న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ 46 మందితో కొలువుతీరింది. ఈ మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా, 10 మందికి సహాయ మంత్రులు హోదా, 12 మందికి స్వతంత్ర హోదా దక్కింది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవాలని భావించినా.. ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఆయా శాఖలు లభించే అవకాశం ఉన్న అభ్యర్థుల వివరాలు..
రాజ్నాథ్ సింగ్ -హోంశాఖ
అరుణ్జైట్లీ - ఆర్ధిక, రక్షణ శాఖ
రాధా మోహన్ సింగ్- వ్యవసాయ శాఖ
గడ్కరీ- రవాణా శాఖ
సదానంద గౌడ - రైల్వేశాఖ
సుష్మాస్వరాజ్ - విదేశాంగ శాఖ
వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి శాఖ
మేనకా గాంధీ- మహిళ, శిశు సంక్షేమ శాఖ
అనంత్కుమార్ - పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ శాఖ
అశోక్గజపతిరాజు - పౌరవిమానయాన శాఖ
స్మృతి ఇరానీ - మానవవనరుల అభివృద్ధి శాఖ
నిర్మలాసీతారామన్ - వాణిజ్య శాఖ (స్వతంత్ర)
జవదేకర్ - సమాచార ప్రచార శాఖ(స్వతంత్ర)
పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు శాఖ (స్వతంత్ర)
మోడీ కేబినెట్ లోఎవరెవరికి ఏ శాఖలు!
Published Mon, May 26 2014 8:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement