివారం ముగిసింది. ఆయన షాంఘై నుంచి నేరుగా మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్ చేరుకున్నారు. ఈ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ దేశంలో రెండు రోజులు మోదీ పర్యటించనున్నారు. -
తియ్యటి విషం!
కాల్షియం కార్బైడ్తో త్వరితగతిన మాగుతున్న మామిడి ఈ పండ్లు తింటే అనారోగ్యమే! మామిడి మార్కెట్ను ముంచెత్తుతున్న కాల్షియం కార్బైడ్ మిగిలిపోయిన పండ్లుతిని ఒక ఎద్దు మృత్యువాత గుట్టు చప్పుడు కాకుండా పెన్నాలో పాతి పెట్టిన వైనం ‘సాక్షి’ చొరవతో కంపోస్ట్ యార్డ్లో ఖననం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆర్జించడానికి మామిడి పండ్ల వ్యాపారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వారం రోజుల్లో మాగాల్సిన మామిడి కాయలను కాల్షియం కార్బైడ్ సహాయంతో రెండు రోజుల్లోపసుపు పచ్చని రంగు తెప్పించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. మిగిలిపోయి కాస్త పాడైన పండ్లు తిని ఓ ఎద్దు మృతి చెందడం ప్రొద్దుటూరులో కలకలం లేపింది. క్యాల్షియం కార్బైడ్ను కెమికల్ ఫ్యాక్టరీలలో వినియోగిస్తారు. ఘన రూపంలో ఉన్న దీనిని పొడిగా మార్చి వాడతారు. మనం తినే పదార్థాల్లో ఇది కలిసి ఉంటే గ్యాస్ట్రిక్, అలర్జీ సమస్యలతో పాటు కంటి చూపు దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం జంతువులపై కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రొద్దుటూరు టౌన్ : క్యాల్షియం కార్బైడ్.. మోతాదు మించితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అయితేనేం మాకు కావాల్సింది ఆదాయం అంటున్నారు మామిడి పండ్ల వ్యాపారులు. ప్రతి రోజు క్యాల్షియం కార్బైడ్ 50 కిలోల డబ్బాలు నేరుగా పండ్ల మార్కెట్లో దించుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ప్రొద్దుటూరు పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి మామిడి పండ్లు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. అయితే ఇక్కడి వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్ను పెద్ద ఎత్తున తెప్పించి పొడి చేసి.. ప్యాకెట్లలో నింపి మామిడి కాయలను మాగబెడుతున్నారు. దీని మోతాదు కాస్త ఎక్కువైతే పండ్లు కుళ్లిపోతున్నాయి. ఇలా కుళ్లిన పండ్లను మార్కెట్ ప్రధాన రోడ్డుపై ఉన్న చెత్త తొట్టి వద్ద పడేస్తున్నారు. ఇలాంటి పండ్లను తిన్న జంతువులు అస్వస్థతకు గురవుతున్నాయి. బుధవారం రాత్రి ఓ ఎద్దు వీటిని ఎక్కువగా తిని అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పరిశీలించగా పండ్ల దుకాణాల వద్ద క్యాల్షియం కార్బైడ్ డబ్బాలు కనిపించాయి. ఓ దుకాణంలో కూలీలు కార్బైడ్ను పగులగొట్టి పొడి చేసి పేపరు ప్యాకెట్లల్లో నింపుతూ కనిపించారు. వారు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కనిపించింది. క్యాల్షియం కార్బైడ్ ఎక్కువ కావడం వల్ల కుళ్లిపోయిన మామిడి పండ్లు సైతం కనిపించాయి. ఈ విషయాన్ని కమిషనర్ ప్రమోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అది ఫుడ్ ఇన్స్పెక్టర్ చూసుకోవాలని తాను కూడా ఇది వరకే ఫోన్ చేసి చెప్పానని అన్నారు. క్యాల్షియం కార్బైడ్ను వ్యాపారులు పెద్ద ఎత్తున వాడుతున్న విషయంపై ఫుడ్ కంట్రోలర్ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా తాను హైదరాబాదులో మీటింగ్లో ఉన్నానని, వచ్చాక వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా మృతి చెందిన ఎద్దును శానిటరీ సిబ్బంది పెన్నా నదిలో పడేశారు. బయటకు కనిపించకుండా పైన చెత్త వేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ శానిటరీ సూపర్వైజర్ గోవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పెన్నా నది వద్దకు వచ్చారు. ఎద్దు కళేబరాన్ని ట్రాక్టర్లో కంపోస్టు యార్డుకు తరలించి పూడ్చి వేయించారు. -
మామిడి కాయలు కోయబోయి..
సదాశివనగర్ : మామిడి కాయలు దొంగిలిస్తున్నారని యజమాని చెట్టుకు ఇనుప తీగ చుట్టి కరెంటు కనెక్షన్ ఇచ్చాడు. ఇది తెలియని ఓ చిన్నారి మామిడి చెట్టు ఎక్కి కాయలు కోయబోగా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతిచెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని పోస్టాఫీసు కాలనీకి చెందిన జోగిని అక్షయ(10) అనే బాలిక.. అదే కాలనీకి చెందిన కుక్కల నారాయణ అనే వ్యక్తి ఇంట్లో మామిడి కాయల కోసం చెట్టు ఎక్కింది. అయితే చెట్టుకు ముందే అమర్చి ఉన్న ఇనుప తీగ ద్వారా కరెంట్ షాక్కు గురై మృతిచెందింది. కాగా ఇంటి యజమాని వచ్చేంతవరకు శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లమని బంధువులు భీష్మించి కూర్చున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ట్రాలీఆటో బోల్తాపడి విద్యార్థి దుర్మరణం
- మరో 23మందికి గాయూలు - ఇద్దరి పరిస్థితి విషమం - మామిడికాయలు తెంపేందుకు వెళ్తుండగా ప్రమాదం కొత్తకొండ(భీమదేవరపల్లి) : కూలీ పనుల నిమిత్తంమా మిడికాయలు తెంపేందుకు వెళ్తండగా అదుపుతప్పి ట్రాలీఆటో బోల్తాపడి గుగులోతు జీవన్(14) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో 23మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిధి వీర్లగడ్డతండా కు చెందిన 25మంది గిరిజనులు కొత్తకొండకు చెందిన ట్రాలీఆటలో వరంగల్ జిల్లా హసన్పర్తిలో మామిడికాయలు తెంపేందుకు సోమవారం బయలు దేరారు. కొ త్తకొండ విద్యుత్ సబ్స్టేషన్ దాటగానే తారురోడ్డు ఏట వాలుగా ఉండడం, వాహనం వేగంగా వెళ్లడంతో అదపుతప్పి బొల్తాపడింది. ఈఘటనలో గుగులోతు జీవన్(14), గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు విజయ, గున్నీ, బుజ్జమ్మ, రాకేష్, గుమ్మ, బానో తు లక్ష్మి, స్వర్ణ, తిరుపతి, గణేష్, మంగమ్మ, సత్తమ్మ, శారద, కమల, ఉపేందర్, లక్ష్మి, గుగులోతు ధూళి, జ్యో తితోపాటు మరో నలుగురికి గాయూలయ్యూరుు. ఇంకో బాలుడు గుగులోతు రాజ్కుమార్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అరుుతే, తీవ్రంగా గాయపడిన గుగులోతు జీవన్, గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు రాకేశ్, గుగులోతు గున్నీని స్థానికులు 108అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. జీవన్ చికిత్స పొందుతూ మృతి చెం దాడు. గుగులోతు సరోజన, గుగులోతు జమున పరిస్థి తి విషమంగా ఉంది. మిగతా 19 మందిని ముల్కనూర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేరుుస్తున్నారు. గాయపడిన వారి రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ‘అమ్మమ్మ ఇంటికి పోతే బతికటోడు’ ‘అమ్మమ్మ ఇంటికి పోతనంటివి కదా కొడుకా.. ఆడికి పోయినా బతికటోడివి కదా బిడ్డా..’ అంటూ రోడ్డు ప్ర మాదంలో మృతి చెందిన గుగులోతు జీవన్ తల్లి రాధ రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. గుగులోతు రాజేందర్-రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జీవన్ హుజూరాబాద్లోని వసతిగృహంలో ఎనిమిదో తరగతి చదువుచున్నాడు. వేసవి సెలవులు ప్రకటించడంతో స్వగ్రామం చేరాడు. సోమవారం అ మ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పిన జీవన్.. కూలీకి పోతే రూ.150 వస్తుందనే ఆశతో మామిడికాయలు తెంపేం దుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. రెక్కాడితేగాని డొక్కాడని పేద గిరిజన కుటుంబాలు.. పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తూ రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. ఈ ఘట న వీర్లగడ్డతండాలో విషాదం నింపింది. కాగా, ఆటో డ్రైవర్ చింత సునీల్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని ముల్కనూర్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పరిహారం చెల్లించాలని మృతదేహంతో ధర్నా తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్య తీపుకుని పరిహారం చెల్లించాలనే డిమాండ్తో జీవన్ కుటుంబ సభ్యులు జీవన్ మృతదేహంతో ముల్కనూర్లోని ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న సీఐ సదన్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. -
నేలరాలిన మామిడి ఆశలు
- వందల ఎకరాల్లో నష్టం - పలు చోట్ల విరిగిపడిన మామిడి చెట్లు - ఆందోళనలో కౌలు రైతులు జైపూర్/తాండూర్/చెన్నూర్రూరల్/నెన్నెల : జిల్లాలో ఆదివారం రాత్రి గాలి దుమా రం, వాన బీభత్సం సృష్టించింది. మామిడి చెట్లపై ఉన్న కాయలన్నీ నేలరాల్చింది. కాయలన్నీ రాలిపోవడంతో రైతుల ఆశలు నేలరాలారుు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జైపూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలారుు. మండలంలోని ఇందారం, టేకుమట్ల, రసూల్పల్లి, మిట్టపల్లి, దుబ్బపల్లి, జైపూర్, భీమారం, బూరుగుపల్లి, నర్సింగాపూర్, ఖాజిపల్లి, దాంపూర్, రెడ్డిపల్లి, ధర్మారం, మద్దికల్, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వేలాది రూపాయాలు ఖర్చు చేసి తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు రాలిన కాయలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాండూర్ మండలం అచ్చలాపూర్, బోయపల్లి, తాండూర్, రేపల్లెవాడ, చౌటపల్లి మదారం తదితర గ్రామాల్లోని 800 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గాలివానకు మామిడికాయలు నేలరాలారుు. కొద్ది రోజుల్లో కాయలు కోసి మార్కెట్కు తరలించాలని అనుకుంటున్న రైతుల ఆశలకు గండికొట్టింది. చెన్నూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలి దుమారానికి సుద్దాల, సంకారం, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, నాగాపూర్, కన్నెపల్లి, కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలారుు. అకాల వర్షాలు, గాలిదుమారంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు. నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, చిత్తాపూర్, మెట్పల్లి, నందులపల్లి, ఘన్పూర్, గొళ్లపల్లి, మైలారం, కొత్తూర్, దుబ్బపల్లి, జంగాల్పేట, గుండ్లసోమారం, జోగాపూర్, కోనంపేట గ్రామాల్లో చెట్లపై ఉన్న కాయల్లో 90శాతం నేలరాలారుు. మూడు వేల ఎకరాల్లోని తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గంట సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. -
కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు
కొల్లాపూర్... ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు, బంగినపల్లి తర్వాత మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం కొల్లాపూర్. ఇక్కడ పండించే పండ్లను విదేశాల్లో ఉండే వారు సైతం ఇష్టంగా తెప్పించుకుని తింటుంటారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించే వారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న కొల్లాపూర్లో ఈసారి మామిడి పంట దిగుబడి భారీగా పడిపోయింది. గతేడాది పండించిన పంటలో ఈ సంవత్సరం 25శాతం మాత్రమే పండింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానలు రైతులను నష్టాల బారిన పడేశాయి. గత సంవత్సరం పంట దిగుబడి భారీగా ఉన్నా ధరలు లేక మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ధరలు ఉన్నా పంటలు అంత దిగుబడి లేక నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ మాయాజాలం రెండూ మామిడి రైతులను నష్టాలు, కష్టాలపాల్జేస్తున్నాయి. కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ రువేలకు పైగా హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగం డ్ల మండలంలో మామిడి సాగు అధికంగా జరుగుతోంది. మామిడి పంటలకు ప్రతి సం వత్సరం డిసెంబర్, జనవరి నెలలో పూతలు వస్తుంటాయి. ఈసారి మాత్రం ఫిబ్రవరిలో పూత ప్రారంభమైంది. కొన్నిచోట్ల మార్చిలో కూడా పూత వచ్చింది. ఫిబ్రవరిలో భారీ వరా లు, ఈదురు గాలుల కారణంగా పెద్ద మొత్తం లో పూత రాలిపోయింది. మళ్లీ మార్చి నెలాఖ రులో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వాన లు కురవటంతో పిందె, కాయ దశలో కూడా మామిడి పంట భారీగా నేలరాలింది. వడగం డ్లు పడడంతో కాయలకు దెబ్బతగిలి పాడయ్యాయి. కాయ సైజు పెరగకముందే గత్యం తరం లేని పరిస్థితుల్లో రైతులు వాటిని తెంచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మార్కెట్ మాయాజాలం గతేడాది హైదరాబాద్లోని హోల్సెల్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడికి వ్యాపారులు ట న్నుకు *15వేల నుంచి రూ.30వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటలు బాగా పండినా రైతులకు ఆశించిన స్థాయిలో లాభా లు రాలేదు. అయితే ఈ సారి పంటల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో వ్యాపారులు గత మార్చి లో టన్ను మామిడి కాయలను రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటల దిగుబడి లేకున్నా మార్కెట్లో భారీ ధరలు ఉండడంతో రైతులు తోటల్లోనే కాయలను పెద్దమొత్తంలో తెంచేసి విక్రయాల కు తీసుకెళ్లారు. దీన్ని గమనించిన వ్యాపారు లు ఏప్రిల్లో టన్ను ధరను ఏకంగా *25వేల నుంచి రూ.30వేలకు పెంచేశారు. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. విదేశాలకు ఎగుమతులు.. కొల్లాపూర్ మామిడికి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్లో వ్యాపారస్తులు కొనుగోలు చేసే మామిడి కాయలను దేశంలోని ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు ఆర్జిస్తుంటారు. ఎగుమతుల వ్యాపారం మామిడి రైతులకు తెలియకపోవడంతో వారు పంట విక్రయాలకు దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పంటనష్ట పరిహారం మంజూరుకు నిబంధనల అడ్డంకి ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందేలా కనిపిం చ డం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పం ట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటే వింత నిబంధనలు అడ్డు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు కావాలంటే ఈదురు గాలులు, వర్షాల కారణంగా మామిడిచెట్లు వేర్లతో సహా విరిగి పడా లి. లేదంటే చెట్ల కొమ్మలు పూర్తిస్థాయిలో వి రిగిపోవాలి. లేదా వర్షాభావ పరిస్థితుల కారణంగా 50శాతం చెట్లు ఎండిపోవాలి. ఇలా ఉ ంటేనే ప్రభుత్వం పరిహారం మంజూరు చే స్తుంది. ఈ వింత నిబంధనలతో పరిహారంపై రైతులు ఆశలు వదిలిపెట్టుకున్నారు. -
వడగళ్ల వానకు భారీగా పంట నష్టం
- 600 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు దెబ్బ - పర్యటించిన ప్రజాప్రతినిధులు నంగునూరు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వడగళ్ల వాన కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. సిద్దన్నపేట, బద్దిపడగ, నంగునూరు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో మామిడి కాయలు రాలాయి. చాలాచోట్ల తోటల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి. వరి చేనులో వడ్లు రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బద్దిపడగలో రోడ్డు చెట్టు కూలడంతో పక్కన నిలిపిన టీవీఎస్ ఎక్సల్ వాహనం దెబ్బతింది. రాకపోకలకు అంతరాయం కల్గింది. మూడు గ్రామాల్లో సుమారుగా 400 ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఆర్డీఓ, ఎంపీపీ సందర్శన.. మూడు గ్రామాల్లో జరిగిన పంట నష్టం విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, ఆయా శాఖల అధికారులు బద్దిపడగ, సిద్దన్నపేట గ్రామాలను సందర్శించారు. మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గురువారం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల నష్టం వివరాలను సేకరిస్తారని చెప్పారు. వారి వెంట సర్పంచ్ బెదురు గిరిజ, మద్దికుంట మంజూల, నాయకులు దువ్వల మల్లయ్య, వెంకట్రెడ్డి, పురేందర్, వెంకట్రాంజం, జయపాల్రెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ శివారులో అగ్నిప్రమాదం: ఇద్దరి మృతి
న్యూఢిల్లీ: నగర శివారులోని మంగోల్పురిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులలో అయిదేల్ల బాలిక కూడా ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. మృతులను బాలిక గాయత్రి, సురేఖగా గుర్తించారు. భవనంలో చెలరేగిన మంటలు పక్కన మరో రెండు ఇళ్లకు కూడా అంటుకున్నాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ భవనంలో మంటలు ఎగిసిపడినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. -
రైతులను ముంచేసిన అకాల వర్షం
♦ వేలాది హెక్టార్లలో రాలిన మామిడి ♦ నీట మునిగిన వరి, టమాట, వేరుశెనగ పంటలు ♦ నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ♦ జిల్లావ్యాప్తంగా కోట్లలో నష్టం ♦ పూర్తిస్థాయిలో పర్యటించని అధికారులు ♦ నష్టం ప్రాథమిక అంచనా సైతం లేని వైనం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్నఅకాల వర్షాలు కర్షకులకు కష్టాల్ని మిగిల్చాయి. వేలాది హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి, టమాట, బొప్పాయి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒబ్బిళ్లు చేసి పొలంలో ఉంచిన వేరుశెనగ పాదుల్లో నీళ్లు నిలిచిపోయాయి. గాలులతో కూడిన వర్షానికి పక్వదశకు చేరుకుంటున్న మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాక్షి, చిత్తూరు : మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బుధవారం సైతం జిల్లాలో 59 మండలాల్లో వర్షం కురవగా, తంబళ్ల పల్లె నియోజకవర్గం పెద్దమండ్యంలో 88.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తంబళ్లపల్లెలో 40.2 మిల్లిమీటర్లు, కురబలకోటలో 45.6, గుర్రంకొండలో 31 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఒకటి, రెండు నియోజకవర్గాలలో ఈదురు గాలులు లేకుండా కురిసిన వర్షం వల్ల కొంతమేలు జరగ్గా, మిగిలిన నియోజకవర్గాల్లో అపారనష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయలు నష్టం జరిగినా క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదు. ఒకరిద్దరు జిల్లా అధికారులు మినహా ఎవరూ గ్రామాలను తొం గి చూడలేదు. కనీసం ఎంతనష్టం జరిగిందన్న దాని పై కూడా అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం లే దు. పంట నష్టం వివరాలు అడిగితే, ఇంకా రాలేదం టూ తప్పించుకుంటున్నారు. గ్రామాల్లో విచారిస్తే, ఏ ఒక్క అధికారి రాలేదని రైతులు చెబుతున్నారు. ► పుంగనూరులో అత్యధిక వర్షంతో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. 165 ఎకరాల్లో టమాటా,135 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మిరప, కీరకాయ, కాలీఫ్లవర్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పది ట్రాన్స్ఫార్ల్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. సుమారు * 5 కోట్ల పైనే నష్టం వాటిల్లినట్లు అంచనా. ► పూతలపట్టు నియోజకవర్గంలో భారీవర్షం కురిసింది. పిడుగుపాటుతో తలపులపల్లెలో రెండు ఆవులు మృతి చెందాయి. మామిడి పంట పిందె రాలిపోయింది. ► సత్యవేడు నియోజకవర్గంలో బుధవారం సైతం భారీవర్షం కరిసింది. 1,200 ఎకరాల్లో కోతదశలో ఉన్న నువ్వుల పంట, మూడు వేల ఎకరాలకు పైగా వేరుశనగ, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుధవారం ఉదయం విద్యుత్ వైర్లు తెగి పది బర్రెలు మృతి చెందాయి. ► శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోనూ అన్నదాతలు నష్టపోయారు. తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో మామిడి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. వర్షంతో ఇటుక బట్టీలు పూర్తిగా తడిసి పోయి * కోటి పైనే నష్టం వాటిల్లింది. ► మదనపల్లె నియోజకవర్గంలో రామసముద్రం మండలంలో అపారనష్టం వాటిల్లింది. గాలీవానకు బొప్పాయి, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. రూ.3 కోట్ల పైగానే నష్టం వాటిల్లినట్లు అంచనా. ► పలమనేరు నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. బెరైడ్డిపల్లెలో ఎక్కువ నష్టం జరిగింది. కోత దశలో ఉన్న 150 హెక్టార్ల వరి పంట దెబ్బతింది. మామిడి, టమాట, కాకర, బీర పంటలకు నష్టం వాటిల్లింది. ► తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో 20 ఎకరాల టమాట, ములకలచెరువులో అరటిపంట దెబ్బతినింది. రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. నీటి ఎద్దడి నెలకున్న నేపథ్యంలో వర్షం కురవడంతో మేలు జరిగిందని కొన్ని ప్రాంతాల రైతులు పేర్కొంటున్నారు. ► చంద్రగిరి నియోజకవర్గంలో గాలీవానకు మామి డి, వేరుశెనగ పంటలకు నష్టం వాటిల్లింది. -
పెప్సీకి ఇక ఏపీ హబ్
మామిడి గుజ్జుకు ఇదే ఆధార కేంద్రమవుతుంది రూ.1,200 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ప్లాంటుగా చేస్తాం శ్రీ సిటీ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవంలో పెప్సీ కో చైర్మన్ ఇంద్రా నూయి సింగిల్ లైన్ ఉత్పత్తిని ప్రారంభించిన పెప్సీకో మరో మూడేళ్లలో 9 లైన్లతో పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటామని వెల్లడి అది పూర్తయితే దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా శ్రీ సిటీ ప్లాంటు శ్రీ సిటీ నుంచి ఎం. రమణ మూర్తి శీతల పానీయాల రంగంలో మార్కెట్ లీడర్గా ఉన్న పెప్సీకో... భారతదేశంలో తన ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీని ప్రధాన కేంద్రంగా చేసుకుంటానని స్పష్టం చేసింది. మామిడి గుజ్జుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్నే దేశం మొత్తానికి ఆధార కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంపెనీ చైర్పర్సన్, సీఈఓ ఇంద్రా నూయి చెప్పారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో శ్రీ సిటీ ప్లాంటుపై రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడతామని తెలియజేశారు. శ్రీ సిటీలో 86 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పెప్సీ కో ప్లాంట్లో ఉత్పత్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలసి శుక్రవారమిక్కడ ఆమె ప్రారంభించారు. మామిడి గుజ్జుకు (మ్యాంగో పల్ప్) సంబంధించి శ్రీ సిటీ ప్లాంటును భారతదేశం అంతటికీ ఆధార కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆమె ప్రకటించారు. శుక్రవారం ప్రారంభించిన ప్లాంటులో ప్రస్తుతం సింగిల్ లైన్లోనే ఉత్పత్తి జరగనుంది. వచ్చే మూడేళ్లలో ఈ ప్లాంటు తొమ్మిది లైన్లలో ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది. మూడు దశల్లో జరిగే ఈ విస్తరణ అనంతరం భారతదేశంలో పెప్సీకి ఇదే అతిపెద్ద ప్లాంటు కానుంది. ఈ ప్లాంటులో పెప్సీకి సంబంధించిన వివిధ రకాల పానీయాలు తయారు చేయటంతో పాటు స్పోర్ట్స్ బేవరేజెస్ కూడా తయారు చేయనున్నట్లు ఇంద్రా నూయి తెలియజేశారు. మేక్ ఇన్ ఇండియా భావనను అత్యంత సాఫీగా అమలు చేయడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని తెలియజేశారు. ‘‘భారతదేశంలో పెప్సీ యాత్ర 1989లో ప్రారంభమైంది. అంటే దాదాపు పాతికేళ్లు పూర్తయింది. ఇన్నాళ్లూ భారతదేశంలో పెట్టుబడి పెడుతూనే ఉన్నాం. మరో పాతికేళ్ల పాటు కూడా దీన్ని కొనసాగిస్తాం’’ అని తెలియజేశారు. శ్రీ సిటీ ప్లాంటును పూర్తి దేశీయ పరిజ్ఞానంతో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించటం చాలా సంతోషంగా ఉందంటూ... ఈ సంస్థలో దాదాపు 25 శాతం మహిళలనే తీసుకున్నామని తెలియజేశారు. ‘‘అంతేకాదు. ఇక్కడ అత్యున్నత స్థాయి మేనేజ్మెంట్లో 9 మంది ఉండగా వారిలో ఏడుగురు మహిళలే’’ అని తెలియజేశారు. అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ పెప్సీకి ఇప్పటిదాకా ఉన్న ప్లాంట్లలో నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకుంటున్న ప్లాంటు ఇదేనని ఈ సందర్భంగా ఇంద్రా నూయి చెప్పారు. వాన నీటి నిల్వ, వాటర్షెడ్లు వంటి సానుకూల చర్యలకు సహకరిస్తూ... తాము వినియోగిస్తున్న నీటికంటే ఎక్కువ నీటిని సంరక్షిస్తున్నామని కూడా ఆమె చెప్పారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్లో తమ ప్లాంటు వల్ల 32,000 మంది రైతులు ప్రత్యక్షంగా లభ్ధి పొందుతారని తెలియజేశారు. స్థానికంగా ఉన్నవారు తమ అభివృద్ధిలో భాగమైతే నే అది సమగ్రాభివృద్ధికి దారి తీస్తుందన్న సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆమె ప్రశంసించారు. అంతకుముందు పెప్సీకో ఇండియా చైర్మన్, సీఈఓ డి.శివకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పంజాబ్ తరవాత అత్యంత ఖరీదైన వినియోగదారులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. గతంలో నోకియా కంపెనీకి సైతం ఇండియా హెడ్గా వ్యవహరించిన శివకుమార్... రాష్ట్రంలో విశాఖ పట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు... ఇలా అన్ని ప్రాంతాలూ వినియోగంలో చాలా ముందుంటాయని, పంజాబ్ తరవాత దేశంలో ఇంకెక్కడా ఇలాంటి ప్రాంతం లేదని చెప్పారు. పెప్సీకో వల్ల రాష్ట్రంలో మామిడి, బంగాళాదుంప ఇతరత్రా రైతాంగానికి మేలు కలుగుతుందని, వారికి మరింత మంచి ధరలు వచ్చే అవకాశముందని చెప్పారు. 10 కంపెనీలకు భూమి పూజ ఈ సందర్భంగా బ్రిటన్కు చెందిన రెక్సామ్తో పాటు బెల్జియం కంపెనీ వెర్మీరెన్, గోదావరి ఉద్యోగ్, ఆరుర్వెట్, బీరోలెక్స్, బెయా తదితర భారత కంపెనీలు సహా మొత్తం 10 కంపెనీలకు సీఎం సమక్షంలో భూమి పూజ చేశారు. తదనంతరం నెదర్లాండ్స్ కంపెనీ హంటర్ డగ్లస్, వెస్ట్ ఫార్మా (అమెరికా), జెడ్టీటీ (చైనా), నిప్పన్సీకీ, నిట్టన్ వాల్వ్, కుసకబే (జపాన్), సిద్ధార్థా లాజిస్టిక్స్, అర్తురా, ఎంఎం పాలీటెక్ (ఇండియా), చక్సింగ్ (చైనా) కంపెనీల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. రూ 500 కోట్లతో జీవీకే గ్రూప్ హెల్త్ సిటీ... వైద్య సేవల రంగంలోకి అడుగు పెట్టడానికి జీవీకే గ్రూపు ఆసక్తి చూపిస్తోంది. సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడి వ్యయంతో శ్రీ సిటీలో హెల్త్కేర్ సిటీని ఏర్పాటు చేయడానికి జీవీకే గ్రూపు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హాస్పిటల్, మెడికల్ కాలేజీతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఈఎంఆర్ఐ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీవీకే ముందుకొచ్చిందని, దీనికి సంబంధించి కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే 2-3 నెలల్లో జీవీకేతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఈ చర్చల్లో పాల్గొన్న శ్రీ సిటీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీల వలే శ్రీ సిటీలో కూడా రాత్రి వేళల్లో మహిళలు పని చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని శ్రీ సిటీలో కలిసిన పారిశ్రామిక ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామినిచ్చారు. ప్రస్తుతం రెండు షిప్టుల్లో మాత్రమే పనిచేయడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని, ఇది ఇబ్బందిగా ఉందని కొన్ని కంపెనీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. -
రుచుల రుతువు
కోకిల... వగరు పాట. వేప... చేదు పూత. చెరకు... తీపి గడ. చింతపండు... పుల్లటి రసం. మిర్చి... ఘాటైన ప్రేమ. ఉప్పు... తెల్లటి రుచి. వసంతం... రుచుల రుతువు. అన్నిటి మేళవింపులే ఉగాది తాలింపులు. అయ్యంగారి పులిహోర చింతపండు - 200 గ్రా.; ఎండు మిర్చి - 25; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; నువ్వుల నూనె - కప్పు; ఉప్పు తగినంత పొడి కోసం: ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు; మెంతులు - టీ స్పూను; ఎండు మిర్చి - 15; ఇంగువ - కొద్దిగా అన్నం కోసం: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - 3 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; జీడిపప్పు - అర కప్పు; కరివేపాకు - ఒక కట్ట; నువ్వుల నూనె - 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి - 3; ఉప్పు - తగినంత తయారీ: చింతపండు రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు అరగంటసేపు నానిన తర్వాత, మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి. (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడిపోకూడదు) ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి చింతపండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి వేరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ఒక పళ్లెంలో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలపాలి. మామిడికాయ నువ్వు పప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు - 2; నువ్వులు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - అర కప్పు; వెల్లుల్లి రేకలు - అర కప్పు; అల్లం తురుము - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; కరివేపాకు - 4 రెమ్మలు; ఎండు మిర్చి - 4; రిఫైన్డ్ ఆయిల్ - 350 మి.లీ.; పసుపు - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి వేరొక బాణలిలో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి వేయించి ఉంచుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; చింతపండు - కొద్దిగా; ధనియాల పొడి - పావు టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; పచ్చి మిర్చి - 2; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - టీ స్పూను తయారీ: వేపపువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి వేయించాలి వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింతపండు రసం వేసి బాగా కలపాలి రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. -
ప్రమాదవశాత్తూ గాయపడ్డ వ్యక్తి మృతి
భూదాన్ పోచంపల్లి (నల్లగొండ): మామిడి కాయల కోసం చెట్టెక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి సీతావానిగూడెం గ్రామానికి చెందిన చెర్కు మల్లేష్ గౌడ్(42) బుధవారం తన వ్యవసాయ బావి వద్ద ఉన్న మామిడి చెట్టు ఎక్కాడు. కాయలు తెంపబోతూ కొమ్మ విరిగి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మల్లేష్ మృతి చెందాడు. మల్లేష్కు భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడు, ఎనిమిదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. మల్లేష్ మరణంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. -
మడ అడవులకు ముప్పు
మచిలీపట్నం / బంటుమిల్లి : బంటుమిల్లి-బందరు మండలాల సరిహద్దుల్లోని ఉప్పు కాలువ (సాల్ట్ క్రీక్) పరీవాహక ప్రాంతంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది బడా బాబులు, ప్రజాప్రతినిధులు మడ అడవులపై కన్నేసి వ్యూహాత్మకంగా వాటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి అధికారులను మచ్చిక చేసుకుని మడ అడవులను నరికి చెరువులు తవ్వేస్తున్నారు. ఆక్రమణలు సాగేదిలా... వేసవి ప్రారంభం కావడంతో బంటుమిల్లి మండలం నారాయణపురం, బందరు మండలం పెదపట్నం, కానూరు గ్రామాల పరిధిలో మడ అడవులను నరికే కార్యక్రమం వేగవంతం చేశారు. ఈ గ్రామాలకు చెందిన కొంతమంది పెద్ద మనుషులు తొలుత మడ చెట్లు నరికి చిన్న, చిన్న చెరువులుగా మనుషులతో తవ్వేపనిని వేగవంతం చేశారు. ఈ రెండు మండలాల్లో మడ అడవులు విస్తరించి ఉన్న గ్రామాల పరిధిలో గ్రామ స్థాయి అధికారుల కనుసన్నల్లోనే చేపల చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తొలుత మడ అడవులను చిన్న చిన్న చెరువులుగా మార్చి, అనంతరం ఈ భూములను భూస్వాములకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఇక్కడ రివాజుగా మారింది. మడ అడవుల్లోని భూములను కొనుగోలు చేసిన భూస్వాములు యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో రాత్రివేళల్లో వాటిని చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే వేలాది ఎకరాల మడ అడవులు చెరువులుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఉన్న మడ అడవులను నరకడం, వాటిని తమ భూములుగా చూపి బడా బాబులకు అమ్మేయడం యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. భూముల పేరుతో సొమ్ముల వసూలు సాల్ట్ క్రీక్ పరిధిలో ఉన్న భూముల్లో పట్టాలు ఇప్పిస్తామంటూ పెదపట్నం ప్రాంతానికి చెందిన కొంతమంది ఏజెంట్లు పలువురి వద్ద భారీగా సొమ్ములు వసూలు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఉప్పు కాలువ సమీపంలో రాత్రివేళల్లో పొక్లెయిన్ల సాయంతో పెద్ద పెద్ద చెరువుల తవ్వకాన్ని చేపట్టారు. వాటికి సమీపంలో మాగాణి భూములు ఉండటంతో సంబంధిత రైతులు అభ్యంతర పెట్టగా ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. భూములకు పెరిగిన గిరాకీ బంటుమిల్లి-మచిలీపట్నం గ్రామాల మధ్య తుపాను ప్రత్యేక నిధుల తో నారాయణపురం, పెదపట్నం గ్రామాల మీదుగా లింక్ రోడ్డు ఏర్పడటంతో ఈ రోడ్డు పరిధిలో ఉన్న భూములకు గిరాకీ ఏర్పడింది. సాల్ట్ క్రీక్పై వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానున్న తరుణంలో కాలువకు రెండు వైపులా ఉన్న మడ అడవిపై భూస్వాముల కన్ను పడింది. దీంతో ఆక్రమణదారులు అయినకాడికి సొమ్ము చేసుకునేందుకు తమ పనులు వేగవంతం చేసినట్టు సమాచారం. రోడ్డు ఏర్పడకముందు వేలల్లో ఉన్న భూములు నేడు లక్షలు పలుకుతున్నాయి. సుప్రీం ఆదేశాలు బేఖాతరు తీర ప్రాంతాల్లో పర్యావరణం దె బ్బతినకుండా ఉండేందుకు మడ చెట్లు ఎక్కడ మొలిచినా తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 1500 ఎకరాల్లో మడ చెట్లు పెంచాలని ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందులో భాగంగా పాలకాయితిప్ప, కోడూరు, నాగాయలంక గ్రామాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. సంబంధిత శాఖ అధికారులు ప్రారంభోత్సవాలు కూడా చేయడం గమనార్హం. ఈ స్థితిలో రెవెన్యూ అధికారులు సొమ్ముల కోసం ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన మడ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి ఆ భూముల్లో మడ చెట్ల పెంపకాలకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
కన్నీళ్లే దిగుబడి!
రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన రైతు గౌతమ్ కళ్యాణ్ సుమారు 18 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. మొన్నటి వరకు చెట్లు పచ్చగా కళకళలాడాయి. 2014 ఆగస్టు వరకు రెండు బోర్లలో వస్తున్న నీటితో చెట్లను సంరక్షించుకుంటూ వచ్చాడు. ఈ బోర్లలో నీరు ఇంకిపోవడంతో సుమారు 10 బోర్ల వరకు వేశాడు. కానీ, నీటి జాడ కనిపించలేదు. నాలుగైదు ట్యాంకర్లు పెట్టి ఐదారు నెలలుగా నీటిని తోలాడు. ప్రస్తుతం చుట్టు పక్కల ఎక్కడా నీరు లేకపోవడంతో ట్యాంకర్లతో తోలడానికి ఇబ్బందిగా మారింది. సుమారు 1200 పైగా 20 ఏళ్ల వయసున్న మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా చెట్లు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. సాక్షి, కడప : పుడమి తల్లిని నమ్ముకున్న రైతుకు పుట్టెడు కష్టాలు మిగిలాయి. ఆరుగాలం శ్రమించినా అవస్థలు తప్పడం లేదు. ఒకనాడు చేసిన వ్యవసాయానికి, నేటి వ్యవసాయానికి చాలా తేడా కనిపిస్తోంది. నాడు బావుల్లో నీరు దొరికితే, నేడు వేల అడుగులు డ్రిల్ చేసినా పాతాళ గంగను పైకి రప్పించలేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఒక్కొక్క రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసినా చుక్కనీరు కనిపించక, ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో తెలీక కుమిలిపోతున్నాడు. దిగుబడులు రాక, చేసిన అప్పులు తీరక ఆవేదన చెందుతున్నాడు. పల్లెల్లో ఎండుతున్న చెట్లను సంరక్షించుకునేందుకు ఒక్కో రైతు ఒక్కో ప్రయోగం చేస్తున్నాడు. కొందరు బోర్లు వేస్తే, మరికొందరు ట్యాంకర్లతో నీరు తోలితే, ఇంకొందరు సంపుల్లో స్టాకు పెట్టుకుని పాట్లు పడితే.. కొంత మంది దూర ప్రాంతం నుంచి తోట వద్దకు పైపులైన్లు వేసుకుని వేసవి దాటేంత వరకు చెట్లను సంరక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుది ఒక్కో గాథ. వేలాది ఎకరాల్లో ఎండిన పండ్ల తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 93.5 వేల ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేశారు. ప్రస్తుత వేసవిలో పండ్ల తోటలను ఎలా రక్షించుకోవాలో అన్నదాతకు అంతుచిక్కడం లేదు. ఏడాదికేడాది పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవిలో చెట్లను ఎలా బతికించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గత ఏడాది 5 వేల ఎకరాలు ఎండిపోతే ఈ సంవత్సరం అది రెట్టింపు అవుతోంది. జిల్లాలోని పులివెందుల, రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన చీని, నిమ్మ, అరటి, మామిడి, ఉసిరి, సపోట, శీతాఫలం తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి. రానున్న రెండు నెలల్లో పరిస్థితి మరింత ఆందోళనగా మారనుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. పండ్ల తోటలను రక్షించుకునేందుకు రైతులు విరివిగా బోర్లు వేస్తున్నారు. చాలా మంది రైతుల పొలాల్లో నీరు పడక లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నాడు. చీనీ, అరటి, మామిడి చెట్లు వాడుబడుతుంటే చూస్తూ తట్టుకోలేక ఇలా అప్పులపాలవుతున్నారు. పల్లెల శివార్లలో బోర్లు వేసే లారీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే.... మార్చి ఆరంభంలోనే భూగర్బ జలాలు ఇంత అట్టుడుగు స్థాయికి పడిపోవడంతో రానున్న మూడు నెలల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది. అరకొరగా నీరు వస్తున్న బోర్లలో ఇప్పుడే నీరు అడుగంటుతోంది. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఊహించుకోడానికే భయం వేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు, సంపులు, ట్యాంకర్ల ద్వారా ఎలా పడితే అలా పరిస్థితిని బట్టి నీరు తోలుకుంటున్నారు. సాఫ్ట్లోన్లు అందించండి రైతులు నీటి తడులు అందించుకోడానికి భారీ పెట్టుబడులు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాఫ్ట్లోన్లను అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలాది ఎకరాలు ఎండుతున్న నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించి నష్టపరిహారం వచ్చేలా చూడాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెట్లను సంరక్షించుకోవడానికి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్యాంకర్లతో నీటి తడులు అందించేందుకు ట్యాంకర్లకు బాడుగ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ, నేటి ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జీడిమామిడి తోటలో అగ్ని ప్రమాదం
ఖమ్మం: అశ్వారావుపేట మండలంలోని వినాయకపురానికి చెందిన మస్తాన్ అనే రైతు జీడిమామిడి తోటలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. వేసవి కాలం కావటంతో జీడిమామిడి చెట్ల ఆకులు రాలి పోయాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయటంతో ఆకులకు తగులుకొని ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. (అశ్వారావుపేట) -
మహారాజ ఫలం వచ్చేసింది
సాక్షి, ముంబై: మామిడి పండ్లలో అత్యంత ప్రీతిపాత్రమైన ‘హాపూస్’రకం పండ్లు రత్నగిరి మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు అందన్నంత ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం రత్నగిరి మార్కెట్లో డజను పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఈ మామిడి పండ్ల ధరలు మరింత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. హాపూస్ రకం పండ్లు అత్యధికంగా కొంకణ్ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో కొంకణ్లో ధరలను బట్టి ఇతర మార్కెట్లలో ఈ పండ్ల ధరలు ఎంత ఉండవచ్చో అంచనా వేస్తారు. ప్రస్తుతం కొంకణ్లో మార్కెట్లలోనే డజను హాపూస్ పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దేశంలోనే అత్యంత పెద్ద పండ్ల మార్కెట్గా ప్రసిద్ధి గాంచిన ఏపీఎంసీలోకి ఇటీవల నాలుగు పెట్టెల మామిడి పండ్లు వచ్చినప్పుడు వ్యాపారులు వాటికి పూజలు చేసి స్వాగతించారు. ప్రస్తుతం మామిడి పండ్ల విక్రయాలు కొంకణ్లో ప్రారంభమయ్యాయని, త్వరలోనే నగర మార్కెట్లకు చేరవచ్చని ఇక్కడి వ్యాపారులు చెప్పారు. ప్రారంభంలో సరుకు కొరత కారణంగా పండ్ల ధరలు ఆకాశాన్ని అంటినట్టు కన్పించినా ఆ తరువాత నిల్వలు పెరిగినకొద్దీ ధరలు దిగివస్తాయని పేర్కొంటున్నారు. ఏపీఎంసీ మార్కెట్లో వచ్చేవారం నుంచి పుష్కలంగా మామిడి పండ్ల దిగుమతి ప్రారంభం కాగలదని వ్యాపారులు అంటున్నారు. మే ఆఖరు వరకు వీటి సీజన్ ఉంటుందని వారన్నారు. -
దిల్ ‘మ్యాంగో’ మోర్..!
⇒ మళ్లీ మామిడి ఎగుమతుల జోరు ⇒ ఈయూ నిషేధం ఎత్తివేత ఫలితం ⇒ మామిడికి ధరలు పెరిగే అవకాశం ⇒ రైతుల్లో చిగురించిన ఆశలు సాక్షి, చిత్తూరు/మచిలీపట్నం: భారత్ మామిడి పండ్ల దిగుమతిపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మామిడి ఎగుమతులు మళ్లీ జోరందుకోనున్నాయి. దీంతో మామిడికి ధరలు పెరిగే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ గత ఏడాది మే ఒకటి నుంచి 2015 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే మామిడి పండ్ల ఎగుమతులు, నాణ్యతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మామిడితోటల ఆరోగ్య పరిస్థితి, నిర్వహణ, సర్టిఫికేషన్ విధానంలో కీలకమైన మార్పులను తాజాగా చేపట్టడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇతర దేశాలకు మామిడి ఎగుమతులకు మార్గం సుగమమైంది. యూరోపియన్ యూనియన్ నిషేధంతో 2014 మామిడి సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప తదితర జిల్లాల నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు తగ్గాయి. పశ్చిమగోదావరి జిల్లాలో హోతా కంపెనీ గత ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకుని 200 టన్నుల మామిడి కాయలను మాత్రం ఎగుమతి చేయగలిగింది. కృష్ణాజిల్లా నుంచి విదేశాలకు దాదాపు ఎగుమతులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై ఇంకా విధివిధానాలు వెలువడాల్సి ఉందని, ఎగుమతులపై నిషేధం తొలగిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యానశాఖ కృష్ణాజిల్లా అధికారి సుజాత తెలిపారు. రూ.60-80 వేలకు ధర... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 92,913 హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండించే రకాల్లో ఖాదర్, బంగినపల్లె, బేనిషా రకాలను యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. మామిడి పండ్లతో పాటు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతి అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడాదికి ఆరు లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా,. ఇందులో పల్ప్ లక్ష టన్నులు, మామిడి పండ్లు 50వేల టన్నుల వరకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2011 నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చిన ఎగుమతి రకాల టన్ను ధర గతేడాది రూ. 20 వేలకు పడిపోయింది. క్రితం ఏడాది ఎగుమతులపై నిషేధం ఉండడంతో జాతీయ మార్కెట్లోనూ మామిడి ధరలు తగ్గిన విషయం విదితమే. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతులపై నిషేధం తొలగించడంతో మామిడి పండ్లకు మంచి ధర లభించే అవకాశమున్నట్లు రైతు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా గత సంవత్సరంలో టన్ను రూ.20 వేల వరకు ఉన్న ధర... అంతర్జాతీయ ఎగుమతుల నేపథ్యంలో ఈ ఏడాది టన్ను రూ.60 వేల నుంచి 80 వేల వరకు పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. జిల్లాలో మే నెల రెండవ వారం నుంచి మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఎగుమతి రకాలు ఖాదర్, బేనిషా, బంగినపల్లె జూన్ నెల రెండవ వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. -
మామిడి రైతులకి తీపి వార్త
యూరోపియన్ యూనియన్ గత సంవత్సరం భారత మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ నిషేదం గడువు డిసెంబర్ 2015 వరకు ఉన్నప్పటికీ ముందుగానే ఈ నిషేదాన్ని ఎత్తేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మామిడి పళ్ల పై జరిపిన తనిఖీల్లో అధిక మోతాదులో రసాయనాల వినియోగం ఉన్నాయని తెలడంతో వీటిపై నిషేదం విధించారు. ఈ దిగుమతులపై ఉన్న నిషేదాన్ని ఎత్తేయడానికి బ్రిటీష్ పార్లమెంట్లోని భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు చాలా కృ఼షి చేశార. వంకాయ, కాకరకాయ, పొట్లకాయలపై ఉన్న నిషేదం ఇంకా అలానే కొనసాగనుంది. మామిడి దిగుమతి సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. ఈ నిషేదం ఎత్తివేతతో మన దేశంలోని మామిడి రైతులకు ఊరట లభించింది. -
మామిడికి బీమా.. రైతుకు ధీమా
బెల్లంపల్లి/చెన్నూర్ : ప్రకృతి వైపరీత్యాలతో ఏటేటా నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రబీలో మామిడి తోటలకు వాతావరణ ఆధారిత బీమా వర్తింపజేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బీమా సదుపాయం కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలకు బీమా సౌకర్యం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాతావరణ ఆధారిత బీమా పథకం అమలు తీరు, వర్తింపు తదితర వివరాలను జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పీవీ రమణ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 24,928 హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 15,617.7 హెక్టార్లలో మామిడి చెట్లు ఫలసాయాన్ని అందిస్తున్నాయి. 50ఏళ్ల వయస్సు కలిగిన మామిడి చెట్లు 22,311 హెక్టార్లలో, ఐదేళ్ల వయస్సు కలిగిన చెట్లు 2,617 హెక్టార్లలో ఉన్నాయి. మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన దశేరి, బంగెనపల్లి, మల్లిక, తోతపురి తదితర రకాల చెట్లను పెంచుతున్నారు. చెట్టు వయస్సు ఆధారంగా.. రైతులు మామిడిచెట్లకు బీమా చేయిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పూర్తి స్తాయి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మామిడి చెట్టు వయస్సు ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న చెట్టుకు రూ.450 బీమా కోసం రూ.52 ప్రీమియం చెల్లించాలి. ఇందులో రైతు రూ.26 ప్రీమియం చెల్లిస్తే మిగతా రూ.26 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన స్థాయిలో ప్రీమియం భరిస్తాయి. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన చెట్టుకు రూ.800 బీమా కోసం రూ.92 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతు రూ.46 ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం ప్రభుత్వం సబ్సిడీ రూపేణా బీమా కంపెనీకి చెల్లిస్తుంది. వర్తింపు ఇలా.. మామిడి తోటలకు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా బీమా కల్పిస్తుంది. మామిడి సీజన్లో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల ఆధారంగా ఇన్స్యూరెన్స్ను బీమా కంపెనీ చెల్లిస్తుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో అకాల వర్షాలు కురిసి మామిడి పూత రాలిపోయినా, తెగుళ్లు సోకినా బీమా పరిహారం పొందవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో తీవ్రమైన ఎండతో పిందెలు రాలిపోయినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి మే 31వ తేదీ మధ్యలో వాడగాలులు, ఇతర ప్రకృతి ప్రభావంతో చెట్లపై నుంచి కాయలు రాలినా బీమా వర్తిస్తుంది. తుది గడువు.. మామిడి తోటలకు బీమా చేయించుకోవడానికి ప్రభుత్వం తుది గడువు విధించింది. 2014 డిసెంబర్ 15లోపు బీమా చేయించుకోవడానికి అవకాశం కల్పించింది. మామిడి తోటల పెంపకానికి బ్యాంకుల నుంచి రుణం పొందిన, పొందని రైతులు ప్రభుత్వం నిర్దేశించిన తుది గడువు లోపల బీమా ప్రీమియం చెల్లించడానికి వీలుంది. బీమా ప్రీమియాన్ని రైతులు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది. సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అనుబంధంగా ఉన్న బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రైతుల వద్దకు వచ్చి బీమా ప్రీమియం డీడీలను తీసుకుంటారు. ఇతర వివరాలకు బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచి మేనేజర్ సాయిబాబా ఫోన్ నం.9705188786లో సంప్రదించవచ్చు. -
మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే..
మామిడి పూత సాధారణంగా డిసెంబర్ - జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో మాసం మొత్తం పూత కాలంగా ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో, కోత కోయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు.. తేమ తక్కువగా ఉండే నేలల్లో, ఇసుక నేలల్లో మొగ్గ బయటకు వచ్చే ముందు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గలు బయటకు వచ్చే ముందు గానీ పగిలే సమయంలో గానీ పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ-కేను లీటరు నీటికి ఐదు గ్రాముల యూరియాలో కలిపి పిచికారీ చేయాలి. అక్టోబర్ తర్వాత.. అక్టోబర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దుక్కి దున్నవద్దు. చెట్టుకింద పాదులను కదిలించకూడదు. లేదంటే చెట్ల వేర్లు, పోషక పదార్థాల సమతుల్యత దెబ్బతిని పూత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఎరువులు వేయకూడదు. చెట్టుకు నీటి తడులు సైతం ఇవ్వవద్దు. మామిడిలో ఆశించే బూడిద రంగు తెగులు నివారణ... లేత ఆకులు, పూత కాండం, పూలమీద, చిరు పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు. ఇది ఎక్కువగా రాత్రిపూట చల్లగా, పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాత రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హెక్బాకోనజోల్ 2 మి.లీ. లేదా ప్రాసికోనజోల్ ఒక మి.లీ. లేదా డినోకాఫ్ లేదా ట్రైడిమాల్స్ ఒక మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు... వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. లేత ఆకులు, రెక్కలు, పూలను పండ్లను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పెరిగిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చిపూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్ మిథైల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5గ్రాముల మండోజెల్ లేదా 2గ్రాముల ఆంట్రాకాల్ కలిపి పిచికారీ చేయాలి. తేనెమందు పురుగులు... తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులను, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్ల మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి తియ్యని పదార్థాన్ని విసర్జిం చడం వల్ల ఆకులు, కాండలు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు రాలిపోతాయి. పూత, పిందె దశలో ఈ పురుగుల ఉద్ధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో ఈ పురుగులు చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి నాణ్యత లోపిస్తాయి. వీటి నివారణకు 1.5 మి.లీ. మోనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, మొగ్గ దశలో లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోఫాస్ లేదా 3గ్రాముల కార్పోరిల్ కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపూత దశలో కాండలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రొటోపాస్, లేదా డైమిథోయేట్, లేదా 3 మి.లీ. జిథైల్డెమాటాన్, లేదా0.25మిల్లిలీటర్ల ఇమిడాక్లోపిడ్ పిచికారీ చేయాలి. నవంబర్ మాసంలో ఈజాగ్రత్తలు.. సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, మూడు గ్రాముల బోరాక్స్ 5గ్రాముల ఫెర్రిస్ సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపి 10 నుంచి 15రోజుల వ్యవధిలో రెండుమార్లు పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా చూడాలి. వర్షం పడితే రసం పీల్చే పురుగులు ఎక్కువగా చేరతాయి. వీటి నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లేదా పిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫిడ్ ఏడు మి.లీ. ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. తోటలో పూత, మొగ్గలు ప్రారంభమైన తర్వాత మొగ్గలు పగిలి పూత రావడానికి రెండు గ్రాముల బోరాన్ లేదా 10 గ్రాముల మల్టీ-కేతో పాటు 5 గ్రాముల ఫార్ములా-4 మందును లీటరు నీటికి కలికి పిచికారీ చేయాలి. సందేహాలున్న రైతులు 89744 49325ను సంప్రదించవచ్చు. -
పూతను కాపాడితేనే కాత
మంచిర్యాల రూరల్ : మామిడి సాగు చేసిన రైతుకు ముందు చూపు అవసరం. మామిడి తోటల్లో సరైన యాజమాన్యం పాటించి సాగు చేస్తూ, మామిడి పూత, కాత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సా ధ్యం. మామిడి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే చిట్కాలు, నవంబర్లో రైతులు పాటించాల్సిన పద్ధతులను మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారి సౌమ్య వివరించారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు, చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడుల్లో తగ్గుదల, నాణ్యత తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు అవగాహన లేమితో తమకు తోచిన విధంగా సేద్యం పనులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. నవంబర్లో మామిడి రైతులు చేపట్టాల్సిన, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఇవీ. చేయాల్సిన పని ఈ నెలలో చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయరాదు. ముఖ్యంగా ఈ నెలలో రైతులు ఎలాంటి కత్తిరింపులు చేపట్టకూడదు. నీటిని కూడా వదలొద్దు. ఒక్కోసారి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. వాటిని ఉత్తేజ పరిచి పూత త్వరగా రావడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ కింది పద్ధతులు పాటించాలి. నీటి వసతి ఉన్న తోటల్లో తేలికపాటి తడి ఇవ్వడం లేదా లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం, నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు వస్తాయి. సస్యరక్షణ తప్పనిసరి మామిడి పూతకు ముందు, పూత సమయం, కాయ ఎదిగే దశలో అనేక రకాల పురగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. అలాగే సరైన నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం సరిగా చేపట్టని తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోయి, కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. దీని నివారణకు కింది జాగ్రత్తలు పాటించాలి. బూడిద తెగులు లేత ఆకులు, పూత, కాండాలను, పూల మీద, చిరుపిందెల మీద, తెల్లని పౌడరు లాంటి బూజు రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి. నివారణ మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం(నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేయాలి పూత దశలో తెగులు కనిపించిన హెక్సాకోన జోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా డినోకాప్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు చొప్పున నీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ/పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు వర్షాలు/పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. ఈ తెగులు లేత ఆకులు, పూలు, పండ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పోయి ఆకు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. నివారణ పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి. సూర్యరశ్మి సోకేలా కొమ్మలను జూన్, జూలై మాసంలో కత్తిరింపులు చేసి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. పూతకు ముందే 3 గ్రాముల కాపర్ ఆక్సీ ఫ్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్, మిథైల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మండోజెల్ లేదా రెండు గ్రాముల ఆంట్రాకాల్ కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగులు తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు, పూత మాడిపోతాయి. పిందెలు ఏర్పడవు, ఏర్పడినా బలహీనంగా ఉండి రాలి పోతాయి. అంతేకాకుండా తేనెలాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జింజడం వల్ల ఆకులు, కాండాలు, కాయలపై మసి పొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణ జన్య సంయోజన క్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి, నాణ్యత కోల్పోతాయి. నివారణ పూత మొగ్గ దశలో : లీటరు నీటికి 1 మిల్లీలీటరు డైక్లోరోఫాస్ లేదా 3 గ్రాముల కార్బోరిల్ కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేయాలి. పచ్చపూత దశ : పూత కాండలు బయటకు వచ్చి, పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయాలి. నల్లపూత దశ : ఈ దశలో పిందెలు బఠాణి గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. లీటరు నీటికి ఒక మిల్లీలీటరు పాస్పోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా గ్రాము ఎఫిసేట్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పురుగులు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై గోకి బయటకు వచ్చి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి గ్రాము ఎఫిసేట్ లేదా 1 మిల్లీలీటరు పాసోమిడాన్ లేదా 2 మిల్లీలీటరు రిజెంటును కలిపి పిచికారీ చేయాలి. -
వర్షంతో పెరిగిన ఉక్కపోత
సాక్షి, ముంబై: నగరంలో రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షంవల్ల ముంబైకర్లు హైరానా పడుతున్నారు. ఒకపక్క చలి పత్తాలేకుండా పోయింది. మరోపక్క ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కాని రెండు రోజులుగా ఆకాశమంత మబ్బులు కమ్ముకుని ఉండడంతో వాతావరణం చల్లబడి చలి వేస్తుండవచ్చని అందరూ భావించారు. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చలి వేయకపోగా ఉక్కపోత మాత్రం రెట్టింపు అయింది. శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదగా, జారుడుగా మారాయి. వర్షా కాలం ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోన్నా ఇంతవరకు చలి పత్తాలేకుండా పోయింది. ఉక్కపోత కారణంగా ఇళ్లలో, కార్యాలయాల్లో ఫ్యాన్లు, ఏసీలు యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి తోటల్లో పూత నేల రాలడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మామిడితోపాటు పత్తి, కందిపప్పు, బత్తాయి, ఉల్లి, ద్రాక్ష పంటలకు నష్టం వాటిల్లగా, మరికొన్ని పంటలకు మేలు జరిగింది. నాసిక్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ద్రాక్ష, ఉల్లి, దానిమ్మ తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈదురు గాలులవల్ల పండ్ల తోటలకు దాదాపు రూ.మూడు కోట్ల మేర నష్టం చేకూరిందని రైతులు చెబుతున్నారు. షోలాపూర్ గ్రామీణ ప్రాంతాల్లో నేలలో నాటిన జొన్న, ఉల్లి, వెల్లుల్లి విత్తనాలు గాలికి చెల్లాచెదురయ్యాయి. దీంతో రైతులు నేలను మళ్లీ సాగుచేసి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పంటలకు ఈ అకాల వర్షాలు వరంగా పరిణమించాయని రైతులు చెబుతున్నారు. -
నలుగురు దోపిడీ దొంగల అరెస్టు
విజయనగరం క్రైం: స్థానిక ఆంధ్రా యూ నివర్సిటీ స్టడీ సర్కిల్ సమీపంలోని తోట లో ఓ వ్యక్తి వద్ద నుంచి 20 లక్షలు దోచుకుని ఉడాయించిన వ్యక్తులను అ రెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒకటో ప ట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 29న పట్టణంలోని గాజులరేగ సమీపంలోని మామిడితోటలో హైదరాబాద్ లక్డీకపూల్కు చెందిన కొనిశెట్టి సుబ్బారావు సొత్తు 20 లక్షలను కొందరు వ్యక్తులు దోచుకువెళ్లారని తెలిపారు. సుబ్బారావుకు విజయవాడకు చెందిన మీనా శివ అనే మధ్యవర్తి... జగదీష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు బంగారం ఉందని చెప్పి, రూ.20లక్షలు తేవాలని ఆశ పెట్టాడని, దీంతో ఈ నెల 29న గాజులరేగ మామిడితోట వద్దకు సుబ్బారావుతోపాటు శి వ, గుమ్మలక్ష్మీపురం మండలం రెళ్ల గ్రా మానికి చెందిన గంటా జగదీష్ అలి యాస్ జగన్ చేరుకున్నట్లు పేర్కొన్నారు. బంగారం విషయం మాట్లాడుకుందామనే సమయానికి ముందే పక్కా ప్ర ణాళికతో ఉన్న బొబ్బిలికి చెందిన యాగిరెడ్డి చిట్టినాయుడు, కాటవీధికి చెందిన రియాజ్, కాటవీధికి చెందిన పొందూరి బాబ్జి, కోరాడ వీధికి చెందిన ఇస్మాయిల్, సీతానగరం మండలం పులిగు మ్మి గ్రామానికి చెందిన వెంకటరమణ, పార్వతీపురానికి చెందిన కౌసల్య ప్రసాద్లు తోటలోకి వచ్చి సుబ్బారావు, శివలను కొట్టి రూ. 20లక్షల నగదును దోచుకెళ్లారన్నారు. వీరి వెనుకనే జగదీష్ పా రిపోయాడని తెలిపారు. సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద గంటా జగదీష్ అలి యాస్ జగన్ను పట్టుకుని అతడి వద్దను న్న రూ.15,13,100, యాగిరెడ్డి చిట్టినాయుడును పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాబ్జిని పట్టుకుని *12,200, ఇస్మాయిల్ను పట్టుకుని *11,700 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని కూడా పట్టుకుని సొమ్ము స్వాధీ నం చేసుకుంటామని తెలిపారు. కౌసల్య ప్రసాద్, చిట్టినాయుడు పాత నేరస్తులని తెలిపారు. వీరిపై పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. వీరిపై రౌ డీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుబ్బారావు అత్యాశకు వెళ్లడం వల్లనే ఇది జరిగిందన్నారు. జగదీష్ బంగారం పూత పూసిన బిస్కట్లు తెచ్చి మోసం చేయడానికి ప్రయత్నించారని వివరించా రు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కె.రామారావు, టూటౌన్ ఎస్ఐలు శ్రీధర్, కృష్ణకిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజుగాడు
ఉదయాన్నే... అంటే మరీ ఉదయాన్నే కాదు. ఇంట్లోవాళ్లు లేపగా లేపగా, దుప్పటి లాగగా లాగగా, చివరకు ముఖాన నీళ్లు కొట్టించుకున్న తర్వాత లేస్తే, వెంటనే పనులు! ఏదో నూతిలో నాలుగు బిందెలు నీళ్లు తోడామా, ఐదో బిందె ఒంటిమీద పోసుకుని దానికి స్నానం అని పేరు పెట్టామా, ఇంట్లో పనులు ఎగ్గొట్టడానికి ఒక గంట ముందే హైస్కూల్కి బయల్దేరామా అన్నదే జీవితం. అయినా ఒక్కోసారి తప్పేది కాదు. గేదెలకు నీళ్లు పట్టడం, వాటి దగ్గర పేడ ఎత్తడం, పాలు పితకడం... ఇలా వయసుకు మించిన పనులు. పెద్దోళ్ల దృష్టిలో బాధ్యత. ఇంట్లో అందరినీ పనికి పంపి నన్నొక్కడినే బడికి పంపిస్తున్నందుకు నిర్వర్తించాల్సిన బాధ్యత. దాని పేరు చేయిసాయం (ఎన్నాళ్లయిందీ మాట విని). ఆ రోజు పొద్దున్నే పాలకేంద్రానికి పాలు తీసుకెళుతున్నా. సరిగ్గా ఆయీది పెద్దమ్మగారి ఇంటి వరకు వెళ్లేసరికి ఎదురుగా వచ్చాడు. ముఖంలోకి కళ్లు పెట్టి ఏదో తెలిసిన ముఖంలా చూశాడు. నాకు అర్థం కాలేదు. పక్కకు తప్పుకోమన్నా వినలేదు. తప్పించుకు వెళుతుంటే భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్టు, వాడు నా చుట్టూ తిరిగి మళ్లా నా ముందుకే వచ్చి అడ్డగిస్తున్నాడు. మా వీధిలో ఇలాంటి వాళ్ల పరాచికాలు మామూలే కానీ, మరీ కాస్త చనువెక్కువైనట్టుగా అనిపించింది. నాకు ఒక్క క్షణం వళ్లు మండింది. కోపంలో నుంచి ఆలోచన పుట్టింది. అప్పటివరకు నా ముందు ఉన్న అడ్డంకిని మాత్రమే చూసిన నేను, వాడి కళ్లలోకి చూశాను. ఏదో తెలిసిన ముఖం, ఎక్కడో పరిచయం, ప్చ్... పరిచయం కాదు బంధమే అనిపించింది. అరే... కొంపదీసి మన రాజుగాడు కాదు కదా అనే సందేహం కలిగింది. పిలిస్తే పోలా! ‘అరే రాజుగా...’ అన్నాను అనుమానంగా. అంతే! ఒక్కసారిగా ఎగిరి గంతేసి నన్ను అల్లుకున్నాడు. నా కాళ్లకు బంధం వేసినంత పనిచేశాడు. నా గుండెలమీద తడిచేస్తూ ఏదో రాసే ప్రయత్నం చేశాడు. డౌటే లేదు వాడు రాజుగాడే. వాడి ఆరాటం చూస్తే, నా కళ్లు చెమర్చాయి. పాలకేను పక్కనపెట్టి వాడిని తనివితీరా మరోసారి చూశాను. తల నిమిరాను. నేను గుర్తించినందుకు సంతోషమో, వాడు నన్ను కలిసినందుకు ఆనందమో తెలియదు గానీ, ఆ క్షణం నా ముందు మోకరిల్లాడు. ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ భావోద్వేగాలు తట్టుకోలేక, వాడికి నచ్చిన డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులన్నీ నాకు గుర్తుచేసే ప్రయత్నంలో మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. అప్పటికే వాడు బాగా బక్కచిక్కిపోయాడు. కొత్త ప్రదేశం. ఎన్ని అడ్డంకులు దాటుకుని వచ్చాడో వాడి వళ్లు చూస్తేనే అర్థమవుతోంది. అసలే ఊరికి కొత్త ముఖం. ఎంతమంది దాడిచేసి ఉంటారు. ఎన్ని ప్రమాదాలు తప్పించుకుని ఉంటాడు. రాజుగాడు కాబట్టి రాగలిగాడు అనిపించింది. ముందు వాడిని ఇంటికి తీసుకెళ్లాలి. తర్వాతే పాలకేంద్రానికి. వెనక్కి తిరిగాను. ఒక్కసారి మళ్లీ ‘రాజూ..!’ అన్నాను. అప్పటికే వాడు నాకంటే రెండడుగులు ముందున్నాడు. వెనకుండి ముందుకు నడిపించే రకం కాదు వాడు. ముందుండి నడిపించే నికార్సయిన రకం. ఇంటికి వెళ్లగానే ఎదురుగా అన్నయ్య, నాన్నలను చూశాడు. ఒక్కసారిగా వాడికి వచ్చిన ఒక విషాద రాగంలో గద్గద స్వరాన్ని వినిపిస్తూ నాన్నను హత్తుకున్నాడు. తప్పిపోయిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు నాన్న. గారాముగా వాడిని దగ్గరకు తీసుకుని ‘ఎలా ఉన్నావురా? ఏమైపోయావ్ ఇన్నాళ్లూ...’ అంటూ కుశలం అడిగాడు. అన్నింటికీ రాజుగాడిది ఒకటే సమాధానం. రిథమ్లో సాగే వినసొంపైన సంగీతంలా ఉంటుంది వాడూ వాడి మాటా, వాడి మూలుగూ. పావలా ఇస్తే గానీ, బడికి వెళ్లని నాతోనే అలా ఉన్నవాడు, పావలా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే నాన్నతో ఎలా ఉంటాడో చెప్పాలా! పైగా వాడు లాజిక్కు, మేజిక్కులతో పనిలేకుండా బతికే రకం. నాన్నను చుట్టేశాడు. చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. ఇంతలో అన్నయ్య పిలుపు వినపడింది. ఆళ్లిద్దరి అనుబంధం గురించే చెప్పుకోవాలిక. అబ్బో! అదో పెద్ద ముత్యాలసుబ్బయ్య సినిమా. ఒకరిని చూడకుండా ఒకరు ఉండేవాళ్లు కాదు. రాజా... అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు. ఏడెకరాల మామిడితోటలో ఏ మూలన ఉన్నా నాలుగు ఉరుకుల్లో ఎదురుగా నిలబడేవాడు. ఆడుంటే చాలు, ఏడెకరాల తోటకూ ఏడున్నరడుగుల మనిషి కంటే పెద్ద కాపలా! వెయ్యి కోతులు కలిసి మందగా వచ్చినా, ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు. మామిడితోట కాపు అయిపోయి అప్పటికే ఆరునెలలు దాటిపోయింది. మేమంతా తోట ఖాళీ చేసి వస్తున్నప్పుడు తప్పిపోయిన రాజుగాడు ఇన్నాళ్లకు మళ్లీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అన్నయ్యను తనివితీరా హత్తుకున్నాడు. ఏదో తన బాధలు, ఆనందాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హమ్మయ్యా! నా పని అయిపోయింది అనుకుంటూ మళ్లీ పాలకేంద్రానికి బయల్దేరా.సరిగ్గా వారం గడిచింది. రాజుగాడు మా ఇంట్లోనే ఉన్నాడు. అందరికీ ఆ తోటలో గడిపిన రోజులు గుర్తుచేస్తున్నాడు. రోజూ వీధిలో తన సాటివాళ్లతో ఒకటే గొడవలు, అరుపులు. అయినా సరే... నాన్న మాట దాటి ఒక్క అడుగు ముందుకు వేయకుండా అలా వీధి అరుగుమీదే కాలక్షేపం చేస్తున్నాడు. ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు. ఒకరోజు పొద్దున్నే రాజుగాడి సడిలేదు. ఉన్నాడా అంటే ఉన్నాడంతే. తొలి కోడి సడిచేశాక... తెల్లారి సూర్యుడు సడిచేశాక... పక్షులు సడిచేశాక... పశువులు సడిచేశాక కూడా ఇంట్లో ఉన్నవాళ్ల సడిలేకపోతే నాన్న అస్సలు భరించలేడు. ‘రాజూ’ ‘రాజూ’ అంటూ పిలిచాడు. అయినా సడిలేదు. రెండో మారు కాదు కదా... వాడి పేరులో రెండో అక్షరం కూడా పూర్తికాకుండా వచ్చి వాలిపోయే గుణం వాడిది. అయినా జాడలేదు. నాన్న వెంటనే వీధి అరుగు మీదకు వెళ్లి చూశాడు. ఒకటే వాసన... ఏదో తెలియని ఒక దుర్గంధం. రాజుగాడు కదల్లేకుండా పడుకున్నాడు. దగ్గరగా వెళ్లిన నాన్న వెంటనే అమ్మను ఒక్క గసురుగా పిలిచాడు. ఆ భయానికి నేను కూడా వెళ్లాను. అప్పటికే రాజుగాడి తల నాన్న ఒడిలో ఉంది. తలపై ఏదో గాయం లాంటిది కానీ తగిలిన దెబ్బ కాదు. ఏదో మాయరోగం. తిన్నగా లోపలి సరుకంతా కనిపిస్తోన్నంత గాయం. నాన్న వాడిని బుజ్జగిస్తున్నాడు. ఆ నొప్పి తెలిసి ఓదారుస్తున్నాడు. రాజుగాడి కళ్లంట నీళ్లు కారుతున్నాయి. చాలాకాలం తర్వాత వారం క్రితం వాడు మమ్మల్ని కలుసుకున్నప్పుడు కారిన నీళ్లు కావవి. కచ్చితంగా కన్నీళ్లే. పట్టరాని బాధ ఏదో ప్రాణం పిండుతుంటే వచ్చే కన్నీళ్లవి. వాడి ముఖం చూస్తే దుఃఖమొస్తున్నా ముక్కు మూసుకోకుండా ఉండలేకపోయాను. ఇంతలో అన్నయ్య వచ్చాడు. ‘అయ్యో ఏదో మాయదారి జబ్బు అంటుకున్నట్టుంది’ అన్నాడు. ఆ వాసన భరించలేక ముక్కు ముందు అరచేతిని అటూ ఇటూ ఆడించాడు. ఇక రాజుగాడు బతకడని అన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వాణ్ని ఆ స్థితిలో చూడలేక, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాన్న మాత్రం రాజుగాడికి సపర్యలు చేస్తూ అమ్మతో ఏదో చెప్పాడు. ఆయనకు ప్రకృతి వైద్యం బాగా తెలుసు. మొత్తానికి ఒక మందు తయారుచేశాడు. ప్రతిరోజు నాన్నే రాజుగాడికి మందు పూసేవాడు. ఆ సమయంలో తన చేతుల్ని డాక్టర్ కంటే పరిశుభ్రంగా ఉంచుకునేవాడు. ఇంకెవ్వరినీ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి వాడి ఆరోగ్యం చెక్ చేసుకుని... మధ్యరాత్రి మళ్లీ ఒకసారి లేచి మందు రాసేవాడు. సరిగ్గా రెండు వారాలు గడిచింది. మేమంతా ఆశ్చర్యపోయాం. నెత్తిమీద చిల్లు పూడుకుపోయింది. రాజుగాడు మళ్లీ మామూలైపోయాడు. నాన్న ముందు ఎప్పుడూ రాముడు ముందు హనుమంతుడిలా నిలబడేవాడు. నిత్యం ఆ కళ్లలో నాన్నకు నమస్కరిస్తున్న చెమ్మ కనిపించేది. అలా కోలుకున్నాక, రాజుగాడు నాలుగేళ్లు బతికాడు. ఆ నాలుగేళ్లలో వాణ్ని ఎప్పుడు దగ్గరగా చూసినా నాన్నకు భజన చేస్తున్న భక్తుడిలా, నాన్న రుణం తీర్చుకోవడానికి బతుకుతున్నవాడిలా కనిపించేవాడు. వాడు ఇక లేడు అన్న క్షణాన మాత్రం నాన్న కళ్లలో మొదటిసారి నీళ్లు చూశాను. తట్టుకోలేకపోయాడు. బతుకుతున్న ప్రాణం కంటే, బతికించుకున్న ప్రాణం పోయినప్పుడు కలిగే బాధ ఎక్కువ. ఏం చేశాం మేం రాజుగాడికి? నెలలో పాతికసార్లు మేము అన్నం తినగా మిగిలిన గంజి పోశాం. కంచంలో పెట్టించుకున్న అన్నమంతా తినలేనప్పుడు ఆ నాలుగు మెతుకులు రాతిచిప్పలో వేసేవాళ్లం. అన్నయ్యకు నాకు బోర్కొట్టిన ప్రతిసారీ ‘ఒరేయ్ రాజూ..!’ అని ప్రేమగా పిలిచి కాసేపు ఆడుకునేవాళ్లం. నాన్న ఒక్కడే తను తినే ముద్దలో కాస్త పంచి పెట్టేవాడు. ఈమాత్రం దానికి ఆ రాజుగాడు మాకు ఎంత చేశాడని! ఊరు చివర అడవి చెంతన తోట మధ్యలో పిల్లా పాపలతో ఉన్న మా కుటుంబం మొత్తాన్ని రాత్రంతా కాపలా కాసేవాడు. తోటలోకి ఒక కోతి రాకుండా, ఒక దొంగ రాకుండా రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాసేవాడు. నాకైతే వాడెప్పుడూ జూలు విదిల్చిన సింహంలా కనిపించేవాడు. అయినా సరే మాకు కోపమొచ్చి కొడితే తోకాడించుకుంటూ పడేవాడు. ముద్దుగా మూలిగేవాడు. చివరికి వాణ్ని మర్చిపోయి వచ్చేసినా ప్రాణాలకు తెగించి మమ్మల్ని వెతుక్కుంటూ ఊళ్లోకొచ్చాడు. రాజుగాడు చనిపోయాక నాన్న ఒక్కటే మాటన్నాడు. నాతో వైద్యం చేయించుకోవడానికే వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడ్రా అని. ఆ మాట విన్నప్పుడు మా కుటుంబం మొత్తానికి కళ్లు చెమర్చాయి. నిజంగా రాజుగాడు మనిషి కాదు. మనిషిని చదివినవాడు. మనసెరిగినవాడు. సృష్టి ధర్మంగా వచ్చిన పేరు కాబట్టి తప్పదు కానీ, వాణ్ని ‘కుక్క’ అనాలంటే ఇప్పటికీ నాకు మనసొప్పదు. తిడుతున్నట్టుగా, కించపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనిషిగా నన్ను నేను తక్కువ చేసుకుంటున్న భావన కలుగుతుంది. బహుశా! అంత విశ్వాసం మనుషుల్లో చూడకపోవడం వల్ల కావచ్చు! రాజుగాడిని మాత్రం చేతులు జోడించి అడుగుతున్నా క్షమించమని! తప్పనిసరై ఇలా ఒక్కసారి తన జన్మను గుర్తుచేసినందుకు కాదు... ఇన్నాళ్లూ వాడిని గుర్తుచేసుకోనందుకు! సారీ రా రాజుగా. - పూడి శ్రీనివాసరావు -
మామిడి.. మాగాణి!
