durga puja
-
ఓ వైపు పూజ.. మరోవైపు వర్క్: వీడియో వైరల్
చదువుకునే రోజుల్లో.. జాబ్ వస్తే ఏదైనా చేసేయొచ్చని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి దుర్గా పూజలో కూడా ల్యాప్టాప్, మొబైల్ రెండూ చేతపట్టుకుని క్లయింట్ మీటింగ్కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈయన చుట్టూ ఏం జరుగుతోందో కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది చూసిన చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరులో ఇలాంటివి మామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఉద్యోగుల జీవితం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు పని పూర్తయిన తరువాత పూజకు హాజరైతే బాగుంటుందని అంటున్నారు.ఇలాంటి సంఘటనలు బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. స్కూటర్ మీద వెల్తూ మీటింగులకు హాజరైన సంఘటనలు, బైక్ నూక కూర్చుని వర్క్ చేసుకుంటున్న దృశ్యాలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.A Peak Bengaluru moment unfolded when a man was caught attending a client meeting on both his laptop and phone while at a Navratri pandal in Bengaluru. The incident perfectly encapsulates the city's fast-paced work culture, where balancing professional commitments and personal… pic.twitter.com/fVIeGDN23d— Karnataka Portfolio (@karnatakaportf) October 13, 2024 -
కళ, సంస్కృతి, కవిత్వాన్ని ప్రేరేపించే చేప కథ
అనేక బెంగాలీ కుటుంబాలకు వారి ప్రియమైన ఇలిష్ (హిల్సా) లేకుండా దుర్గా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అది లేనిదే పూజ అసంపూర్తిగా ఉంటుందని భావించి కొందరు అమ్మవారికి ఈ చేప వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. హిల్సా వంటకం కేవలం పాక ఆనందాన్ని మాత్రమే కాకుండా వారి సంస్కృతిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ ’జీవనాళం’ గుండా ఈదుతూ, పండుగలు, వేడుకలలో కనిపిస్తుంది.హిల్సా వెండి మెరుపు, అద్భుతమైన రుచి రారమ్మని ఆహ్వానిస్తాయి. బెంగాలీ–అమెరికన్ ఆహార చరిత్రకారుడు చిత్రిత బెనర్జీ ఈ చేప సాంస్కృతికతను సంపూర్ణంగా అక్షరీకరించారు. దీనిని ‘జలాల ప్రియత‘, ‘చేపలలో రాకుమారుడు‘గా అభివర్ణించారు.హిల్సా కథ పండుగలు, డైనింగ్ టేబుల్కు మించి విస్తరించి ఉంది. శతాబ్దాలుగా, ఇది సాంప్రదాయ కాళీఘాట్ పెయింటింగ్స్లో లేదా సమకాలీన వర్ణనలలో గంభీరమైన, మత్స్యకన్య లాంటి దేవతగా – కవులు, రచయితలు, కళాకారుల కల్పనలను ఆకర్షించింది.ఒక సాహిత్య వ్యవహారంహిల్సాతో బెంగాలీ ప్రేమ, దాని సాహిత్య సంప్రదాయంలో క్లిష్టంగా అల్లింది. 18 ఉపపురాణాలలో ఒకటైన బృహద్ధర్మ పురాణంలో సనాతనవాదులు దాని వినియోగాన్ని చర్చించినప్పటికీ, చేపలు బ్రాహ్మణులకు రుచికరమైనది అని ప్రశంసించారు. ‘బ్రాహ్మణులు రోహు (బెంగాలీలో రుయి), చిత్తడి ముద్ద (పుంటి), స్నేక్హెడ్ ముర్రెల్ (షూల్), ఇతర తెల్లటి, పొలుసుల చేపలను తినవచ్చని ఈ పాఠం చెబుతోంది‘ అని గులాం ముర్షీద్ తన పుస్తకం, బెంగాలీ కల్చర్ ఓవర్ ఎ థౌజండ్లో రాశారు. -
దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.యూపీలోని బహ్రాయిచ్లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు -
బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
ఢాకా: బంగ్లాదేశ్లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.బంగ్లాదేశ్లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లోని దుర్గా పూజ మండపంలోకి ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్లోని జేఎం సేన్ హాల్లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Bomb Blast in Tatibazara Puja Mandap, Dhaka.#DurgaPujaAttack2024 pic.twitter.com/BQqHj5SURo— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) October 11, 2024ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం -
దుర్గాపూజ మండపంలో కలకలం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్ను షేర్ చేసింది.ఆ పోస్ట్లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని మెటియాబ్రూజ్లోని బెంగాలీ హిందువులు దుర్గాపూజ చేస్తున్నారు. ఇంతలో కలకలం నెలకొంది. పూజలో భాగంగా శంఖం ఊదుతుండగా, సీఎం మమతా బెనర్జీ మద్దతుదారులు మండపంలోకి ప్రవేశించి, వేడుకలను వెంటనే ఆపకపోతే, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని బీజేపీ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు తాము నమాజ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఆపివేస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ‘న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెంగాల్ బీజేపీ ఈ ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గామండపంలోకి 50 మంది బలవంతంగా ప్రవేశించారని, వారు మహిళలను కూడా దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీజేపీ షేర్ చేసింది. నిందితులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. Disturbing scenes have emerged from West Bengal, in KMC Ward 133, Metiaburuz, where Bengali Hindus were celebrating Durga Puja. This year, many of the Tithis occurred in the morning, which led to the sound of Dhaks and conch shells being heard earlier in the day.This angered a… pic.twitter.com/h8JYHCBYX8— BJP West Bengal (@BJP4Bengal) October 11, 2024ఇది కూడా చదవండి: అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్గా 'కోల్కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు
జంషెడ్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ట్రాన్స్జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.ఈ ట్రాన్స్జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు. ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు! -
Bangladesh: దుర్గాపూజలకు మరింత బందోబస్తు
ఢాకా: భారత్లోని పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న దరిమిలా, అక్కడ దుర్గాపూజలు ఎలా జరగనున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత, కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు నియమనిబంధనలను రూపొందించింది. బంగ్లాదేశ్లో దుర్గాపూజల కోసం 32,666 వేదికలను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ గత కొంతకాలంగా జరుగుతున్న మత అల్లర్ల దృష్ట్యా, దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్స్పీకర్లు నిలిపివేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ హిందువుల భద్రతకు తాము హామీనిస్తున్నామని అన్నారు. అక్టోబరు 3 నుంచి దుర్గాపూజలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న ముగియనున్నాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరవుతారు.ఇది కూడా చదవండి: మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి -
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
దీదీ వ్యాఖ్యలు సరికాదు: జూ.డా. తల్లి ఆవేదన
కోల్కతా: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. డాక్లర్లు, వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. మరోవైపు.. డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సీఎం మమత చేసి వ్యాఖ్యాలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఘటన ఆమె చేసి వ్యాఖ్యలు సరైనవి కాదని.. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఎప్పుడూ మా కూతురుతో దుర్గా పూజ జరుపుకునేవాళ్లం. రాబోయే రోజుల్లో మేము దుర్గా పూజనే కాదు మరే ఇతర పండలు జరుపుకోలేము. సున్నితమైన అంశంపై ఆమె(మమతను ఉద్దేశించి) అలా ఎలా మాట్లాడతారు?. మా కూతురిని తిరిగి తీసుకురాగలరా. సీఎం మమత కుటుంబంలో ఇలాంటి దారుణ ఘటన ఆమె ఇలాగే మాట్లాడేవారా? నా బిడ్డకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం మమత అడ్డుకోవాలని చూస్తున్నారు. మా కూతురి మరణంతో మా ఇంట్లో దీపం వెళ్లిపోయింది. మా కూతురిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం డిమాండ్ను చేస్తున్నవారిని కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మమత మాట్లాడుతూ.. ‘‘ నిరసన చేస్తున్న ప్రజలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దుర్గా ఉత్సవాలపై దృష్టి సారించండి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో దుమారం రేపుతున్నాయి.చదవండి: Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా? -
దుర్గాపూజ లిస్ట్.. చిన్న కత్తి పెప్పర్ స్ప్రే!
కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ‘మహిళల భద్రత’ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రేయసి బిస్వాస్ అనే ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘రాబోయే దుర్గా పూజ కోసం మీ షాపింగ్ లిస్ట్లో ఉండాల్సిన ఐటమ్స్’ అనేది వీడియో సారాంశం. ఇన్ఫ్లూయెన్సర్స్ శ్రేయసి ‘దుర్గా పూజా జాబితా’లో పండగకు అవసరమైన వస్తువులతో పాటు చిన్న కత్తి, పెప్పర్ స్ప్రే, అలారమ్ కీచైన్... లాంటివి జత చేసింది. ‘పెప్పర్స్ప్రే, అలారమ్ కీచైన్ల మీద వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కోల్కతా దుర్ఘటన నేపథ్యంలో తప్పకుండా చేయాలనిపించింది. మహిళల భద్రత ప్రమాదంలో పడింది. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ భద్రత గురించి తామే జాగ్రత్త పడాలి. బ్యాగులో సెల్ప్–డిఫెన్స్ టూల్స్ తప్పనిసరిగా ఉండాలి’ అంటుంది శ్రేయసి బిస్వాస్. సెల్ఫ్–డిఫెన్స్ టూల్స్ను ప్రేక్షకులకు చూపుతూ వాటి వల్ల ఉపయోగం ఏమిటో చెప్పింది శ్రేయసి. ‘ఈ సెల్ఫ్–డిఫెన్స్ ్రపాడక్ట్స్ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్ సెర్చ్ చేయండి చాలు’ అని సలహా కూడా ఇచ్చింది. ఈ వీడియో 7.6 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది.‘కోల్కతా దుర్ఘటన తరువాత కొత్త వాళ్లు ఎవరైనా మిల్లీ సెకన్ నా వైపు చూసినా చాలా భయంగా ఉంది’ అని ఒక యూజర్ రాసింది. ‘మా పరిస్థితి కూడా అదే’ అన్నారు చాలామంది. ‘భయపడితే ఎలా! మహిళలలో దుర్గాదేవి అంశ ఉంది. దుర్మార్గుల అంతు చూసే అపార శక్తి ఉంది’ అని ఒక యూజర్ రాశారు. -
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. ‘ధునుచి నాచ్’లాగే డ్రమ్స్ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. వీళ్లు ముఖ్యంగా రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! డిమాండ్ పిరిగింది... ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్ ఉండేది కాదంటున్నారు శివ్పాద్ దాస్. ఆయన మాచ్లాండ్పూర్లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్పాద్ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 14 ఏళ్ల కిందట మొదలై... ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్ చంద్ర దాస్ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్–హంట్ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దుర్గాపూజ బిజినెస్.. అక్కడ రూ.1,100 కోట్లు!
ఇటీవల ముగిసిన దుర్గా పూజ ఉత్సవం అక్కడి రెస్టారెంట్లకు కాసులు కురిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో దుర్గాపూజ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలతో పాటు పిల్లాపాపలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ప్రత్యేకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లు కోల్కతా నగరంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు దసరా ఉత్సవాల సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లను ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే ఈ సారి 20 శాతం అధికంగా వచ్చిందని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. కోవిడ్ సంక్షోభం అనంతరం అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఇది రెండవ దుర్గా పూజ. దశమి వరకు ఆరు రోజుల పాటు తెల్లవారుజామున 3 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు ఆహారం ఆస్వాదిస్తూ కనిపించారని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేష్ పొద్దార్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఆరు రోజుల్లో నగరంలోని రెస్టారెంట్లు రూ. 1,100 కోట్ల వ్యాపారం చేశాయని ఆయన పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20-25 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. -
తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..
పూర్వం అరుణుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు పాతాళవాసి, మహా క్రూరుడు. దేవతలంటే అతడికి బద్ధవిరోధం. దేవతలను జయించాలనే సంకల్పంతో బ్రహ్మ కోసం తపస్సు చేయాలనుకున్నాడు. హిమాలయాల దిగువన గంగాతీరంలోని ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు ప్రారంభించాడు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీరు మాత్రమే తాగుతూ పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. కేవలం గాలి మాత్రమే పీల్చుతూ మరో పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. అతడి తపోగ్రత అంతకంతకు పెరిగి అతడి శరీరం నుంచి మంటలు వెలువడి, లోకాలను దహించడం ప్రారంభించాయి. అరుణుడి తపోగ్రత నుంచి వెలువడిన మంటలు లోకాలను దహిస్తూ ఉండటంతో దేవతలు భీతావహులై, పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు చేరుకున్నారు. దేవతల మొరను ఆలకించిన బ్రహ్మదేవుడు గాయత్రీ సమేతంగా హంసవాహనాన్ని అధిరోహించి అరుణుడి వద్దకు బయలుదేరాడు. అరుణుడి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన సమయానికి అతడు బొందిలో ప్రాణం మాత్రమే మిగిలి, ఎముకల పోగులా మిగిలి ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతడిని చూసి, ‘వత్సా! ఏమి నీ కోరిక’ అన్నాడు. బ్రహ్మదేవుడి నోట ఆ మాట వినగానే అరుణుడు ఆనందపరవశుడయ్యాడు. బ్రహ్మదేవుడి ముందు మోకరిల్లి, నానా విధాలుగా స్తుతించాడు. ‘దేవా! నాకు మరణం లేకుండా వరమివ్వు’ అని అడిగాడు. ‘నాయనా! జీవులకు కాలధర్మం తప్పదు. అది తప్ప ఇంకేదైనా వరమడుగు, తీరుస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘అయితే, యుద్ధంలో నాకు శస్త్రాస్త్రాల వల్ల గాని, స్త్రీ పురుషుల వల్ల గాని, రెండుకాళ్ల, నాలుగుకాళ్ల జంతువులతో గాని, రెండు ఆకారాల ప్రాణులతో గాని చావు కలగకుండా వరమివ్వు’ అన్నాడు. ఇదివరకటి రాక్షసులు హతమారిన సందర్భాలను గుర్తుచేసుకుని, అరుణుడు ఎంతో తెలివితో అడిగిన ఈ వరానికి బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అంటూ సమ్మతించాడు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత అరుణుడు తిరిగి పాతాళానికి వెళ్లాడు. అక్కడ అసురులందరినీ సమావేశపరచి, బ్రహ్మదేవుడి ద్వారా తాను సాధించిన వరాన్ని గురించి చెప్పాడు. ఆనందభరితులైన అసురులు అరుణుడిని తమ పాలకుడిగా ఎన్నుకున్నారు. వెంటనే అరుణుడు స్వర్గానికి తన దూతను పంపాడు. ‘స్వర్గాన్ని తక్షణమే విడిచిపెట్టి వెళ్లిపోవాలి. లేదా అరుణుడితో యుద్ధానికి సిద్ధపడాలి’ అని ఆ దూత తెచ్చిన సందేశానికి ఇంద్రుడు భయకంపితుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్లాడు. వారు విష్ణువు వద్దకు వెళ్లారు. తర్వాత అందరూ కలసి కైలాసానికి వెళ్లి, పరమేశ్వరుడికి పరిస్థితిని వివరించి, ఆపద నుంచి గట్టెక్కించమని కోరారు. ‘బ్రహ్మదేవుడు అతడికి ఇచ్చిన వరం వల్ల మనమెవ్వరమూ అతణ్ణి ఏమీ చేయలేము. అందువల్ల త్రిభువనేశ్వరి అయిన జగజ్జననిని శరణు కోరుదాం. ఆమె మాత్రమే రక్షించగలదు’ అన్నాడు శివుడు. దేవతలందరూ జగజ్జనని అయిన ఆదిశక్తిని ప్రార్థించారు. వారి మొరను ఆలకించిన ఆమె, ‘అరుణుడు నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటాడు. ఆ జపాన్ని విరమింపజేసినట్లయితే వాడికి చావు మూడుతుంది’ అని పలికింది. జగజ్జనని చెప్పిన తరుణోపాయాన్ని నెరవేర్చడానికి దేవేంద్రుడు దేవతల తరఫున బృహస్పతిని అరుణుడి వద్దకు పంపాడు. బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్లాడు. అరుణుడు అతడికి స్వాగతం పలికాడు. ‘మునివరా! ఎక్కడి నుంచి రాక. అయినా నేను మీ పక్షపాతిని కాదు, నీవు మా పక్షపాతివి కాదు. నేను దేవేంద్రుడికి, దేవతలకు శత్రువునని నీవెరుగుదువు కదా’ అన్నాడు. ‘అదంతా సరే, నువ్వూ గాయత్రీ మంత్రజపం చేసేవాడివే, నేనూ గాయత్రీ మంత్రజపం చేసేవాడినే! కాబట్టి నువ్వు మా పక్షపాతివి ఎందుకు కావు?’ అన్నాడు బృహస్పతి. అహం దెబ్బతిన్న అరుణుడు ‘నా శత్రువైన నీవు జపించే మంత్రం నాకెందుకు’ అంటూ గాయత్రీజపాన్ని వదిలేశాడు. వచ్చిన పని నెరవేరడంతో బృహస్పతి అక్కడి నుంచి వెనుదిరిగాడు. వరకారణమైన గాయత్రీమంత్రాన్ని వదిలేసిన తర్వాత అరుణుడు తేజోహీనుడయ్యాడు. దేవతలందరూ తిరిగి జగజ్జననిని ప్రార్థించారు. జగజ్జనని తమ్మెదలు మూగిన పూలమాలలతో ప్రత్యక్షమైంది. తుమ్మెదల సైన్యాన్ని అరుణుడి మీదకు పంపింది. కోటాను కోట్ల తుమ్మెదలు భీషణ ఝుంకార ధ్వనులు చేస్తూ అరుణుడి మీద దాడి చేశాయి. అరుణుడి అసుర సేనలను కుట్టి కుట్టి హతమార్చాయి. తుమ్మెదల దండయాత్రలో అరుణుడు అంతమొందాడు. భ్రమరాలతో రాక్షస సంహారం చేసిన జగజ్జనని భ్రామరీదేవిగా పూజలందుకుంది. -
ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా!
ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి తొమ్మిదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతోపాటు తలపెట్టిన పనులలో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయకారిణి అమ్మే! త్రిమూర్తులకు, దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే! ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలనీ, దేవీ శరన్నవరాత్రోత్సవాలనీ ప్రసిద్ధి చెందాయి. శరన్నవరాత్రుల విశేషాలు హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి ‘దశహరా’ అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అనే అర్థం కూడా. దీనిప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈవేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాష్టమి దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. ‘దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది‘, అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలపై అదుపును, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణం,‘దుం’ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. మహర్నవమి మానవ కోటిని పునీతులను చేయడం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసలకోర్చి గంగను దివి నుంచి భువికి తెచ్చినది ఈరోజే! ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పడంలోని ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ‘సిద్ధిదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని. దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆచారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పర్వదినాన రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, కుట్టుపని వారు తమ కుట్టు యంత్రాలకు, చేనేత కార్మికులు తమ మగ్గాలకు, కర్మాగారాలలో పని చేసే కార్మికులు తమ యంత్ర పరికరాలకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం... పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అందువల్ల ఆయుధాలు తుప్పు పట్టకుండా చెడకుండా సురక్షితంగా ఉన్నాయి. యుద్ధానికి వెళ్లడానికి ముందు అర్జునుడు తన గాండీవానికి, భీమసేనుడు తన గదాయుధానికి ప్రత్యేకంగా పూజలు జరిపించారని ప్రతీతి. శక్తి స్వరూపిణిని.. అలా పాండవులు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి. బొమ్మల కొలువు.. ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బొమ్మల కొలువును నిర్వహించడం పరిపాటి. విజయదశమి దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి.‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం లాంటివి చూడకుండా విజయదశమి నాడు చేపడితే ఆ కార్యంలో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు. ‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ’జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారివారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది, శమీవృక్ష రూపాన ఉన్న‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితాదేవి’ని పూజించి, రావణుని సంహరించడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడు. తెలంగాణ ప్రాంతంలో శమీపూజ తర్వాత శుభానికి సూచిక అయిన‘పాలపిట్ట’ను చూసే ఆచారం ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ దిగువ ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు. ‘శమీ శమయతే పాపం శమీశత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ! అనే శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. శ్రీశైల భ్రమరాంబికకు ఒకవిధంగా అలంకారం చేస్తే, విజయవాడ కనకదుర్గమ్మకు మరోవిధంగా అలంకారాలు చేస్తారు. అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! అందరికీ అమ్మ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ విజయ దశమి అందరికీ సకల శుభాలూ, తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ జయాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. కనక దుర్గాదేవి (పాడ్యమి) శ్రీ బాలాత్రిపురసుందరి ( విదియ ) శ్రీ అన్నపూర్ణాదేవి (తదియ ) శ్రీ గాయత్రీదేవి ( చవితి ) శ్రీ లలితాత్రిపుర సుందరి ( పంచమి ) శ్రీ మహాలక్ష్మీదేవి ( షష్ఠి) శ్రీ సరస్వతీదేవి (సప్తమి ) శ్రీ దుర్గాదేవి (అష్టమి) శ్రీ మహిషాసురమర్దిని దేవి (నవమి ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి (దశమి) దేవీ అలంకారాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని, శత్రుజయం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. చల్లని చూపు ఆ అమ్మ కంటిలో నవరసాలను శంకరాచార్యులు వర్ణిస్తారు. చేప స్తన్యం ఇచ్చి తన పిల్లలను పోషించదు. చేప తన పిల్లను పోషించినప్పుడు కేవలం అలా కన్నులతో తల్లిచేప చూసేసరికి పిల్ల చేపకు ఆకలి తీరిపోతుంది. మీన నేత్రాలతో ఉంటుందని అమ్మవారికి మీనాక్షి అనిపేరు. అమ్మ కళ్ళ వైభవాన్ని అనుభవించి, అమ్మకంటి వంక ఒకసారి చూసినట్లయితే మనలో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలు ఉపశమించి శాంతి, సంతోషం కలుగుతాయి. ∙డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు! వాటి ప్రాశస్యం ఏంటంటే..) -
గుజరాత్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వైష్ణోదేవి దర్శనానికి ఎంతసేపు వేచివుండాలి?
శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతా వైష్ణో దేవి(జమ్ము) మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అహ్మదాబాద్లో.. గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి. వారణాసిలో.. వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. కేరళలో.. కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్లో.. నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం.. "కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి’. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!! (చదవండి: జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?) -
అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
కోల్కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now. I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 5, 2022 8 Dead, Several Missing During Idol Immersion In West Bengal. #JalpaiguriAccident #Jalpaiguri pic.twitter.com/hTgAAJvYmq — Jagadanand Pradhan (@JPradhan_) October 6, 2022 Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi — PMO India (@PMOIndia) October 5, 2022 -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్కు ఊహించని షాక్! -
బంగ్లాదేశ్లో మత కలహాలు
ఢాకా/కోల్కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్లోని అందర్కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్లో ఉందని పేర్కొంది. కోల్కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
West bengal: ‘దుర్గాపూజ చేసుకునే హక్కు మాకుంది’
కోల్కతా: పశ్చిమబెంగాల్లో విజయదశమిని పురస్కరించుకొని శుక్రవారం సోనాగచిలోని సెక్స్ వర్కర్లు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. దుర్గాదేవి పూజ అనంతరం డెబీ బోరాన్, సిందూర్ ఖేలా, ధునుచి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సెక్స్ వర్కర్ల దర్బార్ మహిళా సమితి సభ్యురాలు విశాఖ లష్కర్ మాట్లాడుతూ.. ఈ సమాజంలో తమకు సమాన హక్కులు లేవని, అందుకే తమ పిల్లలు ఈ సమాజాన్ని ఆమోదించడంలేదని అన్నారు. దీంతో తాము మరో ప్రపంచం నుంచి వచ్చామనే భావన కలుగుతోందని తెలిపారు. దానికి గల కారణం తాము సెక్స్ వర్కర్లము కావడమే అనిపిస్తోందని అన్నారు. కుటుంబాలను పోషించుకోవటం కోసమే తాము ఈ వృత్తిలో ఉన్నమని తెలిపారు. అయితే దుర్గా పూజ వేడకలు జరుపుకోవడాని తమకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. తాము ఈ సమాజమానికి చెందినవారిమనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సెక్స్ వర్కర్కు దుర్గాదేవి పూజ చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే దుర్గాదేవి పూజలు నిర్వహించేందుకు గతంలో వీరికి అనుమతి ఉండేది కాదు. దాని కోసం వీరు పోరాటం చేశారు. సెక్స్ వర్కర్లు దుర్గాపూజ చేసేందుకు అనుమతి కోసం దర్బార్ మహిళా సమితి కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వారికి దుర్గాపూజ చేసుకోవచ్చని 2013లో కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
బంగ్లాదేశ్లో దుర్గాదేవి మండపాలు ధ్వంసం
ఢాకా: దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో దుర్గామాతకి తీవ్ర అపచారం జరిగింది. క్యుమిలియా జిల్లాలో దుర్గా దేవి మండపాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు జిల్లాల్లో హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు. దుర్గ దేవి కొలువుదీరిన మండపాల వద్ద ఖురాన్ను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దుండగులు మండపాలపై దాడికి దిగి ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది. 22 జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకి మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చాందీపూర్ హజీగంజ్, బన్షఖాలి, షిబ్గంజ్, కాక్స్ బజార్ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ దాడుల వెనుక జమాత్–ఇ–ఇస్లామీ హస్తం ఉందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మచ్చ తీసుకురావడానికి, మత ఘర్షణలు రాజేయడానికే వారు ఈ పని చేశారని చెప్పారు. కొన్ని మండపాల్లో దుర్గమ్మ పాదాల చెంత పవిత్ర ఖురాన్ను ఉంచారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం దుర్గాదేవి మండపాలు మూడు వేలు ఉన్నాయి. -
దసరా ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖుల సందడి
సాక్షి, ముంబై: పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. రానున్న విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్, అజయ్ దేవగణ్ భార్య కాజోల్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అమిత్ కుమార్, సినీ గాయకుడు షాన్ అతని తల్లి, టీవీ నటి, కపిల్ శర్మ ఫో ఫేం సుమోన చక్రవర్తి, జాన్ కుమార్ సాను, డెబినా బోన్నర్జీ, గుర్మీత్ చౌదరి, బప్పా బి లాహిరి, తనీషా లాహిరి, దేబు ముఖర్జీ , శర్బానీ ముఖర్జీ తదితర స్టార్లు ఉత్తర బొంబాయి సర్బోజనిన్ దుర్గను సందర్శించుకున్నారు. ముంబైలోని పురాతన , అతిపెద్ద దుర్గా పూజా మండపాల్లో ఇది కూడా ఒకటి. కాగా కరోనా మహమ్మారి, కఠిన ఆంక్షల మధ్య ఇది వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్గా సాగుతోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి నిస్తుండటం విశేషం. చదవండి : Durga Puja : బాలీవుడ్ హీరోయిన్ సందడి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు
భువనేశ్వర్: సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత చిత్ర విచిత్ర ఘటనలు వైరల్గా మారిన వైనం చూస్తున్నాం. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్పూర్ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్గా మారింది. (చదవండి: బెంగళూరులో 7గురు విద్యార్థులు అదృశ్యం..) మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. People in the locality of Bijapara village have begun worshipping a two headed calf as #Durga Avatar After it was born with two heads and three eyes on the occasion of #Navratri to a farmer in Odisha's Nabrangpur District. #DurgaPuja @aajtak @IndiaToday pic.twitter.com/tz9i9mpJ0O — Suffian सूफ़ियान سفیان (@iamsuffian) October 12, 2021 (చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!) -
అమ్మవారికి ప్రత్యేక పూజలు: బాలీవుడ్ హీరోయిన్ సందడి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేశారు. దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్ కలర్ చీరలో కాజోల్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. (Sunny Leone: పీస్ ఆఫ్ హెవెన్, స్టన్నింగ్ ఫోటో) దసరా వచ్చిందంటే ప్రతీ ఏడాది ప్రత్యేక పూజలతో కాజోల్ వేడుక చేస్తారు. మహా సప్తమిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా కాజోల్ ముంబైలో దుర్గా పూజ మండపంలో మంగళవారం అమ్మకారికి పూజలు చేశారు. కాజోల్తోపాటు ఆమె కజిన్, నటి శర్బానీ ముఖర్జీ కూడా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే..
రాబోయే రోజులు పండగ కళతో ప్రభవించే రోజులు. దుర్గపూజను దృష్టిలో పెట్టుకొని కోల్కతాలోని ‘హ్యూమన్స్ ఆఫ్ పాటులి’ (హెచ్వోపీ) అనే స్వచ్ఛంద సంస్థ నిరుపేద మహిళలకు కొత్త చీరలను అందజేయడానికి ‘ఒక కొత్త కాటన్చీర’ పేరుతో ఫేస్బుక్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడురోజుల్లోనే దీనికి మంచి స్పందన వచ్చింది. దాతల నుంచి వచ్చిన కొత్తచీరలను ఎప్పటికప్పుడు పేదమహిళలకు అందిస్తున్నారు. ‘పేదలకు మనకు తోచిన రీతిలో సహాయం చేయడం మన కనీసధర్మం’ అంటుంది స్వప్న అనే గృహిణి. స్వప్న కూతురు కూడా తల్లి బాటలోనే నడిచి తన పొదుపు మొత్తంలో కొంత కొత్తచీరల కోసం ఇచ్చింది. సౌత్ కోల్కతాలోని ఒక కాలేజీలో హిస్టరీ లెక్చరర్ అయిన శ్రేయషి దానధర్మాల గురించి వినడం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించింది లేదు. ఫేస్బుక్లో ‘ఒక కొత్త కాటన్ చీర’ ప్రచారానికి ఆకర్షితురాలైన శ్రేయషి తన వంతుగా కొన్ని కొత్తచీరలను కొని డొనేట్ చేసింది. అక్కడితో ఆగిపోలేదు. తన మిత్రులు, బంధువుల ద్వారా ఇంకొన్ని కొత్త చీరలు డొనేట్ చేయించింది. ‘కరోనా దెబ్బతో చాలా రోజులు పనులు లేవు. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పనులు దొరుకుతున్నాయిగానీ చాలా భాగం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఈ సమయంలో పండగపూట ఒక కొత్త చీర కొనుక్కోవాలి అనే ఆలోచన చేయలేం. చేసినా కొనే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఉచితంగా కొత్త చీరలు ఇస్తున్నారని తెలిసి తీసుకున్నాను. సంతోషంగా ఉంది’ అంటుంది పాటులి మురికివాడలో నివసించే రాజశ్రీ. మతసామరస్యంపై రకరకాల కార్యక్రమాలు చేపట్టే ‘హెచ్వోపీ’ గత సంవత్సరమే ‘ఒక కొత్త కాటన్ చీర’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే గతంతో పోలిస్తే... ఇప్పుడు స్పందన గొప్పగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గత సంవత్సరం పిల్లలకు కొత్తదుస్తులు ఇప్పించడం వరకు మాత్రమే మొదట పరిమితమయ్యారు. ఆ తరువాత మహిళలను చేర్చారు. ఈసారి చెప్పుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు... 1. రిపీట్గా డొనేట్ చేసేవారు పెరగడం 2. తమ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, కొత్త చీరలు దానం చేసేవారి సంఖ్య పెరగడం. వెతుక్కుంటూ సంస్థ కార్యాలయానికి వచ్చి మరీ స్వయంగా కొత్త చీరలు అందించేవారు కొందరైతే, కొరియర్ ద్వారా పంపించేవారు కొందరు. ‘హెచ్వోపీ’ నినాదం...ఫెస్టివ్ జాయ్ ఫర్ ఆల్! మంచి మనసులు ఉన్న మనుషులు ఉన్నచోట అదేమంత కష్టమైన పని కాదని మరోసారి నిరూపణ అయింది. చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో.. -
ఎంపీ నుస్రత్పై కోర్టు ధిక్కార ఆరోపణలు
కోల్కతా : కరోనా కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా బెంగాల్లో పెద్ద ఎత్తున దేదీప్యమానమైన అలంకరణలతో పాండల్స్ (దేవీ మండపాలు) దర్శనమిస్తాయి. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది పాండల్స్ ఏర్పాటుచేయడంపై కలకత్తా హైకోర్టు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఎంపీ నుస్రత్ జహాన్ పాండల్స్లో దుర్గామాత పూజా కార్యక్రమాలకు హజరయ్యారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. పాండల్స్ను నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించినప్పటికీ ప్రజా ప్రతినిధులు నుస్రత్ జహాన్, దేవీ మండపాలను దర్శించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కోర్టు ఆంక్షలను బేఖాతరు చేయడం కోర్టు దిక్కారానికి పాల్పడినట్లే అని పేర్కొన్నారు. కాగా దసరా సందర్భంగా ఈనెల 24న ఎంపీ నుస్రత్ జహాన్ ఆమె భర్తతో కలిసి కోల్కతాలోని ప్రముఖ పాండల్ని సందర్శించారు. (నవంబర్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు ) #Exclusive: Contempt of Court charge leveled against actor #NusratJahan over her visit to a #DurgaPuja pandal despite the High Court ban. Watch this #ReporterDiary by Indrajit Kundu for more. @iindrojit More videos https://t.co/FAHzdk9TO8 pic.twitter.com/wMXnDAjGaB — IndiaToday (@IndiaToday) October 29, 2020 -
బీహార్ : పోలీసులపై కాల్పుల కలకలం
పట్నా : దుర్గాదేవి నిమజ్జనం సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటన బీహార్లోని మంగేరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో పోలీసులకు, కొంతమంది ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సమూహంలోని కొంతమంది దుండగులు కాల్పులు జరపగా 18 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత పోలీసులపై కొంతమంది రాళ్లురువ్వగా, పోలీసులు సైతం గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. (‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’ ) ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ లిపి సింగ్ అన్నారు. సంఘటనా ప్రాంతం నుంచి మూడు పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగాయి. వెంటనే ఎస్పీ సింగ్ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం! ) -
అమ్మవారి రూపాన్ని ధైర్యంగా చూడగలరా?!
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ విజయదశమి. యావద్భారతం ఏటా ఎంతో వైభవంగా జరుపుకొనే ఉత్సవం. అయితే ఈసారి కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ప్రజలు పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహించి, పదో రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఈ ఉత్సవాలు ఒకేరకంగా నిర్వహించరు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్లోని ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా ఈ పండుగ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా దసరా అంటే శక్తి ఆరాధనే. శక్తి స్వరూపిణిని అయిన అమ్మవారిని కొలిచే సందర్భమే. మహిషాసురుడిని వధించిన ఆ దుష్టసంహారిణికి జేజేలు పలుకుతూ, మమ్మల్ని కాపాడు తల్లీ అంటూ వేడే వేడుక. (చదవండి: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు) మరి ఆ అమ్మవారికి ప్రతిరూపమైన మహిళలకు ఈదేశంలో ఏపాటి గౌరవం దక్కుతోంది? దుర్గామాత విశ్వరూపం గురించి తెలిసిన మనం, ప్రతి ఆడబిడ్డలోనూ అంతర్లీనంగా దాగి ఉండే ఆ ఆదిశక్తికి ఎంత విలువ ఇస్తున్నాం? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మా జన్మస్థానం అని గర్వంగా చెప్పుకొనే వాళ్లలో లింగభేదాలకు అతీతంగా, ఎంతమంది మహిళను పురుషులతో సమాననంగా, ముఖ్యంగా సాటి మనిషిగా చూడగలుగుతున్నారు? ఆ దేవి అనుగ్రహం పొందేందుకు హారతులు పట్టి, పెద్ద ఎత్తున పండుగ చేస్తున్న వారిలో, కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే అంతం చేస్తున్న వాళ్లు ఎందరు? అన్ని అవాంతరాలు దాటుకుని ఎలాగోలా భూమి మీద పడి, ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని విద్యాసంస్థల్లో అడుగుపెడితే ప్రేమ పేరిట వేధించే పోకిరీలు, వాటిని అధిగమించి కార్యక్షేత్రంలోకి దిగితే అడుగడుగునా వివక్ష, ఇక గృహిణిగా అంతాతానై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఇల్లాలికి కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూసేవిధంగా వ్యవహరించే తంతు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమేనని కొట్టిపారేసే మహానుభావులు ఎందరు? ఇక నెలల పసికందు నుంచి పండు ముసలిదాకా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మృగాళ్ల పశువాంఛకు బలైపోతున్న ఆడవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. నేర గణాంక సంస్థల లెక్కల పరిగణనలోకి రాని అవ్యవస్థీకృత నేరాలు కోకొల్లలు. అనాదికాలం నుంచి నేటి ఆధునిక స్మార్ట్ యుగం దాకా.. హథ్రాస్ ఉదంతం వంటి ఎన్నెన్నో దారుణాలకు సాక్షీభూతంగా నిలిచిన సమాజం, ఏ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడకపోవచ్చు. కానీ ఆ దుర్గాదేవి విజయాన్ని ఉత్సవంగా జరుపుకొనే ఈ పర్వదినంనాడు, ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడి, ఆ తల్లి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా ఆమె అనుగ్రహం కోరే ధైర్యం ఎంతమందికి ఉంటుంది! దసరా పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని గ్రహించగలిగితే, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం సహా బాధితుల పక్షాన పోరాడే గుణాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవచ్చు. గతంలో ఎలా ఉన్నా సరే నేటి నుంచైనా పద్ధతి మార్చుకుని, మనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవీయత, అహంకారం వంటి దుర్గుణాలను అంతం చేయమంటూ ‘ఆయుధ పూజ’కు సంసిద్ధులమవుదాం!! -
వైరల్: జిన్పింగ్ తల దుర్గమ్మ కాళ్ల దగ్గర!
కోల్కతా: గత కొంత కాలంగా భారత్కు, చైనాకు అస్సలు పడటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ను ల్యాబ్లో తయారు చేసి వదిలారని పలు దేశాలు డ్రాగన్ దేశంపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారతీయులు కూడా చైనాను దోషిగా వేలెత్తి చూపారు. ఇక్కడితో చాలదన్నట్టు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మన భారత సైనికులను పొట్టన పెట్టుకుని యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇక అప్పటి నుంచి ఇండియాలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది. (చదవండి: యూట్యూబ్లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట) అయితే చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విగ్రహం తల నరికి వేసి దుర్గామాత కాళ్ల దగ్గర పడేశారు. అదెలాగంటే.. పశ్చిమ బెంగాల్లో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి బెర్హంపూర్లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దుర్గాదేవిని ప్రతిష్టించారు. అమ్మవారి చేతిలో హతమైన రాక్షసుడి స్థానంలో రక్తం కక్కుతున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బొమ్మను ఉంచారు. ఇది దుర్గా దేవి పాదాల కింద ఉంచారు. అమ్మవారి వాహనమైన సింహం దాని మొండాన్ని తినేస్టున్నట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం క్రెడిట్ అంతా ఆర్టిస్ట్ అషిమ్ పాల్కే చెందుకుతుంది. (చదవండి: బుద్ధం శరణం గచ్ఛామి!) -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
సోనూ సూద్కు అరుదైన గౌరవం
కోల్కతా: నటుడు సోనూ సూద్కు అరుదైన గౌరవం దక్కింది. లాక్డౌన్లో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన రియల్ హీరో అయ్యారు. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం కోల్కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్లో సోనూ సూద్ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్ చేశారు. అదే విధంగా కెష్టోపర్ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: వలస దుర్గమ్మ..) అయితే ఈ పండల్లో లాక్డౌన్లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్నప్పటి సోనూసూద్ విగ్రహాంతో పాటు ఎదురుగా వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఉంచారు. అదే విధంగా సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదాకర దృశ్యాలను కూడా పండల్లో ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కూమరుడిని సూట్కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని దొపుడు బండిపై కుర్చోపెట్టి లాక్కెడం, సైకిల్ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. అయితే లాక్డౌన్లో సోనూ సూద్ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్) My biggest award ever 🙏 https://t.co/4hOUeVh2wN — sonu sood (@SonuSood) October 21, 2020 -
సొంత ఊరిపై మమకారం
కోల్కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
సీఎం నన్ను అవమానించారు : గవర్నర్
కోల్కతా : దుర్గా పూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీఫ్ ధంఖర్ ఆరోపించారు. వేదికపై తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గాపూజా వేడుకల్లో సీఎం మమతాతో పాటు గవర్నర్ ధంఖర్కూడా హాజరయ్యారు. వేదిక కార్నర్లో అతనికి సీటు కేటాయించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తనకు కేటాయించిన సీటులోనే కూర్చొని ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా బయటపెట్టలేదు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ఒక్కసారి కూడా గవర్నర్ ముఖాన్ని చూపించలేదు. ఈ ఘటనపై గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ దుర్గాపూజ వేడుకల్లో అవమానానికి గురయ్యాను. చాలా మనస్తాపం చెందాను. ఓ గవర్నర్కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ముఖ్యమంత్రి నాకు ఇవ్వలేదు. వేదిక చివర్లో నాకు సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్లలో నేను ఒక్కసారి కూడా కనిపించలేదు. అవమానం జరిగింది నాకు ఒక్కడికే కాదు. బెంగాల్ ప్రజలందరిని మమతా అవమానించారు. నేను ప్రజల సేవకుడిని.. రాజ్యాంగబద్దంగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని అభినందిన్నాను. నాకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఆశిస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధంఖర్ పేర్కొన్నారు. -
‘దేవుని ప్రత్యేక బిడ్డను.. అలాంటివి పట్టించుకోను’
కోల్కతా : తాను దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. శుక్రవారం తన భర్త నిఖిల్ జైన్తో కలిసి నుస్రత్ చల్తాబాగన్లో బెంగాలీ హిందు సంప్రదాయమైన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సింధూర్ ఖేలా వేడుకలో సింధూరం ధరించారు. బెంగాల్లో నవరాత్రుల అనంతరం అక్కడి మహిళలు ఈ దుర్గా పూజలో పాల్గొంటారు. అందరికి మంచి జరగాలని దుర్గాదేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నుస్రత్ కూడా నుదుటన కుంకుమ ధరించి పూర్తి హిందూ సంప్రదాయంలో కనిపించారు. అయితే ముస్లిం మహిళ ఇలా చేయడమేంటంటూ ఇప్పటికే అనేకమార్లు నుస్రత్ చర్యలను సంప్రదాయవాదుల తప్పుబట్టిన విషయం తెలిసిందే. మత సంప్రదాయాలకు విరుద్ధంగా నుస్రత్ ప్రవర్తిస్తుందని ఇస్లాంను కించపరచడానికే ఇలా చేస్తుందంటూ ఓ మతాధికారి విమర్శించారు. అంతేగాకుండా ఇకపై ముస్లిం పేరును కొనసాగించవద్దని, వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించారు. కాగా పూజా కార్యక్రమం అనంతరం నుస్రత్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రేమ, మానవత్వానికే అన్నింటికంటే ఎక్కువ గౌరవం ఇస్తానని ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పానని స్పష్టం చేశారు. తను దేవుని బిడ్డనని, తనపై వచ్చిన విమర్శల గురించి ఎప్పటికీ పట్టించుకోనని కొట్టిపారేశారు. ముస్లిం మహిళ అయినప్పటికీ.. హిందూ మతానికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్తానని ఎంపీ తెలిపారు. అదే విధంగా దుర్గ పూజలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. బెంగాల్లో పుట్టి పెరిగిన తను సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తానని, అన్ని మతాల ఉత్సవాలను జరుపుకొంటానని అన్నారు. కాగా నటిగా కెరీర్ ప్రారంభించిన నుస్రత్ 2019 లోక్సభ ఎన్నికల్లో అధికార టీఎంసీ తరఫున గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. -
దసరా వేడుకల్లో బాలీవుడ్ తారలు
-
మరోసారి వార్తల్లో నూస్రత్..ధాక్తో సందడి
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. కోల్కతాకు చెందిన పారిశ్రామిక వేత్త, భర్త నిఖిల్ జైన్తో కలిసి దుర్గా పూజలో సందడి చేశారు. ఎంపీ అయిన తరువాత తొలిసారి బెంగాల్లో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట దుర్గాదేవికి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ కూడా వాయించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ జైన్లో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని తాను అమ్మవారిని ప్రార్థించారని నూస్రత్ తెలిపారు. మనమంతా బెంగాల్ కుటుంబంలో భాగమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన వెంటనే కోల్కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్ను పెళ్లాడి, కొత్త పెళ్లి కూతురుగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసి వార్తల్లోనిలిచిన సంగతి తెలిసిందే. ఎంపీ నూస్రత్ జహన్, నిఖిల్ జైన్ దంపతులు View this post on Instagram Playing dhaak for the first time with my wonderful wifastic @nusratchirps @suruchisangha #aroopbiswas A post shared by Nikhil Jain (@nikhiljain09) on Oct 6, 2019 at 1:21am PDT -
బాలాకోట్ దాడులను కళ్లకు కట్టేలా దుర్గా మండపం
కోల్కతా : దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలను వైవిథ్యభరితంగా తీర్చిదిద్దే భక్తులు ఈసారి బాలాకోట్ వైమానిక దాడులను థీమ్గా ఎంచుకుని మండపం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. కోల్కతాలోని ఓ దుర్గాపూజా కమిటీ భారత వైమానిక దళం బాలాకోట్లో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన ఘటనను థీమ్గా ఎంచుకుంది. 50 ఏళ్లుగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కోల్కతాలోని యంగ్ బాయ్స్ క్లబ్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ క్లే మోడల్స్, డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా వైమానిక దాడులను ప్రజల కళ్లకు కట్టేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. మండపం ఎంట్రన్స్లో వైమానిక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకోవడం, ఉగ్రవాదులు మరణించిన, పారిపోతున్న దృశ్యాలు, వాటిపై ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతుంటేలా 65 మోడల్స్తో డిస్ప్లే ఏర్పాటు చేశామని కమిటీ ప్రతినిధి విక్రాంత్సింగ్ వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లైఫ్సైజ్ మోడల్ సందర్శకులను పలుకరించలేలా అమర్చుతున్నామని చెప్పుకొచ్చారు. -
అందరు చూస్తుండగానే.. రౌడీ షీటర్ హత్య
అలహాబాద్ : ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో ఓ రౌడీషీటర్ను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలహాబాద్లోని రాజాపూర్ కాలనీలో దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అందరు చుస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధంచి దృశ్యాలు సీసీ కెమెరాలో రాకార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని నీరజ్ బాల్మీకిగా గుర్తించారు. అతనిపై రౌడీషీటుందని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
దసరా వేడుకలపై ఉగ్ర పంజా..?
కోల్కతా : దసరా వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని దుర్గా మంటపాలపై ఉగ్రమూకలు దాడులతో విరుచుకుపడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తర బెంగాల్లోని జల్పాయిగురి, కూచ్బెహర్, అలీపుర్దూర్, సిలిగురి ప్రాంతాల్లో దాడులకు బంగ్లాదేశ్కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. నలుగురు జేఎంబీ ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని, అలీపుర్దూర్, జల్పాయిగురి, సిలిగురిల్లో భీకర దాడులను చేపట్టాలన్నది వీరి లక్ష్యమని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఇద్దరు జేఎంబీ ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహర్ జిల్లా దిన్హత ప్రాంతంలో ఉన్నారని, రెండ్రోజుల్లో మరో ఇద్దరు భారత భూభాగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. నేపాల్ నుంచి జేఎంబీ ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలను సేకరించారని నివేదిక అంచనా వేసింది. గతంలో 2014లో బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాలో దుర్గా పూజ వేడుకల్లో జరిగిన పేలుడుతో రాష్ట్రంలో జేఎంబీ స్లీపర్ సెల్స్ చురుకుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. -
దుర్గా నవరాత్రోత్సవాలు..
-
స్త్రీలోక సంచారం
♦ లెగ్గింగ్స్, యోగా ప్యాంట్ ధరించి పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థినులను యు.ఎస్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో అనేక పాఠశాలల యాజమాన్యాలు కటువుగా శిక్షించడంపై అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిమ్కు, వర్కవుట్లకు అనువుగా ఉండే ‘అథ్లెష్యూర్’ ఫ్యాషన్ ట్రెండ్ దుస్తులను ధరించి పాఠశాలకు రాకూడదని గత మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది విద్యార్థినులు వాటిని లక్ష్యపెట్టకుండా అవే దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నందున వారిపై చర్య తీసుకోవడం తప్పడం లేదని పాఠశాలలు చెబుతుండగా.. కొందరి విషయంలో మాత్రమే స్కూళ్లు ఈ విధమైన వివక్షను పాటిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ♦ 98 ఏళ్ల ‘మిస్ అమెరికా’ అందాల పోటీల చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలను నడిపించిన ఘనత నిర్వాహకులకు దక్కినప్పటికీ.. ఆ పోటీలను టీవీలో చూసే వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోల్చి చూస్తే 19 శాతం తగ్గినట్లు ప్రముఖ సర్వే కంపెనీ ‘నీల్సన్’ వెల్లడించడంతో వచ్చే ఏడాది మళ్లీ స్విమ్ సూట్ రౌండ్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి! సాధారణ పరిస్థితుల్లోనే టీవీలో అందాల పోటీలను చేసేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండగా.. ఈసారి స్విమ్ సూట్ రౌడ్ను తొలగించడంతో.. గత ఏడాది 50 లక్షల 35 వేలుగా ఉన్న టీవీ వీక్షకులు ఈ ఏడాది 40 లక్షల 34 వేలకు పడిపోయారని నీల్సన్ తన సర్వే ఫలితాల్లో తెలిపింది. ♦ లెబనాన్ (పశ్చిమాసియా) రాజధాని బీరుట్కు రోడ్డు మార్గంలో 20 నిముషాల ప్రయాణ దూరంలో ఉన్న జియాలోని ఓన్లీ ఉమెన్ ‘బెలెవ్యూ బీచ్ క్లబ్’లో ఏ ఆంక్షలూ లేకుండా మహిళలకు ఇప్పటి వరకు కల్పిస్తున్న ప్రవేశానికి ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అసలు మగ దృష్టే పడని, స్త్రీలకు మాత్రమే అయిన, అది కూడా లెబనాన్ దేశ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ క్లబ్బులోకి మహిళలు బికినీ సహా, ఏ విధమైన వస్త్రధారణతోనైనా వచ్చి, ఆహ్లాదంగా విహరించే అవకాశం ఉండగా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఎండపూట ఇసుకలో బేర్ బ్యాక్స్తో, బేర్ ఫ్రంట్స్తో సూర్యస్నానాలు చేసే వీలు కల్పించారు. ♦ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వాటికన్ సిటీలో జాతీయ క్యాథలిక్ బిషప్ల సదస్సును నిర్వహిస్తున్నట్లు వాటికన్ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. యు.ఎస్., చిలి, ఆస్ట్రేలియా, జర్మనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని క్యాథిలిక్ చర్చి బిషప్లు.. పిల్లలపై, నన్లపై అత్యాచారం జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికన్ ప్రతిష్టను తిరిగి నిలుపుకోవడం కోసం పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా పూనుకుని ఈ సదస్సును తలపెట్టారు. ♦ గత ఏడాది మొహర్రం రోజు దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఆదేశాలు జారీ చేసి, ముస్లింల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఏడాది కోల్కతాలోని 3,000 దుర్గాపూజ కమిటీలతో సహా, రాష్ట్రంలోని 28,000 కమిటీలకు.. ఒక్కో కమిటీకి 10,000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేసింది. అయితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విధమైన హిందూ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు తప్ప, వారిపై ఆమె ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
భక్తులకు మెరుగైన సేవలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : దుర్గమ్మ దర్శనంలో భక్తులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చెప్పవచ్చని ఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. మహా మండపం సమీపంలోని చాంబర్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత అర్జున వీధి మీదుగా మహా మండపానికి చేరుకున్న ఆమెకు ఏఈవో అచ్యుతరామయ్య, పలువురు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా నేరుగా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. పాలక మండలి సభ్యులు ఈవో కోటేశ్వరమ్మకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో విలేకర్లతో మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం, మెరుగైన సేవలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని తెలిపారు. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ దుర్గమ్మ బిడ్డలేనని పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి చక్కటి దర్శనంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్చకులు , ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని వెల్లడించారు. ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేయడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ , వారి ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తానని వివరించారు. ఇక దాతల సౌకర్యార్ధం టీటీడీ తరహాలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల మనోబావాలు దెబ్బతిసేలా కొంత మంది ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీని వల్ల తరుచూ అనేక గొడవలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆలయ సిబ్బంది అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇక దేవస్థానంలో జరుగుతున్న వివాదాలను ఇకపై జరగకుండా ప్రతి చోటా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు కోటేశ్వరమ్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, శంకరబాబు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రతిష్ట పెంచడమే లక్ష్యం
దుర్గగుడి ప్రతిష్టను పెంచడమే లక్ష్యమని ఐఆర్ఎస్ అధికారి వీ కోటేశ్వరమ్మ అన్నారు. ఆలయ ఈఓగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. అవినీతిని అరికట్టేందుకు దృష్టి సారిస్తానన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సాక్షి,విజయవాడ: రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద దేవాలయం దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా వరుసగా మూడోసారి మహిళా అధికారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల కొందరి చేష్టలు ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలి మహిళా అధికారి సూర్యకుమారి తాత్రింక పూజలపై విమర్శలు రావడంతో బదిలీ కాగా, పాలకమండలి సభ్యురాలు చీర మాయం చేసిన ఘటనలో సంబంధం లేకపోయినా రెండో మహిళా అధికారి ఎం.పద్మపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో మరో మహిళా అధికారి వి.కోటేశరమ్మ ఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆమె తీసుకునే చర్యలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: దుర్గగుడిలో అవినీతి వ్యవíస్థీ్థకృతమైపోయింది. దీన్ని ఏ విధంగా అరికడతారు? కోటేశ్వరమ్మ: కింది స్థాయి ఉద్యోగిపైనా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతాను. అవినీతి జరిగేందుకు అవకాశాలు ఉన్న విభాగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాను. పాలన పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం. సాక్షి:దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. వారి వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? కోటేశ్వరమ్మ: పాలనా విధానంలో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తా. దేవాలయం ప్రతిష్ట పెంచడమే నా ప్రధాన ధ్యేయం. భక్తులకు మెరుగైన సేవలు అందించే విషయంలో రాజీ పడను. దీనికి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నా. ఇబ్బంది కలిగించే వారిపై కఠినంగా ఉండటానికి వెనుకాడను. సాక్షి:దేవస్థానంలో జరిగే పొరపాట్లకు ఈఓనే బాధ్యత వహించాల్సి వస్తోంది. మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? కోటేశ్వరమ్మ: ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాను. భక్తులకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: ఒకవైపు అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. మరోకవైపు నిధులు కొరత వెంటాడుతోంది? ఎలా అధిగమిస్తారు? కోటేశ్వరమ్మ: దేవస్థానం అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం తప్పకుండా తీసుకుంటాను. అలాగే దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: భక్తుల కష్టాలు ఏ విధంగా తెలుసుకుంటారు? కోటేశ్వరమ్మ: గతంలో నవరాత్రులలో దుర్గగుడికి వచ్చాను. అప్పుడు భక్తులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశా. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చూస్తా. సాక్షి: త్వరలో జరగబోయే దసరా ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు? కోటేశ్వరమ్మ: దసరా ఉత్సవాల నిర్వహణకు అందరి సహకారం అవసరం. గతంలో దేవాదాయశాఖలో పని చేసినందున ఆ అనుభవం కూడా ఉపయోగపడుతుందని భవిస్తున్నా. దసరా ఉత్సవాల్లో భక్తుల అవసరాలకే ప్రధాన ప్రాధాన్యం. సాక్షి:పరిపాలనా వ్యవహారాల్లో పాలకమండలి జోక్యం ఎక్కువగా వుంటోందని తెలుస్తోంది. కోటేశ్వరమ్మ: వారి గురించి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటీవలే పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాలకమండలికి చెప్పినట్లు పత్రికల్లోనే చూశాను. సాక్షి: పాలకమండలి సభ్యుల వల్ల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది? దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? కోటేశ్వరమ్మ: ప్రతిఒక్కరూ దేవస్థానం ప్రతిష్ట పెంచేందుకే కృషి చేయాలి. పాలకమండలి ఏ విధంగా ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. -
ఈ పాఠం మన పిల్లలూ చదవాలి
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు. ‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్. సంధ్య సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ. దుర్గాభవానీ సికింద్రాబాద్లోనే రసూల్పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు. కష్టంతోనే జీవితం ‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’. – సంధ్య తప్పకుండా ఐపీఎస్ అవుతా ‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్ను అయితీరుతాను. – దుర్గాభవానీ చదువుల గుడి మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం. సంధ్య ఫోన్ నెంబరు: 9959132466 దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698 -
నైవేద్యంగా నాలుక అర్పించింది...
భోపాల్ : ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దేవతపై నమ్మకంతో భక్తి పేరిట ఓ మహిళ తన నాలుకను కోసి నైవేద్యంగా సమర్పించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని తార్సామా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడ్డీ తోమర్ అనే 45 ఏళ్ల వివాహిత దుర్గా మాతకు పరమ భక్తురాలు. తార్సామా గ్రామంలో ఉన్న బిజసేన్ మాత ఆలయాన్ని ప్రతి రోజూ సందర్శించడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలోనే బుధవారం ఆలయానికి వెళ్లిన తోమర్ తన నాలుకను కోసి అమ్మవారికి నైవేద్యంగా అర్పించింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో పక్కనే ఉన్న ఇతర భక్తులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దేవుడిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికే ఆమె ఇలా ప్రవర్తించిందని.. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. పెళ్లైన నాటి నుంచి అంతే.. ఈ ఘటనపై తోమర్ భర్త రవి తోమర్ మాట్లాడుతూ.. తన భార్య దుర్గాదేవి భక్తురాలని చెప్పారు. పెళ్లైననాటి నుంచి ఆమె ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బిజసేన్ ఆలయానికి వెళ్తుందని తెలిపారు. అయితే బుధవారం కూడా ఆలయానికి వెళ్లిందని.. ప్రార్థనా సమయంలో అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని వాపోయాడు. -
వివాదాస్పద చిత్రం.. విడుదలవుతోంది
సాక్షి, తిరువనంతపురం : టైటిల్తో వివాదంలో నిలిచిన చిత్రం ‘ఎస్ దుర్గ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైపోయింది. మార్చి 23న చిత్రం కేరళలో విడుదల కానుంది. సెక్సీ దుర్గ, న్యూడ్.. కధేంటి? సోమవారం సాయంత్రం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ చేతుల మీదుగా క్యాంపెయిన్ను చిత్ర దర్శకుడు సనాల్ కుమార్ శశిధరన్ మొదలుపెట్టాడు. చిత్రంలోని చిన్న చిన్న వీడియో బైట్లతో ఆయా వాహనాలు సినిమా గురించి రాష్ట్రం మొత్తం ప్రమోషన్ చేస్తాయి. ఇక సెక్సీ దుర్గ టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డుల వేడుకల్లో(లండన్, హాంకాంగ్ తదితర) ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అయితే టైటిల్ కాస్త అభ్యంతరకరంగా ఉందంటూ ఇఫ్ఫీ వేడుకల జాబితా నుంచి ఆ చిత్రాన్ని తొలగించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. బోర్డు వ్యవహారాన్ని తప్పుబడుతూ పలు భాషల నటీనటులు చిత్ర మేకర్లకు అండగా నిలిచారు. ఆపై సినిమా పేరును ఎస్ దుర్గగా మారుస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కూడా చిత్ర విడుదలకు అభ్యంతరం తెలిపింది. చివరకు ఆందోళనల నేపథ్యంలో తగ్గిన బోర్డు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇస్తూ రీలీజ్కు అనుమతించింది. అర్ధరాత్రి ఓ యువతి ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్ దుర్గ చిత్రం తెరకెక్కింది. -
దుర్గమ్మ చెంతకు ఆర్జిత సేవలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం): దుర్గగుడి ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి మొవ్వ పద్మ తనదైన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో జరుగుతున్న పలు ఆర్జిత సేవలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు పాలకమండలి సభ్యుల ఆమోదాన్ని పొందారు. బుధవారం మాడపాటి సత్రంలో పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. దుర్గగుడిపై త్వరలోనే కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహా మండపంలోని, 3, 4 అంతస్తులోకి దేవస్థాన పరిపాలనా విభాగాన్ని తీసుకువచ్చేందుకు ఈవో పద్మ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు శివరాత్రికి మల్లేశ్వరాలయ పనులు పూర్తికానందున ప్రత్యేక పూజలు, కల్యాణాన్ని నిలిపివేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దీనిపై పాలకమండలి కూడా ఆమోదం తెలిపింది. కెనాల్రోడ్డులో జరిగే రథోత్సవంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు యధావిథిగా పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26వ తేదీ మల్లేశ్వరస్వామి ఆలయ కళాన్యాస కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీ ఆమోదముద్ర తెలిపింది. ఆలయ పరిసరాలలోనే ఆర్జిత సేవలు శాంతి కల్యాణాన్ని రాజగోపు రం ఎదురుగా ఉన్న ఆశీర్వచన మండపంలోని, ఆశీర్వచన మం డపాన్ని ఆలయ ప్రాంగణంలోని కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలోకి, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని జై గంట వద్దకు, అష్టోత్తర, సహస్రనామార్చన పూజ లను అన్నదానం క్యూకాంప్లెక్స్లోకి, నటరాజ స్వా మి ఆలయ సమీ పంలోని యాగశాలలో రుద్రహోమం నిర్వహించాలని నిర్ణయించారు. అన్న ప్రా సనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలను ఇకపై నటరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మల్లికార్జున మహామండపం తూర్పు భాగా న షెడ్డు నిర్మాణం చేయాలని దేవస్థానం నిర్ణయించింది. పాలకమండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్కు పంపనున్నారు. అంతరాలయ టికెట్ ధర తగ్గింపునకు ప్రతిపాదన అంతరాలయ టికెటు ధరను రూ.300 నుంచి రూ.250కి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పాలకమండలి మరో మారు ప్రభుత్వాన్ని కోరింది. అంతరాలయంలో జరిగే త్రికాల అర్చనలో మూడు షిప్టులలో రెండు షిప్టులను మాత్రమే అంతరాలయంలో నిర్వహిం చాలని, ఉదయం 11 గంటలకు జరిగే త్రికాల అర్చనను ఆల య ప్రాంగణంలో నిర్వహిస్తే భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఉండబోవని పాలక మండలి భావిస్తుంది. దాతలకు మరిన్ని సదుపాయాలు ఆలయ అభివృద్ధితోపాటు అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతలకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది. రూ.లక్ష పైబడి రూ. 2లక్షలలోపు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదిలో రెండు పర్యాయాలు అమ్మవారి దర్శనం చేసుకునేఅవకాశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఆరుగురు సభ్యులకు మాత్రమే ఈ అవకాశాన్ని 10 ఏళ్లపాటు కల్పిస్తామన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన దాతలకు ప్రతినెలా ఒకసారి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా అనుమతిస్తామ న్నారు. రూ. 5 లక్షలు పైబడి విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక పాస్ను మంజూరు చేసి ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. టెండర్ నిబంధనలకు సవరణ ప్రస్తుతం దేవస్థానానికి సరుకులు పంపిణీ చేసేందుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు రూ.10 కోట్లు టర్నోవర్ ఉండాలనే నిబంధనలను పాలకమండలి సవరించింది. ఏడాదికి టర్నోవర్ను రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించడం వల్ల మరింత మంది వ్యాపారులు టెండర్ల పక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు. ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కమిషనర్కు పంపడం జరిగింది. -
‘నాడు కిరీటం చోరీ.. నేడు క్షుద్రపూజలు..’
సాక్షి, విజయవాడ : కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి కిరీటం చోరీకి గురైందని, ఇప్పుడు ఏకంగా గర్భగుడిలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలోనూ ఎక్కడలేని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేయకుంటే ఆందోళన చేపడతామని రఘువీరా హెచ్చరించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు.. చంద్రబాబు హయాంలోనే జరిగాయి. పొద్దున లేస్తే దుర్గగుడి ఫ్లైఓవర్ నా కల అని చెప్పుకుంటారాయన. మరి పనులు చూస్తే ఎక్కడిక్కడే నిలిచాయి. నాడు హైదరాబాద్లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ విషయంలోనూ ఎనిమిదేళ్లు కాలయాపన చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిచేసింది. ప్రస్తుతం టీడీపీ దృష్టంతా దోపిడీపైనే ఉందితప్ప అభివృద్ధిపై కాదు. రాజధానిలో ఎక్కడిక్కడ కబ్జాలు, దందాలు.. ఇవే సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తోన్నపనులు! మార్చిలోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకుంటే ఏప్రిల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరవధిక దీక్షలకు దిగుతాం’’ అని రఘువీరా రెడ్డి అన్నారు. -
మళ్లీ ఐఏఎస్ అధికారి
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మొవ్వ మండలానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ మొవ్వ పద్మ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లదేవస్థానం (దుర్గగుడి) ఈఓ బాధ్యతలతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజలకు బాధ్యురాలిని చేస్తూ తొలి మహిళా ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ఈఓ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. మళ్లీ ఈఓగా మహిళా ఐఏఎస్ అధికారినే నియమించింది. ఆధార్ అనుసంధానంలో.... పద్మ కృష్ణాజిల్లాలో జన్మించినా విద్యాభాసం తిరుపతిలోనే జరిగింది. ఎస్వీ యూనివర్పీటీలోనే పీజీ, పీహెచ్డీ చేశారు. 1993లో గ్రూపు–1 అధికారిగా ఉద్యోగంలో చేరారు. 2004 బ్యాచ్లో ఐఏఎస్ అధికారిగా మారారు. దశాబ్ద కాలంగా ల్యాండ్ రికార్డ్స్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖలో వివిధ హోదాల్లో పద్మ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలు సక్రమంగా అందేందుకు వీలుగా సెంట్రర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ తయారీలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ పథకాలను ఆధార్తో అనుసంధానం చేయడంలో కృషి చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె భర్త వి.వి.ఆర్.ప్రసాద్ ఈసీఐఎల్లో డీజీఎం గాపని చేసి ఉద్యోగవిరమణ పొందారు. అమ్మవారి దయతో అన్నీ చక్కదిద్దుతా ఈఓగా నియమితులైన పద్మ ‘సాక్షి’తో మాట్లాడారు. అమ్మవారి దయతో దుర్గగుడిలోని అన్ని సమస్యలను చక్కదిద్దుతానన్నారు. వచ్చేవారం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. కనకదుర్గమ్మకు సేవ చేసే అవకాశం రావడంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధే తనకు ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. -
చంద్రబాబు సర్కార్ తీరుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లకు ఉన్నతాధికారుల నియామకంపై ఆయన సునిశిత విమర్శ చేశారు. గతంలో ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరే (ఎండీ) లేని పరిస్థితిలో పని చేసిందని.. తర్వాత ఆ పదవిలో నియమించిన ఐఏఎస్ అధికారి పద్మను కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అక్కడ నుంచి బదిలీ చేసి, ఆమెకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని ఐవైఆర్ ట్విటర్ ద్వారా తప్పుపట్టారు. దాదాపు రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా కనీసం ఐఏఎస్ అధికారిని కూడా నియమించకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఆ బాధ్యతల్లో నియమించారని దుయ్యబట్టారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. Brahmin Corp without MD for six months then padma was posted . With in six month transferred and kept additional charge.kapu Corp 1000 cr budget managed by j d level officer . So much for the commitment of govt to these two communities who whole heatedly voted them to power. — IYR KrishnaRao Former CS GoAP (@IYRKRao) 23 January 2018 -
దుర్గగుడి నూతన ఈవోగా పద్మ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ దుర్గ గుడి ఆలయ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారిణి డాక్టర్ ఎం.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పద్మ ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2004 బ్యాచ్కు చెందిన ఆమె మరో రెండు రోజుల్లో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రోడ్డు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రశాద్, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, (జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు), ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ను ప్రభుత్వం రిజర్వ్లో ఉంచింది. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. -
దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఘాట్రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు. -
అర్ధరాత్రి పూజలు
-
దుర్గమ్మ గుడిలో జరిగింది ఏంటి!
-
‘దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు వాస్తవమే’
సాక్షి, విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలపై పాలకమండలి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తవమేనని పాలకమండలి పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇటువంటి ఘటనల వల్ల భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ఆలయ ఈవో సూర్యకుమారి తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకే ఇటువంటి పూజలు నిర్వహించారని పాలకమండలి ఆరోపించింది. ఈవో సూర్యకుమారికి తెలిసే ఇదంతా జరిగిందని, ఆమె చెప్పడం వల్లే పూజలు, అలంకారం చేశామని బయట వ్యక్తులు చెబుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలో ఈవో ఘాట్రోడ్లోని పర్ణశాలలో హోమగుండాలు ఏర్పాటు చేసి క్షుద్రపూజలు చేశారని, ఆమె వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉందని పాలకమండలి ఆరోపణలు చేసింది. ఆలయ ప్రతిష్టను ఈవో సూర్యకుమారి దిగజార్చారని, ఆలయంలో అర్థరాత్రి పూజలపై గత నెల 30న జరిగిన సమావేశంలో ప్రశ్నిస్తే ఆమె అన్నీ అబద్ధాలు చెప్పారని, అలాగే టెండర్ల విషయంలోనూ ఈవో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని పాలకమండలి చెప్పుకొచ్చింది. ఈవోపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బయటి వ్యక్తులు అంతరాలయంలోకి వెళ్లడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవో సూర్యకుమారి ప్రెస్మీట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆ..ఆలయంపై ఉగ్రవాదులు దాడి!?
సాక్షి, పట్నా : ఉగ్రవాదులు మరోసారి దేశం మీద దాడికి తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ దఫా దేశంలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే సూచనలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ దఫా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రదాడికి తెగబడొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు బీహార్లోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక ఆలయం అయిన మాతా తవవాలి ఆలయం మీద దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది. గోపాల్గంజ్ జిల్లాలోని ఈ ఆలయంలో దుర్గా మాత కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ, 14వ శతాబ్దంలో చేర రాజులు నిర్మించారు. లష్కరే తోయిబాకు చెందిన స్లీపర్ సెల్ ఉగ్రవాది.. షేక్ అబ్దుల్ నయీమ్ కొంత కాలంగా ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గోపాల్గంజ్ జల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు.. పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే దుర్గామాత ఆలయానికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. ఈ ఆలయంలోని దుర్గామాతను దర్శించేందుకు బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, పశ్చిమ బెంగాల్ నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. -
భవానీలతో ఇంద్రకీలాద్రి కిటకిట
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీలతో కిటకిటలాడుతోంది. దీక్ష విరమణ చేయటానికి భారీ సంఖ్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం 68వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజైన సోమవారం తెల్లవారుజాము నుంచే భవానీల తాకిడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భవానీలతో కృష్ణాతీరం ఎరుపెక్కింది. ఘాట్లలో పుణ్యస్నానాల అనంతరం భవానీలు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అనంతరం దీక్ష విరమణ చేసి హోమగుండాల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీక్ష విరమణ చేసే మహామండపంలో ఎక్కువ మంది సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందిగా మారిందని భవానీలు వాపోతున్నారు. -
పవిత్ర సంగమం వద్ద మరోసారి నిర్లక్ష్యం
-
బాహుబలి మాహిష్మతి రాజ్యంలో దుర్గాదేవి
-
నిబ్బరంగా సాగుదాం!
యావద్భారతం దసరా సంబరాల్లో తేలియాడుతోంది. దుష్టసంహారిణి దుర్గ తొమ్మిది రోజుల భీకర సంగ్రామం తర్వాత లోక కంటకుడైన మహిషాçసురుని కడతేర్చి నేల నాలుగు చెరగులా శాంతి సౌఖ్యాలను వెలయించిన రోజు విజయ దశమి. హిందువుల పండుగే అయినా దసరా వేడుకల అంతస్సారం, అంతర్నిహిత సందేశం మతాలకతీతం, లౌకికం, సార్వత్రికం. చెడుపై మంచి విజయం అనివార్య మనే సార్వత్రిక సత్యం ఎవరిలో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నింపదు, ఎంతటి నైరాశ్యపు ఎడారి బతుకుల్లో ఆశల పూలను పూయించదు? భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరైన భారతంలోని అత్యధిక సంఖ్యాకుల హిందూ మతంలోనే ఉన్న ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా దసరా ఉత్సవాల్లో ప్రస్ఫుటంగా కనిపి స్తుంది. అయితే ఎక్కడైనా దసరా అంటే శక్తి పూజే. శక్తి స్వరూపిణిగా మహిళ విశ్వ రూపాన్ని ఆవిష్కరించే సమయమే. ఎంతటి వారైనా ఆమె ముందు మోకరిల్లే సందర్భమే. అందుకే ఇది ‘ఆమె’కు మనం చూపుతున్న స్థానం ఏది? అని ప్రశ్నించు కోవాల్సిన సందర్భం అయింది. చెడుపై మంచి విజయం అనివార్యమేనా? అసలు సాధ్యమేనా? అని అడుగడుగునా రేగే సందేహాలకు సమాధానాలను వెతకాల్సిన సమయమూ అయింది. దేశ జనాభాలోని మహిళల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. 1971లో 15–34 ఏళ్ల వయస్కులైన వెయ్యి మంది యువకులకు 961 మంది యువతులుగా ఉన్న నిష్పత్తి, 2011 నాటికి 939కి పడిపోయిందనీ, అది 2021 నాటికి 904కు, 2031 నాటికి 898కి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనా. ఇప్పుడు హారతులెత్తుతున్న ఆ అమ్మలగన్న అమ్మకు ప్రతిరూపమైన ఎందరు అమ్మల కడు పున ఊపిరి పోసుకుంటున్న శక్తులను చిదిమేసి, కళ్లయినా తెరవని పసి శక్తుల గొంతులు పిసికేసి ఇంతటి ఘనతను మూటగట్టుకుంటున్నాం? చెడును పరిమార్చే ఆ అమ్మ ఈ దురాగతాన్ని సహిస్తుందా? మొక్కులు చెల్లించామని మన్నిస్తుందా? విద్య, ఉద్యోగావకాశాల్లో ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షను అధిగమించి మరీ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు 2014–15 మధ్య 51 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగులుగా ఎంతటి ప్రతిభను, సమర్థతను కనబరుస్తున్నవారైనా 74 శాతం ఇలాంటి వేధింపులపై అసలు ఫిర్యాదే చేయరంటే పర్యవసానాల భయం ఎలాం టిదో ఊహించుకోవచ్చు. విద్యావంతులైన, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితే ఇలా ఉంటే ఇళ్లలో, వీధుల్లో, విద్యాలయాల్లో మహిళలపై సాగే వేధింపులు, హింస, అత్యాచారాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పనవసరం లేదు, గణాంకాలు ఏకరు వు పెట్టాల్సిన అవసరమూ లేదు. శక్తి స్వరూపిణిగా మహిళను ఆరాధించే మనం మన సొంత కూతుళ్లు, అక్కచెల్లెళ్లు, కన్న తల్లి, కట్టుకున్న ఆలి, సహాధ్యాయిని, తోటి ఉద్యోగిని, శ్రామికురాలు, ఎవరైతేనేం మహిళను పురుషునితో సర్వ సమానమైన మనిషిగా చూడగలుగుతున్నామా? గౌరవించగలుగుతున్నామా? నునులేత మొహా లపై యాసిడ్ సీసాలు విసిరి, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడి, ఆత్మ హత్యలకు పురిగొల్పి ఏ మొహం పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం వెళు తున్నాం? ఆ మహిషాసురమర్దని పట్ల చూపే భక్తిప్రపత్తులపై ఈ రాక్షసత్వం ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయా? ఈ పరిస్థితిని భరిస్తున్న సమాజంగా మనం ఆ శక్తి స్వరూపిణి ముందే కాదు, భారత స్త్రీ శక్తి ముందు కూడా దోషులం కాకుండా పోతామా? దేవీ నవరాత్రి ఉత్సవాల నిజ స్ఫూర్తిని గ్రహించగలిగితే, చెడుపై పోరాటం చేయడానికి వెనుకాడటం, చెడు చేయడంతో సమానమేనని గ్రహించే వాళ్లం కాదా? ‘ఈ ప్రపంచం ప్రమాదకరంగా తయారైంది దుష్టులవల్ల కాదు, వారి దుష్కృత్యాలను చూస్తూ ఏమీ చేయని వారి వల్ల (ఐన్స్టీన్).’ నేడైనా ఆ పోరుకు దిగి, విజయాన్ని కోరి ‘ఆయుధ పూజ’ చేద్దాం. శమీ వృక్షాన్ని పూజించడమైనా, రావణ దహనమైనా చెడును నిర్జించడానికి ప్రతిన బూనడానికి సంకేతాలే తప్ప అర్థ రహితమైన ఆరాధనా కాదు, వినోదం అంతకన్నా కాదు. విజయదశమితో ఆ దుర్గమ్మ తల్లి మíß షాసుర సంహారం ముగుస్తుంది. నేడు చేసే ఆయుధ పూజ విజయాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపి, ఇనుమడిం చిన శక్తితో మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. కానీ రేపటి నుంచి అడుగడుగునా చెడు ఎదురవుతూనే ఉంటుంది. మహిషారులు ప్రత్యక్షమౌతూనే ఉంటారు. అన్యా యం, అసమానత, అవినీతి, అజ్ఞానం, అసహనం అసమర్థత, అక్రమం, అధికార దుర్వినియోగం, దురాక్రమణ, దురాగతం, దురాచారం, మూఢనమ్మకం, వివక్ష, నిరక్షరాస్యత ఇలా ఎన్ని రూపాలలో చెడు విచ్చలవిడిగా చెలరేగి పోవడం లేదు? పేదరికాన్ని మించిన సామాజిక హింస మరేదీ లేదు. ఆ చిత్రహింసల కొలిమిలో, రోగాల పుట్టల్లో కునారిల్లుతున్న 30 కోట్ల అభాగ్యుల మాటేమిటి? నిరుద్యోగులు కావడం అంటే ఆచరణలో జీవించే హక్కును కోల్పోవడమే. కొత్త ఉద్యోగాలు వేలల్లో ఉంటే కొత్త నిరుద్యోగులు లక్షల్లో పెరుగుతున్నారు. ఈ భూతాలను ఎవరు పరిమార్చాలి? అవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులే, 70 ఏళ్లుగా అరకొరగా చేసీ చేయకుండా వదిలేసిన బాధ్యతలే. అట్టహాసంగా దసరా ఉత్సవాలు జరుపుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే ప్రభుత్వాలు... దాచిన ఎన్నికల ప్రణాళికలు, చేసిన వాగ్దానాల దుమ్ముదులిపి ఈ విజయదశమినాడైనా అమలు చేయడానికి పూనుకుంటాయని, ఆ కృషిలో విజయం కోసం ప్రార్థిస్తాయని ఆశిద్దాం. అయితే ఆ పాల కులను ఎన్నుకునేది మనమే. కాబట్టి ప్రభుత్వాలు నిజంగానే ప్రజల అధికారానికి ప్రాతినిధ్య సంస్థలుగా పనిచేసేలా చేయడమూ మన బాధ్యతే. ఈ పండుగ రోజున ఇన్ని చేదు వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోవడం వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సమ కూర్చుకోవడానికే. జీవితం, సమాజం సమస్యల సుడిగుండమైనప్పుడు కావా ల్సింది గుండె దిటవు. విజయదశమి రోజున ఆ ఆదిశక్తిని కోరాల్సింది అదే. విశ్వ కవీంద్రుడు అన్నట్టు ‘ఆపదల నుంచి కాపాడమని కాదు, ఆపదలను ఎదుర్కో వాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కొనేలా చేయమని ప్రార్థిద్దాం’. -
సయ్యద్ జిలానీ @ భవానీ
ఒంగోలు , కందుకూరు : అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పేరు సయ్యద్ జిలానీ. దుర్గామాతకు వీరభక్తుడైన ఇతను మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. 24 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తూ ఏకంగా దుర్గామాత ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాడు. ఆలయంలో దూపదీప నైవేద్యాలకు, అమ్మవారి ఉత్సవాలకు లోటులేకుండా అన్నీ తానై నిర్వహిస్తున్న సయ్యద్ జిలానీ భవానీ స్వామిగా పేరుపొందాడు. గుంటూరుకు చెందిన సయ్యద్ బడేషా, హుస్సేన్బీ దంపతులకు ఆరుగురు సంతానం. చివరివాడైన సయ్యద్ జిలానీ తండ్రితో విభేదాలు తలెత్తడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ భార్యతో కలిసి కందుకూరు చేరుకున్నాడు. అంకమ్మ దేవాలయంలో ఓ చిన్న గదిలో ఉంటూ.. ఆరు నెలలపాటు భవానీ దీక్ష తీసుకున్నాడు. దుర్గమ్మ ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని, జనార్దన కాలనీకి చేరుకుని కోవూరు రోడ్డు పక్కనే 4 సెంట్ల స్థలాన్ని రూ.10 వేలకు కొనుగోలు చేశాడు. కాలనీ పెద్దలతోపాటు దాతల సాయంతో రూ.20 లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవలే మరో రూ.14 లక్షలతో భారీ శివలింగంతోపాటు, నవగ్రహాలు, నాగబంధం విగ్రహాలను ప్రతిష్టించాడు. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు పండుల సమయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిలానీ భార్య బేగంతోపాటు ముగ్గురు కుమార్తెలు దుర్గమ్మ సేవకు అంకితమయ్యారు. కుమార్తెలకు అంకమ్మ, శివనాగమ్మ, రేణుకాదుర్గ అని పేర్లు పెట్టాడు. పెద్ద కుమార్తె అంకమ్మకు మసీదులో పేష్ ఇమామ్గా పనిచేసే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. -
దానవత్వంపై దైవత్వం విజయం
పండగ దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం. జమ్మిని ఎందుకు పూజిస్తారు? శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం. రావణ దహనం ఎందుకు చేస్తారు? మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. -
కనకదుర్గాదేవి
లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం. శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!! భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు. ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు. నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం మహిషాసురమర్దిని బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి. శ్లోకం దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను. నివేదన: నువ్వులు, బెల్లమన్నం ఫలమ్: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి. -
దుర్గమ్మకు ప్రేమతో దీదీ
సాక్షి, కోల్కతా : దుర్గా నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం తెలిసిందే. మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. అయితే హైకోర్టు జోక్యంతో చివరకు ఆ ఆదేశాలు పక్కన పెట్టేశారనుకోండి. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. రచయితగా మారి ఓ పాట రాసేశారు. కోల్కతాలో దుర్గా మాతకు కమ్యూనిటీ పూజలు సాధారణంగా జరిగేవే. ఈ క్రమంలో సురుచి సంఘ పూజ కోసం మమతా పాట రాశారు. భిన్న మతాల ముత్యాలతో దేశ ఐకమత్యం.. అంటూ అద్భుతమైన సాహిత్యంతో రాయగా.. సింగర్ శ్రేయా ఘోషల్ స్వరాన్నిఅందించారు. ఇక ప్రముఖ బెంగాలీ సింగర్ జీత్ గంగూలీ సంగీతాన్ని అందించటం విశేషం. పూర్తి పాటను తన ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో మమత పోస్ట్ చేశారు. సురుచి సంఘ కోసం గతంలో కూడా దీదీ ఓసారి పాట రాయటం విశేషం. వివిధ కులాల వారు నిర్వహించే పూజల్లో ఉత్తమ పాటను ఎంపిక చేసిన వారికి అవార్డు అందించటం ఆనవాయితీగా వస్తోంది. కోల్కతా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే కార్యక్రమాల్లో సురుచి సంఘ్తోపాటు త్రిధార సమ్మిళని, కుమార్టూలి సర్బోజోనిన్ సంఘాలు ఆ పోటీల్లో ప్రధానంగా నిలుస్తుంటాయి. -
సిరుల తల్లి... కల్పవల్లి!
-
ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి
ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి. శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్. నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర ఫలమ్: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. -
సిరుల తల్లి... కల్పవల్లి!
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగు బంగారమై విజయనగర వాసులను చల్లగా కాపాడుతోంది పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 19 నుంచి మొదలయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన సిరిమానోత్సవం జరుగుతుంది. 18వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల రోజులూ అమ్మవారికి నిత్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనంగా నమ్ముతుంటారు. విజయనగర సంస్థానాధీశుల ఆడపడచు పైడిమాంబ బాల్యం నుంచి దుర్గాదేవి భక్తురాలు. కొన్ని కారణాంతరాల వల్ల ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత తన అన్న విజయరామరాజుకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు కలలో సాక్షాత్కరించి, పెద్దచెరువులో పశ్చిమదిక్కున నా విగ్రహం ఉంది. దాన్ని బయటకు తీసి, ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైంది. వెంటనే పతివాడ అప్పలనాయుడు ఊరి ప్రజలకు ఈ విషయాన్ని వివరించి పెద్దచెరువులో వెతకగా జాలరి వలలో విగ్రహం బయటపడింది. దానిని బయటకు తీసి ఆ పెద్దచెరువు వద్దనే (ప్రస్తుతం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి)లో ప్రతిష్టించారు. తర్వాతకాలంలో భక్తుల సౌకర్యార్ధం మూడులాంతర్లు వద్ద చదురుగుడిని నిర్మించి పైడిమాంబను ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి అప్పలనాయుడు వంశీకులే ఏటా సిరిమానును అధిష్టించి అమ్మ అంశగా పూజలందుకుంటున్నారు. స్థ్ధానిక రైల్వేస్టేషన్కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేపల సంగమ వృక్షం ఉంది. దానికిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు. దారి చూపించే దేవత సిరిమానుకు కావాల్సిన చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని నమ్మకం. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను డెంకాడ మండలం ముంగినాపల్లి రోడ్డులో ఉన్న రెడ్డికవాని పేట గ్రామంలో వెలిసింది. సిరిమాను, ఇరుసుమాను ఒకేచోట కనిపించాయి. ఇలా జరగడం ఇదే ప్రథమం. సిరిమానుకు పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని హుకుంపేటకు తరలించి, అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్ధం చేస్తారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. తొలేళ్ల సంబరాలు సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలను చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది. రాబోయే ఏడాది కాలంలో జరిగే మంచి, చెడులను పలుకుతుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తుంది. అమ్మవాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. విజయదశమి తర్వాతనే ఉత్సవం ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మ దీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు. సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసినందుకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడనుంచి డప్పు వాయిద్యాలతో మహారాజకోట పశ్చిమభాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. విలక్షణమైన రథోత్సవం సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్ధానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులుగా వ్యవహరిస్తూ, అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై చల్లుతూ ఉంటారు. భక్తులు వారిపై పళ్లూ పూలూ విసురుతారు. ఇలా చేరుకోవాలి... హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైలు ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకున్న వారు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులున్నాయి. ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడు లాంతర్లు వద్ద చదురుగుడిలో అమ్మవారిని సందర్శించవచ్చు. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
అమ్మవు నీవె... అఖిల జగాలకు
ఈ అమ్మ కడుపులో మా అమ్మ పుట్టింది అవ్వ, జేజమ్మ – వాళ్ల అమ్మ – అలా... అందరు అమ్మలకూ అమ్మ ఆదిపరాశక్తి – కనకదుర్గమ్మ... దుర్గమ్మ – దుర్గాప్రసాద్ అమ్మ! దుర్గగుడి ప్రధాన అర్చక పదవి రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా..! శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే... (అంటూ అమ్మవారి ప్రార్థన తో ప్రారంభించారు). విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వయంభువుగా వెలిసింది. స్వయంభూ దేవాలయాలకు పంచప్రాణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందులో మొదటి ప్రాణం అర్చకుడిది. అంతటి ఉన్నత స్థానం పొందిన అర్చకుడిగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. వంశపారంపర్యంగా వచ్చినట్లున్నారు? అవునండీ. నాన్నగారు లింగాభొట్ల వెంకటేశ్వర్లు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వంశపారంపర్యంగా నాన్నగారి తరవాత నేను ప్రధాన అర్చకుడినయ్యాను. ప్రస్తుతం ఈ చట్టాన్ని పునరుద్ధరించారు. అందువల్ల మా వంశంలో మా తరవాతి తరానికి ఈ అవకాశం లేదు. ఈ అవకాశం తీసేయడంతో పదవీవిరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచారు. ఈ పరంపరలో నేనే చివరివాడిని కావడం కూడా అమ్మ సంకల్పంగానే భావిస్తాను. చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరిస్తున్న సమయంలో మీ అనుభూతి ఏమిటి? నా 12వ ఏట నుంచే నాన్నగారి వెంట దేవాలయానికి వెళ్లేవాడిని. నా 18వ ఏట అర్చకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. మొదట భయం వేసింది. మా మీద ఆధారపడిన పాతిక కుటుంబాలను సంరక్షించే బాధ్యత ఆ తల్లి నాకు అప్పచెప్పిందని గుర్తుకు వచ్చి, ఎంతో జాగ్రత్తతో నా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నాను. ఆ తల్లి దయ వల్లే నాకు చదువుకునే అవకాశం కూడా కలిగింది. దేవాలయానికి వస్తూనే డిగ్రీ పూర్తి చేశాను. మీరు అర్చకత్వం స్వీకరించే నాటికి మీ తండ్రి మీతోనే ఉన్నారా? ఈ పదవికి మీ వంశంలోని మిగతా వారితో పోటీ పడవలసి వచ్చిందా? పూర్తి బాధ్యతలు తీసుకునే సమయానికి నాన్నగారు గతించారు. మా వంశంలో మొత్తం ఆరుగురం ఉన్నాం. నాన్నగారికి మేం ఇద్దరం సంతానం. మొత్తం ఆరుగురికీ వరుసగా నాలుగు రోజులకు ఒకరు చొప్పున అర్చనలు ఉండేవి. మావి రెండు వాటాలు ఉండటంతో మాకు ప్రధాన అర్చకత్వ బాధ్యతలు వచ్చాయి. మా అన్నగారికి ఆరోగ్యం సరిగా లే కపోవడంతో, నేనే పూర్తి బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. మొదటి రోజు అర్చకునిగా ఎలాంటి భావాలకు లోనయ్యారు? చిన్నతనమంతా నాన్నగారి నీడలోనే అమ్మవారిని దర్శించుకున్నాను. ‘ఈ రోజు నుంచి బరువుబాధ్యతలు నావే’ అనే విషయం గుర్తుకురాగానే ఒకలాంటి ఉద్వేగం కమ్ముకుంది. అమ్మవారి సేవ మాత్రమే కాదు, మా దగ్గర పనిచేసేవారి బాగోగులు కూడా నాన్నగారిలాగే బాధ్యతగా చూడాలి. ఈ భయంతో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఆ తల్లిని నిత్యం నేనే అలంకరించి, స్వయంగా పూజించాలి అనే భావన మదిలో మెదలగానే ఏదో తెలియని దివ్యానుభూతి కలిగింది. నాటి నుంచి నేటి వరకు ఆ తల్లే నన్ను వెన్ను తట్టి నడిపిస్తోంది. మీ జీవితంలో వ్యక్తిగతంగా అమ్మవారి మహిమలు ఏవైనా సంభవించాయా? ఎన్నో మహిమలు చూశాను. ఇటీవల సంభవించిన మహిమను నేను ఎన్నటికీ మరచిపోలేను. అది నాకు పునర్జన్మ. ఆ రోజున ఆ తల్లి దయ లేకపోతే ఈ రోజు మీతో మాట్లాడగలిగేవాడిని కానేమో. ఒకరోజు సాయంత్రం పని మీద వెళ్లి ఇంటికి నా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. సరిగ్గా పుష్పహోటల్ సెంటర్కి వచ్చేసరికి నాకు ఏమైందో తెలీదు కాని, రోడ్డుకి పక్కగా కారు పార్క్ చేశాను. ఆ తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్లు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. డాక్టర్ నాతో, ‘అసలు ఏం జరిగిందో గుర్తు ఉందా, కారు ఎందుకు, అలా పార్క్ చేశారో చెప్పగలరా?’ అని అడిగారు. నాకేమీ గుర్తు రాలేదు. ఆ మాటే చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఒకేసారి అదుపు తప్పాయి. ఆ క్షణంలో మీరు కారు డ్రైవ్ చేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మీకు ఏం జరిగేదో చెప్పలేను’ అన్నారు. ఒక్కసారిగా ఆ జగజ్జనని, అమ్మలగన్న అమ్మని మనసులో స్మరించుకున్నాను. ఆ తల్లి నాయందు లేకపోతే ఆ రోజు ఏం జరిగి ఉండేదో... ఈ అనుభవం నా జీవితంలో మరచిపోలేనిది. అమ్మవారి మహిమ వల్లే మీరు బయటపడ్డారనే విషయాన్ని తరచు చెబుతుంటారా? అంటే.. దైవాన్ని నమ్మని వారిని నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారా? అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. మనలను నడిపే శక్తి ఉందని మాత్రమే చెబుతాను. నమ్మనివారు దైవాన్ని దూషించినా, క్రియల ద్వారా వారి వ్యతిరేకత చూపినా... పట్టించుకోను. అయితే వారి మనసులో మార్పు తీసుకురావడానికి మాత్రం నాకు చేతనైనంతగా ప్రయత్నిస్తాను. నిరంతరం భక్తుల మధ్య ఉంటారు. ఎప్పుడైనా భక్తులు తమ బాధలు చెప్పి, పరిష్కారం కోరితే ఏ విధంగా సలహాలు, సూచనలు ఇస్తారు? అర్చకుడిని భక్తులంతా భగవంతునికి తమ కోర్కెలను నివేదించేవానిగా భావిస్తారు. అందువల్లే వారి కష్టాలు మాకు చెప్పుకుంటారు. సంతానం లేదని, ఉద్యోగం రాలేదని, అమ్మాయి వివాహం జరగలేదని మొరపెట్టుకుంటారు. భక్తులు వారి బాధ చెప్పుకున్నప్పుడు, వారికి కొంత ఉపశమనం కలిగే పరిష్కారాలు చెబుతుంటాను. మీరు ఇబ్బందులకు గురైనప్పుడు, సమస్యల నుంచి బయట పడేయమని అమ్మవారిని కోరుకుంటారా? నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏనాడూ అమ్మవారిని నా బాధ తీర్చమని అడగలేదు. అడగను కూడా! ఆ తల్లిని నమ్ముకున్నాను. నిత్యం అర్చన చేస్తాను. కళ్లు మూసుకుని ధ్యానించుకుంటాను. ఆ తల్లిని నమ్ముకున్న వారి బాగోగులు ఆ తల్లే చూసుకుంటుందని విశ్వసిస్తాను. అమ్మవారి ముక్కుపుడక పోయినప్పుడు అర్చకులను నిందించారు. మేం సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది అన్నారు. అన్నిటికీ అందరం ఓర్చుకున్నాం. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక దంపతులు మా దగ్గరకు వచ్చారు. వారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి బీటెక్ చదువుతుండగా అకస్మాత్తుగా చనిపోయిందట. చిన్నమ్మాయి మానసికంగా కుంగిపోయిందట. వారు అమ్మవారిని దర్శించుకుని, సరాసరి మా ఇంటికి వచ్చారు. వారికి అమ్మవారి ఫొటో ఇచ్చి, నిత్యం పూజలు చేసుకోమని, సర్వశుభాలు కలుగుతాయని చెప్పాను. నె రోజుల తరవాత మళ్లీ వచ్చి, ‘అయ్యా! మీరు ఇచ్చిన ఫొటోకు నిత్యం పూజలు చేశాం. మీ దయ వల్ల మా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం. మా చిన్నమ్మాయి ఆరోగ్యం బాగయ్యింద’ని చెప్పారు. ఆ ఆనందాన్ని మరచిపోలేను. సకాలంలో మొక్కులు చెల్లించుకోలేదని ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి ఎటువంటి పరిష్కార మార్గం చూపుతారు? ‘ఫలానా పని పూర్తయితే దేవాలయానికి వస్తాం’ అనో, ‘ఫలానా పూజ చేయిస్తాం’ అనో భక్తులు మొక్కుకోవడం తెలిసిందే. కొందరు అనుకున్న సమయానికి మొక్కులు చెల్లించుకోలేకపోతారు. అటువంటప్పుడు అపరాధం జరుగుతుందని వారు భయపడతారు. మా దగ్గరకు వచ్చి పాపపరిహారం చెప్పమంటారు. అటువంటి సమయాలలో, ‘మీరు సకాలంలో మొక్కు చెల్లించుకోకపోవడం వల్ల మీకు ఏ అరిష్టమూ అంటదు. ఇప్పుడు మీరనుకున్న దానికి రెట్టింపు చెల్లించుకోండి’ అని చెబుతాను. మొక్కు తీర్చుకోలేదు కనుక, అమ్మవారు శిక్షిస్తుందని చెప్పడం సరైనది కాదు నా దృష్టిలో. ఈ వృత్తిలో ప్రవేశించినందుకు ఏనాడైనా బాధ పడిన సంఘటనలు ఎదురయ్యాయా? ఎన్నడూ అలా జరగలేదు. ఎవ్వరికైనా కొన్ని అనుకోని సంఘటనలు తప్పవు. వాటిని సైతం అమ్మవారి దయగానే భావిస్తాను. మీ చేతి మీదుగా అమ్మవారి దేవాలయంలో చేసిన మంచి మార్పులు? ఆలయంలో మా వంశీకులు ఆరుగురం పనిచేస్తున్నాం. ఆ తల్లి దయ వల్ల మహామండప శంకుస్థాపన దగ్గర నుంచి జయేంద్రసరస్వతి స్వామివారితో కలశాలకు మహాకుంభాభిషేకం చేసేవరకు పూర్తిగా అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి. తెప్పోత్సవ ప్రారంభ రచన, అమ్మవారి స్వర్ణతాపడం ఆ అమ్మవారు నా చే తే ప్రారంభింపచేశారు. అది నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ప్రాతఃకాల అర్చన అనంతరం ఖడ్గమాల పూజకు ఆలోచన చేశాను. విజయవంతంగా నడుస్తోంది. అమ్మవారికి ఇస్తున్న విశ్రాంతి చాలనుకుంటున్నారా, మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా? మామూలు రోజుల్లో అయితే ఆ తల్లికి విశ్రాంతి సరిపోతుంది. కాని పండుగలు, నవరాత్రుల సమయంలో మాత్రం చాలదు. ఒకేరోజున రెండు అవతారాలు ఉన్నరోజున మాత్రం ఒకవైపు పూజలు చేస్తూనే, మరో వైపు దర్శనానికి వదులుతాం. లేదంటే దర్శనం పూర్తికాదు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున అస్సలు కుదరదు. ఎంతో దూరాల నుంచి ఆ తల్లిని చూడటానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అమ్మపూజకు ఎప్పుడైనా దూరమైన సందర్భాలున్నాయా? ధర్మప్రచారం కోసం ప్రభుత్వం తరఫున కిందటి సంవత్సరం అమెరికా వెళ్లాను. అమ్మవారి విగ్రహం తీసుకువెళ్లి అక్కడ అలంకరించి, పూజలు చేశాం. మొత్తం 12 రాష్ట్రాలలో 50 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాం. అన్నిరోజుల పాటు అమ్మవారికి దూరంగా ఉండటం వల్ల కొద్దిగా మనసు కలత చెందింది. కాని ఇక్కడ చేస్తున్నది కూడా అమ్మవారి సేవే కదా అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఎంత సర్దిచెప్పుకున్నా, అమ్మవారికి దూరమయ్యాననే భావన పూర్తిగా తొలగిపోలేదు. ఇంట్లో ఉన్న సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అమ్మవారి ప్రస్తావన వస్తే ఆ తల్లిని ఏమని సంబోధిస్తారు? ఇంట్లోనూ ‘అమ్మ’ అనే సంబోధిస్తాను. మా ఇంట్లో ‘అమ్మ’ ఉందన్న అనుభూతిలోనే ఉంటాను. అమ్మవారికి అన్నీ తెలుసు. ఉద్యోగంలా కాకుండా, ఆ తల్లితో అనుబంధం ఉన్నట్లుగా ఉండాలి అర్చకత్వం అంటే. తన సేవలు చేయడానికి నాకు ఇంకా 12 ఏళ్లు అవకాశం ఇచ్చింది ఆ తల్లి. ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నాను. అమ్మవారి దర్శనం జరుగుతున్నంతసేపు ప్రసాద వితరణ జరగాలనేది నా కోరిక. ఇందుకోసం నేను కృషి చేస్తున్నాను. కార్యసాఫల్యత జరిగేవరకు చేస్తూనే ఉంటాను. ► అమ్మవారు సర్వశక్తులనూ సంపాదించి, మహిషుడిని సంహరించి, అదే ఉగ్రరూపంలో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. ఆ రూపాన్ని చూడటానికి అంతా భయపడ్డారని, కొందరు ప్రాణాలు విడిచారనీ కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు బీజాక్షరాలతో శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి శక్తిని శ్రీచక్రంలో ప్రవేశపెట్టి, ఉగ్రరూపం కనపడకుండా, అమ్మను సౌమ్యంగా ఉండేలా అలంకరించారట. ►ఒకసారి ఒక భక్తుడు ఆలయంలో మర ణించడంతో, అమ్మవారికి స్నపనం చేయించాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నారట. ఎక్కువమంది వద్దనే నిశ్చయానికి వచ్చారట. ఆ సమయంలో ఎర్రటి చీర కట్టుకుని, ఒంటì నిండా బంగారు నగలు, నడుముకు వడ్డాణంతో ఒక స్త్రీమూర్తి వచ్చి, ‘మీరు చేయకపోతే అవదా ఏంటిరా’ అంటూ ఏకవచనంలో సంబోధించిందట. ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారట. మరునాటి ఉదయం గర్భాలయంలో అమ్మవారి పైన ఉండే గోపురం మీద మాత్రమే వర్షం కురిసిందట. అలా ఆవిడ సంప్రోక్షణ అయిందని నాన్నగారు చెప్పేవారు. ► నవరాత్రులు తొమ్మిది రోజులూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి అమ్మవారికి నివేదన చేశాక, ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. అమ్మవారే ఏమీ తినకుండా ఉంటే, నేను తినడం ఏమిటి అనుకుంటాను. ► మహిషాసుర మర్దని అలంకారం రోజున ఏదో ఒక చిన్న దెబ్బ తగిలి, రక్తం చిందుతుంది. ► పుట్టినరోజు సందర్భంగా అందరూ దేవాలయానికి వచ్చి అమ్మను దర్శించుకుంటారు. నేను దుర్గమ్మ ప్రసాదం కావడంతో దుర్గాష్టమి రోజంతా ఆవిడ సన్నిధిలోనే ఉండే భాగ్యం నాకు కలిగింది. ► ఏటా నవరాత్రులలో అన్నపూర్ణ అవతారం రోజున కనీసం పదిమందైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. నలభై ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అమ్మవారి దయ. ► అమ్మవారి నగలు పోయిన రోజు.. తెల్లవారు జామునే గుడి తలుపులు తెరిచే బాధ్యత నాది. ఆ రోజు కూడా ప్రాతః కాలానే నిద్ర లేచి స్నానం చేస్తుండగా, నగలు పోయాయని ఫోన్ వచ్చింది. నోట మాట రాలేదు. ‘తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఈ చోరీ ఎలా జరిగిందా’ అని మధన పడ్డాను. వెళ్లి చూస్తే.. అమ్మవారి ముక్కుపుడక, బులాకీ, సూత్రాలు, నైజాం నవాబులు ఇచ్చిన బంగారు నాణెం అన్నీ పోయాయి. నిత్యం అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారు, ఆ రోజు నిరాలంకారంగా దర్శనమిచ్చేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. ఇంటికి వచ్చి చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను. వారం రోజుల దాకా సాధారణస్థితికి రాలేకపోయాను. మా మీద నింద రాకుండా ఆ తల్లి కాపాడిందని ఇప్పటికీ అనుకుంటాను. - డా. పురాణపండ వైజయంతి -
దుర్గా మాతపై దారుణమైన కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఆరాధ్య దైవం పై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేసి ఓ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిని వేశ్యతో పోలుస్తూ కామెంట్ చేయటంతో పలువురు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) పరిధిలోని దయాల్ సింగ్ కాలేజీలో కేదార్ కుమార్ మండల్ అసిస్టెంట్ ప్రోఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాతో. ఈ నెల 22వ తేదీన తన ట్విట్టర్ పేజీలో ‘పురాణాల ప్రకారం దుర్గాదేవి ఓ వేశ్య’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ మనోభావాలను కేదార్ దెబ్బతీశాడంట ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యాసంస్థలు ఆయనపై లోధీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తక్షణమే ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలోనే కేదార్ మండల్ ఇలాంటి కామెంట్లు చేయటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. -
దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గానవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రముఖ పండితులు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి దుర్గానవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు శ్రీబాల త్రిపురాసుందరిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి వస్త్రవ్యాపారులు బరాటం నాగేశ్వరరావును కె.నారా యణరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేడీ యూత్ ప్రెసిడెంటు పిన్నింటి కృష్ణ తదితరులు విచ్చేశారు. -
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
-
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
► మొహర్రం రోజునా నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ► ఆంక్షలు విధించడం పట్ల మమతా బెనర్జీపై కోర్టు మండిపాటు ► గొంతు కోసినా కుట్రకు బలికానన్న మమత కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహర్రం పండుగనాడు సహా అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 వరకు నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. నిమజ్జనంపై ఆంక్షలు విధించినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. పౌరులు తమ మతాచారాలను పాటించకుండా అడ్డుకునే హక్కు ప్రభు త్వానికి లేదని తేల్చిచెప్పింది. మతి లేకుండా హక్కులను హరించకూడదని ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మొహర్రం ఉరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం ఒకేరోజున జరుగుతాయనీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. మీకు కల వస్తే ఆంక్షలు విధించలేరు మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. విజయదశమి రోజున రాత్రి 10 గంటల వరకే నిమజ్జనానికి అనుమతించడంతోపాటు, మొహర్రం రోజైన అక్టోబరు 1న నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హరీశ్ టాండన్ల ధర్మాసనం విచారించింది. ‘అధికారం ఉంది కదా అని మీరు (మమత) సరైన కారణాలు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణిస్తాయన్న ఊహలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకూడదు. ఏదో అనర్థం జరగబోతోందని మీరు కలగన్నంత మాత్రాన ఆంక్షలు విధించలేరు’ అంటూ ధర్మాసనం మమతకు మొట్టికాయలు వేసింది. దుర్గామాత విగ్రహాలు, మొహర్రం ఊరేగింపునకు వేర్వేరు మార్గాలను నిర్దేశించాలనీ, ఊరేగింపు వెళ్లే దారుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని కోర్టు ఆదేశించింది. కుట్రదారులదే బాధ్యత: మమత తీర్పు అనంతరం మమత బీజేపీని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడుతూ అక్టోబరు 1న హింస చెలరేగితే కుట్రదారులదే బాధ్యత అని అన్నారు. ‘నా గొంతు కోసినా సరే. కుట్ర కు నేను బలికాను. ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆమె అన్నారు. -
అమ్మకు ఆగ్రహం తెప్పించరాదు
ఆత్మీయం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని భావిస్తారందరూ. కాని, వీటికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని మనుమడుదుర్గముడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరంతో వి్రçపులు వేదాలు మరచిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి. వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. వారంతా అమ్మను ప్రార్థించగా, ఆమె వారికి ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటినుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ ఇచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చిందని శ్రీమద్దేవీ భాగవతం చెప్తోంది. తల్లి, తన బిడ్డలు ఆకలితో ఉండటాన్ని చూడలేదు. అదేవిధంగా ఒకరి చెడు ప్రవర్తన మూలంగా మిగిలిన వారు బాధపడటాన్ని కూడా అమ్మ సహించలేదు. తప్పు చేసిన వారికి ఎంతటి శిక్ష అయినా విధిస్తుంది. మిగిలిన అందరికీ సుఖాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అమ్మకు ఆగ్రహం తెప్పించకూడదు. ఆడవారికి కన్నీరు రానివ్వకూడదు. అది అర్ధాంగి అయినా, ఆడబిడ్డ అయినా... -
దుర్గా పూజలో చెఫ్లుగా సెక్స్ వర్కర్లు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గా నవరాత్రుల సందర్భంగా సెక్స్ వర్కర్లు చెఫ్ల టోపీలు ధరించనున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్లైట్ ఏరియా అయిన సోనాగచ్చి నగరంలోని సెక్స్ వర్కర్లు దుర్గా పూజ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టుల్లో చెఫ్గా పనిచేయనున్నారు. సెక్స్వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఈ ప్రాజెక్టుపై షెఫ్లుగా శిక్షణ ఇచ్చేందుకు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక అవగాహనకు వచ్చాయి. డీఎంఎస్సీ కింద రిజిస్టర్ అయిన వారిలో 1.30 లక్షల మంది సెక్స్వర్కర్లు ఉన్నారు. దుర్గా పూజా సమయంలో కోల్కతాలోని వివిధ ప్రదేశాల్లో ఎనిమిది, బెంగళూరులో రెండు ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అధిక శాతం మందిని బెంగళూరు పంపనున్నట్లు తెలిపారు. తమకు వంటవారు(కుక్)లు అవసరం ఉందని, డీఎంఎస్సీని సంప్రదించగా వారు అంగీకరించారని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. సజీవంగా ఉన్న చేపల ప్యాకేజీ, వాటి వంటకాల్లో ఈ సెక్స్వర్కర్లకు శిక్షణ ఇస్తామని కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. సోమవారం నుంచి ఈ శిక్షణ ఇవ్వనున్నారు. -
మొహర్రం నాడు నిమజ్జనానికి నో!
ఒకేరోజున దుర్గామాత నిమజ్జనం, మొహర్రం రావడంతో.. మమత సర్కారు నిర్ణయం.. మండిపడుతున్న బీజేపీ కోల్కతా: హిందువులు ఘనంగా నిర్వహించే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ముస్లింలు భక్తిపూర్వకంగా సంతాపం పాటించే మొహర్రం ఒకేరోజున రావడం పశ్చిమ బెంగాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజున రావడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం దుర్గాపూజ నిర్వాహకులు, ముస్లిం మతపెద్దలు, ఇతర మతాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు వేడుకలు ఒకేరోజున ఉన్న నేపథ్యంలో మతసామరస్యాన్ని పాటించే దిశగా వ్యవహరించాలని ఆమె కోరారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం అవుతుందని, అయితే, అక్టోబర్ 1న మొహర్రం దృష్ట్యా ఆ రోజు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని, అక్టోబర్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యథాతథంగా నిమజ్జనం సాగుతుందని ఆమె ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులు ఎదురుపడితే.. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మమత నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా హిందు, ముస్లింలను విడగొట్టడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మమత సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. -
వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం
-విజయదుర్గా పీఠం 45వ వార్షికోత్సవాలు ప్రారంభం గురుహోరలో రాజమహేంద్రవరం విజయదుర్గా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెదపాటి సత్యకనకదుర్గ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితుడు సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని అర్చకులు వంశీకృష్ణ, సుదర్శనాచార్యులు, సి.మాధవాచార్యులు నిర్వహించారు. పాదుకా సమర్పణ, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుర సముద్రాధి జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరామచంద్రుల వారు నాడు ధర్మబద్ధంగా అందించిన పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తొలుత స్వామి వారికి కళ్యాణం, అర్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు చిలకపాటి రాఘవాచార్యులు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, నెల్లూరుకు చెందిన కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాల ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన జరిగింది. -
సరస్వతీనమస్తుభ్యం..
శ్రీసరస్వతీ అమ్మవారిగా పూజలందుకున్న శ్రీవనదుర్గ మూడో రోజు ఘనంగా శ్రావణమాస జాతర మహోత్సవాలు అన్నవరం : రత్నగిరిపై జరుగుతున్న శ్రీవనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాల మూడో రోజు శ్రావణశుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీవనదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయంలో రుత్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ జపాలు, లింగార్చన, శ్రీచక్రార్చన, శ్రీ పురుష సూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మూడోరోజు కూడా రుత్వీకులు చండీహోమం కొనసాగించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాల నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, ప్రసాద్, మూర్తి, శ్రీవనదుర్గ అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిటకిటలాడిన దుర్గాలయాలు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా రత్నగిరి దుర్గామాతలు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
మరో మెగా హీరోతో వినాయక్ 'దుర్గ'..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. అయితే చాలా రోజులుగా మెగా హీరోతోనే వినాయక్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మెగా హీరోగా సాయిధరమ్ తేజ్తో వినాయక్ సినిమా చేయనున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం దుర్గ (వర్కింగ్ టైటిల్) అనే పవర్ ఫుల్ మాస్ కథను వినాయక్ సిద్ధం చేశాడట. కథ, మాటల రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్, ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్ తదుపరి ప్రాజెక్ట్ను ఫైనల్ చేయలేదు. -
అన్నదాతల ఆక్రందన
దుర్గ్: ఎంతో కష్టపడి పండిన పంటకు కనీస ధర దక్కకపోవడంతో అన్నదాత కడుపు మండింది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో కర్షకులు కన్నెర్ర చేశారు. పెట్టుబడి సంగతి అలా ఉంచితే కనీస ధర కూడా రాకపోవడంతో ఛత్తీస్ గడ్ లోని టమాట పడించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడు లారీల టమాటాలను రోడ్డుపై పడేసి తమ ఆవేదన తెలిపారు. ధంధా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నదాతల ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇటీవల కాలంలో టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. నిల్వచేసుకునే సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకుందామని ఆశగా మార్కెట్లకు వచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు చితికిపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం చేతులు కట్టుకుని చూస్తుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
గృహిణి ఆత్మహత్య
కుక్కునూరు : భర్త, అతని తరఫు బంధువులు వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సాధిక్పాషా కథనం ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన గూడురు దుర్గ(35) భర్త రాంబాబు నిత్యం మద్యం సేవించి రావడంతోపాటు భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి చిత్రహింసలు గురిచేస్తున్నాడు. దీంతో దుర్గ మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆమె ఈనెల ఒకటో తేదీన కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను బంధువులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి మరణించింది. దుర్గ మృతికి తన తండ్రి, పెద్దనాన్నలే కారణమని మృతురాలి కూతురు తేజస్వీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్ఐ తెలిపారు. -
తుంగమ్మ ఒడికి దుర్గమ్మ
– ఘనంగా దుర్గామాత నిమజ్జనం – దుర్గాఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం – నగరంలో కలశాలతో మహిళల ఊరేగింపు కర్నూలు(కల్చరల్) : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పది రోజులుగా విశిష్ట పూజలందుకున్న దుర్గామాత బుధవారం తుంగభద్రమ్మ ఒడికి చేరింది. రమ్యకపర్దిని... మోక్షదాయని... శిష్టసంరక్షిణి... దుష్ట సంహారిణి... దయ చూడవమ్మా.. అంటూ నగరంలోని వివిధ ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా దుర్గా ఘాట్కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని చిన్నమార్కెట్ సమీపంలో నేతాజీ వీధిలో దుర్గామాత విగ్రహానికి టీజీవి ట్రస్ట్ నిర్వాహకులు, యువ పారిశ్రామికవేత్త టి.జి.భరత్ ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. చిన్న మార్కెట్ నేతాజీ వీధి నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు చిత్తారి వీధి, జొహరాపురం, రాంభొట్ల ఆలయం, వన్టౌన్ పోలీస్స్టేషన్, పూలబజార్, మించిన్ బజార్, తెలుగు తల్లి సర్కిల్, మున్సిపల్ పాఠశాల గ్రౌండ్, కోట్ల సర్కిల్, ఎస్బీఐ సర్కిల్ మీదుగా సంకల్బాగ్లోని దుర్గా ఘాట్ను చేరుకున్నాయి. కృష్ణానగర్, బుధవారపేట, ఆర్ఎస్ సర్కిల్ తదితర ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన విగ్రహాలు సంకల్బాగ్లోని దుర్గాఘాట్ను చేరుకున్నాయి. దుర్గా ఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం... నగరంలోని దుర్గాఘాట్ వద్ద 67 దుర్గామాత విగ్రహాలు తరలిరావడంతో ఆధ్యాత్మిక పరిమళం అలుముకుంది. తుంగభద్ర తీరంలో విద్యుత్ దీపకాంతులతో చేసిన అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి. ట్రాక్టర్లలో తరలివస్తున్న విగ్రహాల ముందు పరాశక్తి భక్తబృందం చేసిన భజనలు, పాడిన ఆధ్యాత్మిక గీతాలు అలరించాయి. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు దుర్గామాతను స్తుతిస్తూ చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజీవి ట్రస్ట్, గీతా ప్రచార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 గంటలకు దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనోత్సవం ప్రారంభమయ్యింది. దుర్గమ్మ ఆశీస్సులతో సుఖశాంతులు... దుర్గమ్మ ఆశీస్సులతో జిల్లాలో సుఖశాంతులు విలసిల్లుతాయని రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ తెలిపారు. సంకల్బాగ్లోని దుర్గాఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ ప్రారంభ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏటా దుర్గా విగ్రహాల సంఖ్య పెరుగుతోందని, మహిళలు పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. దుర్గా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మహిళలు పాల్గొని తమ భక్తిప్రపత్తులు చాటుకోవడం అభినందనీయని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. పరాశక్తి విగ్రహానికి తొలి నిమజ్జనం... దుర్గా ఘాట్ వద్ద చిన్నమార్కెట్ నుంచి తరలివచ్చిన పరాశక్తి విగ్రహానికి పూజలు చేసి తొలి నిమజ్జనం నిర్వహించారు. తలపై కలశాలతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి, టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి ఏరాసు ప్రతాప్రెడ్డి, డోన్ టీడీపీ ఇన్చార్జి కె.ఇ.ప్రతాప్, కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జయజయహే..
-
త్రిశూలధరణిగా అమ్మవారి దర్శనం
-
9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి
శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని పులివాహనంపై కత్తి, త్రిశూలం చేబూని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దుర్గాష్టమి రోజున దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం. శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!! భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు. ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు. నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం -
శ్రీ మహాలక్ష్మీదేవి
ఏడవ రోజు శుక్రవారం అలంకారం ఈరోజు అమ్మవారిని త్రిశక్తి స్వరూపాలలో ధనాధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. జగత్కల్యాణ స్థితికారిణి అయిన అమ్మ ధనధాన్యధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజ లక్ష్ములుగా అష్ట సిద్ధులనూ ప్రసాదించే అమృత స్వరూపిణిగా, సురాసురులు పాలకడలిని చిలికినప్పుడు క్షీరాబ్ది కన్యకగా పుట్టిన వరాలతల్లి హాలుడు అను రాక్షసుణ్ణి సంహరించి మహాలక్ష్మిగా పేరుగాంచినట్లు ప్రతీతి. వరదాభయ హస్తాలతో కనకధారలు కురిపిస్తూ కమలాసనాసీనురాలై మహాలక్ష్మి రూపంలో దుర్గాదేవిని దర్శిస్తే సమస్త ఆర్థిక బాధలూ తొలగిపోయి సుఖసంతోషాలతో తులతూగుతారని నమ్మకం. శ్లోకం: పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే! భావం: సౌభాగ్యం, సత్సంతానం, ధనధాన్యాదులు ఇచ్చి లోకాలను కాపాడు జగదంబా నీకు నమస్సులు. నివేదన: బెల్లం పాయసం, శనగలు ఫలమ్: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అన్నివిధాలుగా పురోభివృద్ధి కలుగుతుంది. - దేశపతి అనంతశర్మ -
దుర్గమ్మ ఆలయ సిబ్బందిపై వేటు
విజయవాడ: దుర్గగుడిలో అమ్మవారికి మహానివేదనపై ఆలయ ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఏఈవో, ఆలయ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి బుధవారం వెల్లడించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యలను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించడంతో అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి మహా నివేదన చేయవలసి వచ్చింది. -
డబ్బుల్లేకుండా దర్శనానికి వస్తారా?
భక్తునిపై సిబ్బంది దుర్భాషలు సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాదిపై తొలిరోజే భక్తునికి చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం పటమటకు చెందిన చలమయ్య చౌదరి అనే భక్తుడు హైదరాబాద్లోని సుమారు 10 మంది బంధువులతో దర్శనానికి వచ్చారు. క్యూలో వెళ్లి రూ.100 టిక్కెట్లు అడగ్గా లేవు, రూ.300, 500 లవే ఉన్నాయని సిబ్బంది చెప్పారు. వాటిని అసలు ముద్రించలేదని తెలిపారు. అలాంటప్పుడు రూ.100 టిక్కెట్లు అని బోర్డులు ఎందుకు పెట్టారని చలమయ్య చౌదరి ప్రశ్నించారు. రూ. మూడు వేలు పెట్టి టిక్కెట్లు కొనలేనివాడివి, అమ్మవారి దర్శనానికి తొలిరోజే ఎందుకు వచ్చారంటూ సిబ్బంది ఆయనను నానా దుర్భాషలాడారు. దీంతో ఆవేదనకు గురైన చౌదరి మీడియా పాయింట్ వద్ద ఉన్న అధికారులకు చెప్పారు. ఈవో ఎ.సూర్యకుమారి అక్కడకు వచ్చి చలమయ్య చౌదరి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పి, దర్శనానికి పంపారు. సిబ్బంది తీరుపై భక్తులు విస్మయానికి గురయ్యారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
దసరా ఉత్సవాలపై ఈవో సూర్యకుమారి సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు సర్వంసిద్ధం చేశామని దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాలు, అన్నదానం, కేశఖండన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వినాయకుడు గుడి నుంచి ఘాట్రోడ్డు మీదుగా నాలుగు క్యూలైన్ల ఉంటాయని, రెండు లైన్లలో ఉచిత దర్శనం, ఒక లైన్లో రూ.100 టికెట్ దర్శనం, మరో లైన్లో ఓం టర్నింగ్ నుంచి రూ.300 లైన్ అనుమతిస్తామని చెప్పారు. మల్లికార్జున మహామండపంలో 10 లడ్డూ పులిహోర కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద కూడా ప్రసాదాలు విక్రయిస్తామని వివరించారు. క్యూలైన్లలో భక్తులు తాగేందుకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కొండ కింద భాగంలో అన్నప్రసాదం జరుగుతుందని తెలిపారు. కేశఖండన శాలలను సీతమ్మవారి పాదాలు వద్ద ఘాట్లలో ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గోశాల వెనుకభాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. విజయదశమి రోజున భవానీ భక్తులు అమ్మవారి సమర్పించే భవానీ బంధనాలు అర్జునవీధి చివరన గురుభవానీ సమక్షంలో తీయవచ్చన్నారు. లక్షకుంకుమార్చన మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం ఏఈవో అచ్యుతరామయ్య, ప్రధాన అర్చకుడు లింగభొట్ల దుర్గాప్రసాద్, స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్ పాల్గొన్నారు. -
బంగ్లాలో దుర్గాదేవి విగ్రహాల ధ్వంసం
ఢాకా: ఈశాన్య బంగ్లాదేశ్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఢాకాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న హబీగంజ్ జిల్లాలోని ఫుతర్మతి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. ముస్లింల ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో ప్రతిమలు తయారుచేసే వారికి, స్థానికులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఘర్షణలో భాగంగా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు వారు భావిస్తున్నారు. కాగా ఘటనపై ఎలాంటి కేసు నమోదవలేదు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దుర్గాదేవి ఆలయంలో చోరీ
నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామపరిధిలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దుర్గాదేవి మీద ఉన్న రూ. 50 వేల విలువచేసే బంగారు, వెండి ఆభరాణాలతో పా టు ఆలయంలోని సీలింగ్ ఫ్యా¯ŒS ఎత్తుకెళ్లారు. ఆలయం ముందున్న హుండీని పగులగొట్టి డబ్బులను అపహరించారు. శుక్రవారం పూజకు వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారమివ్వడంతో వారు ఎస్సై రాజుకుమార్కు ఫిర్యాదు చేయగా ఆలయానికి వెళ్లి పరిశీలించారు. దొంగలను పట్టుకొని చర్య తీసుకోవాల ని సర్పంచ్ కనకం హైమావతి, ఎంపీటీసీ పాశం వీరయ్య, గోపాల్రెడ్డి, రమేష్ కోరారు. -
పాట్లు ఫీట్లు
అన్నప్రసాదం భక్తులకు నరకయాతన బురదలో అడుగేస్తే జారిపడాల్సిందే దుర్గగుడి అధికారులకు పట్టని వైనం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే భక్తులకు సర్కస్ ఫీట్లు తెలిసి ఉండాల్సిందే. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో అర్జున వీధి అడుగు మేర బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో అడుగు తీసి అడుగు వేయ డం కనాకష్టమైంది. తేడా వస్తే జారిపడిపోతున్నారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఘాట్రోడ్డు మీదుగానే కొండ కిందకు చేరుకుంటున్నారు.. అయితే అన్న ప్రసాదాన్ని మాత్రం అర్జున వీధిలోని శృంగేరీమఠంలోనే కొనసాగిస్తుండటంతో అక్కడకు వెళ్లాలంటే బురద లో నడిచి వెళ్లాలి. ఓ చంకలో బట్టల బ్యాగు, మరో చంకలో చంటి పిల్లలతో బురదలో నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపున బురదలో నడుచుకుంటూ వెళ్లలేక కొంత మంది భక్తులు రోడ్డుకు పక్కనే ఉన్న సిమెంట్ గొట్టాల పైకి ఎక్కి బురదను దాటేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో కొంత మంది పైపు పై నుంచి జారి పడి బురదలో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తుల ఇబ్బందులు కనిపించవా? కనీసం భక్తులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా అన్నదాన సిబ్బంది కనీసం భక్తులు నడిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గమనార్హం. మరోవైపు నిత్యం రద్దీగా కనిపించే అన్నదానం క్యూలైన్లు గురువారం వెలవెలబోయాయి. దేవస్థానం రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ శృం గేరీ మఠంలోనే అన్నదానం చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు అపచారం... మౌనస్వామిని వదిలేశారిలా ఇంద్రకీలాద్రి: తొలినాళ్లలో దుర్గమ్మ భక్తులకు అన్నదానం చేసిన మౌన స్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఆలయ అధికారులు ఆరు బయట పడేశారు. దీంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంది. కొండపై మందిరంలో ఉన్న మౌన ముని స్వామి మందిరాన్ని పుష్కరాలకు ముందు దుర్గగుడి అధికారులు కూల్చేయడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మౌన ముని విగ్రహాన్ని అర్జున వీధిలోని శంగేరీ మఠంలో నిర్వహిస్తున్న అన్నదాన భవనానికి తరలించారు. రంగులు వేసిన తర్వాత ఇలా ఆరు బయట పడేయడం సరికాదని, దీనికి తగిన షెడ్డు ఏర్పాటు చేసి మౌన ముని స్వామి వారి చరిత్ర అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
పరమం.. పవిత్రోత్సవం
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లోని ఉత్సవమూర్తులకు స్పృశ్య, అస్పృశ్యత కారణాలు కలిగే దోషాల నివారణకు ఏటా శ్రావణమాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది శ్రావణంలో పుష్కరాలు రావడంతో భాద్రపద శుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు అంటే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేశారు. దేవాలయం అంతా శుభ్రం పవిత్రోత్సవాల సందర్భంగా అంతరాలయంతో పాటు దేవాలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేశారు. మధ్యాహ్నం నుంచి దర్శనం లేకపోవడంతో అన్ని హుండీలకు తాళాలు వేశారు. క్యూలైన్లు మూసివేశారు. ఒంటిగంట తరువాత ఆలయమంతా నిర్మానుష్యంగా కనిపించింది. ఇది తెలియక వచ్చిన భక్తులు రాజగోపురం బయట నుంచి అమ్మవారికి నమస్కరించుకుని వెనుదిరిగారు. నేటి ఉదయం 9 గంటల నుంచి దర్శనం స్నపనాభిషేకం, అమ్మవారి అలంకరణ, పవిత్రల సమర్పణ తరువాత గురువారం ఉదయం 9 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. – సాక్షి, విజయవాడ -
వివాహిత అనుమానాస్పద మృతి
చింతల్ పరిధిలోని అంబేద్కర్నగర్లో దుర్గా(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. ప్రమాదవశాత్తూ సంపులో పడి చనిపోయిందని భర్త చెబుతున్నాడు. ఈ ఘటనపై పుట్టింటివారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి
అమరావతి : గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహేవ్(27), దుర్గ(20)గా గుర్తించారు. అమరావతిలో స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాప్లో యువకులు పని చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శ్రీత్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలు
సత్తెనపల్లి: పట్టణంలోని ఫిరోజీ మందిరం వెనుక గల శ్రీత్రిశక్తి దుర్గాపీఠంలో దశమ వార్షిక బ్రహ్మో త్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిశక్తి స్వరూపిణీలైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి లక్ష నాగవల్లి పత్రాలతో విఘ్నేశ్వరపూజ, ప్రసన్నాంజనేయస్వామి పూజలు నిర్వహించారు. త్రిపురమల్లు రవిచంద్రకుమార్, సునీత దంపతులు ఇంటి నుంచి అమ్మవార్లకు ప్రభ ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాసకుమారి ఆధ్వర్యంలో ముఖ్యశిష్యులు ∙గురుపూజ చేపట్టారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని పట్టెం వెంకటేశ్వర్లు, లలితకుమారి దంపతులు ప్రారంభించారు. వివిధ దేవతా మూర్తుల రూపాలతో కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆహుతులను అలరింప చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ పీఠాధిపతులు వెలిదండ్ల హనుమంత రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'
విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి పోలీసులకు చెప్పింది. అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు. -
దుర్గాఘాట్లో మంత్రి నారాయణ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం దుర్గాఘాట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రితో పాటు నగర మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ వీరపాండియన్ ఉన్నారు. నీటిలో పువ్వులు, ఇతర పూజ సామగ్రి కనిపించడంతో వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్కు సూచించారు. ఘాట్లో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు, యువకులే కనిపించడంతో వారితో కాసేపు ముచ్చటించారు. -
16 నుంచి విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గాపీఠం 44వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్(బాబి) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శనివారం విలేకరు లతో మాట్లాడుతూ 1972 ఆగస్టు 18న గాడ్ మంత్రోపదేశం పొందారని, 1989 ఆగస్టు 16న శృంగే రీ పీఠాధిపతులు శ్రీభారతీతీర్థస్వామి శ్రీవిజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేశారని చెప్పారు. 16న ఉదయం 8.05 గంటలకు వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని, తిరుత్తణికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన పండితులు సుబ్రహ్మణ్యస్వామి దివ్య కల్యాణం, సుబ్రహ్మణ్య త్రిశతి హోమాన్ని నిర్వహిస్తారన్నారు. 17న ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, 18న శ్రీదేవి, భూదేవి సమేత విజయవెంకటేశ్వరస్వామి వారికి దివ్య కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు. -
కర్నూలులో అరుదైన కదంబ వృక్షం
విరబూసిన పుష్పాలు –ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు –దేవతలకు ప్రీతిపాత్రం దుర్గాదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన కదంబ వృక్షాలకు పూలు విరగకాశాయి. అరుదైన ఈ వృక్షాలను 2013 జూలై 27న అప్పటి నగర పాలక సంస్థ కమిషనర్గా ఉన్న పీవీవీఎస్ మూర్తి కలెక్టరేట్ వెనుకవైపున ఎ.క్యాంపులోని ఇందిరాగాంధి స్మాక నగర పాలక ఉన్నత పాఠశాలలో నాటారు. దీని శాస్త్రీయ నామం ఆంతోసెఫాలస్. శ్రీశైలం, తలకోన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ వక్షం ఇప్పుడు కర్నూలులో కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రెండేళ్ల కాలంలో ఆ మొక్కలు ఇప్పుడు 15 అడుగుల ఎత్తుకు పెరిగాయి. వీటికి టెన్నిస్ బంతి ఆకారంలో, గుత్తులుగుత్తులుగా కాస్తున్న పూలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. లలితాదేవి/దుర్గాదేవికి కదంబవనవాసిని అని పేరని, కదంబ చెట్టు పరిసరాల్లో అమ్మవారు కొలువై ఉంటారని సంగమేశ్వరం దేవాలయం పూజారి తెలకపల్లి రఘురామశర్మ చెప్పారు. ఈ వక్షం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమని, ఈ చెట్టు కింద కూర్చుని లలితాసహస్రనామార్చన, దుర్గాదేవి నామార్చన, జపాలు చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొక్కలను ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ తిరుపాల్రెడ్డి విరాళంగా ఇచ్చినట్లు పాఠశాల పీఈటీ కమాల్బాషా తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
శనీశ్వర ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
-
శనీశ్వర ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
విజయవాడ: నగరంలోని శనీశ్వర ఆలయం వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో సూర్యకుమారికి చుక్కెదురు అయింది. శనీర్వర ఆలయంపై హైకోర్టులో స్టే ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈవోను అడ్డుకున్నారు. ఈ వివాదం హైకోర్టులో ఉన్నందున ఆలయాన్ని స్వాధీనం చేసుకోవటానికి వీల్లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో ఈవో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
కూతురును పరీక్షకు తీసుకువచ్చి...
- గుండెపోటుతో తనువు చాలించిన తండ్రి -పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు విషయం చెప్పిన బంధువులు -రంగారెడ్డి జిల్లా తూంకుంట జెడ్పీ పాఠశాల వద్ద ఘటన శామీర్పేట్ కూతురును పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సైకిల్పై తీసుకువచ్చిన ఓ తండ్రి పాఠశాల వద్ద గుండెపోటుకు గురై కానరాని లోకాలకు తరలివెళ్లాడు. పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు బంధువులు విషయం తెలిపారు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ వుండలం తూంకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మేడ్చల్ వుండలం గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన దొవ్ము నాగేశ్(45), లక్ష్మి దంపతులు. వీరికి నలుగురు సంతానం. రెండో కూతురు దుర్గ ఇటీవల పది పరీక్షల్లో తప్పింది. దీంతో నాగేశ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం బుధవారం సైకిల్పై కూతురును శామీర్పేట్ వుండలం తూంకుంట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్కు తీసుకొచ్చాడు. కుమార్తెను దించేసిన అనంతరం ఆయాసం అనిపించడంతో కింద కూర్చునే యత్నం చేశాడు. అంతలోనే ఛాతీలో నొప్పి వచ్చిందని అక్కడే కుప్పకూలిపోయాడు. విషయుం గవునించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నాగేశ్ మృతిచెందాడని నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన దుర్గకు తన తండ్రి గుండెపోటుతో మృతిచెందిన విషయాన్ని బంధువులు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పరీక్ష పూర్తయ్యాక విషయం తెలుసుకున్న దుర్గ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
పుట్టెడు దు:ఖంలోనూ పరీక్ష రాసిన విద్యార్థినులు
రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయిన బాధతో ఒకరు, అనారోగ్యంతో తండ్రి చనిపోయిన బాధతో మరొకరు పుట్టెడు దుఃఖంలోనూ శుక్రవారం పదో తరగతి పరీక్ష రాశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చెన్నడం గ్రామానికి చెందిన ఉల్లూరి చందన.. నగరం గ్రామంలోని శ్రీచైతన్య స్కూలులో పదో తరగతి చదువుతూ మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతృంది. ఆమె తల్లి హేమలత (35) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమలత మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని గురువారం స్వగ్రామం తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న చందన ఆ బాధను దిగమింగుకుని శుక్రవారం పరీక్షకు హాజరైంది. కాగా, మాకనపాలెం గ్రామానికి చెందిన బొక్కా దుర్గాభవాని లూటుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. ఆమె తండ్రి బొక్కా వెంకటపతి (60) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. తండ్రి చనిపోయిన బాధతో ఉన్న దుర్గాభవాని కూడా అంత బాధలోనూ మొక్కవోని దీక్షతో పదో తరగతి పరీక్ష రాసింది. -
తాగుబోతు భర్తపై మంత్రికి ఫిర్యాదు
ఇంద్రకీలాద్రి: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును అకస్మాత్తుగా ఓ మహిళ అడ్డుకుంది. విజయవాడలో ఉండే దుర్గ(32) అనే మహిళ రోజూ తన భర్త తాగేసి వేధింపులకు పాల్పడుతున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వివరాలు.. కొత్తపేట ఏరియా వాగు సెంటర్కు చెందిన దుర్గ రోజులానే ఈ రోజు కూడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్ను అడ్డుకుంది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించుకు కూర్చుంది. దీంతో మంత్రి పోలీసులను పిలిపించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పడంతోఆందోళన విరమించింది. -
మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..
హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకుని ...ఇద్దరు భార్యలతో ఎలా తంటాలు పడేది,ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడానికి హీరో పడే కష్టాలను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఓ ప్రబుద్ధుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వేదికైంది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కల్యాణ్(28)కు అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం భార్యాభర్తలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనూహ్యంగా 2014లో కల్యాణ్ కనిపించకుండా పోయాడు. దీంతో దుర్గాదేవి భర్త కోసం గాలిస్తూ మాదాపూర్లో నివాసముంటోంది. 2014లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లిన కల్యాణ్ అక్కడ అపర్ణ అనే యువతిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండవ భార్యతో హైదరాబాద్ చేరుకుని బోరబండలో నివాసముంటున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. మొదటి భార్య దుర్గాదేవి మంగళవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చింది. అదే సమయంలో కల్యాణ్ తన రెండో భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. మరో మహిళ, బిడ్డతో వచ్చిన కల్యాణ్ను దుర్గాదేవి నిలదీసింది. దీంతో కల్యాణ్ రెండో వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దుర్గాదేవి భర్తను చితక్కొట్టి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కల్యాణ్పై కేసు నమోదు చేసుకుని స్టేషన్కు తరలించారు. -
ఉమా... నాని మధ్య వార్
ప్రతిష్ట కోసం పాకులాట మంత్రి ఉమా వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ విభేదాలు తెరపైకి మంత్రి శిద్దా రాఘవరావు, కార్యదర్శి శ్యాంబాబు విజయవాడ : నిర్మాణంలో ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ వ్యవహారంపై అధికార పార్టీలో రోజుకో అలజడి రేగుతోంది. ఫ్లైఓవర్ను సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు నేతల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య వివాదం రగులుతుండగా, తాజాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎంపీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమైంది. ఆ ఘనత మంత్రి శిద్దాదేనట! దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని గత ఎన్నికల ముందు బుద్దా వెంకన్న కుమ్మరపాలెం సెంటర్లో ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు ప్లాన్లు తయారు చేయించి, అందులో ఒక దానిని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింప చేసి కేంద్రం వాటాగా రూ.280 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారు. ఇదే విషయం శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ తన కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగారని ఆయన వెల్లడించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాత్రం ఇటీవల విజయవాడలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మాట్లాడుతూ ఫ్లైఓవర్ను తానో, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నో సాధించామని అందరూ అనుకుంటున్నారని, వాస్తవానికి మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుల కృషితోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని బహిరంగంగా ప్రకటించారు. శిద్దా, శ్యాంబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదికలు ఇవ్వడం వల్లే ఫ్లైఓవర్ మంజూరైందని, వారినే అభినందించాలంటూ అధికారులకు కూడా సూచించారు. దీంతో అక్కడ ఉన్న అధికారులు, తెలుగుదేశం నేతలు అవాక్కైనట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకపక్క ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఫ్లైఓవర్ విషయంలో వివాదం కొనసాగుతుండగానే మంత్రి ఉమా తన వ్యాఖ్యల ద్వారా మరో వివాదానికి తెరతీసినట్లయింది. ఉద్దేశపూర్వకంగానే... మంత్రి ఉమా వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే కనబడుతున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు. ఎంపీ కేశినేని నాని, మంత్రి ఉమా మధ్య గతంలోనూ వివాదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఫ్లైఓవర్ ఘనత నానికి దక్కకూడదనే ఉద్దేశంతోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణం నత్తనడకనే... ఒకపక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. మరోపక్క పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. అయినా ఆ విషయాన్ని పట్టించుకోని నేతలు వివాదాలపై దృష్టి కేంద్రీకరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ పనుల్లో జాప్యం ఇలాగే కొనసాగితే కచ్చితంగా పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ కచ్చితంగా పూర్తికాదు. అప్పుడు వచ్చే అప్రదిష్టకు ఎవరు బాధ్యత వహిస్తారనేది నేతలు తెచ్చుకోవాలి మరి. -
తాకట్టు పెట్టడానికి వచ్చి చిక్కారు !
పట్టుబడ్డ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు చాంద్రాయణగుట్ట: ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న ఓ ఘరానా గ్యాంగ్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను శాలిబండ పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. చోరీ సొత్తు తాకట్టుపెట్టడానికి వచ్చిన వీరు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, శాలిబండ అదనపు ఇన్స్పెక్టర్ నగేష్తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... లాల్దర్వాజాకు చెందిన సంగీత (36) ఈ ఏడాది ఫిబ్రవరి 22న సంగారెడ్డిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో చార్మినార్ వరకు బస్సులో వచ్చింది. అక్కడి నుంచి లాల్దర్వాజా రావడానికి ఆటో ఎక్కగా... ఇద్దరు మహిళలు అదే ఆటోలో ఎక్కారు. సంగీత పక్కన కూర్చున్న వారు ఆమెను అటు.. ఇటు నెట్టుతూ దృష్టి మళ్లించి బ్యాగ్ చోరీ చేశారు. ఆ బ్యాగ్లో 16 తులాల బంగారు నగలు ఉన్నాయి. శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్ వద్ద సంగీత ఆటో దిగగా.. వెంటనే వారు కూడా దిగి వెళ్లిపోయారు. అనంతరం తన బ్యాగ్ చోరీకి గురైందని గుర్తించిన బాధితురాలు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంగీత ఆటో దిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు మహిళలు బ్యాగ్ చోరీ చేసినట్టు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఇద్దరు మహిళలు లాల్దర్వాజా మోడ్ వద్ద నగలతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... ఓ ఘరానా దొంగల ముఠాకు చెందిన అక్కాచెల్లెళ్లు కావడి సరోజ (38), మేకల దుర్గ(40) అని తేలింది. వీరిది కడపజిల్లా సాయింపేట. పలుసార్లు జైలుకెళ్లి వచ్చారు. కాగా, ఆటోలో సంగీత నగలను చోరీ చేసింది వీరేనని తేలింది. అప్పట్లో చోరీ చేసిన నగలను ఇప్పుడు తాకట్టు పెట్టడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. ఇద్దరి వద్ద నుంచి 13.1 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఈ చిట్టి దుర్గ సరస్వతిగా మారుతుందా..!
దృశ్యాలు వేర్వేరు.. కొన్ని ఆవహిస్తే.. కొన్ని ఆపేస్తాయి.. మరికొన్ని మాత్రం ఊపేస్తుంటాయి. కళ్లతో ఏడిస్తే బాధ రాలిపోతుంది.. గుండెతో ఏడిస్తే మిగిలిపోతుంది. కొన్ని సంఘటనలు కళ్లముందు గంటలకొద్దీ జరిగినా భౌతికంగా, మానసికంగా చలనం కలిగించలేవు. మరొకొన్ని మాత్రం రెప్పపాటు కాలంలో కళ్లకు కనిపించినా అవి గుండెను తట్టి లేపి ఎదురుగా నిల్చోబెడతాయి. ఆ సమయంలో అనిపిస్తుంటుంది ఓసారి మనిషిగా స్పందిస్తే బాగుంటుంది కదా! సరిగ్గా ఈ దృశ్యం చూసిన ఎవరికైనా బహుశా..! అలాగే అనిపించవొచ్చేమో. హైదరాబాద్ నగరం.. ఎప్పుడూ ఉరుకులు పరుకులు. అయినవాళ్లు కనిపించినా.. ఆ ఏముందిలే అన్నంతగా మసిబారిపోయిన మనుసులు. నిర్లక్ష్యంతో కాదుగానీ పరిస్థితులు అలాంటివి. ఇలాంటి స్థితిలోనూ మనసును తొక్కిపట్టే ఓ సన్నివేశం కనిపిస్తే.. అది ఆరోజంతా ఆలోచింపజేస్తే.. స్పందించకుండా ఉండటం సాధ్యమేనా! ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్ నగర్ సిగ్నల్ చౌరస్తా.. మరో 18 సెకన్లలో సిగ్నల్ పడుతుంది. అప్పుడే టైం ఎంతయిందో చూద్దామని చేతిలో మొబైల్ ఫోన్. టెన్షన్ గా అటూ ఇటూ చూడగా ఓ చోట చూపు ఆగిపోయింది. గబగబా రెండు ఫొటోలు. ఆ చౌరస్తాలోని ఓ ఫుట్పాత్పై కిందపరిచిన గోనెసంచి.. దానిమీద పరిచిన పూలు వాటిపక్కన ముసలవ్వ.. ఆమెకు పక్కనే కూర్చున్న ఓ తొమ్మిదేళ్ల పాప. వాహనాల చప్పుడు, పొగ, అరుపులు కేకలు ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్స్ ఏవీ కూడా ఆ పాప ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. నోట్సుపై ఏవో రాస్తుంటే తన తలరాతే రాసుకుంటోందా అనిపించింది. ఒకప్పుడు మహానుభావులు రాత్రివేళ వీధిదీపాల కింద కూర్చుని చదువుకున్నారని చెబితే విన్నాం.. కానీ ఈ చిట్టి చదువుల తల్లి మాత్రం నిజంగానే వీధిలోని ఫుట్ పాత్ పై కూర్చుంది. కానీ రాత్రి కాదు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో. మరో గంట ఆగితే సూర్యాస్తమయం అయిపోతుంది. అయినా చక్కగా ఒదిగిపోయి పుస్తకంలో దూరిపోయి సూటిగా పుస్తకాల్లోని అక్షరాలను చేతిరాతతో వల్లె వేసుకుంటోంది. అంత ఏకాగ్రత మధ్యనే పూల కోసం వచ్చినవారికి ఇచ్చి.. క్షణంలోనే తిరిగి పుస్తకంలో వాలిపోయింది. ఆ పాప పేరు దుర్గ. ఇంత చిన్నవయసులోనే జీవితం తన ముందు నిలిపిన సవాల్ను ఎదుర్కొంటున్న తీరు చూసి నిజంగా దుర్గే అనిపించింది. ఆమె జవహర్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. వాళ్లమ్మ గణేశ్, ప్రమీలకు నాలుగో సంతానం. అంతకుముందు జన్మించినవారంతా కూడా అనారోగ్యం ఇతర పరిస్థితుల వల్ల చనిపోగా దుర్గ మాత్రమే ఆ దీనదంపతులకు ప్రియమైన కూతురుగా ఉంది. అశోక నగర్ చౌరస్తాలోని ఫుట్ పాత్పై ప్రమీల పూలు అమ్ముతుండగా సాయంత్రం పాఠశాల అయిపోగానే.. పుస్తకాల సంచితో దుర్గ నేరుగా అక్కడికే వస్తుంది. ఈ లోగా తల్లి వెళ్లి చిన్నాచితక పనులు చేసుకుంటుంది. అప్పటి వరకు దుర్గనే ఓ పక్క చదువుకుంటూ.. మరోపక్క పూలను అమ్ముతూ చిన్నవయసులోనే చేదోడు వాదోడుగా ఉంటుంది. కానీ, మనసులో ఓ ఆందోళన ఇన్ని ఇబ్బందుల మధ్య దుర్గకు పుస్తకాలతో సహవాసం ఎన్నాళ్లు నిలిచిఉంటుందోనని.. ఆ ఆందోళన వెంటే మరో ఆశ.. ఆ పుస్తకం ఎప్పటికీ దుర్గనే అంటిపెట్టుకొని ఆమెకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని.. ఏదేమైనా కళ్లకు కనిపించిన ఈ దుర్గకు, కళ్లకు కనిపించకుండా ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్న దుర్గలకు నిజంగా ప్రభుత్వం నుంచైనా, తమకు చాలినంత సంపద కంటే మిగులు సంపద ఉన్న వ్యక్తుల నుంచైనా సాయం అందితే ఈ దుర్గలు నిజంగా అవుతారు సరస్వతీ పుత్రికలు. -
దుర్గ కిడ్నాప్.. సుఖాంతం
నల్లగొండలో నిందితురాలి జాడ పాపను క్షేమంగా విడిపించిన రైల్వే పోలీసులు అదుపులో నిందితురాలు.. మరో ఇద్దరు హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వారం రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి దుర్గ కేసు సుఖాంతమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు నిందితురాలితోపాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను నల్లగొండలో అదుపులోకి తీసుకున్నారు. కాకినాడకు చెందిన జి. రాణి తన కుమార్తె దుర్గ(5)తో కలసి పదిరోజుల క్రితం హైదరాబాద్లో ఉంటున్న సోదరుని ఇంటికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు ఈనెల 5న చిన్నారితో కలసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. స్టేషన్లో వేచిచూస్తున్న రాణితో ఓ మహిళ మాటకలిపి పరిచయం చేసుకుంది. తనదీ విజయవాడేనని నమ్మించింది. రైలు వచ్చేందుకు చాలా సమయం ఉందని స్టేషన్ బయట పండ్లు కొందామని చెప్పి బయటకు తీసుకువచ్చింది. తిరిగి స్టేషన్లోకి వెళ్లే క్రమంలో ముందు రాణి నడుస్తుండగా, వెనుక దుర్గను ఎత్తుకుని మహిళ అనుసరించింది. టికెట్ కౌంటర్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నారితో మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. చుట్టపక్కల వెతికి.. చివరకు తన కుమార్తె కిడ్నాప్కు గురైనట్లు గ్రహించిన రాణి.. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా చిన్నారిని అపహరించిన మహిళను గుర్తించారు. ఆమె చిన్నారితో సహా నల్లగొండ వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నల్లగొండ పట్టణంలో నిందితురాలితోపాటు ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, చిన్నారి దుర్గను సురక్షితంగా విడిపించారు. గురువారం హైదరాబాద్కు తీసుకుచ్చిన నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చిన్నారి దుర్గ కిడ్నాప్ను విజయవంతంగా ఛేదించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. -
దుర్గాదేవి నిమజ్జనంలో అపశ్రుతి
దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవి విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తున్న క్రమంలో వచ్చిన భారీ అలతో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుడి కోసం స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలం చింతపల్లి సముద్రతీరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలి మండలానికి చెందిన వెంకటేష్(29) దుర్గాదేవి నిమజ్జనంలో పాల్గొనడానికి చింతపల్లి బీచ్కు వచ్చాడు. విగ్రహాన్ని నీటిలో వదులుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. -
దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి
దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. దసరా సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్ను సిద్ధం చేశారు. వెలుతురు కోసం అందులో ఉంచిన జనరేటర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఐతారం పెంటయ్య(30) అనే వ్యక్తి జనరేటర్ను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. -
హెలికాప్టర్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా తలెత్తే ట్రాఫిక్ సమస్యలను నివృత్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త ఐడియాను అమలుచేశారు. ఫలితం సంగతి ఎలా ఉన్నప్పటికీ శుక్రవారం నాటి దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి హెలికాప్టర్ల సహాయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు హెలికాప్టర్లను వినియోగించడం దేశరాజధానిలో ఇదే ప్రథమం. 'యమునా నదికి దారితీస్తూ సాగే నిమజ్జనయాత్రను.. ఆకాశమార్గం నుంచి పరిశీలిస్తూ, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో, దానిని ఎలా కంట్రోల్ చేయాలో నిరంతరం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతూ ఉంటుంది. ఆ సమాచారాన్ని వైర్ లెస్ సెట్ల ద్వారా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తెలియజేస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు' అని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ (ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ చెప్పారు. నిమజ్జన మహోత్సవరం నాడు కేవలం రోడ్లపై ఉండి ట్రాఫిక్ ను నియంత్రించడం కష్టసాధ్యమని, అందుకే ఈ ఏర్పాటని, ఇందుకోసం 'పవన్ హన్స్' అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. -
నవరాత్రి వేడుకల్లో విద్యాబాలన్
ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరోయిన్స్ షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న దుర్గా నవరాత్రి వేడుకల్లో తారల సందడి బాగా కనిపిస్తోంది. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్లలో హాట్ హాట్గా కనిపించే తారలు, ట్రెడిషనల్ లుక్లో హుందాగా దర్శనమిస్తున్నారు. ప్రజెంట్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్, ఈ లిస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ లేడి ఓరియంటెడ్ సినిమాలను సక్సెస్ ఫార్ములాగా మార్చిన విద్యాబాలన్, విశ్వజిత్ ఛటర్జీ కుటుంబం నిర్వహించిన దుర్గమాత పూజలో పాల్గొంది. ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి నటిస్తున్న విద్య ట్రెడిషనల్ లుక్లో అందరినీ ఆకట్టుకుంది. బెంగాలీ తరహా వస్త్రదారణతో విద్యాబాలన్ హుందాగా కనిపించింది. -
23 ఏళ్లుగా దుర్గామాత సేవలో సలీమ్ నియారియా
రామ్.. రహీమ్ అంతా ఒక్కరే, ఖురాన్.. భగవద్గీత చెప్పేదొక్కటే అనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది రాయగఢ్ లోని దుర్గానవరాత్రోత్సవం. సర్వమత సమానత్వాన్ని చాటుతూ 23 ఏళ్లుగా నవరాత్రుల్లో దుర్గామాతను నిలబెట్టడంలోనూ, తిరిగి నిమజ్జనం చేయడంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నాడు 50 ఏళ్ల షేక్ సలీమ్ నియారియా. అవును.. ముస్లిం అయి ఉండి కూడా నవరాత్రుల నిర్వహణకు నడుం కడుతున్నాడీయన. హండీచౌక్ దుర్గా కమిటీ పేరున... రాయగఢ్ లోని హండీచౌక్ ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్న నియారియా... మొత్తం 25 మంది బృందంలో తనతోపాటు మరో ముగ్గురు ముస్లింల సాయంతో దుర్గా పూజ వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరంతా నవరాత్రుల్లో దుర్గాపూజా కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్రపోషించి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిపిస్తున్నారు. అలాగే మరెందరో ముస్లిం కళాకారులు దుర్గా మండపాన్ని అలంకరించడంలోనూ పాల్గొంటున్నారు. 1992 నుంచి ప్రారంభించిన ఉత్సవాల కార్యక్రమాలకు నియారియా కేవలం యాజమాన్యం వహించడం కాక, స్వయంగా ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. అలాగే దుర్గా శరన్నవరాత్రుల అనంతరం తొమ్మిదవరోజు దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క దుర్గామాత విషయంలోనే కాదు అతడు అన్ని మతాల కార్యక్రమాల్లోనూ అదే రీతిలో పాల్గొంటారు. -
అమితాబ్ ట్విట్టర్లో అతిపెద్ద దుర్గమ్మ!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోమవారం తన అభిమానులకు దుర్గాదేవీ పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత దయవల్ల అందరికీ సుఖశాంతులు, సంపద కలుగాలని, రానున్న రోజులు మరిన్ని శుభాలు చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవి విగ్రహం ఫొటోను అమితాబ్ ట్వీట్ చేశారు. కోల్కతాలోని దేశప్రియా పార్కులో 88 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పారు. 40మంది శిల్పులు రెండు నెలలు కష్టపడి సిమెంట్తో, సంప్రదాయ అమ్మవారి రూపంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కోల్కతాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మవారి ఫొటోను అమితాబ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అమితాబ్ సతీమణి జయబచ్చన్ బెంగాళీ కావడంతో ఆయన కుటుంబం కూడా దుర్గాదేవీ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నది. -
దుర్గా పూజలో ట్రాన్స్ జెండర్స్
కోల్కతా: దేశ వ్యాప్తంగా దసరా పండుగ నేపథ్యంలో జరుగుతున్న దుర్గా మాత ఉత్సవాల్లో స్వలింగ సంపర్కులు భాగమయ్యారు. తమపట్ల చూపుతున్న వివక్ష ఈ విధంగానైనా పోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. కోల్కతాలోని ట్రాన్స్ జెండర్స్ అంతా ఏకమై ప్రత్యేకంగా దుర్గామాత విగ్రహాన్ని కాకుండా అర్థనారీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు ప్రారంభించారు. స్వలింగ సంపర్కుల ఉద్యమకారుడు అనింద్య హజ్రా ఈ విషయంపై మాట్లాడుతూ'మాకంటు ఒక గుర్తింపు, హక్కులు కావాలనే ఉద్దేశంతోనే ఉత్సవాన్ని జరుపుతున్నాం' అని తెలిపాడు. -
శరన్నవరాత్రి వేడుకల్లో టీమిండియా
-
శక్తి స్వరూపం
జగన్మాత ఆదిపరాశక్తి. శక్తిస్వరూపిణి. చెడుపై మంచి సాధించే అంతిమ విజయానికి ప్రతీక. అమ్మను నమ్ముకుంటే అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. సంస్కృతికి స్త్రీయే ఆధారం. సెలవుల్లో ఉండే పిల్లలూ... ఇళ్లకు వచ్చే బంధువులూ... బంధాలు బలపడే ఈ దసరా పండుగలో లోగిళ్లు కళకళలాడే ఈ శరన్నవ వేడుకలలో స్త్రీయే కీలక పాత్రధారి. స్త్రీ విజయమే కుటుంబ విజయమై తెలుగు సంస్కృతి విరాజిల్లాలని అందుకు ఆ శక్తిస్వరూపిణి ఆశీస్సు ఎల్లెడలా ఉండాలని అశిస్తూ ఈ దశ అలంకరణల ప్రత్యేకం... 1 శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (13వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) - నైవేద్యం: చక్కెర పొంగలి అమ్మవారి తొలిరోజు అలంకరణ ఇది. స్వర్ణకవచంతో అత్యంత విశిష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్రబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. 2 శ్రీ బాలా త్రిపురసుందరీదేవి (14వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-మిగులు) నైవేద్యం: కట్టెపొంగలి రెండోరోజు అభయముద్రతో బాలా త్రిపురసుందరీదేవి అలంకారం. ఆ రూపంలో ఉన్న బాలా త్రిపురసుందరీదేవిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగడమే కాకుండా, సత్సంతానం కలుగుతుందని ప్రతీతి. 3 శ్రీ గాయత్రీదేవి (15వ తేది ఆశ్వయుజ శుద్ధ్ద విదియ) నైవేద్యం: పులిహోర మూడో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. 4 శ్రీ మహాలక్ష్మి (16వ తేది ఆశ్వయుజ శుద్ధ తదియ) నైవేద్యం: రవ్వకేసరి శ్రీమహాలక్ష్మి అలంకరణ. మూడు శక్తులలో ఒకటైన శ్రీమహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. 5 శ్రీ అన్నపూర్ణాదేవి (17వ తేది ఆశ్వయుజ శుద్ధ చవితి) నైవేద్యం: కొబ్బరి అన్నం ఐదో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలి దప్పుల వంటి బాధలు ఉండవు. 6 శ్రీ లలితా త్రిపురసుందరీదేవి (18వ తేది ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యం: అల్లంగారెలు ఆరో రోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారం. లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా దర్శనమిచ్చే లలితా త్రిపురసుందరిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగుతాయి. 7 శ్రీ సరస్వతీదేవి (19వ తేది ఆశ్వయుజ శుద్ధ షష్టి) నైవేద్యం: దద్ధోజనం చదువుల తల్లి సరస్వతీదేవి రూపం. బుద్ధిప్రదాయిని అయిన సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 8 శ్రీ దుర్గాదేవి (20వ తేది ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నైవేద్యం: కదంబం ఎనిమిదో రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. సింహవాహనంపై మహిషాసురుడిని వధిస్తున్న దుర్గాదేవి రూపాన్ని ఆరాధిస్తే శత్రుబాధలు నశిస్తాయి. సమస్త దుర్గతులు దూరమవుతాయని ప్రతీతి. 9 శ్రీ మహిషాసురమర్దిని దేవి (21వ తేది ఆశ్వయుజ శుద్ధ అష్టమి) నైవేద్యం: బెల్లమన్నం తొమ్మిదోరోజు మహిషాసురమర్దిని. అష్టభుజాలతో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై మహిషుడిని సంహరించిన రూపంలోని దేవిని కొలిస్తే సమస్త భయాలు తొలగి, ధైర్య స్థైర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 10 శ్రీ రాజరాజేశ్వరీదేవి (22వ తేది ఆశ్వయుజ శుద్ధ నవమి, దశమి) - నైవేద్యం: పరమాన్నం పదోరోజు విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది. షోడశ విద్యాస్వరూపిణి, శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన దేవికి విజయ అని కూడా పేరు ఉంది. రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే అన్నింటా విజయాలు కలుగుతాయని ప్రతీతి. దేవీ నవరాత్రులు అమ్మ... అమ్మలగన్న యమ్మ... ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని ఆరాధించే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఆ రోజు నుంచే శరదృతువు ప్రారంభం కావడంతో వీటిని శరన్నవరాత్రులంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పదోరోజైన దశమి నాడు దసరా పండుగ జరుపుకొంటారు. దీనినే విజయదశమి అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజు కావడం వల్ల విజయదశమి జరుపుకొనే ఆచారం వచ్చినట్లు చెబుతారు. ఇంద్ర కీలాద్రి స్థలపురాణం తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన అమ్మవారి క్షేత్రం విజయవాడలోని కనకదుర్గ ఆలయం. ఇంద్రకీలాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి అయిన జగన్మాత... కనకదుర్గగా వెలసింది. ఇక్కడ దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పూర్వం కీలుడనే యక్షుడు తపస్సు చేసి, పర్వతరూపంలో ఉన్న తన హృదయ కుహరంలో నివసించమని దుర్గాదేవిని కోరడంతో అమ్మవారు కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని పూజించారు. నాటి నుంచి ఇది ఇంద్రకీలాద్రిగా ప్రాశస్త్యం పొందింది. రాక్షసులను సంహరించిన అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఉగ్రరూపిణిగా ఉండేది. అద్వైత మత వ్యవస్థాపకుడైన ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని దర్శించి, ఆమె మహోగ్రశక్తులను శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రస్థాపన చేశారు. అప్పటి నుంచి అమ్మవారు శాంతరూపిణిగా భక్తులకు దర్శనమిస్తోంది. దుర్గమ్మ కనక కాంతులు బెజవాడ దుర్గమ్మగా జనసామాన్యంలో ప్రసిద్ధి పొందిన కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై నిత్యం కనక కాంతులతో భక్తులకు దర్శనమిస్తోంది. కనకదుర్గమ్మకు వజ్ర వైడూర్యాదులు పొదిగిన బంగారు వెండి ఆభరణాలతో పాటు ఆరు బంగారు కిరీటాలు ఉన్నాయి. వీటిలో రెండు కిరీటాలను నిత్యం వినియోగిస్తుంటే, మిగిలిన నాలుగింటిని పండుగ రోజుల్లో అలంకరిస్తారు. మకరతోరణం, నానుతాడు, మంగళసూత్రాలు, కంఠాభరణం (అష్టోత్తరార్చన మాల), నల్లపూసల గొలుసు, జడ, బొట్టు, బులాకీ, నత్తు, సూర్యచంద్రులు, శంఖుచక్రాలు, పాదాలు... ఇవన్నీ అమ్మవారికి గల కనకాభరణాలే. ఇవి కాకుండా, స్వర్ణకవచం అమ్మవారికి అదనపు ఆకర్షణగా ఉంటోంది. ఆలయ అర్చకులు ప్రతి గురువారం 108 స్వర్ణపుష్పాలతో అమ్మవారిని అర్చిస్తారు. భద్రకాళి ఆలయంలో... వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు ఉదయం ధ్వజారోహణంతో నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. చివరి రోజు అంటే దశమి రోజున ఆలయం వద్దనున్న సరోవరంలో భద్రకాళి, భద్రేశ్వరుల తెప్పోత్సవంతో నవరాత్రి వేడుకలు ముగుస్తాయి. హన్మకొండ-వరంగల్ నడుమ కొండపై ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 625 ప్రాంతంలో చాళుక్య రాజు రెండవ పులకేశి నిర్మించాడని ప్రతీతి. చాళుక్యుల శిల్పకళా రీతికి ఈ ఆలయం అద్దం పడుతుంది. ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మహిషాసురమర్దిని బ్రహ్మ వల్ల వరాలు పొందిన మహిషాసురుడు తన అనుచరగణమైన రాక్షసులతో కలసి ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషుడిని అంతమొందించడానికి ఆదిపరాశక్తి తనలోని వివిధ అంశలను ఒక్కటిగా చేర్చి, జగదంబగా అవతరించింది. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు సహా దేవతలందరూ త్రిశూలం, శారఙ్గం, ధనుస్సు, ఖడ్గం, చక్రం, వజ్రం, పాశం, దండం, తోమరం, గద, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, రౌద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం వంటి ఆయుధాలను ఆమెకు అందించారు. ఆ ఆయుధాలను ధరించిన అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి, చండి, చాముండి, కాళి, బగళ, కామాక్షి, ఛిన్నమస్తా, బాల, త్రిపుర, తారిణి వంటి వివిధ అవతారాలను దాల్చి మహిషుడిని, అతడి అనుచరులైన రాక్షసులను సంహరించింది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించడం వల్ల జగదంబకు దుర్గ అనే పేరు వచ్చింది. మహిషుడిని సంహరించినందున ఆమె మహిషాసురమర్దినిగా ప్రఖ్యాతి పొందింది. శక్తిరూపేణ సంస్థితా... ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అని జగజ్జననిని ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో శక్తిపూజ ప్రధానం. దేవి దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, రౌద్ర రూపాన్ని కాళి అని ఉపాసిస్తారు. మహిషాసురుడిని వధించిన అమ్మ దుర్గాదేవిగా పూజలందుకుంటోంది. ‘దుర్గే దుర్గతి నాశిని’... అంటే దుర్గతులను నశింపజేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. జ్ఞాన పరిమళాలను ఆమె నిరంతరం వెదజల్లుతూనే ఉంటుంది. అందువల్ల అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అనే పేరూ ఉంది. స్వర్ణ కవచాలంకరణ ప్రత్యేకత శరన్నవరాత్రి వేడుకల్లో తొలిరోజు అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత రూపంలో కనకదుర్గమ్మను ఆరాధించడం వెనుక ఒక గాథ ఉంది. పూర్వం మాధవవర్మ అనే రాజు విజయవాటికాపురిని ధర్మబద్ధంగా పాలించేవాడు. ఆయన అమ్మవారికి పరమభక్తుడు. ఒకనాడు ఆయన కుమారుడు నగర సందర్శనానికి బయలుదేరినప్పుడు, ఒక బాలుడు ప్రమాదవశాత్తు అతడి రథచక్రం కింద పడి మరణించాడు. బాలుడి తల్లిదండ్రులు రాజును కలుసుకుని, న్యాయభిక్ష కోరారు. తన కుమారుడే వారి దుర్గతికి కారణమని తెలుసుకున్న రాజు మాధవవర్మ తన కుమారుడికి మరణదండన విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చిన అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడమే కాకుండా, విజయవాటికాపురిలో కొన్ని గంటల సేపు కనకవర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా పూజలందుకుంటోంది. కనకవర్షం కురిపించిన అమ్మవారికి నవరాత్రి వేడుకల్లో తొలిరోజున స్వర్ణకవచాలంకరణ చేయడం కూడా అప్పటి నుంచే ఆనవాయితీగా మారింది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ నశిస్తాయని ప్రతీతి. వివిధ ప్రాంతాలలో నవరాత్రులు దేవీ నవరాత్రులను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రీతుల్లో జరుపుకొంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, మైసూరు ప్రాంతాలలో శరన్నవరాత్రులను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా గల శక్తి పీఠాలు నవరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. భారతదేశంలోనే కాకుండా, హిందువులు ఎక్కువగా ఉండే నేపాల్, మారిషస్ వంటి దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. దాదాపు అన్నిచోట్ల దసరా రోజున ఆయుధపూజలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల నవరాత్రుల చివరిరోజున రావణదహనాన్ని కూడా నిర్వహిస్తారు. మహర్నవమి రోజున శ్రీరాముడి చేతిలో రావణ సంహారం జరిగింది ఈరోజే అని భావిస్తారు. అయితే, పదితలలు గల రాక్షసరాజైన రావణుడిని దహనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక మర్మం ఉందని చెబుతారు. రావణుడి పది తలలూ మనలోని పది అవలక్షణాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు, స్వార్థం, అన్యాయం, అమానవత్వం, అహంకారాలకు ప్రతీకలని అంటారు. పాఢ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ వేడుకల్లో రావణుడి పది తలల వంటి ఈ పది అవలక్షణాలను మనలోంచి తుడిచిపెట్టేయడానికి సంకేతంగానే రావణదహనం తంతును జరుపుతారని చెబుతారు. చివరి రోజైన దసరా పండుగ నాడు కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి హంసవాహనంపై కృష్ణానదిలో నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి సంకేతంగా హంసవాహనాన్ని మూడుసార్లు నదిలో తిప్పుతారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవంతోనే నవరాత్రి వేడుకలు ముగుస్తాయి. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఆ తల్లికి ...ఏ కష్టం వచ్చిందో.. ఏమో.. ఆరునెలల బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి, మరో బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టి గదిలో నిద్రబుచ్చి, పక్క గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలలు నిండిన ఆమె పుట్టింటికి వెళ్లి పండంటి ఆడపిల్లను ప్రసవించి, ఐదోనెలలో అత్త వారింటికి వచ్చింది. ఈనెల 28న నామకరణం చేద్దామని భావించగా, ఈలోగా ఆత్మహత్య చేసు కోవడం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది.ఈ సంఘటన పామర్రులో బుధవారం చోటు చేసుకుంది. పామర్రు : స్థానిక రావి హరిగోపాల్ నగర్లోని కావేటి దుర్గా ప్రసాద్కు కంచికచర్ల గ్రామానికి చెందిన దుర్గ (23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి(2) చిన్న కుమార్తెకు 6నెలల వయస్సు. ఇంకా పేరుపెట్టలేదు. ఈనెల 28న పేరు పెడదామనుకుంటున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లగా పెద్ద ఆపరేషన్ చేయించారు. అనంతరం దుర్గ పిల్లలను తీసుకొని నెల రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది. ఈనేపథ్యంలో బుధవారం దుర్గ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దుర్గ భర్త ఉయ్యూరులోని ఓ ప్రైవేటు కాన్వెంటు వ్యానుకు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఉదయమే తన విధులకు వెళ్లి పోయాడు. దుర్గ అత్త మావిళ్లమ్మ ఉదయమే గిల్టు నగల వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దుర్గ గదిలోని ఫ్యానుపైన ఉన్న దూలానికి చీరను కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో తన కూతురుని చూసేందుకు కంచికచర్ల నుంచి తల్లిదండ్రులైన బత్తిన శ్రీను,రాజులమ్మ ఉదయం 11 గంటల సమయంలో తమ కుమార్తె ఇంటికి చేరుకున్నారు. తలుపులు మూసి ఉండడంతో కొద్ది సేపు తలుపులు తట్టారు. ఎవ్వరూ పలుకకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇంట్లో వారు ఎక్కడి వెళ్లారు అని అడుగుతుండంగా ఇంట్లో నించి మృతురాని పెద్ద కుమార్తె ఏడుపులు వినపడడంతో అనుమానం వచ్చి స్థాని కులు కిటికి తలుపులు తీసి చూశారు. లోపలి గదిలో ఉన్న ఫ్యాను దూలానికి ఉరి వేసుకుని దుర్గ వేలాడుతూ కనబడింది. దీంతో దుర్గ తండ్రి శ్రీను తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి దుర్గ అప్పటికే మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎన్వీ కోటేశ్వరరావు తెలిపారు. అత్తింటి వారే హతమార్చారు తనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారని పెద్ద కుమార్తె దుర్గని అల్లారుముద్దుగా పెంచుకున్నామని ఎంతో బాధ్యతగా ఉండే తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని తల్లి రాజులమ్మ బోరుమని విలపించింది. తన అల్లుడు దుర్గా ప్రసాద్ తన కుమార్తెను ఫోన్లో కూడా మాట్లాడనిచ్చే వాడు కాద న్నారు. చీటికి మాటికీ తిడుతూ కొడుతుండేవాడని పోలీసులకు తెలిపింది. బాలింత అని చూడకుండా భర్త కొట్టడం వల్లే మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నదని ఆమె ఆరోపించారు. -తల్లి రాజులమ్మ తల్లిని కోల్పోయిన చిన్నారులు తల్లి చనిపోయిన విషయం తెలియక రెండేళ్ల కుమార్తె అటు ఇటు తిరగడం స్థానికులను కలచివేసింది. ఆరు నెలల పాప పాల కోసం ఏడుస్తూంటే..అమ్మమ్మ ఏడుస్తూ డబ్బా పాలు పట్టించడం చూపరులను కంటతడిపెట్టించింది. -
దుర్గా మాత విగ్రహాన్ని అప్పగించనున్న జర్మనీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని ఓ ఆలయంలో చోరీకి గురై జర్మనీలోని ఓ మ్యూజియంలో ప్రత్యక్షమైన 9వ శతాబ్దం నాటి దుర్గామాత విగ్రహాన్ని జర్మనీ భారత్కు ఈవారంలో అప్పగించనుంది. జర్మనీలోని భారత దౌత్య కార్యాలయ అధికారులకు ఈ నెల 23న ఈ విగ్రహాన్ని అప్పగించే అవకాశాలున్నాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. ఈ నెల 26న లేదా 27న ఇది భారత్కు చేరొచ్చని చెప్పారు. 1990లో జమ్మూ కశ్మీర్, పుల్వామాలోని ఓ ఆలయంలో దుర్గామాత విగ్రహం చోరీకి గురైంది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విగ్రహం జర్మనీలోని లిండెన్ మ్యూజియంలో ఉన్నట్లు 2012లో పోలీసులకు సమాచారం అందింది. విగ్రహం భారత్కు చెందినదన్న పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అక్కడి అధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో జర్మనీ దీన్ని తిరిగి భారత్కు అప్పగించనుంది. ఈ విగ్రహాన్ని దేశాన్ని దాటించడంలో స్మగ్లర్ సుభాష్ కపూర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కపూర్ను జర్మనీ 2011లో అరెస్ట్ చేసింది. -
అబార్షన్ కేసులో అధికారుల కొరడా
మచిలీపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పేరే దుర్గాదేవి అబార్షన్ కేసులో అధికారులు కొరడా ఝుళిపించారు. పేరే దుర్గాదేవికి స్కానింగ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ వివరాలను వెల్లడించిన స్కానింగ్ సెంటర్ను, అబార్షన్ చేసిన ఆస్పత్రిని శుక్రవారం సీజ్ చేశారు. అధికారులు స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసేందుకు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లిపోయారు. వల్లూరు రాజా సెంటర్లోని డాక్టర్స్ స్కానింగ్ సెంటర్కు చేరుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) ఆర్.నాగమల్లేశ్వరి, డెప్యూటీ డీఎంహెచ్వో గీతాబాయి, బందరు డీఎస్పీ శ్రావణ్కుమార్, రెవెన్యూ అధికారులు న్యాయవాది సమక్షంలో తాళాలను పగలగొట్టారు. సెంటర్లో ఉన్న పరికరాల వివరాలను నమోదు చేసి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సీలు వేశారు. అక్కడినుంచి దుర్గాదేవికి అబార్షన్ చేసిన జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రికి చేరుకుని దానినీ సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకే... డీఎంహెచ్వో నాగమల్లేశ్వరి మాట్లాడుతూ లింగ నిర్ధారణ వివరాలను వెల్లడించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ డాక్టర్స్ స్కాన్ సెంటర్ వైద్యుడు ఎల్ఆర్వీ ప్రసాద్ వాటిని ఉల్లఘించారన్నారు. కలెక్టర్ బాబు.ఎ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు విచారణ చేసిన అనంతరం డాక్టర్స్ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశామని చెప్పారు. పేరే దుర్గావతి గర్భంలో ఉన్నది ఆడపిల్లేనని తెలుసుకోవటం, జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రిలో నర్సు సత్యవతి అబార్షన్ చేసే సమయంలో సరైన పద్ధతులు పాటించకపోవటం వల్ల బాధితురాలు తీవ్ర అనారోగ్యం పాలైందని తెలిపారు. విజయవాడ ఆస్పత్రిలో దుర్గాదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని డీఎంహెచ్వో చెప్పారు. జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై నిఘా ఉంచనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. స్కానింగ్ సమయంలో లింగ నిర్ధారణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ఆస్పత్రి సీజ్ జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న పిల్లల ఆస్పత్రిని కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్పత్రిలో రంగిశెట్టి నాగబాబు అనే వ్యక్తి ఆర్ఎంపీ అయినప్పటికీ తాను పిల్లల డాక్టర్ను అని చెప్పుకొంటూ పెద్ద ఎత్తున బెడ్లు ఏర్పాటు చేసి వైద్యసేవలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
దుర్గగుడిలో గోవధపై విచారణ
విజయవాడ: దుర్గగుడి దేవస్థానానికి చెందిన గోశాలలో 21 గోవులు మృతి చెందడంపై విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా.. అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా హాజరు కావచ్చని అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం మల్లికార్జునపేటలోని గోశాలలో ఆహారం విషతుల్యం కావడంతో 21 గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
దుర్గగుడిలో అన్యమత ప్రచారంపై నిరసన
దుర్గగుడిలో పనిచేస్తున్న ఉద్యోగులే అన్యమత ప్రచారానికి పూనుకుంటున్నారంటూ స్వామి శ్రీనివాసానంద సరస్వతి శనివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై నిరసన వ్యక్తం చేశారు. ♦ కేశఖండనశాలలో అన్యమత ప్రచారకులపై కేసులు పెట్టాలి ♦ అన్యమతాలకు చెందిన 30 మందిని తొలగించాలి ♦ ఇంద్రకీలాద్రిపై ఉన్న చర్చిని వెంటనే తీసివేయాలి ♦ ఇంద్రకీలాద్రి అమ్మవారిదే.. ♦ ఆనందాశ్రమం స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో అన్యమత ప్రచారం జరగడాన్ని నిరసిస్తూ హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై ధర్నా నిర్వహించారు. అన్యమత ప్రచారం గురించి దుర్గగుడి ఈవోను కలిసి తమ నిరసనను తెలియజేసేందుకు శ్రీకాకుళం ఆనందాశ్రమం స్వామీజీ, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీ శ్రీనివాసానంద సరస్వతి, సమితి ప్రతినిధులతో కలిసి వచ్చారు. అయితే, స్వామీజీ వచ్చిన విషయం ఈవో సీహెచ్ నర్సింగరావు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి తోడు దేవస్థానం సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. ఈవో వచ్చి తమతో మాట్లాడిన తరువాతే అక్కడ నుంచి వెళ్తామంటూ పట్టుబట్టారు. రాత్రి 9.30 గంటలకు ఈవో వచ్చారు. ఆయన్ను చూడగానే హిందూ ధర్మ రక్ష సమన్వయ సమితి ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టముట్టారు. వారిని చూసి దేవస్థానం ఉద్యోగులు వాగ్వివాదానికి దిగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కేశఖండనశాలలో క్షురకుడు భాస్కర్తో పాటు మరికొంతమంది అన్యమత ప్రచారం చేస్తున్నట్లు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు పట్టించుకోలేదంటూ స్వామీజీ ఈవోను నిలదీశారు. దేవాలయంలో సుమారు 30 మంది అన్యమతస్తులు పనిచేస్తున్నారని, వారందరినీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. సాక్షి గణపతి దేవాలయం పక్కనే ఉన్న చర్చిలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఆలయ ప్రాంగణంలో కొంతమంది ఉద్యోగులు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఈవో స్పందిస్తూ అన్యమత ప్రచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని, కేశఖండన శాలలో అన్యమత ప్రచారం జరగడంపై విచారణ చేయించి బాధ్యుల్ని విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారికి జరిగే పూజలు, నైవేద్యాల విషయంలో ఏవిధమైన కోతలు పెట్టడం లేదని ఆయనకు వివరించారు. అనంతరం స్వామీజీ విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది తిరుమల, సింహాచలం, అంతర్వేది, ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నారన్నారు. ఈవో తమకు ఇచ్చిన హామీలను వారంలో పూర్తి చేయకపోతే ఇంద్రకీలాద్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో సమితి అధ్యక్షుడు గౌరయ్య, కార్యదర్శి రామాం జనేయులు, న్యాయవాదులు యాబలూరి లోకనాథశర్మ, కృష్ణ, బీజేపీ నాయకుడు యేలేశ్వరపు జగన్మోహనరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
తెర్యాణి (ఆదిలాబాద్): ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారజామున 4 గంటలకు ఆదిలాబాద్ జిల్లా తెర్యాణి మండలం మొదలవాడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిత్రం దుర్గ ఇల్లు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా బెల్లంకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది (పైరింజన్) వచ్చే సరికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంతో సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. కాగా, దుర్గకు చుట్ట తాగే అలవాటు ఉందని స్థానికులు చెప్పారు. దీంతో ఆ ఇల్లు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందా ? లేక నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతిమయం న భయం.. న లజ్జ
దుర్గగుడిలో సిబ్బంది హస్తలాఘవం అమ్మవారి సొమ్మునే దోచేస్తున్న వైనం అయినా చర్యలు నామమాత్రం తెరవెనుక కథలెన్నో.. విజయవాడ : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ చెంతనే అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన సొమ్మును నిస్సిగ్గుగా కాజేయడానికి చూస్తున్నారు. దొరికిన వారు దొంగలు కాగా.. దొరకని వారు దొరల్లా చెలామణి అవుతున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన సుమారు రూ.లక్ష విలువచేసే మంగళ సూత్రాలు, నానుతాడును దేవస్థాన కేశఖండనశాలలో తాత్కాలిక క్షురకుడిగా పనిచేసే రామసుబ్బారావు దొంగిలిస్తూ గురువారం పట్టుబడ్డాడు. అయితే, అమ్మవారి సొత్తు చోరీకి గురవడం ఇదే తొలిసారేం కాదు. గత జూలైలో పైడిరాజు అనే క్షురకుడు హుండీల లెక్కింపు సమయంలో సుమారు రూ.5వేలు చోరీచేస్తూ కెమెరాకు చిక్కాడు. సదరు పైడిరాజు అమ్మవారి సొమ్ము కాజేతకు అసిస్టెంట్లను కూడా పెట్టుకున్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు.. అమ్మవారి సొమ్మును కాజేస్తూ దొరికిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తే.. వారు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి విధులకు హాజరయ్యారు. హుండీల లెక్కింపు సమయంలో చోరీకి పాల్పడినా కఠిన శిక్షలేమీ ఉండవని పలువురు సిబ్బందే చెబుతుండటంతో ఈ తరహా ఘటనలు ఇంద్రకీలాద్రిపై నిత్యకృత్యమైపోయాయి. అక్రమాల పుట్ట తవ్వితే లెక్కలేనన్ని అవినీతి పాములు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే.. కొండపై ఉన్న సుమారు 13 దుకాణాలకు గడువు ముగిసినా అధికారులు ఆక్షన్ నిర్వహించలేదు. దుకాణదారులు రూ.58వేలకు దేవస్థానం వద్ద అద్దెకు తీసుకుని రూ.2లక్షలకు సబ్లీజుకు ఇస్తున్నారు. షాపులు వేలం వేయమని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా అధికారులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండి కమిషనర్కు లేఖలు రాస్తామంటూ తాత్సారం చేస్తూ అమ్మవారికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు. కొండపైకి ప్రవేశించే ప్రయివేటు వాహనాలకు గతంలో ట్రిప్పుకు రూ.25 వసూలు చేసేవారు. అయితే, కొంతమంది ఆలయ ఉద్యోగులు, టీడీపీ నేతల రంగప్రవేశంతో ఆటోలకు అనుమతులు ఇప్పించారు. ఇం దుకు రోజుకు రూ.175 టోల్ఫీజు నిర్ణయించారు. దీనివల్ల దేవస్థాన బస్సులకు ఆదాయం రావట్లేదు. ఆలయలో సుమారు 55 మంది అనధికార అర్చకులు పనిచేస్తున్నారని ఈవో గుర్తించారు. వీరిని తొలగించేందుకు ప్రయత్నించగా దేవస్థానంలో కొంతమంది ఉద్యోగస్తులు, అర్చకులు.. అనధికార అర్చకులతో బేరం పెట్టారు. ఒక్కో అర్చకుడు రూ.50 వేలు చెల్లిస్తే తొలగింపు అడ్డుకుంటామని తెలిపారు. ఫలితంగా హుండీల ద్వారా రావాల్సిన సొమ్ము దక్షిణ రూపంలో అర్చకులకు చేరుతోంది. అమ్మవారి ప్రసాదాల తయారీలోని నెయ్యి, జీడిపప్పు, ఇతర పదార్థాలు పక్కదారి పడుతున్నాయి. ఈ విషయం ఈవో దృష్టికి రాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్శనానికి రూ.100, రూ.50 టికెట్లు కొనాల్సి ఉంటుంది. ఆలయ సిబ్బంది కొంతమంది వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకుని వారి కటుంబసభ్యులకు ఉచితంగా దర్శనాలు, తీర్థప్రసాదాలు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటూ తమ జేబులు నింపుకొంటున్నారు. -
కల్లు సేవించి పలువురికి అస్వస్థత
చేగుంట : కల్లు సేవించి పలువురికి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని భీంరావుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భీంరావుపల్లి గ్రామంలో వారం రోజులుగా దుర్గమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. పూజల సందర్భంగా గ్రామంలో కల్లు తాగడం మానేశారు. శనివారం జాతర ఉత్సవాలు ముగియడంతో ఆదివారం గ్రామంలో చాలా మంది కల్లు దుకాణానికి వెళ్లి కల్లు సేవించారు. ఆదివారం రాత్రి నుంచి కల్లు తాగిన వారంతా మత్తులోకి జారుకున్నారు. సోమవారం ఉదయం వరకు వారు మత్తు నుంచి తేరుకోక పోగా సోమవారం ఉదయం కల్లు తాగిన వారికి సైతం ఎక్కువ మత్తు ఆవహించింది. వారి ప్రవర్తనలో మార్పుతో పాటు అచేతనంగా కల్లు దుకాణం సమీపంలోనే పడి పోవడంతో స్థానికులు వారిని నార్సింగి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన లో 50 సంవత్సరాలు దాటిన వృద్ధులంతా అస్వస్థతకు గురైనారు. భీంరావుపల్లి గ్రామంలో రెడ్డిపల్లి నుంచి కల్లును విక్రయిస్తుండగా కల్తీ కల్లు సేవించడంతోనే గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని ప్రజలు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ యశ్వంత్ గ్రామానికి చేరుకుని బాధితుల వివరాలను సేకరించారు. అనంతరం కల్లు శ్యాంపిల్స్ను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వారసదాసు
- లక్కింశెట్టి శ్రీనివాసరావు, ‘సాక్షి’, కాకినాడ భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఎన్నో కళలు కాలగర్భంలో కలిసిపోతున్న నేటి తరుణంలో సంక్రాంతి వేళ చాలా ఊళ్లలో హరిదాసులే కానరావటం లేదు. అయితే ప్రస్తుత ఆధునిక పోకడల నడుమ ఒక యువకుడు తన కుటుంబ సంప్రదాయాన్ని గౌరవిస్తూ హరిదాసుగా గ్రామాల్లో హరినామ సంకీర్తన చేస్తున్నాడు. తాత, తండ్రుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగించాలని తపిస్తున్నాడు. పదవ తరగతి పూర్తయిన వెంటనే ఇంటర్లో చేరి, తర్వాత ఇంజనీరో, డాక్టరో కావాలనుకుంటున్న నేటి తరంలో ఇలా అంతరించిపోతున్న కళ కు ప్రాణం పోసి ఆ కళనే వృత్తిగా స్వీకరించిన ఆ యువకుడి పేరు దుర్గాప్రసాద్. రాయవరం మండలం పసలపూడికి చెందిన కంబం దుర్గాప్రసాద్ కుటుంబీకులు వంశపారంపర్యంగా హరిదాసు వృత్తిలో ఉన్నారు. తండ్రి నూకరాజు తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట ప్రాంతంలో హరిదాసుగా వెళుతుండగా, తాత గనిరాజు గత నలభై ఏళ్లుగా అదే జిల్లాలోని మండల కేంద్రమైన కె. గంగవరం, దంగేరు ప్రాంతంలో సంక్రాంతి నెలలో హరిదాసుగా పాటలు పాడుతూ వచ్చారు. సంక్రాంతి నెలరోజుల పాటు హరిదాసులుగా వచ్చే ఈ కుటుంబ సభ్యులు మిగిలిన రోజుల్లో వ్యవసాయపనులు చేసుకుంటుంటారు. గనిరాజుకు వృద్ధాప్యం రావటంతో కూతురు కొడుకైన దుర్గాప్రసాద్ ఈ వృత్తిని చేపట్టి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి నెల అంతా కె.గంగవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బయలు దేరి కె.గంగవరం, దంగేరు చుట్టు పక్కల పదహారు గ్రామాల్లో హరి కీర్తనలు పాడుతూ తిరుగుతుంటాడు. గ్రామస్తులు తమకు తోచిన కానుకలు, బియ్యం సమర్పిస్తుంటారు. ఇలా నెలలో ముప్పై రోజులు తిరిగిన అనంతరం సంక్రాంతి నాడు ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వారిచ్చే కానుకలను స్వీకరిస్తాడు. పదవ తరగతి పూర్తి చేసిన దుర్గాప్రసాద్ మూడేళ్లపాటు తన తండ్రి కూడా తిరుగుతూ హరినామ సంకీర్తనలు నేర్చుకున్నాడు. ఈ ఏడాది కె.గంగవరం, దంగేరు పరిసర గ్రామాల్లో హరిదాసుగా తన సంకీర్తనలు వినిపిస్తున్నాడు. 21 ఏళ్ల దుర్గాప్రసాద్కు భార్య సీత, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. తాతల నాటి నుంచి వస్తున్న ఈ వృత్తిని కొనసాగించాలనే ధ్యేయంతోనే హరినామ సంకీర్తనలు నేర్చుకుని హరిదాసుగా మారానని దుర్గాప్రసాద్ చెప్పాడు. -
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో కోత
* తగ్గనున్న 20 గ్రాములు * ఈనెల 18 నుంచి అమలు సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డూ రూ. 10కి విక్రయిస్తుండగా, ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను ఇస్తామని ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి దేవస్థానానికి రూ. 11.40 ఖర్చు అవుతుండగా భక్తులకు రూ.10కే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డూపైన రూపాయి 40 పైసలను దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే రూ.10లకు సరిపోతుంది. దీనివల్ల దేవస్థానానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. సాధారణ రోజుల్లో రోజుకు 45 వేల నుంచి 50 వేల లడ్డూలు, శుక్ర, ఆదివారాల్లో 60 వేల నుంచి 75 వేల లడ్డూలు దేవస్థానం విక్రయిస్తోంది. భవానీ దీక్షలు, దసరా ఉత్సవాల్లో రోజుకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయింది. ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్ అనూరాధకు తెలియపరచడంతో లడ్డూ సైజు తగ్గించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లడ్డూ నాణ్యత పెంచాలి ఈవో నర్సింగరావు వచ్చిన తరువాత పులిహోర నాణ్యత కొంతమేర మెరుగుపడింది. ఆయన లడ్డూపై దృష్టి సారించి నాణ్యత పెంచాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం పాలకమండలి అధికారంలో ఉన్న రోజుల్లో లడ్డూ ప్రసాదాలపై పూర్తిస్థాయి దృష్టిసారించి వాటి నాణ్యతను పెంచారు. ఆ తరువాత కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో నాణ్యత తగ్గిపోయింది. ఇప్పుడు సైజు కూడా తగ్గిస్తుండటంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. నష్టం వస్తోందని సైజు తగ్గించినా కనీసం నాణ్యతైనా పెంచాలని కోరుతున్నారు. -
దుర్గమ్మ చీరలకు దుర్గతి
ఆరు నెలలుగా మూటలు కట్టి పడేశారు నాణ్యత కోల్పోతున్న వైనం సమస్య పరిష్కారంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలం సాక్షి ప్రతినిధి, విజయవాడ : దేవాదాయ శాఖ అధికారుల తీరు దుర్గమ్మ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన పట్టు చీరలు పనికిరాకుండా పోతున్నాయి. వాటిని అమ్మవారికి అలంకరించి తిరిగి భక్తులకు అమ్మడం ద్వారా ఆలయ ఆదాయాన్ని అధికారులు పెంచాల్సి ఉంది. అధికారుల చేతకానితనం వల్ల చీరలు గుట్టలుగా పేరుకుపోతూ పాడైపోతున్నాయి. ‘బోస్ అండ్ బోస్’కే మళ్లీ టెండరు.. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఏటా వేలం లేదా టెండర్ల ద్వారా (ఏది ఎక్కువైతే అది) విక్రయించడం ఆనవాయితీ. గత ఏడాది నగరానికి చెందిన బోస్ అండ్ బోస్ సంస్థ రూ.1.80 కోట్లకు టెండరు దక్కించుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల భక్తుల సంఖ్య తగ్గడంతో వారిచ్చే చీరల సంఖ్య కూడా తగ్గిందని, తనకు వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు ఈ ఏడాదీ తనకే టెండరు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది వేసిన టెండరుకు 25 శాతం ధర పెంచి టెండరు బోస్ అండ్ బోస్ వారు తీసుకుంటే అభ్యంతరం పెట్టొద్దని దేవాదాయ శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ సంస్థ మాత్రం అందుకు అంగీకరించలేదు. కోర్టులో వేసిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. 2013, నవంబర్ 28న దేవస్థానం అమ్మవారి చీరల కొనుగోలుకు వేలం, టెండర్లు ఆహ్వానించింది. వేలంపాటను రూ.2.25 కోట్ల నుంచి ప్రారంభించింది. అంత మొత్తంపై పాట పాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాటను రూ.1.81 కోట్ల నుంచి పెంచుతూ రూ.1.83 కోట్లకు మాత్రమే వెళ్లింది. సీల్డ్ టెండర్లు కూడా ఆహ్వానించడంతో వాటిని పరిశీలించారు. అందులో రూ.1.84 కోట్లకు బోస్ అండ్ బోస్ వారు టెండర్లు వేశారు. వారి టెండరును దేవస్థానం ఖరారు చేసింది. భక్తుడి ఫిర్యాదుతో అవినీతి వెలుగులోకి.. చీరల టెండర్లలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరపాలంటూ ఓ భక్తుడు దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ విచారణ చేపట్టాలని రీజినల్ జాయింట్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్జేసీ రామచంద్రమోహన్ విచారణ జరిపి టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. మార్చిలో చీరల వేలానికి సంబంధించిన ఫైల్ను తీసుకెళ్లారు. టెండరు రద్దు చేయాలని ఆదేశించారు. తాను చెల్లించిన 50 శాతం నిధులు దేవస్థానం వద్దే ఉన్నాయని, ఆ డబ్బుతో మరో రెండు నెలల పాటు తాము చీరలు తీసుకునేందుకు అర్హులమంటూ బోస్ అండ్ బోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై కమిషనర్ను సంప్రదించాలని కోర్టు ఆ సంస్థను ఆదేశిం చింది. ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న చీరలు అమ్ముకునే వరకు కౌంటర్ను ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2014 ఏప్రిల్ నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను దేవస్థానం వారే భద్రపరచాల్సి ఉంది. మూటలు కట్టి పడేశారు... ఆరు నెలలుగా దేవస్థానం వారు అమ్మవారి చీరలను ఎక్కడ భద్రపరచాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. పాతపడిన చిన్న గదుల్లో మూటలు కట్టి పడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చీరల మడతల్లో రంథ్రాలు పడి పనికిరాకుండా పోయే అవకాశం ఉందని ఆలయంలోనే అధికారులే చెబుతున్నారు. నెలకు అమ్మవారికి కనీసంగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల విలువైన చీరలు వస్తుంటాయి. అంటే సుమారు రూ.కోటి విలువైన చీరలు పనికి రాకుండాపోతున్నాయి. కొందరు సిబ్బంది చీరలు తస్కరించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అమ్మవారి చీరలు భక్తులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
గూడూరు సొసైటీలో భారీ చోరీ
రూ.4.60 లక్షలు అపహరణ గూడూరు : స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గురువారం రాత్రి దొంగలు పడి రూ. 4.60 లక్షల నగదు చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. సహకార సం ఘంలో కొన్ని రోజులుగా ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గూడూరు కేడీసీసీ బ్రాంచ్ పరిధిలోని 10 సహకార సంఘాలకు సంబంధించి ఎరువుల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతాయి. సంఘం కార్యదర్శి చక్రవర్తి, గుమాస్తా వెంకన్న ఎరువుల విక్రయాలను నిర్వహిస్తుంటారు. రోజూ మధ్యాహ్నం రెండు గంటలలోపు వచ్చిన సొమ్మును కేడీసీసీ స్థానిక బ్రాంచ్లో జమ చేస్తుంటారు. గురువారం మధ్యాహ్నం వరకు 50 మందికి పైగా రైతులకు ఎరువులను అమ్మారు. వాటిని అమ్మగా వచ్చిన నగదు ను డ్రాయర్ సొరుగులో ఉంచి తాళం వేశారు. సొసైటీకి రా త్రి ఏడుగంటల సమయంలో తాళం వేసి వారిద్దరూ వెళ్లి పోయారు. శుక్రవారం తెల్లవారుజామున సొసైటీ ప్రాంగణా న్ని శుభ్రపరిచేందుకు స్వీపర్ వచ్చింది. భవనం ప్రధాన ద్వారానికి వేసిన తాళం కిందపడి ఉండటాన్ని గమనించింది. గడ్డపలుగుతో తాళం పగులగొట్టినట్లు చుట్టుపక్కల వారికి తెలియజేసి.. గుమాస్తాకు కబురు చేసింది. దీనిపై కార్యదర్శి, గుమస్తా ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ బి.వి.ఎస్.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో వచ్చి భవనం లోపల పరిశీలించారు. దుండగులు పలుగుతో తలుపు తాళాన్ని పగులగొట్టి లోనికి చొరబడి, దానితోనే డ్రాయర్ సొరుగును పగులగొట్టి లోపల ఉన్న రూ.4.60 లక్షల నగదును అపహరించుకుపోయినట్లు గుర్తించా రు. పలుగు పాత భవనం సన్షైడ్పై ఉండటాన్ని చూశా రు. క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ పలు గు సొసైటీ పక్కనే ఉన్న రైతుకు చెందినదిగా పోలీసుల విచారణలో తెలిసింది. బందరు డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సొసైటీలో ఎరువుల స్టాకు వివరాలను రూరల్ సీఐ మూర్తి పరిశీలించారు. ప్రత్యేక బృం దాల ద్వారా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కేడీసీసీ గూడూరు బ్రాంచ్ మేనేజర్ శ్యాంప్రసాద్, సంఘం అధ్యక్షుడు నాగిశెట్టి జోగేశ్వరరావు, మల్లవోలు, జక్కంచర్ల, కంకటావ, రాయవరం సంఘాల అధ్యక్షులు చీడేపూడి ఏడుకొండలు, మత్తి సుబ్రహ్మణ్యం, తోట పోతురాజు, కోళ్ల బాలకృష్ణ, ఆయా సం ఘాల కార్యదర్శులు, గ్రామసర్పంచ్ పెదపూడి ఈశ్వరరావు, సంఘ డెరైక్టర్లు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తాం దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని రూరల్ సీఐ మూర్తి తెలిపారు. విచారణ వేగవంతం చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని పేర్కొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. హుండీల్లోని కానుకలను భవానీదీక్ష మండపంలో గురువారం లెక్కించారు. రూ.1,86,85,910 నగదు, 315 గ్రాముల బంగారం, 6.392 కిలోల వెండి లభించాయని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. 14 హుండీల ద్వారా 18 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. రెండో దఫా హుండీల కానుకల లెక్కింపు 11వ తేదీన, మూడో విడత 14వ తేదీన జరుగుతుందని వివరించారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో 29 రోజులు 8 హుండీల ద్వారా మొదటి దఫా రూ.1.37 కోట్లు, మొత్తం రూ. 3.49 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే 11 రోజులు తక్కువ ఉన్నప్పటి కీ రూ.49 లక్షల మేర ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా కూడా గత ఏడాది ఆదాయాన్ని మించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. -
వైఎస్సాఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో దుర్గా పూజలు
-
దివ్య చైతన్య దీపిక
జగన్మాత జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో నవరాత్రులూ ఆరాధించి విజయదశమి పర్వదినాన విశ్వజనని దివ్యరూపాన్ని విశేషంగా కొలుస్తారు. వసంతరుతువు, శరదృతువు ప్రాణులకు క్లిష్టకాలాలు. జనులకు అనారోగ్యం కలిగించే ఈ మాసాలలో చెడును ఎదుర్కొని, శుభాలను ప్రసాదించమని కాంక్షిస్తూ జగద్రక్షకి అయిన దుర్గాదేవిని పూజించాలని శాస్త్రోక్తం. మానవుడికి కలిగే ప్రమాదాలను అంతర్ముఖ తత్త్వంతో దర్శించిన వ్యాసాది ఋషిపుంగవులు వాటి నిర్మూలన కోసం, నివారణ కోసం దివ్య చైతన్య దీపిక అయిన జగన్మాత ఆరాధనే అనివార్యం, ఆనంద ప్రదాయకం అని ప్రబోధించారు. జగములనేలే జగన్మాత సత్యానికీ, ధర్మానికీ, సామరస్యానికీ విజయానికీ అధినేత్రి. వివేకం, విజ్ఞానం, శాస్త్రం, శక్తి, సంగీతం, సాహిత్యం అమ్మ విభూతిలోని భాగాలే. జీవితంలో ఒడిదుడుకులు, స్తబ్ధత ఏర్పరిచే పరిస్థితులు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తే భగవంతునిపై భారం వేసి కాలానుగుణంగా జీవిత యజ్ఞం కొనసాగించాలనే ఆంతర్యం, విశ్వకళ్యాణం కోసం, ధర్మపరిరక్షణ కోసం అలౌకిక భావనాతుల్య అవతారాలలో జగన్మాత ఆవిర్భావం జరిగింది. దసరా అంటే పది రోజులని అర్థం. కనుక అమ్మవారిని నవరాత్రులూ విశేషంగా ఆరాధించి జీవన దృక్పథాన్ని విజయ పథంలో నడిపించమనీ వేడుకోవాలి. సంప్రదాయం, సంస్కృతి కలగలసిన విజయదశమి మానవ జీవితాల్లో ఆనంద అనుభవాలను అందిస్తూ పావనం చేస్తుంది. -ఇట్టేడు అర్కనందనాదేవి -
దుర్గమ్మ తొలి దర్శనం ఐఏఎస్, ఐపీఎస్లకే
విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారి తొలి దర్శనం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే చేసుకున్నారు. దుర్గగుడి అధికారులు మంగళవారం రాత్రి 1.40 నిమిషాలకు సరస్వతీదేవిగా కొలువైన అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావుతో పాటుగా జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, నగరంలో సీపీలుగా పని చేసి వెళ్లిన మధుసూదనరెడ్డి, బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ మురళి, మున్సిపల్ కమిషనర్ హరికృష్ణ, సబ్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు లింగంభొట్ల బదరీనాథ్బాబు అమ్మవారికి అద్వితీయంగా అలంకారం చేశారు. ప్రసన్నవదనంతో పద్మాసనంలో సరస్వతీదేవిగా కొలువుతీరిన అమ్మవారిని తిలకించిన ప్రతి ఒక్కరూ పులకించిపోయారు. ‘ఐలాపురం’ను పక్కన పెట్టిన పోలీసు అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యను పోలీసు అధికారులు పక్కన పెట్టారు. పైన రాజగోపురం నుంచి తాను ఎమ్మెల్సీ అని పదేపదే చెబితేనే పోలీసు అధికారులకు లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లిన తరువాత కూడా తొలి దర్శనం ఐపీఎస్, ఐఏఎస్లకేనంటూ ఐలాపురం వెంకయ్య కుటుంబాన్ని కొద్ది సేపు పక్కన ఉంచారు. కలెక్టర్, ఇతర ఐపీఎస్ అధికారులు దర్శనం చేసుకుని వచ్చిన తరువాత ఐలాపురం వెంకయ్యను, ఆయన కుటుంబ సభ్యులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం బుధవారం ఉదయం దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పోలీసులు అడ్డుకోవడంతో పలువురు ఖంగుతిన్నారు. దర్శనం ప్రారంభమయ్యే ముందు స్థానిక సీఐ గీతారామకృష్ణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను తప్ప ఎవరినీ లోపలకు అనుమతించవద్దని అక్కడ విధులు నిర్వహిస్తున్న మరో సీఐ పైడపునాయుడుకు సూచించారు. దీంతో ఆలయానికి వచ్చిన చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబను, ఐలాపురం వెంకయ్యను పైడపునాయుడు అడ్డుకున్నారు. సిబ్బంది గట్టిగా చెప్పడంతో భ్రమరాంబను దర్శనానికి అనుమతించారు. వారితో పాటుగా ఆలయంలోపల విధులకు హాజరవ్వాల్సిన సిబ్బందిని, అర్చకులను సైతం సీఐ అడ్డుకోవడంతో వారంతా గొడవకు దిగడంతో లోపలికి పంపించారు. కేవలం పోలీసు అధికారులను, వారి కుటుంబ సభ్యులను మాత్రమే పంపటానికి విధులు కేటాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శించారు. స్థానిక సీఐ, ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న సీఐలకు అవగాహన లేకపోవడం, ఇష్టవచ్చినట్లుగా తాళాలు వేయడంతో భక్తులు, అధికారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. -
నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడిలా..!
-
ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం
విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఓ సీఐ అపచారానికి పాల్పడ్డాడు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న సీఐ వర ప్రసాద్ సెల్ఫోన్లో బూతు చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిపోయాడు. ఓవైపు భక్తులు క్యూ లైన్లలోఅమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తుంటే...మరోవైపు సీఐ మాత్రం విధులు పక్కనపెట్టి దర్జాగా కుర్చీలో కూర్చొని బూతు పురాణాన్ని వీక్షించటం గమనార్హం. పక్క జిల్లా నుంచి డిప్యూటేషన్ మీద దేవీ నవరాత్రులు సందర్భంగా బందోబస్తు నిమిత్తం అతడు దుర్గగుడికి వచ్చాడు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన సీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఐపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా ఈ ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నారు. సీఐపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై విజయవాడ సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. -
జై భవానీ.. జైజై భవానీ
ఆదిలాబాద్ కల్చరల్ : దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి విగ్రహాలను మండపాల్లో నెలకొల్పి భక్తులు తొమ్మిది రోజుల పాటు శక్తిశ్రద్ధలతో పూజలందించనున్నారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపం (అవతారం)లో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముస్తాబైన ఆలయాలు.. మండపాలు.. దుర్గానవరాత్రోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో జిల్లా కేంద్రంలోని పలు వాడల్లో దేవీ ఆలయాలు ముస్తాబయ్యాయి. రేణుకామాత, దుర్గామాత, కాళికామాత, కన్యకా పరమేశ్వరీదేవీ తదితర ఆలయాలు ముస్తాబయ్యాయి. వాడవాడలా దుర్గాదేవీ ప్రతిమలను ప్రతిష్టించేందుకు వివిధ సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మండపాలు, ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్లు రూపొందించారు. అమ్మవారి ప్రతిమలను మండపాల్లో నెలకొల్పారు. ప్రత్యేక పూజలు.. అఖండ దీపారాధన, కుంకుమపూజ, చండీహోమం తదితర పూజలు నవహ్నిక దుర్గోత్సవాల ప్రత్యేకం. ఈ సారి దుర్గామాత ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు మాత్రమే పూజలందుకోనున్నారు. నవరాత్రుల్లో నవమి ప్రాంతంలో దశమి రావడంతో ఉత్సవాలను నవహ్నిక పురస్కార దుర్గోత్సవాలుగా జరుపుకోనున్నారు. తొమ్మిది రూపాల్లో అమ్మవారు.. బాలాత్రిపుర సుందరీ.. అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమిస్తూ భక్తులకు అభయ హస్తమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవీ మొదటిది. బాలదేవీ మహిమాన్వితమైంది. శ్రీ బాలమంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది. అందుకే ముందుగా ఈ దేవీని పూజిస్తేనే మహాత్రిపుర సుందరిదేవీ అనుగ్రహాన్ని పొందగలం. గాయత్రీ.. గాయత్రీమాత సకల మంత్రాలకు మూలమైన శక్తిగా.. వేద మాతగా ప్రసిద్ధి పొందింది. గాయత్రి మంత్రం ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వెయ్యి సార్లు ధ్యానిస్తే గాయత్రీదేవీ అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు. గాయత్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సర్వజీవనాధారం.. అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణే. నిత్యాన్నదానేశ్వరీగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా జీవకోటి నశించకుండా కాపాడుతుంది. దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలి తీరుస్తుంది. అది దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కార్యం. అమ్మవారిని కొలిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని అందరి నమ్మకం. మహాలక్ష్మీ.. మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవీ. ప్రతీఒక్కరి జీవితం లక్ష్మీ కటాక్షంపైనే ఆధారపడి ఉంటుంది. ధనం లేకపోతే బతుకు ఎంత దుర్భరమో చెప్పనక్కర్లేదు. అందుకే అంతా లక్ష్మీ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రెండు చేతుల్లో కమలాలను ధరించి, వరదాభయహస్తాలను ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసనాసీనురాలిగా మహాలక్ష్మీదేవీ దర్శనమిస్తుంది. సరస్వతీ.. చదువులతల్లి సరస్వతీదేవీ. ఈ తల్లి సకల విద్యలను ప్రసాదించి, జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున విద్యార్థులు సరస్వతీదేవీని భక్తితో కొలిస్తే అన్నింటా విజయం లభిస్తుందని ఒక నమ్మకం. సరస్వతీదేవీ ధవళ వస్త్రాన్ని ధరిస్తుంది. తెల్లని హంస అమ్మవారి వాహనం. చేతిలో వీణను ధరిస్తుంది. అందుకే ఆ తల్లిని వీణాపాణిగా కొలుస్తారు. లలితాత్రిపురసుందరీ.. త్రిపుర త్రయంలో రెండో శక్తి లలితాదేవీ. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ అని పిలుస్తారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర ఆదిదేవతగా భక్తులు, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లలితాదేవీ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకు గడను ధరించి, శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిని పూజిస్తే మనిషిలో సోమరితనం పోతుందని నమ్మకం. దుర్గా.. దుర్గతుల్ని నాశనం చేసే శక్తిస్వరూపిణి దుర్గాదేవీ. దుర్గాదేవీ అష్టమితిథి రోజు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది. అందుకే లోకంలో ‘దుర్గా’ అని కీర్తించబడింది. ఆ అష్టమి దుర్గాష్టమిగా ప్రసిద్ధి పొందింది. దుర్గాదేవీ ఆది ప్రకృతి. పంచమహాస్వరూపాల్లో మొదటిది. అమ్మవారి శక్తి అనంతమైనది. దుర్గామాతా ఎప్పుడూ ఉగ్రస్వరూపంతోనే కనిపిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శార్దూలాన్ని (పులి) అధిరోహించి త్రిశూలాన్ని ధరించి శక్తిస్వరూపిణిగా, శ్రీ దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసురమర్దినీ.. మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవీ అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపి లోకాలకు మేలు చేస్తుంది. మహిషాసురుడిని చంపిన అనంతరం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిశారు. కాలక్రమంలో కనకదుర్గా కీర్తి పొందింది. సింహవాహనం మీద ఒకచేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ.. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవీగా అలంకరిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీలలితాదేవే సాక్షాత్తూ శ్రీరాజరాజేశ్వరీదేవీ. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకు) చేతిలో ధరించి ఒకచేత అభయముద్రను చూపిస్తూ దర్శనమిస్తుంది. -
నవరాత్రుల్లో...వెలుగుపూల కోలాటం
దేశమంతా ఎదురుచూసే నవరాత్రి సంబరాలు నేటి నుంచే మొదలు. ఈ తొమ్మిది రాత్రులను అత్యంత వైభవంగా మార్చేసి, శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతను నృత్యోల్లాసాలతో కొలవడానికి స్త్రీలతో పాటూ పురుషులూ పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా గర్బా, దాండియా నృత్యాలుపత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే వీటికి మరింత వన్నెలద్దుతున్నవి వస్త్రాలంకరణలే! గుజరాతీల సంప్రదాయ వైభవం తెలుగురాష్ట్రాలలోనూ సందడి చేయడంతో ఇక్కడా గర్బా, దాండియా నృత్యాల ఆనందహేల ప్రతి మదిని తట్టి లేపుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మరింత దేదీప్యమానంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయే స్త్రీ, పురుషులు ఈ తొమ్మిది రాత్రులకు కొత్త భాష్యం చెప్పనున్నారు. దాండియా, గ ర్బా నృత్యాలలో సందడి చేయడానికి మీ వేషధారణను సరికొత్తగా మార్చుకునే సమయం ఇదే! గర్బా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ‘గర్భ’, ‘దీపం’ అనే సంస్కృత పదాల నుంచి ఈ పేరు పుట్టింది. గర్బా పాటలలో శ్రీకృష్ణుడి లీలను కీర్తిస్తూ, తొమ్మిది మంది దేవతామూర్తులను కొలిచే ప్రక్రియ కనపడుతుంది. ఈ నృత్యం మొట్టమొదట శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రాణీ రుక్మిణీ దేవి ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భం గా చేసిందని అంటారు. అతివలు వలయాకా రంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ తిరుగు తారు. దీనిని దేవతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. కోలాటం కర్రలతో స్త్రీ, పురుషులిరువురూ ఆడేది దాండియా! మహిళల అలంకరణ గర్బా, దాండియా నృత్యానికి మహిళలు రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్ను ధరిస్తారు. దీంట్లో ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ.. వంటి కాంతిమంతమైన రంగు దుస్తులను ఎంచుకుంటారు. పూసలు, పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలను ఉపయోగిస్తూ చేసిన ఎంబ్రాయిడరీ అంచులతో ఈ దుస్తులను ఆక ర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇది పూర్తిగా గుజరాతీ సంప్రదాయ కట్టు. దీంతో పాటూ సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, జుంకాలు, రెండు-మూడు హారాలు, నడుము పట్టీలు, కాళ్లకు గజ్జెలు.. మేని అలంకరణకు ఉపయోగిస్తారు. నవరాత్రులలో మీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వీటన్నింటి ఎంపిక అవసరం. ప్రయోగం ఎంత సంప్రదాయ దుస్తులైనా మీదైన ప్రత్యేకత మీరు ధరించే దుస్తుల్లో కనబరచాలి. ఇందుకు ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ అస్మితా మార్వా, అనితా అరోరా, రాహుల్ మిశ్రా.. వంటి వారి డిజైన్స్తో మీ దుస్తుల్లోనూ వైవిధ్యం తీసుకురావచ్చు. కాటన్ ప్రధానం దాండియా ఆటలో చెమట అధికంగా పడుతుంది. ఇలాంటప్పుడు చెమటను పీల్చుకునే దుస్తులు సరైన ఎంపిక. మగవారి ముస్తాబు జీన్స్, టీ షర్ట్స్తో విసుగెత్తిపోయిన వారు దాండియా రాత్రులను మరచిపోలేరు. దీనికి కారణం మగవారి వేషధారణ ఎంతో వైవిధ్యంగా, సంప్రదాయబద్ధంగా ఉండటమే! దాండియా ఆటలో మగవారు ‘కెడియు’ అనే సంప్రదాయ దుస్తులను దరిస్తారు. చిన్న కుర్తా, కుచ్చుల బాటమ్, తలపై పెట్టుకునే టోపీ (టర్బన్)తో ప్రత్యేకంగా కనిపిస్తారు. బాందీనీ ప్రింట్ కుర్తాకి అద్దాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. షేర్వాణీ ‘కెడియా’ ధరించ డానికి ఇబ్బంది పడేవారు వదులుగా ఉండే పైజమా, లాల్చీ/ ధోతీ, షేర్వాణీ ధరించవచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ దాండియాను శోభాయమానం చేస్తుంది. రాజ్పుత్ కుర్తా కూడా ఈ వేడుకలో వైవిధ్యం కనబరచడంతో పాటు సంప్రదాయపు కళను ఉట్టిపడేలా చేస్తుంది. మేకప్ ఎంత అలంకరణ అయినా బాగుంటుందని అతిగా మేకప్ చేసుకోకూడదు. దాండియా నృత్యంలో పట్టే చెమట వల్ల మేకప్ ముఖమంతా అలుక్కుపోయే ఆస్కారమూ ఉంటుంది. అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకని పెద్దగా మేకప్ లేకుండా కళ్లకు మస్కారా, ఐ షాడో తీర్చిదిద్దుకుంటే చాలు. నుదుటన ఆకట్టుకునే బిందీ, చుబుకం పైన చిన్న కాటుక చుక్కలే వీటికి సింగారం. బరువు తగ్గచ్చు క్రమం తప్పకుండా చేసే యోగా, జిమ్,వ్యాయామాలు విసుగు పుట్టిస్తాయి. అదే దాండియా మనోల్లాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రు లకు ముందు నెల రోజుల ముందుగా దాండియా సాధన చేయడం వల్ల దాదాపు 4 కేజీల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. గర్బా డ్యాన్స్ వల్ల శరీర మంతా కదులుతుంది. భావోద్వేగా లను అదుపు చేసుకోగలుగుతాం. గంట సేపు చేసే ఈ నృత్యం వల్ల సుమారు 500-700 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. నడుము పై భాగం, పిరుదులు, పాదాలకు మంచి వ్యాయామం అవుతుంది. మనసు, శరీరం ఉత్తేజం పొందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయగీతాల మధురిమలను దాండియా నృత్యం గర్తుచేస్తుంటుంది. ఓ వైపు నృత్యం, సంగీతంతో ఆధ్యాత్మికత ఊపిరిపోసుకుంటుంది. మరోవైపు ఎటు చూసినా ఆనందం తాండవం చేస్తుంది. ఇలాంటి అపురూప సమయాలను పూర్తిగా ఆస్వాదించడానికీ.. శరీరానికి, మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించడానికి ఇప్పుడే సిద్ధం కండి. దాండియా అడుగులు వేయడానికి కోలాటం కర్రలు చేత పట్టండి. సంగీతానికి అనుగుణంగా పాదాలు కదపండి. లయబద్ధమైన నృత్యంలో దుస్తుల మెరుపులలో మైమరచిపోండి. - నిర్మలారెడ్డి -
దసరా సందడి
శరన్నవరాత్రులకు నగరం అన్నివిధాలుగా సిద్ధమవుతోంది. స్థానికులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దుర్గామాత పూజకోసం పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. చివరిరోజు రోజు జరిగే రావణ దహనం కోసం దుకాణదారులు ప్రతిమల తయారీలో తలమునకలయ్యారు. సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అప్పుడే దసరా పండుగ సందడి నెలకొంది. ఎక్కడచూసినా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో స్థానికులు నిమగ్నమయ్యారు. నవరాత్రుల సమయంలో గర్భా వేడుకల కోసం కొన్ని చోట్ల, రామ్లీలా ప్రదర్శనల కోసం అనేకచోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దుర్గామాత పూజ కోసం పందిళ్లు రూపుదిద్దుకుంటన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే విజయదశమి నాటి సాయంత్రం రావణ దహనానికి జరిగే ఏర్పాట్లు మరొక ఎత్తు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే రావణ కుంభకర్ణ మేఘనాధుల దహనంతో పది రోజుల పండుగ సంబరాలు ముగుస్తాయి. ఈ వేడుక కోసం రావణ ప్రతిమల తయారీ ఠాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్కు దగ్గరలోనున్న తీతార్పుర్లో జోరుగా జరుగుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా రకరకాల రంగుల్లో, రకరకాల పరిమాణాల్లో తయారవుతున్న రావణ ప్రతిమలు కనిపిస్తున్నాయి. దసరా సమయంలో రావణ దహనం కోసం ప్రతిమలను తయా రు చేయడంలో తీతార్పుర్ గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు ఎంతో అనుభవముంది. ప్రతి సంవత్సరం దసరాకు రెండు నెలల ముందు నుంచి రావణ ప్రతిమల తయారీని ప్రారంభిస్తామని వారు చెప్పారు. తీతార్పుర్ నుంచి రావణ ప్రతిమలు ఇంగ్లండ్, అమెరికా, కెనడా తదితర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఐదు అడుగుల నుంచి మొదలుకుని 70 అడుగలు ఎత్తు కలిగిన రావణ ప్రతిమలను ఇక్కడ రూపొందిస్తున్నారు. ప్రతిమ ఎత్తును బట్టి ధర ఉంటుంది. అడుగుకు 300 రూపాయల చొప్పున ప్రతిమలను తయారుచేస్తున్నట్లు దుకాణదారులు చెప్పారు. 20 అడుగుల రావణ ప్రతిమకు రూ. ఆరు వేలు, 30 అడుగులైతే రూ. తొమ్మిది వేలు తీసుకుంటున్నట్లు దుకాణాదారులు తెలిపారు. డిజైన్ను బట్టి కూడా వీటిధర మారుతుందని వార ంటున్నారు. కొందరు కస్టమర్ల డిమాండ్ మేరకు ఒకవేళ వర్షం కురిసినా తడవకుండా ఉండడం కోసం వాటర్ప్రూఫ్ ప్రతమిలనుతయారుచేసుత్నట్లు వారు చెప్పారు.ఇంకా ఇవేకాకుండా సిక్స్ ప్యాక్ ప్రతిమలను తయారు చేయాలంటూ కొందరు కోరుతున్నారు. రావణుడికి క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైలు మీసాలు కావాలని అడిగే కస్టమర్లు కూడా ఉన్నారని ప్రతిమల తయారీదారులు చెప్పారు. -
దేవీశరన్నవరాత్రులు సిద్ధమవుతున్న నగరం
వరప్రదాయని దుర్గామాతను తనివితీరా కొలుచుకునేందుకు నగరవాసులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగాల్నుంచి కళాకారులను రప్పించుకుని వారితో అమ్మవారి ప్రతిమలను చేయిస్తున్నారు. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమ ఏర్పాటు కానుంది. సాక్షి, న్యూఢిల్లీ:దేవీశరన్నవరాత్రులకు నగరవాసులతోపాటు ఇక్కడ నివసిస్తున్న బెంగాలీలుఅన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో దుర్గాపూజ వేడుకలు జరిగినప్పటికి మినీ బెంగాల్గా పేర్కొనే చిత్తరంజన్ ఉద్యానవనంలో ఈ వేడుక వైభవం చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ఇక్కడి పందిళ్లలో దుర్గా మాత ప్రతిమలను రూపొందిస్తున్నారు. పూజా పందిళ్ల ఏర్పాటు పనులు రేయింబవళ్లు జరుగుతున్నాయి. కళాకారులు రోజుకు దాదాపు 15 గంటలపాటుశ్రమిస్తూ మహిషాసుర మర్థిని ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విభిన్న రూపాలలో, విభిన్న ఇతివృత్తాలతో దుర్గాపూజ పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. చిత్తరంజన్ పార్క్ మేళా మైదానంలో దుర్గామాత రాజస్థానీ మహిళా ఆకృతిని దాలుస్తుండగా, సంగమ్ విహార్లో అమ్మవారు ఆధునిక మహిళ రూపంలో దర్శనమివ్వనుంది. చిత్తరంజన్పార్కులోని కాళీ మందిర్ ప్రాంతంలో బెంగాల్ నుంచి వచ్చిన 11 మంది కళాకారులు మూడు నెలలుగా దుర్గామాతప్రతిమలను రూపొందిస్తున్నారు. మొదట వెదురు కర్రలతో ఆకారాన్ని రూపొందించి, దానిపై గడ్డిని తాళ్లతో కట్టి ఆపై మట్టితో శరీరాకృతిని ఇస్తామని ప్రతిమలను తయారుచేస్తున్న గోవింద్నాథ్ చెప్పారు. ప్రతిమ తయారీ కోసం బంకమట్టిని బెంగాల్ నుంచి తీసుకువస్తామని ఆయన తెలిపారు.ఈ మట్టిని యమునానది తీరంనుంచి తెచ్చేమట్టితో కలిపి ప్రతిమల తయారీకి వినియోగిస్తామన్నారు. ప్రతిమ గట్టిగా ఉండడం కోసం మట్టిలో జనపనారను కలుపుతామన్నారు. ప్రతిమ ముఖాన్ని ముఖ్యంగా కన్నుతోపాటు ముక్కునుమరింత అందంగా తీర్చిదద్దడానికిఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. ప్రతిమ తయారీ పూర్తయ్యాక దానిని ఎండబెట్టి రంగులు వేస్తారు. సాధారణంగా ఐదడుగుల దుర్గా ప్రతిమ ఖరీదు రూ. 10 వేల రూపాయలు ఉంటుంది. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. కాగా చిత్తరంజన్ పార్కు దుర్గాపూజా సమితి 1976లో ఏర్పాటైంది. ఈ పార్కుకు సమీపంలో నివసిస్తున్న కొందరు స్థానికులు ఏర్పాటై దీనిని ప్రారంభించారు. కాలక్రమేణా ఈ సమితి నిర్వహించే పూజాదికాలకు రాజధానిలో అత్యంత ప్రాచుర్యం లభించింది. దీంతో లక్షలాది మంది దుర్గాదేవి భక్తులు మాత ప్రతిమను దర్శించుకునేందుకు, వీలైతే పూజలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమితికి పండుగ సమయంలో స్థానికులు భారీగా విరాళాలను అందజేస్తారు. 1993లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ పార్కులో దక్షిణేశ్వర్ సెట్టింగ్ను ఏర్పాటుచేశారు. అదే ఏడాది బెంగాలీయుడైన స్వామి వివేకానంద శతజయంతి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. 80 అడుగుల పొడవు కలిగిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత 1994లో బేలూర్ మఠ్ (శ్రీ రామకృష్ణ ఆలయం) సెట్టింగ్ను ఏర్పాటుచేశారు. -
కోల్కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత!
కోల్కతా: విజ్ఞానాన్ని, కళను మేళవిస్తూ 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ ద్వారా కాగితంతో రూపొందించిన వినూత్న దుర్గామాత విగ్రహం తొలిసారిగా కోల్కతాలో పూజలు అందుకోనుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని దుర్గామాత విగ్రహం తయారీకి కూడా వాడుకోవడం ఇదే తొలిసారని దక్షిణ కోల్కతాలోని జోధ్పూర్ పార్కు దుర్గా పూజా కమిటీ వెల్లడించింది. దుర్గ విగ్రహాలను మట్టితో చేతులతోనే రూపొందించడం సంప్రదాయం. అయితే తాము 8.5 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహాన్ని కంప్యూటర్లో డిజిటల్ డిజైన్లు, శిల్పకళ అప్లికేషన్ల సాయంతో 3డీ ప్రింటర్ ద్వారా సృష్టించామని ‘ప్రింట్జ్ వరల్డ్వైడ్’ డెరైక్టర్ ఉజ్జల్ మిత్ర తెలిపారు. ఇలాంటి 3డీ ప్రింటింగ్ విగ్రహం తయారీకి ప్రస్తుతం రూ.60 వేలు ఖర్చవుతుందన్నారు. -
భాస్కర్ వచ్చాకే ఫైళ్లు కదులుతున్నాయట
సాక్షి, ఏలూరు : జిల్లా కలెక్టర్గా ఎవరున్నా ఆయన వ్యవహార శైలి, పనితీరుకు అనుకూలంగా అధికారులు మసలు కోవడం సహజమే. కానీ.. ప్రస్తుత కలెక్టర్ కె.భాస్కర్ను జిల్లా అధికారులు ఆయన పనితీరును బహిరంగంగా ప్రశంసించడం విశేషం. తాజాగా కలెక్టర్ పనితీరును పొగుడుతూ పౌర సంబంధాల అధికారి ద్వారా శుక్రవారం ప్రకటన విడుదల చేయడం మరీ విశేషం. జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, వయోజన విద్యాశాఖ డెప్యూటీ డెరైక్టర్ దుర్గాభవాని, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కేఈ సాధన శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ భాస్కర్ మెరుపువేగంతో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, గురుపూజోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఫైళ్లు పరిష్కరించారని కొనియాడారు. జూలై 12న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అధికారుల పనితీరును స్వయంగా బేరీజు వేసుకునే స్థాయికి చేరారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ బంగ్లాలోకి అధికారులెవరూ రానవసరం లేదని, ఫైల్ పంపిస్తే వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్ చెబుతున్నారని తెలిపారు. తప్పు మీద తప్పులు చేసే అధికారులకు నోటీసులు ఇస్తూ, అధికారులకు హితబోధలు చేస్తున్నారన్నారు. గతంలో రెండు నెలలు పట్టేది గతంలో కలెక్టర్ నుంచి ఫైల్ రావడానికి నెలల తరబడి ఎదురుచూసేవాళ్లమని, భాస్కర్ వచ్చినప్పటి నుంచి 2 లేదా 5 నిమిషాల్లో ఫైల్పై చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ బంగ్లాలో సమర్పించిన ఫైల్స్ను కలెక్టర్ ఎప్పటికి చూస్తారో, అవి ఎప్పటికి కార్యాలయాలకు తిరిగి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని కొందరు అధికారులు అంటున్నారని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్పై తమ ‘భక్తి’ని చాటుకోవడానికి గత కలెక్టర్లు పనిచేయలేదని స్వయంగా అధికారులు బహిరంగంగా ప్రకటించడం, పత్రికా ప్రకటనలు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్ : వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదృశ్యమైన గురైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళ ....వాళ్ల మెడలో గొలుసు, చెవి పోగులు తీసుకుని పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దర్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం స్కూల్కు వెళుతున్న విద్యార్థులను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా తమ చిన్నారులు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
మీ నాన్న రమ్మంటున్నాడని కిడ్నాప్
హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సోమవారం ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన చిన్నారులు దుర్గా భవానీ (8), అరవింద్ (7)గా గుర్తించారు. ఈరోజు ఉదయం స్కూల్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి మీ నాన్న రమ్మంటున్నాడంటూ ఇద్దరు చిన్నారులను తనతో తీసుకు వెళ్లినట్లు సహ విద్యార్థులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా కిడ్నాప్ అయిన చిన్నారుల తల్లిదండ్రులు పొట్టకూటి కోసం రాజమండ్రి నుంచి నగరానికి వలస వచ్చినట్లు సమాచారం. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృషి, పట్టుదలతో ఉన్నత జీవితం మీ సొంతం
‘సాక్షి యువమైత్రి’లో డాక్టర్ దుర్గ తిరుపతి గాంధీరోడ్డు : నేటి పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల అలవరచుకుని చక్కటి నైపుణ్యాలతో లక్ష్యం వైపు పయనిస్తే ఉన్నత జీవితం సొంతమవుతుందని ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గ అన్నారు. ‘సాక్షి’, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో గొల్లపల్లె సిద్ధార్థ విద్యాసంస్థలో బుధవారం ‘సాక్షి యువమైత్రి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన దుర్గ ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆధునిక టెక్నాలజీ విస్తరిస్తున్న నేటి సమాజంలో రాణించాలంటే ప్రతి విద్యార్థికి విద్యతో పాటు నైపుణ్యం, కార్యదీక్ష అవసరమన్నారు. ప్రాథమిక విద్య పూర్తి కాగానే ఉన్నత విద్యారంభంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. ఆ దిశగా పయనం సాగించినప్పుడే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. విద్యార్థులు అలవరచుకోవాల్సిన లక్ష్యాల గురించి ఆమె క్షుణ్ణంగా వివరించారు. సాక్షి యువమైత్రికి విశేష సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రాజశేఖర్, డెరైక్టర్ నరసింహారెడ్డి, సాక్షి యువమైత్రి నిర్వాహకుడు జే.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. సాక్షి యువమైత్రి హర్షణీయం ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు వారి లక్ష్యాల సాధనకోసం అవగాహన సదస్సులను సాక్షి యాజమాన్యం నిర్వహించడం హర్షణీయం. ఇదే రీతిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి. - రవీంద్రనాథ్, ఏవో, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల లక్ష్య సాధనకు దోహదం ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లలో మంచి ఫలితాలు సాధిం చేందుకు సాక్షి యువమైత్రి దోహదం చేస్తుంది. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలి. - ఆమని, ఇంజనీరింగ్ విద్యార్థిని ఉజ్వల భవితకు సూచిక సాక్షి అందిస్తున్న ఎడ్యుకేషన్ విద్యార్థుల ఉజ్వల భవితకు చక్కటి సూచిక. ప్రత్యేక ఎడ్యుకేషన్తో పాటు యువమైత్రి పేరిట నిర్వహిస్తున్న సదస్సు విద్యార్థులను జాగృత పరుస్తుంది. - షర్మిల, విద్యార్థి ఆత్మవిశ్వాసం నింపింది ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూలంటే నాలో భయాందోళనలు ఉండేవి. సాక్షి నిర్వహించిన యువమైత్రి నాలో భయాన్ని పోగొట్టి ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఎన్నో సందేహాలు నివృత్తి అయ్యాయి. - దివ్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని మనోస్థైర్యాన్ని పెంచింది ఉన్నత విద్యను పూర్తి చేసిన ప్రతి విద్యార్థిలో సాక్షి యువమైత్రి సదస్సు మనో స్థైర్యాన్ని పెంచింది. వక్తల మాటలు మాలో నమ్మకాన్ని పెంచి ఉజ్వల భవిత సాధనకు మార్గదర్శకాలు సూచించాయి. - ఈశ్వర్ప్రసాద్, విద్యార్థి బంగారు భవితకు పునాది సాక్షి వారు నిర్వహించిన యువమైత్రి సదస్సు ప్రతి విద్యార్థి బం గారు భవితకు పునాది. వక్తలు అం దించిన సందేశాలు ఆత్మ బలాన్ని కలిగించాయి. ఇలాంటి సదస్సులు మరిన్ని చేపట్టాలి - గోపి, ఇంజనీరింగ్ విద్యార్థి -
ఆషాఢంలోనూ ‘కనక’వర్షమే
దుర్గమ్మకు రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం 20 రోజులకు రూ.1.40 కోట్లు సాక్షి, విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలోనూ భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. ఆలయానికి గత 20 రోజులకు గానూ రికార్డుస్థాయిలో రూ.1.40 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాలు, భవానీదీక్షల విరమణ మహోత్సవాలలో రూ.1.35 కోట్లు, ఇక సాధారణ రోజుల్లో రూ.1.20 కోట్లకు మించి ఎన్నడూ హుండీ ఆదాయం ఇంత భారీగా రాలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. కానుకల్లో విదేశీ కరెన్సీ కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులను సోమవారం భవానీ దీక్ష మండపంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 20 రోజులకు గానూ 14 హుండీల ద్వారా రూ.1,40,38,068 నగదు, 387 గ్రాముల బంగారం, 3.571 కిలోల వెండి లభించినట్లు అధికారులు వివరించారు. కేవలం అమ్మవారి ప్రధాన ఆలయ పరిసరాలలోని హుండీల్లో కానుకలను మాత్రమే లెక్కించారు. ఉపాలయాలు, శివాలయం, స్నానఘాట్ల హుండీల్లోని కానుకలను లెక్కించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే 20 రోజులకు గానూ రూ.రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన శాకంబరీ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు భారీగా కానుకలు, మొక్కులను సమర్పించుకున్నట్లు భావిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు బెజవాడ కనకదుర్గమ్మను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నాయకులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధర్బాబు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. -
దర్యాప్తు ముమ్మరం
కిడ్నీ రాకెట్పై కదలిక దుర్గాప్రసాద్ కూలర్ మెకానిక్గా గుర్తింపు నేడు అదుపులోకి తీసుకునే అవకాశం? సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్ ముఠాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆదివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విచారణ జరిపారు. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ ఎవరు.. ఎక్కడున్నాడు.. ఎందుకు తహశీల్దార్, సబ్ కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి కిడ్నీని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు.. అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ‘ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఉన్నతాధికారులు సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ ఎస్ఐ నరేష్ను రంగంలోకి దించారు. ‘సాక్షి’లో వార్తను చదివిన దుర్గాప్రసాద్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తులో పురోగతి సత్యనారాయణపురంలోని టి.రామారావు అనే వ్యక్తి ఇంట్లో నాలుగేళ్ల కిందట క్రాంతిదుర్గాప్రసాద్, ఆయన తండ్రి అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్రాంతిదుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగిగా తేలింది. ప్రస్తుతం విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. క్రాంతిదుర్గాప్రసాద్ కూడా తండ్రితో పాటు ఉంటున్నట్లు నిర్ధారించారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో ఇద్దరూ ఇంట్లో లేరు. సోమ, మంగళవారాల్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సర్టిఫికెట్లలో ఒకటి, అర్జీలో మరోపేరు... ఫోర్జరీ సంతకాలతో పొందిన రెసిడెన్స్, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికెట్ ఆఫ్ డోనర్లో మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అని ఉంది. అయితే తహశీల్దార్కు పెట్టుకున్న అర్జీలో మాత్రం తాను ప్రైవేట్ ఉద్యోగినని, తన భార్య, తాను తప్ప తమకు ఎవరూ లేరని, తన పేరు మిరియాల క్రాంతికుమార్ అని పేర్కొని ఉంది. సర్టిఫికెట్స్లో ఒకపేరు, అర్జీలో మరోపేరు రాయడం కూడా చర్చకు దారితీసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు పేరు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతో పొందిన సర్టిఫికెట్లపై 2014, ఏప్రిల్ 24వ తేదీ ఉంది. ప్రస్తుతం మా వద్దకు క్రాంతి దుర్గాప్రసాద్ రాలేదు... మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ ఇవ్వడానికి వచ్చాడా.. అని హైదరాబాద్ని సత్య కిడ్నీ సెంటర్కు ఫోన్చేసి ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ప్రస్తుతం అటువంటి వారు ఎవరూ లేరని బదులిచ్చారు. గతంలో వచ్చి ఉంటే రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వైద్యుడు సోమవారం డ్యూటీకి వస్తాడని ఆయన్ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయవాడలో రెండు ఆస్పత్రులకే లెసైన్స్... విజయవాడలో కిడ్నీ ఆపరేషన్ చేసేందుకు రెండు ఆస్పత్రులకు మాత్రమే ప్రభుత్వ లెసైన్స్ ఉంది. ఒకటి ఎన్ఆర్ఐ ఆస్పత్రి కాగా రెండోది అరుణ్ కిడ్నీ సెంటర్. గుంటూరులో గుంటూరు సిటీ హాస్పిటల్కు లెసైన్స్ ఉంది. ఈ ఆస్పత్రులకు వెళ్తే వెంటనే గుర్తించి అరెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న దుర్గాప్రసాద్ హైదరాబాద్లోని సత్య కిడ్నీ సెంటర్ను ఆశ్రయించినట్లు సమాచారం. హైదరాబాద్లో కిడ్నీ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదని దుర్గాప్రసాద్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది. ఆరేళ్ల కిందట జోరుగా కిడ్నీల వ్యాపారం విజయవాడలో ఆరు సంవత్సరాల కిందట కిడ్నీల వ్యాపారం జోరుగా సాగింది. ఆటోవాలాలు ఎక్కువ మంది కిడ్నీలు అమ్ముకున్నారు. దీంతో అప్పట్లో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్ చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి కిడ్నీలు తీసి అమ్ముకున్నారు. దీనివెనుక పలువురు వైద్యుల హస్తం అప్పట్లో ఉన్నట్లు స్పష్టమైంది. అవయవ దానం చట్టం ప్రకారం.. ప్రధానంగా కిడ్నీ దానం చేయాలంటే తన రక్తసంబంధీకులై ఉండాలి. భార్యాభర్తలు కిడ్నీలు దానం చేసుకోవాలంటే వారి వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. రక్త సంబంధీకులైతే డీఎన్ఏ పరీక్షలు చేస్తారు. అవయవ మార్పిడి చట్టం-1994 ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. -
బోనమెత్తిన పాలమూరు
జిల్లా కేంద్రంలోని ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు ఉదయం నుంచే బోనాలను సిద్ధం చేశారు. దుర్గామాతకు ప్రతి రూపంగా భావించే గ్రామ దేవతలకు బోనాలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి నైవేద్యంగా సమర్పించారు. కుర్వినిశెట్టి కాలనీ, రవీంద్రనగర్, కుమ్మరివాడి, బండ్లగేరి, వీరభద్రకాలనీలకు చెందిన మహిళలు సామూహికంగా బోనాలతో తోటమైసమ్మ గుడికి చేరుకున్నారు. పలువురు శివసత్తులు పూనకం నిండారు. అంతకుముందు ఆలయంలో స్వస్తిపుణ్యహవాచనం, లక్షాధారణం, అఖండ ప్రజ్వలనం, ధ్వజాపతాక ఆరోహణ, పంచాభృతసహిత నవరస అభిషేకం, గౌరిదేవీ అష్టోత్తరం, లలితాసహస్రనామాలతో సామూహిక కుంకుమార్చన చేసిన అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం నింపారు. -
ఏడుపాయల్లో ఘోరాలు
ఆధ్యాత్మిక కేంద్రమైన ఏడుపాయల నేరాలు, ఘోరాలకు నిలయంగా మారింది? భక్తులకు రక్షణ కరువవుతోంది. దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు.. కాసింత ప్రశాంతత కోసం ఇటు వస్తే అనుకోని ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఓ న్యాయవాదిపై ఆగంతకులు కాల్పులు జరిపి, అతని కుటుంబ సభ్యులను బెదిరించి 25 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పాపన్నపేట: ఓ వైపు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పర్యటన.. మరోవైపు కిక్కిరిసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివచ్చిన నేపథ్యంలో ఏడుపాయల్లో పోలీస్ నిఘా కొనసాగుతోంది. అడుగడుగునా సాయుధులైన పోలీసులు పహారా కాస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు అగంతకులు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ న్యాయవాదిపై కాల్పులు జరిపి వారి కుటుంబీకుల నుంచి సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆదివారం పట్టపగలు ఏడుపాయల్లో జరిగిన కాల్పుల సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది రంగంవేణు తన కుమారుడి మొక్కు తీర్చుకునేందుకు తండ్రి గంగాధర్, తల్లి రాజమణి, భార్య సంయుక్త, చెల్లెలు సాయివిద్య, కుమారుడు విశ్వక్సేన్ కలిసి కారులో ఆదివారం ఏడుపాయలకు వచ్చారు. దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఏడుపాయల సమీపంలోని మురళీకృష్ణ ఆలయం వద్ద భోజనం చేసి సేదదీరారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హెల్మెట్ ధరించిన ఓ యువకుడితో పాటు మరో యువకుడు స్ల్పెండర్పై వచ్చిరాగానే గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వేణు కుటుంబీకులను బంగారు ఆభరణాలు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. ఈ హఠాత్ సంఘటనతో భయభ్రాంతులకు గురైన మహిళలు తమ ఆభరణాలు తీసి ఇస్తుండగా వేణు రెండడుగులు ముందుకు వేశాడు. దీంతో దుండగులు కాల్పులు జరపడంతో కుడి మోకాలిని రాసుకుంటూ వెళ్లిన బుల్లెటు వేణు ఎడమ కాలిలోకి దూసుకు పోయింది. దీంతో వేణు కిందపడగానే దుండగులు సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. దీంతో వేణు కుటుంబీకులు కారులో రోడ్డుపైకి వచ్చి చికిత్స నిమిత్తం ఏడుపాయల కమాన్ వద్దకు గల ఓ ఆర్ఎంపీ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం 108కు సమాచారమిచ్చి మెదక్ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించారు. కాగా వేణుకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని ఎస్పీ శెముషీ బాజ్పాయ్, మెదక్ డీఎస్పీ గోద్రూ, రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ సందర్శిం చారు. అక్కడ రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాటువేసి.. కాపు కాసి... ప్రత్యక్ష సాక్షులు స్వరూప, యాదమ్మ, శేఖమ్మల కథనం.. వారి మాటల్లోనే..‘మేము మురళీకృష్ణ గుడివద్ద కట్టెలు ఏరుకుంటున్నాం. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అరగంట నుంచి అక్కడే తచ్చాడుతున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఐదుగురు కుటుంబీకులు భోజనం చేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో భయపడిన మేము దూరంగా వెళ్లి కేకలు పెట్టాము. దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులు బైక్పై పారిపోయారు. వారికి సుమారు 25 యేళ్లుంటాయి. మంత్రి పర్యటన రోజే.. దారుణం ఏడుపాయల్లో జరుగుతున్న ఓ ప్రైవేట్ విందు కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి వచ్చారు. అయితే అంతకు రెండు గంటల ముందే కాల్పుల సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాలు, భ క్తుల్లో కలకలం రేపింది. ఆదివారం రోజు వేలాది భక్తులు ఏడుపాయలకు తరలివచ్చిన సమయంలోనే పట్టపగలు జరిగిన కాల్పులు, దోపిడి ఉదంతం సంచలనం కలిగించింది. మొక్కు తీర్చుకునేందుకు వస్తే.. ఇదేం ఘోరం మొక్కులు తీర్చుకునేందుకు వస్తే ఇలా జరుగుతుందను కోలేదు. సంతోషంతో వచ్చిన తమకు తీరని విషాదం మిగిలింది. పుణ్య స్థలంలో ఇలాంటి దారుణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. దుండగులను పోలీసులు వెంటనే పట్టుకోవాలి. - వేణు, బాధితుడు