కోల్కతా: దేశ వ్యాప్తంగా దసరా పండుగ నేపథ్యంలో జరుగుతున్న దుర్గా మాత ఉత్సవాల్లో స్వలింగ సంపర్కులు భాగమయ్యారు. తమపట్ల చూపుతున్న వివక్ష ఈ విధంగానైనా పోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
కోల్కతాలోని ట్రాన్స్ జెండర్స్ అంతా ఏకమై ప్రత్యేకంగా దుర్గామాత విగ్రహాన్ని కాకుండా అర్థనారీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు ప్రారంభించారు. స్వలింగ సంపర్కుల ఉద్యమకారుడు అనింద్య హజ్రా ఈ విషయంపై మాట్లాడుతూ'మాకంటు ఒక గుర్తింపు, హక్కులు కావాలనే ఉద్దేశంతోనే ఉత్సవాన్ని జరుపుతున్నాం' అని తెలిపాడు.
దుర్గా పూజలో ట్రాన్స్ జెండర్స్
Published Fri, Oct 16 2015 10:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement
Advertisement