కరువు సీమలో కొత్తదారి మామిడిలో అంతర పంటగా డ్రిప్ ద్వారా వరి సాగు అరెకరానికి సరిపోయే సాగు నీటితో రెండెకరాల్లోసాగు అది రాయలసీమ.. అందులోనూ కరువు ముంచుకొచ్చి వర్షాకాలంలో వాతావరణం ఎండాకాలం మాదిరిగా తయారైంది.. అయినా మడమ తిప్పని వీరులు అన్నదాతలు. సంక్షోభం పడగెత్తినా చెమటోడ్చి పంటలు పండించే దారులను రైతులు నిరంతరం వెతుకుతూనే ఉంటారు. అవసరం తోసుకొచ్చినప్పుడే ధైర్యంగా నిలబడి.. ఆలోచనకు పదునుపెట్టి పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి. చిత్తూరు జిల్లాలో కొందరు అభ్యుదయ రైతులు ఇదే పని చేస్తున్నారు. మామిడి తోటలో డ్రిప్ ద్వారా వరిని సాగు చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. భారతీయుల రోజువారీ ఆహారంలో అన్నం ముఖ్యమైనది. ఆ మాటకొస్తే ఆసియా ఖండంలోనే వరి ప్రధానమైన ఆహార పంట. వరి మెతుకులు ఉడకని పొయ్యి ఒకటి కూడా లేని పరిస్థితి. మెతుకు ఉడకాలంటే మేఘం కురవాలి. ఐరావతానికి ఆకలెక్కువ.. వరి పంటకు దాహమెక్కువ అంటారు పెద్దలు. భూగర్భ జలాలు అడుగంటి పోతూ కాలాలు తారుమారవుతున్న పరిస్థితిలో మిన్ను కురిసేది.. మన్ను పండేదీ అంతుపట్టని అయోమయంగా మారింది రైతుకు. కిలో ముడి ధాన్యం పండి చేతికి రావాలంటే 2,672 లీటర్ల నీరు ఖర్చవుతోందని అంచనా. వరి నీటి మొక్క కానప్పటికీ పొలంలో వచ్చే కలుపును అదుపులో ఉంచడానికి నిలువ నీటిలో సాగు చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య రైతాంగం ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడ్లు ఎదబెట్టి సాగు చేయడం, ఆరుతడి పంటగా నాట్లు వేయడం కూడా కొనసాగుతోంది. అయితే, సాగు నీటికి కటకటగా ఉంటున్నందున మామూలుగా నీరు పారించే సాగు విధానం రైతుకు బ్రహ్మ ప్రళయమౌతోంది. ఈ పరిస్థితిని అధిగమించ డానికి సూక్ష్మ నీటిపారుదల పద్ధతిని కూడా కొందరు రైతులు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్నారు. సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండే రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని పలువురు రైతులు డ్రిప్పు ద్వారా వరి పంటను విజయవంతంగా సాగుచేసి సత్ఫలితాలు సాధించారు. వారి అనుభవం తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్ఫూర్తిదా యకంగా నిలుస్తుంది. రామకుప్పం మండలం మిట్టపల్లికి చెందిన రైతు సోదరులు సుబ్రమణ్యం (93928 71887), ఆంజనేయప్ప నీటిని నిల్వగట్టే పద్ధతికి స్వస్తి చెప్పి డ్రిప్ ద్వారా వరి సాగు చేపట్టి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ‘బోరు వెరుు్య అడుగులు వేసినా నీటి జాడ కానరావడం లేదు. వరి సాగుకు అవసరమైన నీరు అందుబాటులో లేదు. ఒక వేళ మొండికేసి సాగు చేసినా పంట చేతికందుతుందనే ఆశలేదు. అందుకే సూక్ష్మ సేద్యం వైపు చూస్తున్నాం. 2012లో డ్రిప్ పరికరాలను సమకూర్చుకున్నాం. బంగాళ దుంప సాగు కోసం పొలాన్ని దుక్కి చేశాం. ఆ సమయంలో వర్షం రావడంతో సాగుకు అంతరాయం ఏర్పడింది. అదే పొలంలో వరి సాగు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. 50 సెంట్ల (అరెకరం) పొలంలో డ్రిప్ ద్వారా వరి సాగు చేశాం. 15 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది’అని వారు వివరించారు. సాధారణ పద్ధతిలో అర ఎకరాకు అవసరమయ్యే నీటితో డ్రిప్పు ద్వారా రెండు ఎకరాల్లో వరి పండించవచ్చని రుజువు చేశారీ సోదరులు. సుబ్రమణ్యం, ఆంజనే యప్పల స్ఫూర్తితో గత ఏడాది శాంతిపురం మండలం 121 పెద్దూరులో కృష్ణారెడ్డి బిందు సేద్యం ద్వారా ఎకరాకు 52 బస్తాల ధాన్యం దిగుబడి సాధించడం విశేషం. మామిడి తోటలో మొక్కల మధ్య చాలా స్థలం ఖాళీగా ఉండిపోతుంది. ఈ స్థలాన్ని అంతర పంటలకు ఉపయోగించుకోవడం తెలిసిన పద్ధతే. అయితే, రామకుప్పం మండలం సగినేకుప్పం గ్రామానికి చెందిన రైతులు సుకుమార్రెడ్డి, రాజారెడ్డి, వెంకట మునెప్ప మరో అడుగు ముందుకేసి.. ప్రయోగాత్మకంగా తమ మామిడి తోటల్లో డ్రిప్పు ద్వారా వరి సాగు చేపట్టారు. గత ఏడాది మామిడి తోటలోని 70 సెంట్ల విస్తీర్ణంలో డ్రిప్ పద్ధతిలో వరి సాగు చేసి 20 బస్తాల దిగుబడి పొందారు. బోరు 2 అంగుళాల నీరు పోస్తున్నది. ఈ భరోసాతో నెల క్రితం 50 సెంట్ల విస్తీర్ణంలో 3 కిలోల సోనా మసూరి విత్తనాలను నేరుగా విత్తారు. వరి సాగు వల్ల నేలలో తేమ త్వరగా ఆరిపోకుండా ఉంటున్నదని, మామిడి మొక్కలకూ ఎంతో మేలు జరుగుతోందంటున్నారు సుకుమార్రెడ్డి. -కె.సుబ్రమణ్యంరెడ్డి, రామకుప్పం, చిత్తూరు జిల్లా వత్తుగా విత్తితే కలుపు తగ్గింది! గత ఏడాది డ్రిప్ లేటరల్కు అటొక రెండు సాళ్లు, ఇటొక రెండు సాళ్లలో వరి విత్తులు నాటాం. ఎక్కువ ఖాళీ ఉండడంతో కలుపు బాగా పెరిగింది. ఈ ఏడాది అటు 4, ఇటు 4 సాళ్లు వత్తుగా నాటాం. మొక్కల మధ్య 5-6 అంగుళాల దూరం పెట్టాం. కలుపు సమస్య తోపాటు ఖర్చూ తగ్గింది. నెలరోజుల పంట 6 అంగుళాలు పెరిగి దుబ్బుకు 20-30 పిల కలు వేసింది. సర్కారు ప్రోత్సహించాలి. - సుకుమార్రెడ్డి(8186810635), మిట్టపల్లి, రామకుప్పం మం., చిత్తూరు జిల్లా డ్రిప్తో వరి సాగు ఇలా.. మామిడి తోటలో డ్రిప్ పద్ధతిలో వరి సాగు చేస్తున్న సుకుమార్రెడ్డి ఇలా చెబుతున్నారు.. సన్న రకాలు, బీపీటీ, సోనావుసూరి, జయు, హంస.. వంటి ఏ రకం వరి విత్తనాలనైనా ఈ పద్ధతిలో విత్తుకోవచ్చు. వుుందుగా వరి సాగుకు ఎంపిక చేసుకున్న పొలాన్ని చక్కగా దుక్కి చేయించాలి. అరెకరానికి ఒక ట్రాక్టర్ లోడు చొప్పున పశువుల ఎరువు, పరిమితంగా రసాయనిక ఎరువులు వేసి లోతుగా కలియుదున్నాలి. ఆఖరు దుక్కిలో భాగంగా రొటోవేటర్ను ఉపయోగించి పొలాన్ని బాగా దుక్కిచేయాలి. తద్వారా పొలం మెత్తగా ఉండి విత్తనాలు మొలకెత్తేందుకు అనువుగా ఉంటుంది. తర్వాత 3 అడుగుల దూరంలో డ్రిప్ లేటరల్ పైపులు వేయాలి. దుక్కి సిద్ధం చేసుకున్న తర్వాత డ్రిప్ పైపునకు ఇరువైపులా 4 వరుసలుగా విత్తనాలు వేసుకోవాలి. సాళ్ల మధ్య 9 అంగుళాల దూరం పాటించాలి. మొక్కల మధ్య ఐదారు అంగుళాల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. విత్తినప్పటి నుంచి మొలకెత్తే వరకు క్రమం తప్పకుండా డ్రిప్పు ద్వారా నీరందించాలి. మొలకెత్తిన తర్వాత కలుపు నివారించడానికి సాళ్ల మధ్య రోటో వీడర్ తోలుకోవాలి. కలుపు మరీ ఎక్కువగా ఉంటే 2-4 డీ వంటి కలుపు నివారణ వుందులు పిచికారీ చేసుకోవాలి. వరి పైరు ఎదిగే సవుయుంలో కొద్ది మోతాదులో యుూరియూను చల్లుకోవాలి. లేటరల్కు ఇరువైపుల వరుసల్లో వరి దుబ్బుల వేర్లు తడిసే విధంగా నీరందించాలి. నేల తడి ఆరిపోకముందే క్రమం తప్పకుండా నీరందిస్తుండాలి. నేల స్వభావాన్ని బట్టి నీరు ఎన్ని రోజుల వ్యవధిలో, ఎంత సమయం ఇవ్వాలనేది రైతు స్వయంగా నిర్ణయిం చుకోవచ్చు. రోటో వీడర్ వలన నేల కదలబారి.. వేరు వ్యవస్థ బలపడి.. త్వరగా పిలకలు వేసి దుబ్బు కడుతుంది. సిఫారసు చేసిన మోతాదు మేరకు ఎరువులు వాడుకోవాలి. పైపాటుగా పంచగవ్య, జీవామృతం పిచికారీ చేసుకుంటే మొక్క బెట్ట పరిస్థితిని తట్టుకోవడమే కాక నేల గుల్లబా రుతుంది. కాలానుగుణంగా పరిశీలించి చీడ పీడలను అదుపు చేసుకుంటే మంచి దిగుబడులు అందుకోవచ్చు. -
‘మేమూ అదే చెట్టుకు ఉరేసుకుంటాం’
బదౌన్: కోర్టులో తమకు న్యాయం జరగకపోతే తమ కూతుర్లు ఉరితో వేలాడిన మామిడి చెట్టుకే తామూ ఉరివేసుకుంటామని ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అత్యాచారం, హత్యకు గురైన ఇద్దరు బాలికల్లో ఒకరి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సీడీఎఫ్డీ నుంచి అందిన డీఎన్ఏ నివేదిక ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాలేదని సీబీఐ వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు ధ్వంసం చేశారని, సీబీఐ కూడా యూపీ పోలీసుల కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. -
అందని మామిడి పండు పుల్లన..
జాంబియాలోని లువాంగ్వా జాతీయ పార్కు.. ఓ పిల్లేనుగుకి ఆకలేసింది.. బద్దకంగా లేచి.. ఆహారం కోసం బయల్దేరింది. దారిలో మామిడి చెట్టు.. నోరూరించే మామిడి పళ్లు.. ట్రై చేసింది.. అందలేదు.. చివరికి సర్కస్ ఏనుగు స్థాయిలో రెండు కాళ్లు గాలిలోకి లేపి.. ఫీట్లు చేసింది. అబ్బే.. అందితేగా.. దీంతో మనం చదువుకున్న కథలో నక్క బావలాగే.. అందని మామిడి పండు పుల్లన అనుకుంటూ నిట్టూర్చింది. పై కథకు సరిపోయేలా ఉన్న ఈ అద్భుతమైన చిత్రాన్ని తీసింది బ్రిటన్కు చెందిన ల్యూక్ మస్సే అనే ఫొటోగ్రాఫర్. దాదాపు రెండు వారాలపాటు లువాంగ్వా జాతీయ పార్కులో ఉండి.. ఇలాంటివెన్నో అద్భుత చిత్రాలను క్లిక్మనిపించారు. -
ఇక టెంక లేని మామిడి!
పాట్నా: టెంక లేని మామిడి పండును ఊహించుకోండి! ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని రుచిని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు కదూ!! త్వరలోనే ఈ కొత్త రకం మామిడి అందుబాటులోకి రానుంది. అది కూడా మరింత తీయగా, సరికొత్త రుచితో ఆకట్టుకోనుంది. భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు ఈ కొత్త రకాన్ని అభివృద్ధి పరిచారు. ఈ వెరైటీ పేరు సింధు. రత్నా, ఆల్ఫోన్సో హైబ్రిడ్ రకాల నుంచి దీన్ని సృష్టించారు. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పరిశోధనలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సగటున 200 గ్రాముల బరువుండే ఈ రకం మామిడిలో.. ఇతర వెరైటీల్లో కన్నా తక్కువ ఫైబర్ ఉంటుందట! సింధు రకాన్ని ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు లేదా తోటలు వేసి పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తి చేయవచ్చని తమ పరిశోధనల్లో నిర్ధారించామని బీఏయూ ఉద్యానవన విభాగం చైర్మన్ వి.బి. పటేల్ తెలిపారు. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిజానికి సింధు రకాన్ని మహారాష్ర్టలోని కొంకణ్ ప్రాంతంలో ఉన్న కొంకణ్ కృషి విద్యాపీఠ్ ప్రాంతీయ పండ్ల పరిశోధనా కేంద్రంలో తొలుత అభివృద్ధి పరిచినట్లు పటేల్ వివరించారు. అక్కడి మూడేళ్ల వయసున్న సింధు రకం మామిడి చెట్టు ఈసారి విరగ కాసిందని పేర్కొన్నారు. వచ్చే సీజన్లోనే ఈ వెరైటీని బీహార్లోని మామిడి రైతులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
టెంక లేని మామిడిపళ్లు!!
మామిడిపళ్లు.. తలుచుకుంటేనే నోరు ఊరుతుంది కదూ. కానీ, రసం మామిడిపళ్లు తినాలంటే మధ్యలో పెద్ద టెంక ఉంటుంది. అది లేకుండా మొత్తం అంతా రసమే ఉంటే ఎంతో బాగుంటుంది కదూ. సరిగ్గా ఇదే ఆలోచన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిందే తడవుగా వాళ్లు పరిశోధనలు మొదలుపెట్టారు. గింజలు లేని ద్రాక్షపళ్లను సృష్టించినప్పుడు.. టెంకలు లేని మామిడిపళ్లు సాధ్యం కాదా అనుకున్నారు. అంతే.. తియ్యటి మధురమైన రసాలూరే టెంకలేని మామిడిపండు సిద్ధం అయిపోయింది. రత్న, ఆల్ఫోన్సో (కలెక్టర్) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో ఈ కొత్త మామిడిపండును రూపొందించినట్లు బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానశాఖ ఛైర్మన్ వీబీ పటేల్ తెలిపారు. ఈ కొత్త రకానికి సింధు అనే పేరు పెట్టారు. దీన్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నాటి.. ఫలితాలు ఒకే రకంగా వస్తున్నాయో లేవోనని చూస్తున్నారు. భారీగా తోటల్లో వేయడంతో పాటు ఇళ్లలో వేసినా ఒకే రకం రుచి వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు. సగటున ఒక్కో పండు 200 గ్రాములు తూగుతుందని, ఇతర రకాల కంటే దీంట్లో పీచు తక్కువగా ఉంటుందని పటేల్ చెప్పారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్లో దీన్ని రూపొందించారు. దీని పంట కూడా ఇతర మామిడి రకాల్లా వేసవిలో కాకుండా జూలై మధ్యవారంలో వస్తుందట. 2015 నాటికల్లా రైతులకు ఈ సింధు రకం మామిడి మొక్కలను అందిస్తామని చెబుతున్నారు. -
కరువు వ్యథ
ప్రమాదకర స్థాయికి పడిపోయిన భూగర్భజలాలు వెయ్యి నుంచి 1200 అడుగుల లోతులో పాతాళ గంగ 217 వ్యవసాయ, 143 తాగునీటి బోర్లు ఎండిపోయిన వైనం నిలువునా ఎండుతున్న మామిడిచెట్లు భారీ వర్షాలు కురవకపోతేఉద్యానపంటలకు తీవ్ర నష్టం కరువు బెంబేలెత్తిస్తోంది. వరుణుడు కరుణించడం లేదు. పాతాళగంగ పలకరించలేదు. భూగర్భజలమట్టం అడుగంటింది. వెయ్యి-1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటిజాడ దొరకడం లేదు. ఈక్రమంలో జిల్లాలోని రైతన్నలు ఓ వైపు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటే..మరోవైపు మామిడిలాంటి ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతులు వాటిని కాపాడుకోలేక మధనపడుతున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు కన్నబిడ్డల్లా చూసుకున్న మామిడిచెట్లు కళ్లముందే ఎండిపోతుంటే కుమిలిపోతున్నారు. భారీ వర్షాలు కురవకపోతే ఉద్యాన వనపంటలకు తీవ్రమైన నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. సాక్షి, చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది సరైన వర్షపాతం నమోదు కాకపోవడం, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులే ఉండడంతో ఒక్కసారి భూగర్భజల నీటిమట్టం ఊహించనిస్థాయికి పడిపోయింది. గతేడాది 500-600 అడుగుల లోతులోని బోరుబావుల ద్వారా నీరు వచ్చేది. ఈ ఏడాది అవే బోరుబావులు ఎండిపోయాయి. వాటి సమీపంలో 850 నుంచి వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటిజాడ కనిపించడం లేదు. కుప్పం నియోజకవర్గంలో 1200 అడుగుల వరకూ నీళ్లు పడని దుర్భర పరిస్థితి. జిల్లాలో 217 వ్యవసాయబోర్లు ఎండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో ఉద్యానరైతులు తీవ్ర వేదన పడుతున్నారు. జిల్లాలో 71వేల హెక్టార్లలో మామిడి పంటలు సాగవుతున్నాయి. 15ఏళ్ల వయసున్న చెట్లు కూడా నీటి ఎద్దడిని తట్టుకోలేకపోతున్నాయి. జిల్లాలో సగటున ఎకరాకు 5 మామిడి చెట్లు ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ ఏడాది వర్షాభావంతో వేలాది చెట్లు ఎండిపోయిన పరిస్థితి. రైతులు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నా నీళ్లు సరిపోవడం లేదు. ఒక్కో చెట్టుకు ఏడాదికి 2-3వేల రూపాయల విలువైన కాయలు(తక్కువ లేకుండా) కాస్తాయి. ఈ లెక్కన చెట్లు ఎండిపోవడం వల్ల ఎకరాకు పది వేల రూపాయల చొప్పున నష్టమే! భారీ వర్షం పడితేనే.. పాతాళానికి వెళ్లిన జలం మళ్లీ బోరుబావులకు అందాలంటే ఈ ఏడాది 934 మి ల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఈ ఏడాది 113 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇంకా 800 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదుకావాలంటే ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురవాలి. లేదంటే జిల్లాలోని ఉద్యానపంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తాగునీటికీ కటకట భూగర్భజల ప్రభావంతో 143 తాగునీ టిబోర్లు ఎండిపోయాయి. దీంతో 11 మండలాల్లోని 443 ఆవాసప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరస్థితి నెలకొంది. మ రో 8 మండలాల్లోని 83 ఆవాసప్రాంతా ల్లో ప్రమాదకర స్థితి. వర్షాలు పడకుండా పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సంఖ్య మరిం తపెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామాల్లో 562 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు రోజూ నీటి సరఫరా చేయడం లేదు. 2-3 రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. దీంతో పల్లెసీమల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాసుదేవరెడ్డి గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు గ్రామ రైతు. అతని ఐదెకరాల పొలంలో 3 ఎకరాల్లో మామిడి, 2 ఎకరాల్లో కొబ్బరిసాగు చేశాడు. వీటి కోసం 7బోర్లు వేశాడు. వర్షాలు లేవు. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో 6 బోర్లు ఎండిపోయాయి. ఉన్న ఒక్క బోరుకు కొద్దిమేర మాత్రమే నీళ్లు వస్తున్నాయి. నీళ్లు లేక..బోరునీరు సరిపడక పది రోజుల తేడాలో 15 ఏళ్ల వయస్సున్న 12 మామిడి చెట్లు ఎండిపోయాయి. కంటికిరెప్పలా కాపాడుకున్న చెట్లు ఎండిపోవడాన్ని భరించలేక పది రోజుల కిందట మరో బోరు 847 అడుగుల లోతు వేశాడు. 87 వేల రూపాయలు ఖర్చయింది. నీటి జాడ మాత్రం కనిపించలేదు. ఎండుతున్న చెట్లు ఓ వైపు...అప్పుచేసినా నీటిజాడ కనిపించలేదన్న బాధ మరోవైపు...వీటికి తోడు ఇటీవల ఆయన ట్రాక్టర్ దొంగతనానికి గురైంది. ఇప్పటికే 4లక్షల రూపాయలు అప్పు ఉంది. దీంతో బోరుమని విలపించడం తప్ప ఏం చేయలేని నిస్సహాయస్థితి వాసుదేవరెడ్డిది. -
జస్ట్ టేస్ట్ ఇట్
డోనట్... రిచ్ ఫ్యాట్ కంటెంట్తో తయారైన కేక్. మామిడిని మరిపించే మ్యాంగో డోనట్... పిల్లలకోసం ఓరియో డ్రీమ్, రంగు రంగుల హరివిల్లులా ఆకట్టుకునే రెయిన్బో... ఇలా రకరకాల ఫ్లేవర్స్తో నగరవాసులకు తన రుచులను పంచేందుకు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు తయూరు చేసి అందించడం ఇక్కడి స్పెషాలిటీ. ప్యాషనేట్ పార్ట్నర్స్ భువనేష్ సుబ్రహ్మణ్యం 2011లో ఈ డోనట్ హౌస్ను చెన్నైలో ఏర్పాటు చేశాడు. అక్కడ టేస్ట్ చూసిన నగరవాసులు జయ్ప్రకాశ్, శ్రీకాంత్, మోహన్, శర్వాణీలు దానిపై వునసు పడ్డారు. ఈ రుచిని హైదరాబాదీలకు పంచేందుకు సోమాజీగూడలో ఈ డోనట్ హౌస్ ఏర్పాటు చేశారు. హ్యాంగౌట్ ప్లేస్ హైదరాబాద్లో ఇది మొట్టమొదటి బ్రాంచ్. దీంట్లో లైవ్ కిచెన్ కూడా ఉంది. గంటకోసారి తయారు చేసే వీటిని ఎలా చేస్తున్నారో చూసే వీలు కూడా ఉంది. డోనట్ హౌస్ కోసమే శిక్షణ పొందిన ప్రత్యేక చెఫ్ మీ ముందే వండి వడ్డిస్తారు. మొత్తం 35 వెరైటీల్లో మీకు ఏది కావాలంటే అది తినేయెచ్చు. కోడిగుడ్డు కలపని ఈ వెరైటీలను ఓసారి రుచి చూస్తే ఆహా అనాల్సిందే. స్పెషల్ డిషెస్ సమ్మర్ సీజన్లో మ్యాంగో డోనట్స్ ఫేమస్ అయితే... కిడ్స్ నోరూరించే ఓరియో డ్రీమ్స్ పూర్తిగా డార్క్ చాక్లెట్తో ఫిల్ చేసినవి. హరివిల్లునుతలపించే రెయిన్బో డోనట్ను ఓరియోతోనే గార్నిష్ చేస్తారు. చాక్లెట్ అంటే పడిచచ్చేవారికైతే ఏలియన్, చీనీ స్ట్రాబె ర్రీ డోనట్స్ సరిగ్గా సరిపోతారుు. స్పైసీని కోరుకునే వారికోసం ఇటాలియన్ స్పైసెస్, చిల్లీ చీజ్ కూడా దొరుకుతారుు. ఇక మొజిటోస్తో ఇండియాలోనే మొదటి డోనట్బర్గర్ ఇక్కడి ప్రత్యేక డిష్. సో... లేటెందుకు? జస్ట్ టేస్ట్ ఇట్! - సిద్ధాంతి -
పవన్ నాకు మామిడి పళ్లు పంపించలేదు!
అందాల భామ సమంతకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కాస్తంత కోపంగా ఉందట. అది ఏదో పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వనందుకు కాదండోయ్. ఈ అందాల చిన్నది పవన్ పై అలగడానికి కారణం మామిడిపళ్లట. ఏంటీ.. మామిడిపళ్ల కోసమే పవన్ పై సమంతా ఈ మాత్రం వయ్యారాలు వలగబోయాల అనుకుంటున్నారా! మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఎవరికైనా కోపం రావడం సహజమే కదండీ. అలాగే సమంతాకు వచ్చిందంట. 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ సమయంలో సమంతా తనకు మామిడిపళ్లంటే ఇష్టమని పవన్ కు చెప్పడమే ప్రధాన కారణం. తన ఫాంహౌస్ లో ఉన్న మామిడి తోటలోని పళ్లను పంపిస్తానని పవన్ మాట ఇచ్చి..ఇప్పుడు ఆ సంగతిని మరిచిపోయాడని ఆ అమ్మడు తెగ బాధపడుతోందట. దీనికంతటికీ కారణం పవన్ తనకు బాగా తెలిసిన వాళ్లకు మామిడిపళ్లను పంపించడమే. మొన్నామధ్య హీరో నితిన్ కు కూడా మామిడిపళ్లను పంపించాడు పవన్. ఆ మామిడి పళ్ల రుచి చూసిప నితిన్ ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో సమంతా అసలు విషయం తెలుసుకుని ..పవన్ తన విషయాన్ని మరిచిపోయాడని తాజాగా గుర్తు చేసుకుంది. దీనిపై పవన్ కు ఓ ఉత్తరం కూడా రాస్తానని సమంతా అంటోంది. -
పవన్ నాకు మామిడి పళ్లు పంపించలేదు!!
-
థ్యాంక్యూ పవన్ సార్..
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ నుంచి కొంతమందికి ఓ పార్శిల్ అందుతుంది. అది మామిడిపళ్ల బుట్ట. ‘గబ్బర్సింగ్’ చిత్రంలోలా పాపిడి బిళ్లెట్టుకున్న అమ్మాయి ఈ మామిడి పళ్లను తీసుకురాదు కానీ, ఈ పళ్ల రుచి మాత్రం కెవ్వు కేక అట. పవన్ కల్యాణ్కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు. ఈ ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశారట నితిన్. ‘‘పవర్స్టార్ ఈ ఏడాది కూడా నాకు మామిడిపళ్లు పంపించారు. చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్యూ సార్’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. -
యువ హీరోకు మామిడి పళ్లు పంపించిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంపిన బహుమతికి తబ్బిబ్బైన టాలీవుడ్ హీరో నితిన్ ఆనందంతో ట్విటర్ లో గంతులేశాడు. పవన్ కళ్యాణ్ మామిడి పళ్లను పంపించడమే నితిన్ ఆనందానికి కారణం. 'టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ను అమితంగా అభిమానించి హీరోల్లో నితిన్ ఒకరనే విషయం తెలిసిందే. నేను అభిమానించే పవన్ కళ్యాణ్ ఈ వేసవిలో మామిడి పళ్లను పంపించారు. పవన్ పంపిన మామిఢి పళ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. థాంక్యూ సర్' అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో సందేశంతోపాటు మామిడి పళ్ల ఫోటోలను పోస్ట్ చేశారు. POWER STAR sent me mangoes this summer too!! Follow @sakshinews -
నష్టాల మామిడి
కొంపముంచిన అకాల వర్షం కోత దశలో నేలరాలిన మామిడి పంట పతనమైన ధర నష్టాల్లో కూరుకుపోయిన రైతులు, వ్యాపారులు ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు, వ్యాపారులు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారు. మామిడి పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించడంతో మంచి కాపుతో లాభాలు వస్తాయని ఆశించారు. అయితే కోత దశలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అంతకు ముందు వారం రోజులు పెను గాలులు వీచాయి. వేలాది ఎకరాల్లో పంట నేలరాలిపోయింది. ఉద్యానవన శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్లైన్: భిన్నమైన మామిడి రకాల సాగుకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. మామిడి సాగులో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, దేశంలో మూడో స్థానంలో నిలిచింది. అయితే పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. ప్రతి ఏటా మామిడి రైతులు ఏదో ఒక రకంగా నష్టపోతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే ఏటా లక్షా 50 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగవుతోంది. జిల్లాలో ప్రధానంగా తోతాపురి రకాన్ని 50 శాతంపైగా సాగు చేస్తున్నారు. 20 శాతం బేనీషా రకం, 20 శాతం ఖాదర్ రకం, మిగిలిన శాతం మల్లిక, నీలం రకాలు సాగు చేస్తున్నారు. తగ్గిన బరువు, రాలిన కాయలు ఈ ఏడాది మామిడి దిగుబడిపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించింది. కాయదశ వచ్చే సరికి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసాయి. అంతకు ముందు వారం రోజుల పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించిం ది. దీంతో కాయదశకు చేరకున్న మామిడి ఒక్కసారిగా బరువు తగ్గిపోవడంతో పాటు బలమైన ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి. ఉద్యాన శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కాయబరువు తగ్గడం, సైజు లేకపోవడం కారణాలతో పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎకరాకు 4 టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 3 టన్నులు మాత్రమే రైతుల చేతికి అందనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పిందె దశలో నీలం రకం మామిడి ఆగస్టు మాసంలో కోతకు రావచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. సింకేట్తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడికి మార్కెట్ బాగా ఉంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ కావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. జిల్లాలో మామిడి పండ్ల గుజ్జు (ఫల్ఫ్) పరిశ్రమలు 70కి పైగా ఉన్నాయి. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేటై ధరలు నిర్ణయించాయి. దీని ప్రభావం ఎక్స్పోర్టు క్వాలిటీ కాయలపైనా పడింది. తోతాపురి రకం మామిడి గిట్టుబాటు ధర టన్ను రూ.15 వేలు కాగా, రూ.9 వేలకు పడిపోయింది. బేనీషా రకం మామడి గిట్టుబాటు ధర టన్ను రూ.25 వేలు కాగా, రూ.13 వేలకు కుదేలైంది. ఖాదర్ రకం మామడి ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. టన్ను ధర రూ.24 వేలు పలుకుతోంది. అయితే ఈ రకం మామిడి సాగు జిల్లాలో కేవలం 20 శాతమే ఉంది. గిట్టుబాటు ధర నిర్ణయించాలి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. మామిడికి గిట్టుబాటు ధర నిర్ణయించడంపై ఏటా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశం జరుగుతుంది. కమిటీలో నిర్ణయించిన ధర ప్రకారం రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఈ ఏడాది సైతం అన్యాయం జరగకుండా తగిన గిట్టుబాటు ధర కల్పించి, ఖచ్చితంగా అమలు చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నచూపు తగదు వాణిజ్య పంటగా మామిడి మంచి లాభాలను అందిస్తుంటే ప్రభుత్వాలు సాగుపై శ్రద్ధ చూపడం లేదు. సూచనలు అందించే ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండరు. యాజమాన్య పద్ధతులపై అవాగాహన లేక నాసిరమైన మందుల వినియోగంతో నష్టపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో చెట్లను నాటిస్తున్నారే తప్ప మార్కెటింగ్పై శ్రద్ధ చూపడం లేదు. మార్కెట్ కమిటీలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారే తప్ప రైతులకు ఒరిగేది లేదు. దిగుబడి ఒక్క సారిగా మార్కెట్కు రావడంతో ధరను వ్యాపారులు తగ్గిస్తున్నారు. రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి జ్యూస్ ఫ్యాక్టరీలచే మామిడి రైతులకు అగ్రిమెంట్ చేయిస్తే నేరుగా కొనుగోళ్లతో లాభపడే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం గాలి వానలకు రాలిన కాయలతో సుమారు 2 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది - పి. సుదర్శన్ రెడ్డి, మామిడి రైతు, నారాయణవనం. -
నిలువు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్లైన్ : మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం కరువైంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దో గోప్పో పంట చేతికందినా గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలోని 23వేల హెక్టార్ల లో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో 18 వేల హెక్టార్లలో కాపు వచ్చే మామిడితోటలు ఉండగా.. ఐదు వేల హెక్టార్లలో ఐదేళ్ల వయసు గల తోటలు ఉన్నాయి. ప్రకృతి అనుకూలిస్తే ఎకరాకు ఏడు టన్నుల చొప్పున మామిడి కాయ దిగుబడి వస్తుంది. కానీ అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఏటా పూత, పిందె రాలిపోయి తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో కాయ దిగుబడి హెక్టారుకు సగటున 3 టన్నులకు మించి రావడం లేదు. ఈసారీ మామిడి రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీశాయి. మామిడి చెట్లకు పూత విరగబూసి పిందె దశకు చేరే క్రమంలో అకాల వర్షాలతో పిందెలు సగానికి పైగా రాలిపోయింది. కొద్దో గొప్పో మిగిలిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ సౌకర్యం లేక.. మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. మంచిర్యాల కేంద్రంగా మార్కెట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. రెండేళ్ల నుంచి ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రైతులు మామిడి కాయలను మాహారాష్ట్రలోని నాగ్పూర్, నాందేడ్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామిడికాయలను తీసుకెళ్లే క్రమంలో ధర ఆకాశంలో ఉన్నట్లు నమ్మబలికి.. తీరా తీసుకెళ్లాక ఒక్కసారిగా ధర దించి రైతులను వంచనకు గురి చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారు. మామిడికాయలు, పండ్లను వేలం పాడి విక్రయించి ఇచ్చినందుకు రూ.లక్షకు రూ.10వేల చొప్పున దళారులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు టన్నుకు 50 కిలోల తరుగు తీస్తున్నారు. రైతులు ఎదురుతిరిగితే కొనుగోలు చేయడం లేదు. తడిసి మోపెడవుతున్న చార్జీలు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాయలను చెట్లపై నుంచి తెంపడం నుంచే ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో రోజువారీ కూలీకి వచ్చే కూలీలు ప్రస్తుతం టన్ను లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఆరు టన్నుల కాయలు కోస్తే రూ.10వేలు కూలిగా ఇవ్వాల్సి వస్తోంది. కాయలు తెంపిన తర్వాత మార్కెట్కు తరలించడానికి రవాణా చార్జీ అదనపు భారమవుతోంది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి నాగ్పూర్కు మామిడికాయలు తరలిస్తే డీసీఎం వ్యాన్కు రూ.18వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెన్నెల, జైపూర్, భీమారం తదితర ప్రాంతాల నుంచి తరలిస్తే రూ.22వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రవాణా భారం రైతులకు తడిసి మోపెడవుతోంది. మద్దతు ధర కరువు.. రోజు రోజుకు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మామిడి కాయలు పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కరువవుతోంది. ఏయేటికాయేడు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ఈయేడు తొలుత బంగినపల్లి మామిడి పండ్లకు టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, దశేరికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు మద్దతు ధర చెల్లించి రైతులను వ్యాపారులు ఊరించారు. మద్దతు ధర లభిస్తోందని ఆశపడిన రైతులు ఒక్కసారిగా మామిడికాయలు, పండ్లను మార్కెట్లో ముంచెత్తగా ఆకాశంలో ఉన్న ధరను పాతాళానికి దించారు. ప్రస్తుతం బంగెనపల్లి మామిడికాయలు టన్నుకు రూ.13 వేల నుంచి రూ.16 వేల వరకు, దశేరి టన్నుకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలుకుతోంది. ఇతర రసాల పండ్లను టన్నుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మద్దతు ధర కూలీల ఖర్చు, ట్రాన్స్పోర్టు చార్జీలు, రైతుల శ్రమను తీసివేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చేయూత కరువు.. మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించి కష్టాలు తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్కనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మార్కెట్ సౌకర్యం కోసం చేసిన ప్రతిపాదనలను ఇప్పటికైనా కార్యారూపం దాల్చేలా చర్యలు తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
గాలీవాన బీభత్సం
చౌడేపల్లె, న్యూస్లైన్: మండలంలో శనివారం రాత్రి గాలీవాన బీభత్సాన్ని సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. టమాట, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చారాల, దుర్గసముద్రం, ఏ కొత్తకోట గ్రామ పంచాయతీల్లో టమోట, మామిడి కాయలు నేలరాలాయి. దుర్గసముద్రం, దాదేపల్లె, ఓదులపేట, అంకుతోటపల్లె, కుంచినపల్లె, ఏ.కొత్తకోట, బుటకపల్లె తదితర గ్రామాల్లో వడగండ్లుతో పాటు గాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బుటకపల్లె , ఓదులపేట కీలేరుల వద్ద సుమారు 12 స్తంభాలు నేలకొరిగాయి. రెండు ట్రాన్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు భారీ చెట్లు నెలకొరిగాయి. పంటలు చేతికివచ్చే సమయంలో మామిడి కాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. గాలీవాన బీభత్సంతో 200 ఎకరాల్లో టమాట పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లో మామిడి కాయలు గాలికి నేలరాలాయి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పుంగనూరులో.. పుంగనూరు: గాలీవాన బీభత్సంతో పుంగనూరు మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. శనివారం సాయంత్రం నుంచి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా పుంగనూరు మండలంలో సుమారు 96 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, వేప, తుమ్మ, మునగ, కొబ్బరి, అర్కీలిఫాం చెట్లు సైతం నేలకొరిగాయి. వీటితో పాటు కొత్తిమీర, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని నల్లగుట్లపల్లెలో జి.చంద్రశేఖర్రెడ్డికి చెందిన పది ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అలాగే మర్రిమాకులపల్లెకు చెందిన రత్నమ్మకు చెందిన 15 ఎకరాల్లో , నల్లురుపల్లె రామిరెడ్డికి చెందిన 4 ఎకరాల తోట, జయరామిరెడ్డికి చెందిన 30 ఎకరాల తోట , మర్రిమాకులపల్లె నాగరాజారెడ్డికి చెందిన 7 ఎకరాల తోట, అలాగే కృష్ణప్ప, శ్రీనివాసులు, చంద్రప్పకు చెందిన 20 ఎకరాల తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పుంగనూరు సమీపంలోని మాదనపల్లెకు చెందిన వి.సుబ్రమణ్యంకు చెందిన 20 ఎకరాల మామిడి తోట,కృష్ణప్పకు చెందిన 5 ఎకరాల తోటలో మామిడి కాయలు రాలిపోయాయి. మామిడి తోటల్లో బెనీషా, బాదం, బెంగళూరు, నీలం కాయలు రాలిపోవడంతో ఒకొక్క రైతుకు సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లింది. ఆకాల వర్షాలతో మామిడి పంట రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు రాని కాయలను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్ద పంజాణి మండలంలో.. పెద్దపంజాణి: పెద్దపంజాణి మండలంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో పలువురు రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో చాలా పల్లెలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సుమారు 200 ఎకరాల్లోని మామిడి కాయలు నేలరాలాయి. మామిడి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మంది అప్పులు చేసి మరీ మామిడి తోటలను కొన్నారు. అలాగే గురివిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొరస్వామి, నరసింహయ్య, వెంకట్రామయ్యలకు చెందిన రేకులు గాలులకు లేచిపోవడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ముత్తుకూరు రోడ్డులోని గుణ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. రాయలపేట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు చెందిన రేకులన్నీ పూర్తిగా లేచిపోయాయి. కూరగాయల కొత్తపల్లెకు చెందిన హరినాథ్ నూతనంగా నిర్మిస్తున్న కోళ్లషెడ్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. అలాగే పలు చోట్ల పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కెళవాతి, వీరప్పల్లె, మంగప్పల్లె, పాత వీరప్పల్లె, సుద్దగుండ్లపల్లె గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కెళవాతి వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు, సుద్దగుండ్లపల్లె వద్ద నాలుగు, శ్రీరామాపురం వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కొండేపల్లె క్రాస్ వద్ద 33కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో కరసనపల్లె, ముత్తుకూరు గ్రామాలకు రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. -
మామిడి రుచిలెక్కలెరుగదు...
రుచులను షడ్రుచులుగా వర్ణించి వర్గీకరించారు... రసాలను నవరసాలంటూ పరిమితి విధించి చెప్పారు... ఇలా నిర్ణయించినవారికి మామిడి గురించి తెలుసో? లేదో? ఆ ఒక్క పండులోనే ఎన్నో రసాలు... చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు... మామిడిని ఆస్వాదించడానికి... ఆ ఆరూ, ఈ తొమ్మిదీ సరిపోలేదు... వంట వంక పెట్టుకుని... రెసిపీ పేరు పెట్టుకొని ... కొత్త రుచుల అన్వేషణ చేస్తున్నారు... ఆకలి రుచినీ, నిద్ర సుఖాన్నీ ఎరగనట్టే... మామిడి రుచులు లెక్కలెరగవు. లెక్కలకు ప్రాధాన్యమిస్తే పండును వదిలేసి టెంకను తిన్నంత ఒట్టు. ఈ వంటలన్నీ చేసేసి, కొత్తరుచుల గిన్నెలను పొయ్యి దించండి. లెక్క లేని, అంతు లేని మామిడి వంటలను ఆస్వాదించండి. మ్యాంగో చీజ్ కేక్ కావలసినవి: హెవీ క్రీమ్ - కప్పు; కన్ఫెక్షనరీ పంచదార - 2 టేబుల్ స్పూన్లు; మేరీ బిస్కెట్ల పొడి - 3 కప్పులు; పనీర్ తురుము - 50 గ్రా;క్రీమ్ చీజ్ - 150 గ్రా., పనీర్ - 100 గ్రా., పాలు - పావు కప్పుపంచదార పొడి - 6 టీ స్పూన్లు, కరిగించిన బటర్ - 4 టేబుల్ స్పూన్లు వెనీలా ఎసెన్స్ - టీ స్పూను, మామిడిపళ్లు - 2, మామిడిపండు గుజ్జు - పావు కప్పు తయారీ: ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి సర్వింగ్ బౌల్స్లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి) మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్తో సర్దాలి మామిడిపండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్లో ఉంచాలి చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి. మ్యాంగో ముసిలీ కావలసినవి: కార్న్ ఫ్లేక్స్ - 100 గ్రా., ఓట్లు - 100 గ్రా. (ఎండబెట్టి వేయించాలి) డ్రై ఫ్రూట్స్ - అర కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు - పావు కప్పు, నువ్వుపప్పు - పావు కప్పు (వేయించాలి) పెరుగు - అర లీటరు, పచ్చి మామిడికాయ తురుము - 2 కప్పులు, తేనె - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో కార్న్ ఫ్లేక్స్, వేయించిన ఓట్లు, వేయించిన నువ్వు పప్పు, డ్రై ఫ్రూట్స్ కలిపితే ముసిలీ తయారవుతుంది. ఒక పాత్రలో పెరుగు, తేనె వేసి బాగా గిలక్కొట్టాలి. ఒక గ్లాసులో ముందుగా పెరుగు + తేనె మిశ్రమం ఒక పొరలా వేయాలి. ఆ పైన నాలుగు టేబుల్ స్పూన్లు ముసిలీ మిశ్రమం వేయాలి. ఆ పైన పెరుగు మరో పొరలా వేయాలి. చివరగా పచ్చిమామిడికాయ తురుము, ముసిలీ మిశ్రమం వేయాలి. ఫ్రిజ్లో పది నిమిషాలు ఉంచి తీసి అందించాలి. మ్యాంగో కార్డమమ్ పౌండ్ కేక్ కావలసినవి: మైదా పిండి - ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను ఏలకుల పొడి - టీ స్పూను, అన్ సాల్టెడ్ బటర్ - అర కప్పు పంచదార - ముప్పావు కప్పు, గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు మజ్జిగ - 100 మి.లీ., మామిడి పండు గుజ్జు - అర కప్పు మామిడి పండు ముక్కలు - కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఐసింగ్ సుగర్ - టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) తయారీ: అవెన్ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి ఉంచాలి. కేక్ టిన్ తీసుకుని దానిలో ముందుగా అన్ సాల్టెడ్ బటర్, ఆ తరవాత కొద్దిగా మైదా పిండి వేయాలి. ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. బటర్లో పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి. పెరుగు జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. పెన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో మజ్జిగ, మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. సిద్ధంగా ఉన్న కేక్ టిన్లో ఈ మిశ్రమాన్ని పోయాలి. సుమారు 45 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. బాగా చల్లారాక పైన ఐసింగ్ సుగర్, మామిడిపండు ముక్కలు వే సి అందించాలి. మ్యాంగో అండ్ జింజర్ జామ్ కావలసినవి: మామిడి పండు ముక్కలు - 2 కప్పులు పంచదార - పావు కప్పు ఉప్పు - చిటికెడు అల్లం తురుము - టీ స్పూను నిమ్మరసం - టీ స్పూను తయారీ: అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి స్టౌ (సన్నని మంట) మీద ఉంచి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. (మాడకుండా ఉండేలా మధ్య మధ్యలో కలుపుతుండాలి) రుచి చూసి పంచదార తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా జత చేయాలి. బాగా చల్లారాక శుభ్రమైన గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్లో భద్రపరిస్తే సుమారు నెల రోజులు నిల్వ ఉంటుంది. మ్యాంగో పులిసేరీ కావలసినవి: మామిడిపండు - 1; కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; మెంతులు - అర టీ స్పూను; చిక్కటి మజ్జిగ - ఒకటిన్నర కప్పులు; నూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉప్పు - తగినంత తయారీ: ఇది కేరళ వంటకం ముందుగామామిడి పండు తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు, మామిడిపండు ముక్కలు, కరివేపాకు వేసి ఉడికించాలి చిన్న బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక, మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న మామిడిపండుగుజ్జులో వేయాలి బాగా ఉడుకుతుండగా మజ్జిగ జత చేసి, కలిపి దించేయాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు వేసి వేయించి, మామిడిపండు గుజ్జులో వేయాలి ఇది అన్నంలోకి, వేపుడులోకి బాగుంటుంది. రా మ్యాంగో సలాడ్ కావలసినవి: నువ్వు పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; బెల్లం - టేబుల్ స్పూను; పచ్చి మామిడికాయ తురుము - కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; ఎల్లో క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత తయారీ: బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్లో ఉంచి చల్లబడనివ్వాలి) సర్వింగ్ బౌల్స్లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి. సేకరణ: డా. వైజయంతి కర్టెసీ: అరుంధతీరావ్ -
మధుర ఫలం.. విషతుల్యం..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లో కంటికింపుగా కనిపించే మామిడి పండ్లు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకు కారణం వ్యాపారుల మధ్య ఉన్న పోటీ. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. 30 కిలోల మామిడి కాయలను 200 గ్రాముల కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండబెడుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాలను ఎగుమతి చేసే పండ్లను బాక్సుల్లో ప్యాక్ చేసి వాటి మధ్యలో కాల్షియం కార్బైట్ ప్యాకెట్లను ఉంచుతున్నారు. దీంతో అవి నిర్ధేశిత ప్రదేశానికి చేరుకునేలోగానే పండుతున్నాయి. ఇలా అన్నిదశల్లో కాల్షియం కార్బైడ్ వినియోగిస్తుండడంతో ఆ పండు సహజ రుచిని కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి. పట్టించుకోని అధికారులు.... కాల్షికార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా దానిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతున్నారు. కాల్షియం కార్బైడ్తో వచ్చే వ్యాధులు.... రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న ప్రజలు పలు వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ ర్భిణులకు, చిన్న పిల్లలు తింటే అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు విరేచనాలు అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక కళ్ల సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా అయితేనే మంచిది..... మామిడి పండ్లను చెట్టుపైనే బాగా ముదిరిన తర్వాత కోయాలి. ఆ తర్వాత గడ్డి వేసి అందులో కాయలు మగ్గబెట్టాలి. వారం రోజుల పాటు అలా ఉంచితే మధురమైన వాసనతో పాటు రుచి, పోషక విలువలు ఉన్న మామిడి పండ్లు సిద్ధం అవుతాయి. గతంలో మామిడి పండ్లను ఇలానే పండించి విక్రయించేవారు. -
‘లక్ష’ణమైన చెట్టు!
ఒక్క చెట్టు మామిడికాయలకు రూ. లక్ష చెల్లింపు న్యూస్లైన్, మలికిపురం, పూర్వం సారస్వత రసపిపాసులైన రాజులు.. మెచ్చిన కవనానికి ‘అక్షరానికో లక్ష’ ఇచ్చేవారని ప్రతీతి. చరిత్రలో అలాంటి ప్రతిఫలం పొందిన కవులున్నారో లేరో గానీ.. మధుర ఫలాలు పండించి ‘వృక్షానికో లక్ష’ పొందిన కర్షకులు ఈ కాలంలోనే ఉన్నారు సుమా! తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన సుందర బ్రహ్మయ్యకు ఆ ఘనత దక్కింది. ఆయనకున్న మామిడితోటలోని ఓ ముదురు బంగినపల్లి మామిడి చెట్టు ఈ ఏడు విరగ కాసింది. మామిడిపండ్ల ప్రియులకు బంగినపల్లి రకం అత్యంత ప్రీతిపాత్రమైంది. దాంతో ఒక వ్యాపారి ఆ చెట్టు ఒక్కదానికి కాసిన కాయలనే రూ.లక్షకు కొనుగోలు చేశారు. తుపానులకు చెట్లు విరిగి, పొగమంచు ధాటికి పూత రాలిపోయి ప్రస్తుత సీజన్లో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. అయితే.. బ్రహ్మయ్య పంట పండించిన ఈ చెట్టు మాత్రం పుష్కలంగా కాసింది. తన తోటలోని బంగినపల్లి చెట్లు ఏటా బాగా కాస్తాయని, అయితే ఎన్నడూ లేని రీతిలో ఒక్క చెట్టే లక్షకు అమ్ముడుపోవడం ఎంతో ఆనందంగా ఉందని బ్రహ్మయ్య చెప్పారు. ఏదేమైనా.. ‘డబ్బు చెట్లకు కాస్తుందా?’ అని వెటకరించే వారు ఈ బంగినపల్లి చెట్టును చూసి వెనక్కి తగ్గాల్సిందే! -
ఆ ఒక్కచెట్టు.. తోట పెట్టు
ఒక్క చెట్టుకే 14 రకాల మామిడికాయలు న్యూస్లైన్, గంగవరం, సాధారణంగా ఓ మామిడితోటలో ఎన్నిరకాల చెట్లుంటాయి? ‘బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కలకటేరు, ఇమాం పసంద్, సువర్ణరేఖ, నీలం..’ ఇలా మహా అయితే ఓ పదిరకాలుంటాయి. కానీ.. ‘రాజు తలచుకుంటే కానిదేదీ లేదు’ అని నిరూపిస్తూ.. చోడరాజు రాజుబాబు ఒక చెట్టునే అరుదైన తోటగా అవతరింపజేశారు. ‘చెట్టేమిటి, తోట కావడమేమిటి?’ అంటారా.. రాజుబాబు కృషి 14 రకాలుగా ఫలించి, కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది మరి! తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం మొల్లేరుకు చెందిన రాజుబాబు తన ఇంటి ఆవరణలోని ఓ కలకటేరు చెట్టుకు 2012 వర్షాకాలంలో క్లోనింగ్ పద్ధతిలో 13 రకాల మామిడిని అంట్లు కట్టారు. ఈ వసంత రుతువులో ఆ తరువు ‘14 జాతుల కొలువు’గా ఫలించింది. తన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడా చెట్టుకు కలకటేరుతో పాటు చిన్నరసాలు, పెద్దరసాలు, బంగినపల్లి, సువర్ణరేఖ, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహెబ్, నీలం, పంచదార కల్తీ, ఇమాం పసందు, చెరకురసం, పునాస, పాపారాయుడు గోవ జాతుల కాయలు కాశాయని రాజుబాబు చెప్పారు. -
పేరుకే మార్కెట్ రోడ్డుపైనే బీట్
జహీరాబాద్ టౌన్, న్యూస్లైన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణం పనులు పూర్తయి నాలుగు సంవత్సరాలవుతున్నా దుకాణాలు వినియోగంలోకి రావడంలేదు. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన దుకాణాల షెటర్లు దెబ్బతింటున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే సాగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో రహదారిపైనే బీట్లు జరుగుతున్నాయి. జహీరాబాద్ పట్టణంలోని పశువుల సంత ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 2009లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.28 లక్షలు మంజూరు కాగా అప్పటి మార్కెట్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యాపారుల కోసం 23 దుకాణాలను నిర్మించారు. సిమెంట్ రోడ్డు వేసి విద్యుత్ దీపాలు అమర్చారు. పండ్ల మార్కెట్ యార్డుకు గేటు నిర్మించారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా దుకాణాలను వ్యాపారులకు కేటాయించడం లేదు. పశువుల పంత పక్కనే పండ్ల మార్కెట్ సముదాయం ఉండడంతో పశువులపాకగా మారిం ది. వ్యాపారులు కొనుగోలు చేసిన పశువులను ఇక్కడే కట్టేస్తున్నారు.దీంతో చెత్తాచెదారం,పశువుల పేడ పేరుకపోయి ఆధ్వానంగా మారింది. పశువుల వ్యాపారులు,రైతులు దుకాణాల్లో ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాల షెటర్లను ధ్వంసం చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ కూడా దెబ్బతిం టోంది. ఇప్పుటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని పండ్ల మార్కెట్ను ప్రారంభించి వినియోగంలోనికి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపైనే మామిడి పండ్ల బీట్లు ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో పండిన మామిడి పండ్ల బీట్లు జరుగుతున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో జాప్యం కారణంగా రోడ్లపై అమ్మకాలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి పెద్ద మొత్తంలో పట్టణానికి పండ్లురావడం..అక్కడే బీట్లు జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. -
ప్లేట్లోంచి నోట్లోకి టేస్టీ ఎవరెస్ట్...!
ఇప్పిస్తే అలకలు తీరుస్తుంది. అంటిస్తే మెలికలు తిప్పేస్తుంది. ఈ పొడుపు కథకు ఆన్సరేమిటీ? పళ్లను జిల్లనిపించే, నాల్కకు ఛిల్లనిపించే థ్రిల్లయిన ఐస్క్రీమ్. ఐస్క్రీమ్ తినడం ఈజీక్వల్టూ నైస్డ్రీమ్ కనడం ఐస్క్రీమ్ తెచ్చి ఇచ్చి ఐస్లో ఐస్ పెట్టి చూస్తే చాలు ప్రేమికులు ఐసైపోవాల్సిందేనట! ఐస్క్రీములు కేవలం వాళ్లకోసమేనా? వయసుతో నిమిత్తం లేకుండా అందరికోసం కాదా? ఎందుక్కాదూ! ఐస్క్రీములంటేనే వైజ్ ప్యూపిల్స్ కోసం, గాళ్స్ అండ్ గైస్ అండ్ నైస్ పీపుల్ కోసం అందుకే ఈ వేసవిలో మనాలీ వెళ్లినట్టనిపించేలా వెనీలానూ, కష్టాలన్నీ తీరేలా కస్టర్డ్ సలాడ్స్నూ మరెన్నో రకాలతో పాటు మ్యాంగో మ్యానియానూ మీకందిస్తున్నాం. కప్, కోన్లలోనే ఎవరెస్టులెక్కండి. తనివితీరా... చల్లటి ఐస్క్రీములు మెక్కండి. మ్యాంగో మ్యానియా కావలసినవి డెజైస్టివ్ బిస్కెట్స్ - రెండు కప్పులు; అన్సాల్టెడ్ బటర్ - 100 గ్రా. (కరిగించాలి); క్రీమ్ చీజ్ - ఒక టిన్; క్రీమ్ - ఒక కప్పు; మామిడిపండు గుజ్జు - ఒకటిన్నర కప్పులు; మామిడిపండు ముక్కలు - కప్పు; జిలెటిన్ - టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) వేడి నీళ్లు - అర కప్పు; పంచదార - అర కప్పు తయారీ బిస్కెట్లను మెత్తగా పొడి చేయాలి. కరిగించిన బటర్, బటర్ ఒక పాత్రలో వేసి రెండూ కలిపి, గ్లాసులలో వేసి గట్టిగా ఒత్తి, ఫ్రిజ్లో పది నిమిషాలు ఉంచాలి. ఒక పాత్రలో క్రీమ్ చీజ్, క్రీమ్, పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి. మామిడిపండు ముక్కలు జత చేయాలి. అరకప్పు వేడి నీళ్లలో జిలెటిన్ వేసి కరిగించాలి. మామిడిపండు గుజ్జు జత చేసి, ఈ మిశ్రమాన్ని సగం పక్కన పెట్టి, మిగిలిన దానికి క్రీమ్ చీజ్ జత చేసి బాగా కలపాలి. ఫ్రిజ్లో నుంచి గ్లాసులను బయటకు తీసి, వాటిలో మామిడిపండు మిశ్రమం, చీజ్ మిశ్రమం వరుసగా పోయాలి. ఇలా చేయడం వల్ల అన్ని పదార్థాలు కలిసిపోకుండా విడివిడిగా కనిపిస్తాయి. గ్లాసులను సుమారు నాలుగు గంటలు డీప్ ఫ్రిజ్లో ఉంచి, చల్లగా అందించాలి. ఈజీ వెనీలా ఐస్క్రీమ్ కావలసినవి: క్రీమ్ - 2 కప్పులు (సూపర్ మార్కెట్ లేదా బేకరీలో దొరుకుతుంది); హోల్ మిల్క్ - కప్పు; పంచదార - 2/3 కప్పు; వెనీలా ఎక్స్ట్రాక్ట్ - టీ స్పూను; వెనీలా బీన్ - 1 (తురమాలి) తయారీ: ఒక పాత్రలో క్రీమ్, పాలు, పంచదార, వెనీలా వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి పంచదార కరివేవరకు కలుపుతుండాలి వెనీలా బీన్ తురుమును పాల మిశ్రమంలో వేసి కలిపి దించి, ఒక పాత్రలో పోసి చల్లారనివ్వాలి పైన ప్లాస్టిక్ కవర్తో చుట్టి సుమారు నాలుగు గంటల సేపు ఫ్రిజ్లో ఉంచి బయటకు తీయాలి మిక్సీలో వేసి మెత్తగా చేసి మళ్లీ పాత్రలో పోసి ఫ్రిజ్లో ఉంచాలి ఈ విధంగా సుమారు మూడు సార్లు చేసి చివరగా డీప్ ఫ్రిజ్లోఉంచి నాలుగు గంటల తర్వాత తీసి చెర్రీలు, కిస్మిస్లతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి. మిక్స్డ్ ఫ్రూట్ క స్టర్డ్ కావలసినవి: పాలు - పావు లీటరు; కస్టర్డ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; పంచదార - 50 గ్రా.; అరటిపళ్లు - 2; ఆపిల్ - 1 ; దానిమ్మ - 1; ద్రాక్షపళ్లు - కొద్దిగా; చెర్రీస్, డ్రైఫ్రూట్స్ - గార్నిషింగ్ కోసం. తయారీ: ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి పంచదార జత చేయాలి కస్టర్డ్ పౌడర్ను కొద్దిగా చన్నీటిలో వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి కలిపి దించేసి చల్లారనివ్వాలి చల్లారిన పాలకు పండ్ల ముక్కలు జత చేసి ఫ్రిజ్లో ఉంచాలి సుమారు రెండు గంటల తరువాత బయటకు తీసి, క ప్పులలో ఉంచాలి డ్రైఫ్రూట్స్ ముక్కలు, చెర్రీలు, ద్రాక్షపళ్లతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చాకొలేట్ చిప్ ఐస్ క్రీమ్ కావలసినవి పాలు - అర లీటరు; హెవీ క్రీమ్ - అర లీటరు; పంచదార - మూడు టేబుల్ స్పూన్లు; ప్లెయిన్ చాకొలేట్ తురుము - 3 టీ స్పూన్లు (ఇందులోని పదార్థాలన్నీ సూపర్మార్కెట్లో దొరుకుతాయి) తయారీ ఒకపాత్రలో పాలు, పంచదార వేసి సన్నని మంట మీద ఉంచి పంచదార కరిగేవరకూ కలుపుతుండాలి. పాలు చల్లారేవరకు పక్కన ఉంచి చల్లారాక క్రీమ్ వేసి కలపాలి. తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జాగ్రత్తగా ఒక పాత్రలో పోసి, ఫ్రిజ్లో సుమారు రెండు గంటలు ఉంచాలి. బయటకు తీసి, ఫ్రీజర్లో సుమారు అరగంట ఉంచాక, బయటకు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఫ్రీజర్లో మరో అరగంట ఉంచి తీసి మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ విధంగా మూడు నాలుగు సార్లు చేయాలి. చివరగా ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజ్లో ఉంచి అరగంట తర్వాత తీసి సర్వ్ చేయాలి. ఫ్రోజెన్ బనానా కస్టర్డ్ కావలసినవి: పాలు-2 కప్పులు; బ్రౌన్ సుగర్-కప్పు; కస్టర్డ్ పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు; వెనిలా ఎసెన్స్-టీ స్పూను; అరటిపళ్లు - 3 (బాగా పండినవి); రాస్ప్ బెర్రీస్-కొన్ని తయారీ: ఒక పాత్రలో పాలు, బ్రౌన్ సుగర్ వేసి పంచదార కరిగేవరకు పాలు కలుపుతుండాలి చల్లటి నీళ్లలో కస్టర్డ్ పొడి వేసి జారుగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి వెనిలా ఎసెన్స్ జత చేసి, బాగా ఉడికిన తర్వాత దించేయాలి అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో ఉంచి, మూత పెట్టి ఫ్రిజ్లో సుమారు అరగంటసేపు ఉంచాలి పాల మిశ్రమం పూర్తిగా చల్లారాక అరటిపండు ముక్కల మీద పోసి మళ్లీ సుమారు అరగంటసేపు ఫ్రిజ్లో ఉంచి తీసి సర్వ్ చేయాలి. ఫిజీ మింట్ చలివేంద్రం కావలసినవి: పుదీనా ఆకులు - ఒక కట్ట; నిమ్మకాయ - సగం చెక్క; పంచదార పొడి - 3 టీ స్పూన్లు; రాళ్ల ఉప్పు - టీ స్పూను; సోడా లేదా నీళ్లు - 100 మి.లీ. తయారీ: పుదీనా ఆకులను, నిమ్మచెక్కను రసం పిండే దానిలో ఉంచి గట్టిగా ఒత్తి రసం వేరు చేయాలి ఒక గ్లాసులో పంచదార పొడి, ఉప్పు వేసి కలపాలి పుదీనా, నిమ్మ చెక్కల రసాన్ని పంచదార మిశ్రమం మీద పోయాలి సోడా జత చేసి కాసేపు ఫ్రిజ్లో ఉంచి తీసి, చల్లగా సర్వ్ చేయాలి. సేకరణ: డా. వైజయంతి -
ఢిల్లీ సేఠ్ల కొను‘గోల్మాల్’
నున్న మ్యాంగో మార్కెట్లో తలెత్తిన వివాదం సూట్ పద్ధతిపై తిరగబడిన రైతన్నలు కొనుగోళ్లు నిలిపేస్తామంటున్న సేఠ్లు కొనసాగుతున్న చర్చలు నున్న మామిడి మార్కెట్లో ‘సూట్’ వివాద ం తలెత్తింది. ఢిల్లీసేఠ్ల అడ్డగోలు దోపిడీపై రైతులు తిరగబడ్డారు. తాము చెప్పినట్లు వినకుంటే సరకు కొనుగోలు చేయబోమంటూ సేఠ్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు, సేఠ్లు వేర్వేరుగా సమావేశమై వ్యూహరచనలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో ఉత్కంఠత నెలకొంది. చర్చలు సఫలం కాకుంటే శుక్రవారం నుంచి మార్కెట్ స్తంభించే పరిస్థితి నెలకొంది. పశ్చిమకృష్ణా, న్యూస్లైన్ : ఢిల్లీసేఠ్ల దోపిడీపై మామిడి రైతులు తిరగబడ్డారు. సూట్ (డిస్కౌంట్) పేరుతో చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయకుంటే నున్న మామిడి మార్కెట్కు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని రైతులు స్పష్టంచేశారు. సూట్ లేకుంటే సరుకు కొనుగోలు చేయబోమని సేఠ్లు తెగేసి చెబుతున్నారు. ఈ సూట్ వివాదంపై గురువారం రాత్రి ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశమై చర్చలు సాగించారు. ఈ చర్చలు ఫలితం ఇవ్వని పక్షంలో శుక్రవారం నుంచి మార్కెట్ను స్తంభింపజేందుకు రంగం సిద్ధమవుతోంది. మామిడి కాయ కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో తలెత్తిన ఈ వివాదం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే నున్న మార్కెట్ను మామిడి ముంచెత్తింది. రోజుకు 50 నుంచి 70 లారీల సరకు ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలో వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సరకుతో మార్కెట్ నిండిపోయింది కాబట్టి రెండు మూడు రోజులు కాయకోతల్ని నిలపాలని రైతులకు వర్తమానం పంపారు. రైతులు నిలువుదోపిడీ మామిడి రైతులు ఏటా నిలువు దోపిడీకి గురవుతున్నారు. నున్న మ్యాంగో మార్కెట్లో ఏడాదికి రూ.150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వ్యాపారం జరుగుతోంది. టన్నుకు 80 కేజీల చొప్పున సూట్ పేరుతో కోతపెడుతున్నారు. దీనివల్ల రైతులు రూ.15 కోట్ల నష్టపోతున్నారు. దానిమ్మ, కిస్మిస్, యాపిల్ సరకు ఉత్పత్తుల కొనుగోళ్లలో సూట్ విధానం అమల్లో లేదు. హైదరాబాద్, చెన్నై మ్యాంగో మార్కెట్లలోనూ సూట్ తీయకుండానే వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన బడా వ్యాపారులు జిల్లాలో మామిడి మార్కెట్ను శాసిస్తున్నారు. సిండి‘కేట్లు’గామారి ధర నిర్ణయిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో రూ.30 వేలు పలికిన బంగినపల్లి ధర నేడు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పడిపోయింది. మామిడి కాయల కోతలు ముమ్మరంగా సాగే సమయంలో వ్యాపారులు ధరలకు గండికొడుతున్నారు. ఈ క్రమంలో సూట్ విధానంలో ఇక ఉత్పత్తి చేయలేమని రైతులు స్పష్టంచేస్తున్నారు. ఖర్చులు పెరిగాయ్ మామిడి సాగు ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల ఖర్చవుతోంది. కాయకోతలకు రోజుకూలీ రూ.250 చెల్లిస్తున్నాం. గతేడాది ట్రాక్టర్ కిరాయి రూ.1500 ఉంటే ఈ ఏడాది రూ.2 వేలకు చేరింది. ఈక్రమంలో సూట్ విధానం అమలు చేస్తే గిట్టుబాటు ధర దక్కదు. మా కష్టాన్ని ఢిల్లీసేఠ్లు దోచుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. - మాగంటి నాగేశ్వరరావు, మామిడి రైతు, కోడూరు రోజులు మారాయి కాటా ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రోజులు మారాయి. రైతు బాధల్ని వ్యాపారులు అర్థం చేసుకోవాలి. తెగుళ్లకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరుగాలం మేము పడ్డ శ్రమను దోచుకుందామనుకుంటే కుదరదు. ఇక్కడ (నున్న) కాకపోతే వేరే మార్కెట్కు వెళ్తాం. - వీరంకి శ్రీనివాసరావు, మామిడి రైతు, కొత్తూరు తాడేపల్లి ఇదేమీ కొత్తకాదే ఢిల్లీ నుంచి వచ్చి నలభై ఏళ్లుగా మామిడి వ్యాపారం చేస్తున్నాం. సూట్ పేరుతో టన్నుకు 50 నుంచి 60 కేజీలు తీసేస్తాం. ఇది పాత విధానమే. మేం ఎక్కడ కొనుగోలు చేసినా ఇదే పద్ధతి. రైతులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. సూట్ తీస్తే వారికి నష్టమంటున్నారు. తీయకుంటే మాకు నష్టం వస్తోంది. దీనిపై చర్చలు సాగుతున్నాయి. ఏమవుతుందో చూద్దాం. - గౌలత్ రామ్, ఢిల్లీసేఠ్ -
భారీ నష్టం
ఖమ్మం, న్యూస్లైన్: గత మూడు రోజులుగా కురిసిన అకాలవర్షంతో జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల మేరకు పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. అయితే వ్యవసాయశాఖాధికారులు మాత్రం కొండంత నష్టం జరిగితే గోరంత అంచనాలను చూపుతూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 1900 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు నిర్ధారించడం విడ్డూరమని, పంటనష్టం అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు మరోసారి వంచనకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. నష్టం కోట్లల్లో... జిల్లా వ్యాప్తంగా వరిపనుగులు, ధాన్యం, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయలు, మొక్కజొన్న, వేరుశన, పసుపు మొదలైన పంటలు నీటి మునిగి రూ. 30 కోట్ల మేరకు నష్టం జరిగిందని రైతుసంఘాలు అంచనా వేస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో రెండు వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం, మిర్చి, పత్తి, మొక్కజొన్నలు తడిసి పోయాయి. కొత్తగూడెం మండల పరిధిలో చేతికందే దశలో ఉన్న వరి నేలవాలింది. వేపలగడ్డ ప్రాంతంలో వరి నూర్పిడి చేసి బస్తాల్లో నింపి పెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. సింగభూపాలెం చెరువులో మత్స్యకారులు వేసిన చేపలు , మత్స్యకారుల వలలు, తెప్పలు, అలుగువల తదితర సామాన్లు సైతం కొట్టుకుపోయాయి. పాల్వంచ మండలంలోని సోములగూడెం, కరకవాగు, పునుకుల, సూర్యతండ, పూసలతండ, సూరారం, కోడిపుంజులవాగు తదితర గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల్లో కోసి ఆరబోసిన వరిపంట కొంత తడిసింది. పినపాక నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల పంట తడిసింది. పాలేరు నియోజకవర్గంలో వరి,మిర్చి,పసుపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వేసిన వరి పంట ఎక్కువగా కల్లాల్లోనే తడిసిపోయింది. వరి,మిర్చి,పసుపు పంటలకు కలిపి రూ.4కోట్లు నష్టం వాటిల్ల వచ్చని అంచనా. ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. బయ్యారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 100 ఎకరాలలో పండించిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గార్ల మార్కెట్యార్డ్లో రైతులు ఆరబోసుకున్న సుమారు 2000 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, మిర్చి నీటిలో తడిసిపోయాయి. వైరా నియోజకవర్గంలో 8వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిని సుమారు రూ. 2కోట్ల విలువ చేసే నష్టం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. సదాశివునిపాలెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. వివిధ గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినప్పటికీ వర్షపునీరు ఎక్కువగా చేరటంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. నియోజకవర్గంలో సుమారు 4వేల ఎకరాలకు చెందిన వరి, మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట మండలంలో మామిడి, పామాయిల్, నిమ్మ, సపోటా తోటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు వేర్లతో సహా పడిపోయాయి. ముల్కలపల్లి మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. కొండంత నష్టానికి గోరంత అంచనాలు.. అకాలవర్షానికి జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు కనబతున్నా వ్యవసాయ అధికారుల లెక్కలు వేరుగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 948 మంది రైతులకు చెందిన 571 హెక్టార్లలోవరి, 88 హెక్టార్లలో మొక్కజొన్న, 150 ఎకరాల మామిడి, 100 ఎకరాల బొప్పాయి మాత్రమే పంటనష్టం జరిగిందని చెప్పి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నష్టం అంచనాలు వేయడంలో ప్రభుత్వ నిబంధనలు సాకుగా చెబుతున్నారు. నష్టం జరిగిన ప్రతీ రైతుకు పరిహారం ఇవ్వాలి: రైతు సంఘాలు కుండ పోతవర్షం, గాలి దుమారంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 30కోట్లకు పైగా పంటనష్టం జరిగిందని ఏపీ రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వర్రావు పేర్కొన్నారు. మొక్కుబడి అంచనాలతో అధికారులు సరిపెట్టకుండా పంటనష్టం జరిగిన ప్రతిరైతు కుటుంబాన్ని అదుకోవాలని డిమాండ్ చేశారు. పరిహారం అందించడంతోపాటు తడిసిన ధాన్యం, రంగుమారిన మిర్చి, పసుపు, మొక్కజొన్నలను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, ఖరీఫ్ సీజన్కు ఉచితంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందచేయాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు చేసేందుకు సిద్ధమే అని హెచ్చరించారు. -
మామిడి రేటు పుల్లన!
* కొన్ని ప్రాంతాల్లో 70% తగ్గిన పంట * పండ్ల ధర ఇంకాస్త పెరిగే అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండ్ల రారాజు మామిడి సామాన్యుడికి అందనంటోంది. వేసవి ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసిన మామిడి ప్రియులకు ఈ సీజన్లో మాత్రం ఊరిస్తోంది. మేలు రకాలకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం ధర పలుకుతోంది. వివిధ దేశాల నుంచి డిమాండ్ పెరగడం కూడా దీనికి తోడైంది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత మామిడి అధికంగా పండేది ఆంధ్రప్రదేశ్లోనే. రాష్ట్రంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో పంట దెబ్బతింది. దీంతో మామిడి రైతులకు కన్నీళ్లను తెప్పించడమేకాదు అటు సామాన్యుడికి ధరలు షాక్కొడుతున్నాయి. నిషేధం ఉన్నా.. యూరోపియన్ యూనియన్ భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విధించింది. దీంతో మామిడి ధర అనూహ్యంగా తగ్గుతుందని అందరూ భావించారు. వాస్తవానికి ఈయూ దేశాలకు 4 వేల టన్నుల దాకా మాత్రమే ఎగుమతి అవుతోంది. మరోవైపు పంట గణనీయంగా పడిపోవడం వల్లే ధర తగ్గడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అల్ఫోన్సో మేలు రకం గతేడాది ఎగుమతి మార్కెట్లో కిలోకు రూ.150 ఉంటే, ఈ ఏడాది రూ.375 దాకా వెళ్లింది. ప్రస్తుతం ముంబై మార్కెట్లో రూ.200 దాకా ఉంది. బంగినపల్లి మేలైన ఎగుమతి రకం గతేడాది కిలోకు రూ.50 ఉంటే, నేడు రూ.150 దాకా చేరడాన్నిబట్టి చూస్తే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చని హైదరాబాద్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ సబీర్ పటేల్ అంటున్నారు. నాణ్యతా తగ్గింది.. ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. అయితే గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది మామిడి పంట రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 70% దాకా తగ్గింది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 30% పంట తగ్గింద ని యునెటైడ్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద నాయుడు తెలిపారు. చిత్తూరులో అత్యధికంగా 70% పడిపోయిందని అన్నారు. మామిడి నాణ్యత కూడా పడిపోయిందని పేర్కొన్నారు. నూజివీడు ప్రాంతంలో 80% పంట తగ్గిందని తెలుస్తోంది. 50 ఎకరాల పంటకు గతేడాది రూ.25 లక్షలు తీసుకున్న ఓ రైతుకు ఈ ఏడాది దక్కింది కేవలం రూ.2 లక్షలే. మేలైన రకాలు దాదాపుగా ఎగుమతి అవుతున్నాయని, రిటైల్ మార్కెట్లో ద్వితీయ, తృతీయ శ్రేణి రకాలు లభ్యమవుతున్నాయని ఒక వ్యాపారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం.. 2012-13లో దేశవ్యాప్తంగా 18 మిలియన్ టన్నుల మామిడి పండింది. 20% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పాదకతలోనూ ఆంధ్రప్రదేశ్దే ప్రథమ స్థానం. ఇక్కడ సుమారు 2 వేల టన్నుల ఆల్ఫోన్సో పండుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1,300పైగా మామిడి రకాలున్నాయి. ఇందులో భారత్లో 1,000 పైగా రకాలు పండుతున్నాయి. అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(అపెడా) గణాంకాల ప్రకారం 2012-13లో భారత్ నుంచి రూ.265 కోట్ల విలువైన 55,585 టన్నుల మామిడి యూఏఈ, యూకే, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర 50కిపైగా దేశాలకు ఎగుమతి అయింది. ఈయూ దిగుమతి నిషేధం నేపథ్యంలో కొత్త మార్కెట్లపై వ్యాపారులు దృష్టి పెట్టారు. కింగ్ ఆఫ్ మ్యాంగో... సబీర్ మామిడి పండ్లలో ఆంధ్రప్రదేశ్లో పండేవి ఎక్కువ రుచిగా ఉంటాయని అంటున్నారు హైదరాబాద్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ సబీర్ పటేల్. దిగుమతిదారులు ఎక్కువ చెల్లించైనా సరుకు తీసుకుంటారని ఆయన అంటున్నారు. ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణం ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. 400 పైగా మామిడి క్షేత్రాలను నిర్వహిస్తున్న సబీర్కు కింగ్ ఆఫ్ మ్యాంగో అనే పేరు కూడా ఉంది. మామిడి పంట వృద్ధికి కృషి చేస్తున్నందుకుగాను ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి. నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలుకుని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు ఈయన చేతుల మీదుగా మామిడి పండ్లను అందుకున్నవారే. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. అరుదైన మామిడి రకాలు పరసపల్ల దూదియా, ఆజముస్సమర్ వంటివి దేశంలో ఈయన మాత్రమే పండిస్తున్నారు. వీటి ధర కిలోకు రూ.500 పైమాటే. ఒకే చెట్టుకు 25కుపైగా రకాల మామిడి పండ్లను పండించడమూ ఆయనకు తెలుసు. మ్యాంగో ఇన్ ఇండియా పేరుతో ఉర్దూలో ఒక పుస్తకాన్ని సైతం రాశారు. మ్యాంగో ఫెస్టివల్స్ను నిర్వహిస్తూ మామిడికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
మామిడి కోత మెలకువలు: కాయ తొడిమ ఇరువైపులా పసుపు పచ్చరంగు రావడం, కాయ పైన నూనె గ్రంధులు ఏర్పడినప్పుడు కోయాలి. బంగిన పల్లిలో తొమ్మిది, దశేరిలో 8.5 టి.ఎస్. ఎస్. ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి. ఐ.ఐ.హెచ్.ఆర్., ఐ.ఏ.ఆర్.ఐ., డాఫోలి వేర్వేరుగా రూపొందించిన ఆధునిక కోత పరికరాలతో కోయడం ద్వారా కాయకు దెబ్బతగలకుండా నాణ్యతను పెంచుకోవచ్చు. కాయలో ఉన్న జీడి సొన పూర్తిగా కారిపోయే వరకు బోర్లించి ఉంచడం ద్వారా కాయకు జీడి అంటకుండా చూసుకోవాలి. జీడి పూర్తిగా కారిపోయిన తర్వాత గడ్డిలో పేర్చి మాగబెట్టుకోవాలి. కాయలను కోసి కార్బైడ్ ద్వారా మగ్గబెట్టడం చట్టరీత్యా నేరం. కూరగాయలు: వేసవి కూరగాయల నాణ్యత, దిగుబడి దెబ్బతినకుండా కొన్ని మెలకువలు పాటించాలి. నీటి తడులు పలుచగా, తక్కువ వ్యవధి వ్యత్యాసంతో ఇచ్చుకోవాలి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కన్నా ఎక్కువ ఉన్నప్పు డు, సాయంకాలం సమయంలో నీటిని పిచికారీ చేయడం ద్వారా మొక్కలను, కాయలు వేడి వల్ల కమిలిపోకుండా కాపాడుకోవచ్చు.డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడులు ఇవ్వడం శ్రేయస్కరం. భూమిలో తేమ ఆవిరి కాకుండా ప్లాస్టిక్, గడ్డితో మల్చింగ్ చేసుకోవాలి.ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం ఉన్న చోట డ్రిప్ ద్వారానే ఎరువులను అందించాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందువలన 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.4 గ్రాముల ధయోమిధాక్సామ్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
దిగుబడిపై దిగులు
బెల్లంపల్లి, న్యూస్లైన్ : మామిడి తోటల పెంపకానికి తూర్పు ప్రాంతంప్రసిద్ధిగాంచింది. దశేరి, బంగినపల్లి, మల్లిక, తోతపురి తదితర రకాల మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా 23 వేల హెక్టార్లలో మామిడి తోటల పెంపకం జరుగుతోంది. ఇందులో 5 వేల హెక్టార్లలో ఐదేళ్లలోపు మామిడి తోటలు ఉండగా 18 వేల హెక్టార్లలో కాపుకాసే తోటలు ఉన్నాయి. ఏటా జిల్లాలో సుమారు రూ.50 కోట్లకు పైబడి మామిడి వ్యాపారం సాగుతుందనేది అంచనా. అంత పెద్దస్థాయిలో మామిడి వ్యాపారం జరుగుతున్నా స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతానికి తీసుకెళ్లి పంటను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. పగబట్టిన ప్రకృతి మామిడి రైతులు ఐదారేళ్ల నుంచి నష్టాలను చవిచూస్తున్నారు. ఏటా చెట్లకు పూత ఏపుగా రావడం, పూత, పిందె దశలో అకాల వర్షాలు కురిసి, గాలి దుమారం వీయడంతో నష్టం జరుగుతోంది. ఆ ప్రభావం కాపుపై పడుతోంది. ఆ రకంగా దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నారు. ఈ ఏడు కూడా ప్రకృతి మామిడిపై కన్నెర చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు చెట్లకు ఏపుగా పూసిన పూత సగానికిపైగా రాలింది. పూత పడిపోయి ప్రస్తుతం చెట్లకు మామిడికాయలు అంతగా కనిపించడం లేదు. ఒక్కో చెట్టుకు సగటున పది నుంచి ఇరవై కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని తోటల్లో ఆ మాత్రం కాపు కూడా కనిపించడం లేదు. సాధారణంగా ఎకరాకు మూడు టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఆదిలోనే ప్రకృతి దెబ్బతీయడంతో ప్రస్తుతం ఎకరాకు రెండు నుంచి రెండున్నర టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉద్యానవన అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రకంగా మామిడి కాపు పడిపోయి పంట దిగుబడిపై ప్రభావం పడింది. తగ్గిన మామిడి దిగుబడితో వ్యాపారం రూ.50 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పడిపోనుందని వ్యాపార, వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. పది రోజుల క్రితం కురిసిన గాలి దుమారానికి కూడా మామిడి కాయలు రాలాయి. ఎంత యత్నించినా.. మామిడి పూత, పిందెను దక్కించుకోవడానికి రైతులు ఎన్ని యత్నాలు చేసిన సత్ఫలితాలు ఇ వ్వడం లేదు. ఏపుగా పూత రావడానికి రైతులు ముందస్తుగానే చెట్ల మొదళ్లలో దుక్కులు దు న్ని, ఎరువులు వేసి నీటి తడులు అందిస్తారు. ఇందుకోసం హెక్టార్కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా జిల్లా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మామిడి చెట్లకు జనవరి మాసం నుంచి పూత రావడం జరుగుతుంది. మార్చి మొదటి వారం వరకు వచ్చిన పూత పిందె దశకు మారుతుంది. ఏప్రిల్లో ఓ మోస్తారు సైజు కాయ చెట్లకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో మామిడి కోత పనులు ఆరంభమవుతాయి. అయితే ఈసారి కాపు సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పూత, పిందె, కాపును దక్కించుకోవడం కోసం ఇన్నాళ్లు రైతు పడిన శ్రమ వృథా కానుంది. ప్రకృతి వంచనకు గురైన మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
దానమాసం
సందర్భం- ఏప్రిల్ 30 నుంచి వైశాఖ మాసం దానాలకు పేరు పొందిన ఈ వైశాఖ మాసంలో అన్నవస్త్రాలు, శయ్య, బియ్యం, మామిడిపళ్లు, ఆవునెయ్యి, మజ్జిగ, చెరకు రసం, అరటి పండ్లు దానం చేసిన వారికి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసమని పేరు. మాసాలన్నింటిలోకి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైనదిగా పురాణాలు పేర్కొన్నాయి. చాంద్రమానాన్ని అనుసరించే ప్రజలు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరారంభంగా ఏ విధంగా భావిస్తారో సౌరమానాన్ని ఆచరించే జనులు వైశాఖమాసం మొదలయ్యే రోజును అంటే వైశాఖశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా భావిస్తారు. అక్షయతదియ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, హనుమజ్జయంతి, బుద్ధపూర్ణిమ వంటి ఎన్నో పర్వదినాలకు ఆవాసం ఈ మాసం. కొద్దిపాటి దానానికైనా అనంతమైన ఫలాలనిచ్చేదిగా పేరు పొందిన ఈ మాసంలో మండు వేసవిలో ఎండనబడి వెళ్లే బాటసారులకోసం ఒక కుండతో నీళ్లు ఏర్పాటు చేసి, అడిగిన వారికి నీరు అందిస్తే అదే జలదానం. దానితోబాటు అన్నవస్త్రాలు, శయ్య, బియ్యం, మామిడిపళ్లు, ఆవునెయ్యి, మజ్జిగ, చెరకు రసం, అరటి పండ్లు దానం చేసిన వారికి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్య తీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మ పురాణం చెబుతోంది. చెరువు, సరస్సు లేక బావి వీటిల్లో ఏదైనా సరే ఈ వైశాఖ స్నానానికి యోగ్యమైనదే! నెల పొడవునా స్నానం చేయలేనివారికి మూడు రోజుల్లో అయినా స్నానం చేయాలని చెబుతారు. అవి - శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. ఈ మూడు తిథుల్లో చేసే స్నానానికి కల్మషాలను కడిగేసే శక్తి ఉంటుంది. స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి. నల్ల తులసి, తెల్ల తులసి, రెండూ ఈ మాసంలో హరిపూజకి అనుకూలమైనవే. ఈ విధంగా త్రికాలపూజ చేసే వారికి పునర్జన్మ ఉండదని పద్మపురాణ వచనం. ఈ మాసంలో ఆవును అర్చించినవారి దుర్గతులు దూరమవుతాయని పురాణోక్తి. వైశాఖశుద్ధ పాడ్యమి నాడు శాస్త్రప్రకారం స్నానం చేసినవారు వేయి ఆవుల దానం వల్ల, భూమిని దానం చేయటం వల్ల లభించే ఫలితాన్ని పొందుతారని ప్రతీతి. అట్లాగే ఏకభుక్తం, నక్తం లేక అయాచితం... వీనిలో ఏదైనా ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖపురాణం చెబుతోంది. ఈ వైశాఖస్నాన వ్రత సంపూర్ణ ఫలితాన్ని పొందాలనుకునేవారు చేయవలసిన దాన విశేషాల్ని గురించి వామన పురాణం ఏమి చెబుతోందంటే... పాడి ఆవు, పాదుకలు, పాదరక్షలు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం దానం చేయాలి. వీలైనంతమందికి భోజనం పెట్టి నీటితో నింపిన కలశాన్ని, యవలను దానం చేసి, దక్షిణ ఇవ్వాలి. అందుకు శక్తి లేనివారు కనీసం పది మందికి పులగం వండిపెట్టాలి. ఈ మాసంలో చలివేంద్రాలు నిర్వహించటం, శివుడికి నిరంతరాయంగా అభిషేకం జరిగేలా చూడటం, పితృదేవతలకు తర్పణలు ఇవ్వడం, చెప్పులు, గొడుగు, వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది. వీటితోబాటు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశిష్ఠ ఫలాలనిస్తుందని శాస్త్రవచనం. వైశాఖంలో పర్వదినాలు ఏప్రిల్ 30 నుంచి వైశాఖమాసం ఆరంభమవుతోంది. అన్నట్లు ఇది దానాల మాసం మాత్రమే కాదు. అనేక పర్వదినాలకు ఆవాసం కూడా! మే 2, శుక్రవారం అక్షయతృతీయ: ఈరోజున చేసే పూజ, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికాపేరొచ్చింది. మే 4, ఆదివారం శంకర జయంతి: సాక్షాత్తూ శంకరుని అంశతో జన్మించినట్లుగా చెప్పుకునే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు జన్మించిన పుణ్యతిథి శంకర జయంతి. మే 4న పరశురామ జయంతి కూడా! మే 13, మంగళవారం నృసింహ జయంతి: వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మే 14, బుధవారం బుద్ధపూర్ణిమ: కర్మాచరణ కన్నా ధర్మాచరణ ముఖ్యమని, అన్ని వ్రతాలలోకెల్లా అహింసావ్రతమే మిన్న అని బోధించి, మానవాళి కష్టాలకు మూలకారణమైన కోరికలను త్యజించాలని చెప్పిన గౌతముడు జ్ఞానం పొంది, బుద్ధుడైన రోజు. మే 23, శుక్రవారం హనుమజ్జయంతి: ఉత్తర భారతంలో చైత్రమాసంలో చేస్తే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతిజరుపుకుంటారు. హనుమంతుని అనుగ్రహం కోసం ఈరోజున సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. శ్రీ సీతారామచంద్రులను పూజిస్తారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు పైన చెప్పిన వాటిలో అన్నీ కాకపోయినా, కనీసం కొన్నింటిని ఆచరించినా మంచిది. - డి.కృష్ణకార్తిక -
అకాల వర్షం
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్లైన్: జిల్లాలో వర్షాకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున 4నుంచి 9గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చొప్పదండి, ధర్మపురి, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో గింజ పోసుకునే దశలో ఉన్న వరి నేలవాలింది. కొన్నిచోట్ల వరి కోసి ధాన్నాన్ని కల్లాల్లో ఆరబెట్టగా తడిసి ముద్దయింది. ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలగా, బట్టీలకు సిద్ధంగా ఉన్న ఇటుక తడిసి ముద్దయింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపో యి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అత్యధిక ంగా ధర్మారం మండలంలో 62.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రామడుగులో 1.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 8 మండలాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లాలో సగటున 6.7 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షపాతం ఇలా... కరీంనగర్ 33.6మిల్లీమీటర్లు, మానకొండూర్ 24.2, రామడుగు 1.3, చొప్పదండి 61.4, పెగడపల్లి 9.3, వేములవాడ 6.8, శ్రీరాంపూర్ 20.0, పెద్దపల్లి 6.0, ఓదెల 5.4, రామగుండం 19.8,, సుల్తానాబాద్ 10, వెల్గటూర్ 12.2, ధర్మారం 62.2, జూలపల్లి 46.2 ఎలిగేడ్ 56.2, మంథని 3.2, కమాన్పూర్ 5.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
గాలివాన, వడగళ్ల బీభత్సం
దోమ / కుల్కచర్ల, న్యూస్లైన్: అన్నదాత ఆశలను ప్రకృతి అడియాస చేసింది. శుక్రవారం జోరుగాలి, వడగళ్లతో విరుచుకుపడిన వాన దోమ, కుల్కచర్ల మండలాల్లో పంటలను నాశనం చేసింది. తీవ్రమైన గాలికి వడగళ్ల వర్షం తోడవడంతో వేల సంఖ్యలో మామిడి కాయలు రాలిపోయాయి. గాలివాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. దోమ మండలంలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో పెంచుతున్న మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఉదన్రావుపల్లి గ్రామంలో వడగళ్ల ధాటికి సుమారు 40ఎకరాల్లో వరి పంట చేతికందకుండా పోయింది. దోమతో పాటు ఎల్లారెడ్డిపల్లి, లింగన్పల్లి, దిర్సంపల్లి, బ్రాహ్మణ్పల్లి, ఉదన్రావ్పల్లి, పాలేపల్లి, ఐనాపూర్, మోత్కూర్ తదితర గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కన్నీటిపర్యంతమైన రైతులు వడగళ్ల వాన దోమతో పాటు ఉదన్రావ్పల్లి గ్రామాల్లో వరి పంట సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సుమారు 40 ఎకరాల్లో ధాన్యం నేల రాలి పాడైపోయింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్క దోమ గ్రామంలోనే రైతు గానుగ నర్సయ్య 16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నాశనమైంది. దోమ సర్పంచ్ రాధాబాయి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. బాధిత రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కుల్కచర్లలో... మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్లు ప్రజలతో పాటు రైతులకు నష్టం మిగిల్చాయి. అంతారం, కుల్కచర్ల, బండ వెల్కిచర్ల, పుట్టపహడ్, ఘణపూర్ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, తోటల్లో పెద్దసంఖ్యలో మామిడికాయలు నేలరాలాయి. జోరుగాలికి కుల్కచర్ల, బంగరంపల్లి గ్రామాల్లో 20 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలో ఈడ్గి పుల్లయ్యగౌడ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. -
మామిడిపండ్లు,పులిబొంగరాల కోసం ఎదురుచూపులు...
జ్ఞాపకం వేసవి... పిల్లల హుషారుకు కొత్త రెక్కలు తొడుగుతుంది. వారిని ఊహల గుర్రం ఎక్కిస్తుంది. పెద్దవారినైనా మళ్లీ బాల్యంలోకి తీసుకెళుతుంది. జ్ఞాపకాల కొమ్మల్లో దాగిన మిఠాయి పొట్లాన్ని విప్పి తియ్యని కబుర్లెన్నో చెబుతుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రమణ గోగుల వేసవి జ్ఞాపకాలలో దాగున్న తియ్యటి బాల్యంలోకి ఇలా ప్రయాణించారు. ‘‘ఇప్పటి పిల్లలకు వేసవి ఎలా ఉంటుందో కానీ ఎండాకాలం వస్తోందంటే చాలు నేటికీ చిన్నతనంలో నేను వెళ్లిన ఊరు, అక్కడ చేసిన అల్లరి, ఇంట్లోవారికి తెలియకుండా కొనుక్కున్న పులిబొంగరాలు, ఆడిన కోతికొమ్మచ్చి, క్రికెట్ ... అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీపడి గుర్తుకొచ్చేస్తాయి. మాది విశాఖపట్టణం. నాన్నకు అక్కడే ఉద్యోగం. మా బాబాయి వాళ్లది నెల్లూరు జిల్లాలోని కావలి. పరీక్షలు అయిపోగానే ప్రతి వేసవికి కావలి వెళ్లిపోయేవాళ్లం. మా కోసం చిన్నమ్మ బోలెడు పిండివంటలు చేసి ఉంచేది. కొత్తబట్టలు కుట్టించి ఉంచేవారు. రోజూ మామిడిపండ్లు.. ఎంత తిన్నా ఇంకా తినాలపించే తియ్యటి రుచి వాటిది. సాయంత్రం ఐస్క్రీమ్ బండి దగ్గర ఐస్ప్రూట్ కొనాల్సిందే! కాసేపు ఆటలు. ఆ తర్వాత సోంపాపిడి. అటూ ఇటూ చూస్తే ఒక చిన్నగల్లీలో ఓ ముసలావిడ పులిబొంగరాలు చేసేది. వాటి రుచి ఇప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్లూరాల్సిందే! నోటికి ఖాళీ, కాళ్లకు అలసట ఉండేదే కాదు. అంత సంబరం వేసవి అంటే!! సినిమాకు వెళ్లేటప్పుడైతే పెద్ద పండగే! అప్పుడన్నీ సైకిల్ రిక్షాలు. రెండు, మూడు సైకిల్ రిక్షాల మీద అంతా కలిసి సినిమాకు వెళ్లేవాళ్లం. సెలవులు అయిపోయాక మళ్లీ వేసవి కోసం ఎదురుచూస్తూ విశాఖపట్టణం చేరేవాళ్లం. అప్పుడప్పుడు వేసవికి మా చిన్నమ్మ వాళ్ల కుటుంబం వచ్చేది. వస్తూ వస్తూ చిన్నమ్మ సున్నుండలు తెచ్చేది. రోజూ సాయంత్రం అందరం కలిసి బీచ్కి వెళ్లేవాళ్లం. మా ఇల్లు ఆంధ్రా యూనివర్శిటీకి దగ్గరి కాలనీలో ఉండేది. కాలనీలోనే పార్క్.. అందులో పేద్ద మామిడిచెట్టు. మా స్నేహితులతో కలిసి అక్కడే కోతికొమ్మచ్చి ఆటలు ఆడేవాళ్లం. మామిడికాయలు కోసి ఉప్పు-కారం పెట్టి తినేవాళ్లం. అక్కడ ఏర్పాటుచేసిన రేడియో నుంచి క్రికెట్ కామెంట్రీ వింటూ మేమూ క్రికెట్ ఆడేవాళ్లం. రాత్రి పూట మేడపైన కూర్చొని ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్లం. బోలెడన్ని కథ లు చెప్పుకునేవాళ్లం. అప్పుడు ఎక్కువగా విషయాలు వినడం వల్ల ఎక్కువగా ఊహించుకోవడం ఉండేది. అదే నేను సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది. జీవితకాలంలో చిన్నప్పటి వేసవి సెలవుల ఆనందాన్ని లెక్కేస్తే అత్యంత స్వల్పం. కానీ అదే జీవితాంతం వెంట వచ్చే ఓ తీపి జ్ఞాపకం. సృజనకు అతి పెద్ద వేదిక వేసవి.’’ -
మామిడి అ‘ధర’హో!
న్యూఢిల్లీ: మామిడి ధరలు ఈ ఏడాది చుక్కలు చూపే అవకాశం ఉందని ‘అసోచామ్’ అధ్యయనంలో వెల్లడైంది. నోరూరించే మన మామిడికి విదేశాల నుంచి భారీగా డిమాండ్ ఉండటం, అందుకు తగినట్లుగా దిగుబడి లేకపోవటమే దీనికి కారణం. గత నెలలో అకాల వర్షాల కారణంగా మామిడి తోటలు దెబ్బ తినటంతో దేశంలో దిగుబడి ఈ ఏడాది 20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లో మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 50 శాతానికిపైగా మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. దేశంలో మామిడి దిగుబడిలో 2/3 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మామిడిలో సగం ఆంధ్రప్రదేశ్, యూపీ నుంచే వస్తోంది. గత మూడేళ్లలో విదేశాలకు మామిడి ఎగుమతులు 27 శాతం పెరిగాయి. 2012-13లో రూ.267 కోట్ల విలువైన మామిడి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్లో మామిడి ధరల పెరుగుదలకు ఇది ప్రధాన కారణం. భారత్ నుంచి అత్యధికంగా యూఏఈకి 61 శాతం మామిడి ఎగుమతి అవుతోంది. బ్రిటన్, సౌదీ అరేబియా తరువాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 1,300కిపైగా మామిడి రకాలున్నాయి. ఒక్క భారత్లోనే 1,000కిపైగా రకాలను సాగు చేస్తున్నారు. -
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు
సాల్వాపూర్, మన్సాన్పల్లిలో భారీగా పంటనష్టం వెయ్యి ఎకరాల్లో ధ్వంసమైన వరి పంట రాలిపోయిన మామిడి కాయలు బచ్చన్నపేట, న్యూస్లైన్ : ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం కురిసిన వడగళ్లతో కుదేలైన రైతులు, ఆదివారం రాత్రి మరోసారి ప్రకృతి సృష్ట్టించిన బీభత్సానికి విలవిలలాడారు. వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన దుమారంతో వందలాది ఎకరాల్లో మామిడి చెట్లు విరిగిపోవడమేగాక, కాయలు రాలిపోయాయి. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, పడమటికేశ్వాపూర్, ఇటికాపల్లి, బచ్చన్నపేట, తమ్మడపల్లి, కట్కూరు, చినరామన్చర్ల, బసిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మండలవ్యాప్తంగా గోలి సైజులో గంటన్నరపాటు కురిసిన వడగళ్లు వెయ్యి ఎకరాల్లో వరి పంటను నాశనం చేశాయి. సుమారు 250 ఎకరాలకుపైగా మక్క పంట, మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు. బాధిత రైతులను ఆదుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్లు చొక్కం వరల క్ష్మి, బండకింది చంద్రకళ, భైరగోని బాలమణి, బేజాటి సిద్దులు, కాంగ్రెస్ నాయకులు గూడ చెన్న కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. మద్దూరులో గాలి దుమారం మద్దూరు : మండలంలో ఆదివారం సాయంత్రం భారీ గాలిదుమారం రావడంతో చేతికందిన వరి పంట నాశనమైంది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి నిలవ నీడలేకుండా చేశాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికందే సమయంలో గాలి దుమారం రావడంతో రైతు లు కన్నీరుమున్నీరయ్యారు. చేసిన అప్పులు ఎలా తీరేదని వాపోతున్నారు. మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
వడగళ్ల బీభత్సం
జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతోకూడిన భారీ వర్షం కురిసింది. రేగోడ్, కంగ్టి, మనూరు, అల్లాదుర్గం మండలాల్లో పెను బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఉల్లి, కూరగయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వడగళ్ల ధాటికి రేగోడ్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పంటలన్నీ వర్షార్పణం అల్లాదుర్గం రూరల్: మండలంలో శనివారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. ఉల్లి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని గొల్లకుంట తండాలో విఠ్యానాయక్కు చెందిన లేగదూడ వడగళ్ల వానకు మృతి చెందింది. మండలంలోని వెంకట్రావుపేట, రెడ్డిపల్లి, అల్లాదుర్గం, గొల్లకుంట తండా తదితర గ్రామాలలో భారీగా వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్న మరుగుదొడ్ల పైకప్పు రేకులు అల్లంతదూరంలో ఎగిరిపడ్డాయి. హాస్టల్ గదులలోకి నీరు వచ్చి చేరింది. రాత్రంతా విద్యార్థులు చీకట్లో జాగారం చేయాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మి ఇంటి పైకప్పు రేకులు వడగళ్ల దెబ్బకు పూర్తిగా పగిలి పోయాయి. కాగా అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను జిల్లా అధికారులు గుర్తించి ఆదుకోవాలని మండల రేణుకా ఎల్లమ్మ రైతు సంఘం అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. నిండా ముంచిన వాన రేగోడ్, న్యూస్లైన్: మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వెంకటాపురంలో కురిసిన భారీ వడగళ్ల వానతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ క్షేత్రాల్లో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక నర్సయ్య ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. ఇంట్లో ఉన్న వంట సామగ్రి, వరిధాన్యం, సిమెంటు బస్తాలు, ఎరువుల బస్తాలు తడిసిపోయాయి. రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధితుడు నర్సయ్య తెలిపారు. 10 ఎకరాల్లో టమాటా పంట నీట మునిగింది. జొన్న 25, మొక్క జొన్న 70, వరి 25 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మామిడి కాయలు, చింతపండు చెట్ల నుంచి రాలిపడి తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. రైతు నాగిరెడ్డికి చెందిన మూడున్నర ఎకరాల్లో మామిడి చెట్లనుంచి మామిడి కాయలు కింద రాలిపడ్డాయి. మరో నాలుగెకరాల్లో చెరకు నేలకొరిగింది. దీం తో రెండు లక్షల రూపాయలు నష్టం జరిగిందని తెలిపారు. కొండాపురంలో సైతం వడగళ్ల వర్షం కురిసింది. రైతాంగం అతలాకుతలమయ్యింది. మం డలంలో సుమారు 15 ఇళ్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు. బురాన్వాడి తండా, రేగోడ్, మర్పల్లి, చౌదర్పల్లి, పోచారం, ప్యారారం, టి.లింగంపల్లి, సిందోల్, ఆర్.ఇటిక్యాల తదితర గ్రామాల్లో ఉల్లి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, వరి పంటలు దెబ్బతిన్నాయి. రాయిలొంక తండాలో రేకులు పడి కేలీబాయి అనే మహిళ గాయపడింది. కాగా మండలంలో 48.2 వర్షపాతం నమోదు అయినట్లు ఎంఆర్ఐ మర్రిప్రదీప్ తెలిపారు. అంతా అస్తవ్యస్తం మనూరు, న్యూస్లైన్: మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మనూరులో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు వృక్షాలు నేలవాలాయి. గ్రామాల్లోని ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. గ్రామాల శివారులో గొర్రెల మందలు కలిగిన రైతులు ఆందోళనకు గురయ్యారు. పొట్పల్లిలో పండరికి చెందిన రెండు గొర్రెలు మృ త్యువాత పడ్డాయి. డోవూరులోని నర్సుగొండకు చెందిన రెండెకరాల చెరకు పూర్తిగా నేలకొరిగింది. ఇదే గ్రామంలో నీర్ సంగయ్యకు చెంది న ఇల్లు ధ్వంసమైంది. మనూరు ఎస్సీ వాడలోని బి.విఠల్ ఇంటిపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. చేతికొచ్చిన ఉల్లిపంట వర్షం కారణంగా పూర్తిగా కుళ్లిపోయిందని రైతులు ఆవేదనతో తెలిపారు. ఎటు చూసినా జలమయమే కంగ్టి, న్యూస్లైన్: ‘మూలిగే నక్కపై తాటి పండు పడిన ’ చందంలా కురిసిన అకాల వర్షం రైతులను మరింత కుంగదీసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఎక్కడ చూసినా వరద నీటితో జలమయమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వారం నుంచి అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని భీంరా, దెగుల్వాడి, తుర్కవడ్గాం, బోర్గి, చౌకాన్పల్లి, వాసర్, రాంతీర్థ్, సుక్కల్తీర్థ్, గాజుల పాడ్, ఎన్కెమూరీ, నాగూర్, సిద్ధంహంగిర్గ గ్రామా ల్లో భారీ వర్షం కురిసింది. రాంతీర్థ్, వాసర్ ఊరవాగు, వంగ్దాల్ వాగుల్లో వరద నీరు ఉధృతమై పొంగి పొర్లాయి. చేతికొచ్చిన కంది పంటను రైతులు వారం కితం కోసి చేనులో ఉంచారు. కంది పంట బాగా తడిసి ముద్దయ్యింది. పంట రాశులు చేయకముందే గింజలు ఉబ్బి మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. శనగ పంట, తెల్ల కుసుమ పంటల పరిస్థితి మరి దయనీయంగా మారింది. కోసి ఉంచిన శనగపంట కుప్పలు నలుపు రంగులోకి మారి కుళ్లిపోయాయి. టమాటా, మిరప తదితర కూరగాయల పంటలు నెలకొరిగి బాగా దెబ్బతిన్నాయి. కంగ్టి పరిసర ప్రాంతాల్లో 44.06 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు మండల సహాయ గణాంకాధికారి రుస్తుం జలీల్, కంగ్టి వీఆర్ఓ సీహెచ్.అంజయ్య ఆదివారం తెలిపారు.మార్చి నెలలో సాధారణ వర్షపాతం కేవలం 13.0 మిల్లీమీటర్లు కాగా ఈనెల 7వ తేదీ వరకే 107 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
కడగండ్లు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్లైన్: అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. వడగళ్ల వానలతో మిర్చి, మొక్కజొన్న, వరి, పెసర, నువ్వులు, బొబ్బెర తదితర పంటలతో పాటు మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, బూర్గంపాడు, పినపాక, భద్రాచలం, వెంకటాపురం, వాజేడు, చర్ల, చింతూరు, దుమ్ముగూడెం, మణుగూరు తదితర మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిసి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. భద్రాచలం ఏరియాలో దాదాపు 50 వేల క్వింటాళ్లకు పైగా మిర్చి కల్లాల్లో తడిసింది. ఈ పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి తదితర మండలాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు, పినపాక తదితర మండలాల్లో వరి, పెసర, బొబ్బెర, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే, వ్యవసాయ శాఖ మాత్రం అందుకు బిన్నంగా లెక్కలు చూపుతోంది. నిబంధనల మేరకు 50 శాతం నష్టం జరిగితేనే ఆ పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ నిబంధన ప్రకారం వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలి. ఆ తరువాత వ్యవసాయ నిపుణులు వారి నిబంధనల మేరకు నష్టాలను నిర్ధారించాలి. ఆయా రిపోర్టుల ఆధారంగా పంట నష్టాల నివేదికలను గుర్తిస్తారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాల ప్రాథమిక రిపోర్టును పంపాలని జేడీఏ పి,బి భాస్కర్రావు ఆదేశం మేరకు మండల వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. దీని ప్రకారం జిల్లాలో 1296 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం సంభవించినట్లు గుర్తించారు. ఇల్లందు మండలం రొంపేడు, కొమరారం, టేకులపల్లి మండలం గంగారం, కోయగూడెం, కొప్పురాయి, బూర్గం పాడు మండలం టేకులచెరువు, నాచిరిపేట, ఎన్.కె.బంజర, పాల్వంచ మండలం యానంబైలు, పాయకారి యానంబైలు, కొత్తగూడెం మండలం రేగళ్ల గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలుల ప్రభావంతో వరి, పెసర, బొబ్బర, మొక్కజొన్న, నువ్వులు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ గుర్తించింది. పాల్వంచ డివిజన్లో 60 మంది రైతులకు చెందిన 42 హెక్టార్లలో వరి, 25 మంది రైతులకు చెందిన 20 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో బొబ్బర, 50మంది రైతులకు చెందిన 50 హెక్టార్లలో మొక్కజొన్న, 10 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో నువ్వుల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేశారు. ఇల్లందు డివిజన్లో 336 మంది రైతులకు చెందిన 118 హెక్టార్లలో, కొత్తగూడెం డివిజన్లో నలుగురు రైతులకు చెందిన 2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అంచనా వేశా రు. మోరంపల్లి బంజర డివిజన్లో 220 మంది రైతులకు చెందిన 140 హెక్టార్లలో వరి, 18 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 24 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. స్థానిక వ్యవసాయాధికారుల నుంచి ప్రాథమికంగా అందిన నివేదికను కలెక్టర్కు, వ్యవసాయ శాఖ కమిషనర్కు అందజేసినట్లు భాస్కర్రావు ‘న్యూస్లైన్’కు చెప్పారు. కాగా, వడగండ్ల వర్షాలతో ఉద్యానవన పంట లకు ఎలాంటి నష్టం జరగలేదని ఆశాఖ సహా య సంచాలకులు సూర్యనారాయణ, మరియన్న చెప్పారు. -
వర్షార్పణం!
తాండూరు, న్యూస్లైన్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వ్యాపారులకూ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది. అమ్ముకునేందుకు యార్డుకు తరలించిన పంటలతోపాటు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులు వర్షార్పణం అయ్యాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రితం రోజు వర్షానికి వేలాది బస్తాల వేరుశనగలు, కందులు, శనగలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 12 వేల బస్తాల్లో నిల్వ చేసిన వేరుశనగలు నల్లగా రంగు మారాయి. సుమారు రూ.2 కోట్ల మేరకు పప్పుధాన్యాల ఉత్పత్తులు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు. ఒకవైపు వర్షం జోరు.. మరోవైపు వడగళ్లు కురవడంతో యార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు, హమాలీలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునేందుకు రెండో షెడ్ లేకపోవడమే నష్టానికి కారణమని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు పాలకమండలి, మార్కెట్యార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా షెడ్ నిర్మాణం చేపట్టలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అలాగే హైదరాబాద్ మార్గంలోని ఖాంజాపూర్ సమీపంలో కొత్త యార్డు ఏర్పాటులో జాప్యాన్ని వారు తప్పుపడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చుతారని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మాకెవరు దిక్కని రైతులు వాపోతున్నారు. ఇకముందైనా ఇలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు మార్కెట్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు. రెండు రోజల నుంచి కురుస్తున్న వర్షాలకు షాబాద్ మండలంలోని కక్కులూరు, కేసారం, నరెడ్లగూడ, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో మిర్చి, కీరదోస, సొరకాయ, టమాటా, ఉల్లి, క్యాబేజి, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, పూలతోటలకు నష్టం వాటిల్లింది. వడగళ్లు, ఈదురు గాలులకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, శేరిగూడ, నాగన్పల్లి, పోల్కంపల్లి, ముకునూరు, నైల్లి గ్రామాల పరిధిలో గల వందలాది ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పూత, పిందెలు రాలిపోయాయి. రాందాస్పల్లి, మల్శెట్టిగూడ, చింతపల్లిగూడ తదితర గ్రామాల్లో వడగళ్లు పడడంతో వివిధ పంటలకు నష్టం కలిగింది. మేడ్చల్ మండలం డబిల్పూర్, సోమారం, లింగాపూర్, రాయిలాపూర్, బర్మాజిగూడ, శ్రీరంగవరం గ్రామాల్లో టమాటా, ఆలుగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గిలో వడగళ్ల కారణంగా మిరప పంట దెబ్బతిన్నది. వరుస నష్టాలను చవిచూస్తున్న మిర్చి రైతులకు ఈ సారీ కలిసిరాలేదు. కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో అధిక మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాచుపల్లి, ధన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, దాసర్లపల్లి గ్రామాల్లో వడగళ్లకు క్యాప్సికం, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా, కీరదోస, చిక్కుడు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. -
కిష్టంపేటలో దారుణహత్య
రాయికల్, న్యూస్లైన్: జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగిపోతోంది. కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో తరిమితరిమి నరికిచంపుతున్న ఘటనలు ఇటీవల బాగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట వీణవంక మండలం నర్సింగాపూర్లో మాజీ ఎంపీటీసీని వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన మరువకముందే ఇప్పుడు రాయికల్ మండలం కిష్టంపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది. కిష్టంపేటకు చెందిన కచ్చకాయల మోహన్(35)ను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మోహన్ ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగివస్తుండగా గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో గుర్తుతెలియని వ్యక్తులు కాపుకాసి అడ్డుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో చల్లి వేటకొడవళ్లతో దారుణంగా నరికారు. తల, ముఖంపై, కడుపులో విచక్షణా రహితంగా పొడిచారు. ఓ కత్తిని అతడి పొట్టలోనే వదిలేశారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ పరమేశ్వర్రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ, రాయికల్ ఎస్సై రామూనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు భూతగాదాలు, పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలంలో దుండగులు ఏపీ 15 క్యూ 3473 నంబర్ గల ద్విచక్రవాహనం వదిలివెళ్లారు. ఈ వాహనం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మృతుడి భార్య వసంత అడ్డుకుంది. తనకు గ్రామంలోని పది మందిపై అనుమానం ఉందని, తన భర్తను వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ... అనుమానితుల పేర్లను ఎస్సైకి వివరించింది. వారిని వెంటనే శిక్షించాలని, అప్పటివరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లొద్దంటూ అడ్డుకుంది. దోషులను పట్టుకుంటామని, న్యాయం చేస్తామని సీఐ నచ్చజెప్పడంతో ఆమె ఆందోళన విరమించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మోహన్కు భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి జీవన్రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కాగా, మృతుడికి కొందరితో భూ తగాదాలు ఉన్నాయని, ఓ హత్యకేసులో జైలుకెళ్లి వచ్చాడని స్థానికులు తెలిపారు. -
'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి
ఢిల్లీ రాష్ట్ర మంత్రి రాఖీ బిర్లా కారుపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మంగోళ్ పూరి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతి చిన్న వయస్సులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రివర్గంలో రాఖీ చోటు సంపాదించారు. కొందరు రాఖీ కారును చుట్టుముట్టి హంగామా సృష్టించారు. అక్కడ జరిగిన గలాటాలో ఆమె ప్రయాణిస్తున్న కారు విండో స్క్రీన్ ను పగిలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని పోలీసులు తెలిపారు. -
మీరు భూమి సొత్తా? భూమి మీ సొత్తా?
వివేకం మీరు పుట్టినప్పుడు, మీ శరీరం ఎంతుండేది? ఇప్పుడెంతైంది? అది పెరగడానికి ఏం చేశారు? ఆహారం ఇచ్చారు. ఆహారం ఎక్కడి నుండి లభించింది? ఈ నేల నుండి. మీరు తిన్న ప్రతి పండు, కాయ ఈ మట్టితో, నీటితో తయారైనవే కదా! మాంసాహారి అయితే మీరు తినే మేక, కోడి కూడా ఈ మట్టిలో లభించినదాన్నే తిని పెరిగాయి. కనుక ప్రధానంగా ఈ మట్టి వల్లనే మీ శరీరం తయారైంది. అంటే ఈ శరీరానికి మట్టి చేర్చి, చివరకు దాన్ని ‘నేను’ అంటున్నారు. ఒక పాత్రలో నీరున్నది. అదీ, మీరూ ఒకటేనా? కాదనే అంటారు. ఆ నీటిని తాగేయండి. అది మీ శరీరంలో కలిసిపోగానే, దాన్ని ఏమంటారు? ‘నేను’ అనే కదా! అంటే ఏదైనా మీ ‘అనుభూతి’లోకి రావడాన్నే ‘మీరు’ అని భావిస్తారు. బయట ఉన్న నీరు, నేల, గాలి, వేడి.. వీటితోనే సృష్టింపబడ్డారని తెలుసా? అవి మీలో ఒక భాగమైన పిమ్మట, వాటిని వేరుచేసి చూడటం వీలు పడదు కాబట్టి, మొత్తం ‘నేను’ అంటున్నారు. అంటే కొంత ఆ మట్టి మీ రూపంలో శ్వాస వదులుతున్నది. ఇంకొంత మట్టి మీ తోటలో ఎత్తుగా ఎదిగిన చెట్టుగా ఉన్నది. మరికాస్త మట్టి మీరు కూర్చున్న కుర్చీగా మారిపోయింది. ఇదే మట్టి కాలచక్రంలో మామిడిచెట్టుగా, వేప చెట్టుగా, గడ్డిగా, పువ్వుగా, వానపాముగా, మనిషిగా పలురకాల అవతారాలను ధరిస్తోంది. మీ ఆలోచనా విధానాన్ని బట్టి చూసినా అది నిజమే! మీరు ఊదిన బెలూన్లో మీ ఊపిరి గాలి దాగి ఉంది. బెలూన్ పగిలి, అది బయటికి పోగానే, మీలోని ఒక భాగం, బయటి గాలిలో కలిసిపోయినట్లే కదా! సూక్ష్మంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మీరొక భాగమై ఉన్నట్లే. ఈ ప్రపంచం కూడా మీలో ఒక భాగమేనని అర్థం చేసుకున్నారా? దీన్ని బుర్ర ఉపయోగించి అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతరంగంలో అది స్ఫురిస్తే, అదే ఆధ్యాత్మికం! అంతేకాని, ఆధ్యాత్మికం అంటే గుళ్లకు వెళ్లి టెంకాయలు కొట్టడం కాదు. కొవ్వొత్తి వెలిగించడమూ కాదు. మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థించడమూ కాదు. దీన్ని అర్థం చేసుకుంటే, దేవుడి కోసం ఎదురు చూడకుండా, మీ స్వర్గాన్ని మీరే నిర్మించుకోగలరు. ఒక యోగి మరణశయ్య మీదున్నాడు. తన శిష్యులకు తాను స్వర్గానికి పోవడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ‘‘దేవుడి మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు. మిగతావాళ్లు నరకం అనుకునే ప్రదేశానికి నన్ను పంపినా, దాన్ని కూడా స్వర్గంగా భావించడం నాకు తెలుసు,’’ అన్నాడా యోగి. నిజమే! మీ అంతరంగం దేన్నైనా స్వర్గంగా మార్చవచ్చు. లేదా నరకంగా చేయవచ్చు. అది బాహ్య స్థితి వల్ల కాదు. మీరూ మీ పక్కనున్నదీ ఒకటే అని తెలుసుకోగలిగారంటే- తర్వాత ఎవరి మీద ఈర్ష్యపడతారు! అసూయ పడతారు! ఎవరితో కొట్లాడుతారు? ఎవరితో పోటీ చేస్తారు? ఎవరితో శత్రుత్వం పెంచుకుంటారు? ఆ అనుభవం వచ్చిన పిమ్మట, బయట పరిస్థితులెలా ఉన్నా అంతరంగంలో మీకు ఎప్పుడూ స్వర్గమే! సమస్య - పరిష్కారం ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. ఈ మధ్య అనేక మంది గురువుల గురించిన వార్తలు విన్న తరువాత ఇలా అడగాలని అనిపిస్తోంది. మీరు దేవుడిని చూశారా? - రామాంజనేయులు, నల్గొండ సద్గురు: ‘నేను దేవుడిని చూశానా?’ అని మీరు అడుగుతున్నారంటే, అది భూతకాలాన్ని సూచిస్తోంది. నేనెప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను. నాకు దేవుడు తప్ప మరేమీ కనిపించడం లేదు. నేను దేవుడినే చూస్తున్నాను. మీరు దేవుడని అనేది సృష్టికి మూలమైనది. అవును కదూ? మీరు ఒక జీవిని చూడదలచుకుంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయి. మీ శరీరాన్ని చూడవచ్చు. మీ మాటల ద్వారా మీ మనసుని చూడవచ్చు లేక మీలో సృష్టికి మూలంగా ఉన్న మౌలికమైనదాన్ని చూడవచ్చు. ఈ రోజు ఉదయం మీరు దోశలు తిన్నారు. సాయంత్రం అయ్యేసరికి అది కాస్తా మనిషి శరీరంగా మారిపోయింది. అంటే సృష్టి మీలోనే పనిచేస్తోందన్న మాట. అంటే, సృష్టికి మూలం, అంటే మీరు చెప్పే సృష్టికర్త లేక మీరు చెప్పే దేవుడు మీలో నుంచే పని చేస్తున్నాడన్నమాట. దాన్ని మీరు చూడగలరా, చూడలేరా అన్నదే ఇక్కడ ప్రశ్న. జీవితంలోని ప్రతిక్షణం, దానిని నేను నాలోనే చూడగలుగుతున్నాను. చుట్టుపక్కల ఉన్న ప్రతిదానిలోనూ చూడగలుగుతున్నాను. నేను దేవుడిని చూశానా? ఇది ఓ ప్రశ్నే కాదు. నేను ఎప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను. -
అమ్మకానికి అడవి
అటవీశాఖలో అవినీతి పేట్రేగుతోంది. బతుకు తెరువు కోసం మామిడి మొక్కలు నాటిన పేదలపై జులుం ప్రదర్శించే ఫారెస్టు అధికారులు పెద్దలకు దాసోహమంటున్నారు. రిజర్వు ఫారెస్ట్ను రియల్ ఎస్టేట్ ప్లాట్లలా ఆ శాఖ ఉద్యోగే విక్రయిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందన్న భావనతో కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నవారినీ వదిలిపెట్టకుండా మామూళ్ల దందాతో వేధిస్తున్నారు. పశ్చిమకృష్ణా, న్యూస్లైన్ : జిల్లా అటవీశాఖకు డబ్బు జబ్బు పట్టింది. ఏం చేసినా అడిగేవాడు లేడనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జీవనాధారం కోసం పేదలు మామిడి మొక్కలు వేసుకుంటే జులుం ప్రదర్శించి వాటిని పీకేసే ఫారెస్టు అధికారులు నగరం సమీపంలోని అటవీభూముల్ని పెద్దలకు దోచిపెడుతున్నారు. గతంలో నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో వేలాది ఎకరాలను పెద్దల పరం చేసిన ఈ అధికారులు ఇప్పుడు కొత్తూరు రిజర్వుఫారెస్ట్ను బడాబాబులకు బేరం పెట్టారు. కొత్తూరులో 2,300 ఎకరాల అటవీభూమి ఉంది. దీని పరిధిలోని అంబాపురం అటవీప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గుడిసెలతో మొదలయ్యే ఆక్రమణల కథ పక్కా బంగ్లాల నిర్మాణం వరకు కొనసాగుతోంది. ఇందులో ప్రధాన సూత్రదారులు అటవీశాఖ అధికారులే కావడం చర్చనీయాంశమైంది. రెండు వందల గజాల స్థలాన్ని రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారని సమాచారం. ఈ సొమ్ము ఆ శాఖలో కిందనుంచి పైస్థాయి వరకూ ఎవరి వాటా వారికి అందుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నెండేళ్లగా సెక్షన్లు మారుతూ విజయవాడ రేంజ్లోనే తిష్టవేసిన ఓ ఉద్యోగే అటవీ భూముల విక్రయ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా తారుమారు చేశారనే అభియోగాలు ఉన్నాయి. నివాసితులకూ తప్పని తిప్పలు అంబపురం అటవీ భూముల ఆక్రమణ పర్వం 2011లో మొదలై ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. రియల్ ఎస్టేట్ వెంచర్లను తలదన్నే రీతిలో ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం అంతా బ్రోకర్ల ద్వారా ఈ ఉద్యోగే నడుపుతున్నారు. ముందుగా పాక, ఆ తర్వాత ఓ మోస్తరు ఇల్లు, చివరకు పక్కా బిల్డింగ్ వెలుస్తుంది. ‘విజయవాడకు సమీపంలో గజం వెయ్యి రూపాయలకు దొరకడం మామూలు విషయం కాదు. మీరు ఇల్లు కట్టుకున్నాక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కావాలంటే చూడండి.. చాలా ఇళ్లే ఉన్నాయ’ంటూ బ్రోకర్లు మాయమాటలు చెప్పి పార్టీలను ముగ్గులోకి దించుతారు. తక్కువ రేటుకు వస్తుందని ఆశపడినవారు సొమ్ము ముట్టజెప్పి ఇల్లు కట్టుకుంటే.. ఆ తరువాత ఫారెస్టు అధికారులు మరో కొత్త డ్రామాకు తెరతీస్తారు. డీఎఫ్ఓ, కన్జర్వేటర్, విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారంటూ బెదిరిస్తూ నివాసితుల నుంచి మరింత పిండుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఇచ్చేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారికి వేధింపులు తప్పడంలేదు. అటకెక్కిన సస్పెన్షన్ ఆక్రమణల్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలపై ఉద్యోగిని 27 నవంబర్ 2012న నాటి డీఎఫ్ఓ హరిబాబు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రెండు రోజునే ఆయన బదిలీ అయ్యారు. కొందరు జిల్లాస్థాయి అధికారుల అండదండలతో ఉన్నతాధికారుల్ని మేనేజ్ చేసి ఆ ఉద్యోగి సస్పెన్షన్ ఫైల్ను నిలుపుదల చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటవీప్రాంత హద్దుల్ని నిర్ణయించే కేరిన్ల(అడవి హద్దులు) ఏర్పాటులోనూ ఉద్యోగి మాయచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. జనకమ్మ కుంట ప్రాంతంలో నిర్మించిన 100 కేరిన్లలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఇందుకోసం వాచర్ను మేనేజ్చేసినట్లు భోగట్టా. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే అంబపురం అటవీప్రాంతంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. పేదలపై ప్రతాపం నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో పేదలు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్న మామిడి మొక్కల్ని అధికారులు అడ్డంగా నరికేశారు. చాట్రాయి మండలం సోమవరం గ్రామం, నూజివీడు మండలం బత్తులవారిగూడెం, ముసునూరు మండలం రమణక్కపేట, బలివే వెంకటాపురం గ్రామాల్లో పేదలు వేసిన మామిడి మొక్కలను పీకేశారు. ఎన్నో ఏళ్ళుగా అటవీ భూముల్ని ఆక్రమించుకొని బడాబాబులు సాగిస్తున్న కార్పొరేట్ వ్యవసాయం వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. తాజాగా విజయవాడలోని ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ 50 ఎకరాల అటవీభూమిని ఆక్రమించినట్లు సమాచారం. ఇందుకు భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతున్న దృష్ట్యా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు బడాబాబులు అటవీభూముల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో అవినీతి అధికారులకు కాసుల పంట పండుతోంది. విచారణ నిర్వహిస్తాం అంబపురం అటవీభూమి ఆక్రమణకు గురైందని నాకు తెలియదు. విచారణ నిర్వహిస్తా. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటా. గతంలో ఉద్యోగి సస్పెన్షన్ అయిన విషయమూ నాకు తెలియదు. నేను విధులు చేపట్టి మూడు నెలలే అయింది. కేరిన్ల ఏర్పాటులో అవకతవకలు జరిగే అస్కారం ఉండదు. అయినా పరిశీలిస్తా. - రాజశేఖర్, అటవీశాఖ జిల్లా అధికారి